అక్షౌహిణి
చీకటిగా ఉన్న గదిలోకి ఏ మూలనుంచో ఒక సూర్యకిరణం
చొరబడిందనుకోండి- పొడుగాటి ఆ వెలుగుచారలో మనకు ఎన్నోకోట్ల దుమ్ముకణాలు కనబడతాయి.
వాటిలోంచి ఒకేఒక్క ధూళి రేణువును పట్టుకుని తూచగలిగితే దాని బరువును 'త్రస' అంటారు.దాని కొలతను ముప్ఫై పరమాణువులుగా
లెక్కించారు. సూక్ష్మమైన 'త్రసరేణుభారం' మొదలుగా ఎన్నోవేల రెట్ల తూకాలను మనవాళ్ళు లెక్కలుకట్టారు. వివిధ విభాగాలతో
కూడిన సైనిక బలాన్ని ఎలా లెక్కించాలో మహాభారతం వివరించింది.ఒక రథం, ఓ ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు
సైనికులు మొత్తం పదిమంది బృందాన్ని 'పత్తి' అంటారు. పత్తికి మూడురెట్లు సేనాముఖం. దానికి మూడు రెట్లు అయితే అది
గుల్మం. మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం. మూడు గణాలు కలిసివాహిని. దానికి మూడింతలు
పృతన. దాన్ని మూడుతో గుణిస్తే ఒక చమూ. మూడు చమూలు ఒక అనీకినీ. దానికి పదిరెట్లు
అక్షౌహిణి. కురుక్షేత్రంలో మొత్తం సైన్యం పద్దెనిమిది అక్షౌహిణులు.
ఇక సంఖ్యామానానికి వస్తే ఒకట్లు,
పదులు, వందలూ... అంటూ లెక్క వెయ్యికోట్లు
దాటాక- ఒక్కో సున్న చొప్పున చేర్చుకుంటూ పోతే అర్బుదం, ఖర్వం,
పద్మం, క్షోణి, శంఖం,
క్షితి, క్షోభం, నిధి,
పరతం, పరార్థం, అనంతం,
సాగరం, అమృతం, అచింత్యం,
భూరి, మహాభూరి... దాకా ఆ లెక్క
విస్తరిస్తుంది. ఒకటి పక్కన ముప్ఫై అయిదు సున్నాలు చేరిన సంఖ్య మహాభూరి అవుతుంది.
అక్షౌహిణి
అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని
21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు +
109350 కాలిబంట్లు
ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో
పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు +
19,68,300 కాలిబంట్లు
ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా
ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో
యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.
వానర సైన్యము - కంబరామాయణము
రామ దండు సుగ్రీవుడు
అక్షౌహిణి
X '18'
= ఏకము
ఏకము
X '8'
= కోటి (మన కోటి కాదు)
కోటి
X '8'
= శంఖము
శంఖము
X '8'
= కుముదము
కుముదము
X '8'
= పద్మము
పద్మము
X '8'
= నాడి
నాడి
X '8'
= సముద్రము
సముద్రము
X '8'
= వెల్లువ
అంటే
36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.
ఇటు
వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే
366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.
అంతమందిని తన నియంత్రణలో ఉంచుకొన్నాడు కాబట్టియే సుగ్రీవాజ్ఞ అన్న మాట ప్రాచుర్యము
లోనికి వచ్చినది.
256842399744000
కపి సేన, త్రేతాయుగములో లంకకు వారధి కట్టినారన్నమాట.
No comments:
Post a Comment