కపిత్థస్యఫలంచైవయథా కుంజర భక్షితంl
తస్య సారంచ ఘృణ్ణీయాత్ తాతా హవిరసం ప్రభోll
తస్య సారంచ ఘృణ్ణీయాత్ తాతా హవిరసం ప్రభోll
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్తఫలాక్రియాః
ఇది మనుస్మృతి లోని శ్లోకము.దీనివల్ల మాకు ఏమి అర్థమౌతుంది . స్త్రీలను మనము ఎంతగా గౌరవిస్తామన్న విషయము అర్థముకావటములేదా ! మరి మనము ఎందుకు స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నామని నలుగురిచేత అభిశంసింప బడుతున్నాము. విష్ణుభక్తి పరాయణుడే కావచ్చు కానీ దైత్యుడై కూడా ప్రహ్లాదుడు తన దృష్టికి ఆడవాళ్ళు అడ్డుపడితే వారలను మాత్రు భావముతోచూసి దృష్టి ప్రక్కకు మరల్చేవాడని తెలుగుభాగవతమున
పోతన గారు శెలవిస్తారు. అదే స్త్రీలను నీచ దృష్టితో చూసిన రావణ దుర్యోధనుల గతి ఏమైనదో ఒకసారి మనము పరికిస్తే అర్థమౌతుంది. నేడిది గతమైనది. కొందఱు యువకులకు అసంగత మైనది. వారి దృష్టిలో స్త్రీ
ఆటబొమ్మ. చాటింగులతో తో చీటింగులకు,మీటింగులనుండి డేటింగులకు, సెల్లు మాటలనే సొల్లు మాటలకు ఒక అడుగు ఇంకా ముందుకు పోయి 'LOVE JIHAD' లకు ఎరలను జేసి యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత
వయస్సు లోనే బాలికలను విషయవాంఛలకు లోబడ జేసి మొగ్గ గా చిదిమేస్తున్నారు, మొక్కగా తుంచేస్తున్నారు. మరి లొంగకుంటే స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, మానభంగాలు ఇలాఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, అరణ్యరోదనన్యాయంలా”పనికి రాకుండా పోతోంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా,మమతా, మానవతలు సమాజంలోవెల్లివిరియాలన్నా- ఒక్కటే మార్గం.అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. ఈ మాటలు కేవలము పురుషులకే కాదు స్త్రీలకు కూడా! ఈ నాడు వేషధారణలో కానీ, భారతీయ సంస్కార ఆచరణలోగానీ ఆవగింజంత గౌరవములేకుండా విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. ఇది తమకు, తమ కుటుంబానికి, తమ బంధు వర్గానికి, తమ ధర్మానికీ, తమ దేశానికి ముప్పు వాటిల్లునని ఊహించక తప్పుచేయుచున్నారు.
ప్రతి ఇంట్లో దేవుడు అమ్మరూపంలో ఉన్నాడు కనుకనే మాతృదేవోభవ అని వేదాలు బోధించినాయి. అలాగే మనుస్మృతిలో స్త్రీలను గూర్చి ఈవిధముగా చెప్పబడింది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃl
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతాస్తఫలాక్రియాఃll
ఎక్కడ స్త్రీలు పూజింప బడుతారో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యములన్నీ
నిష్ఫలములనితెల్పి, 'స్త్రియః శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కశ్చన' స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే, ఇంతకు మించిన విశేషషణము లేదని స్త్రీని కీర్తించుతాడు. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత 'కన్యాం కనక సంపన్నాం' అని “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయదదాతి' అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగాచూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చ వలెనని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.
నిష్ఫలములనితెల్పి, 'స్త్రియః శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కశ్చన' స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే, ఇంతకు మించిన విశేషషణము లేదని స్త్రీని కీర్తించుతాడు. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత 'కన్యాం కనక సంపన్నాం' అని “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయదదాతి' అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగాచూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చ వలెనని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.
పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా: l
పూజ్యా భూషయితవ్యాశ్చ బహు కళ్యాణమీప్సుభి:ll
అనగా తండ్రి, సోదరులు, భర్త, మరదులు అందరు స్త్రీలని గౌరవించాలని, వారుకోరిన భూషణవస్త్రాదులనిచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా అండగాఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో
పూజ్యా భూషయితవ్యాశ్చ బహు కళ్యాణమీప్సుభి:ll
అనగా తండ్రి, సోదరులు, భర్త, మరదులు అందరు స్త్రీలని గౌరవించాలని, వారుకోరిన భూషణవస్త్రాదులనిచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా అండగాఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో
పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే /
రక్షంతిస్తావిరే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి.
రక్షంతిస్తావిరే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి.
చిన్నతనంలో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలిఅని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువుని, ప్రాచీన సంప్రదాయాలని ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకం మొత్తం గ్రహించకుండా చివరి పాదం 'నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అన్నది మాత్రంగ్రహించి, మనువు స్త్రీలకి వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిరశంఖారావ న్యాయంలా వినరు, తమ ప్రవర్తన మార్చుకోరు. అస్తు. వారిని అలాగే వదిలేద్దాం.
వినేవారికే మనం కొన్ని మంచిమాటలు చెప్దాం. బాల్యంనుండే మంచిఅలవాట్లు, సత్ సంప్రదాయాలు నేర్పిస్తే,భావితరాలైనా బాగుపడతాయి. స్త్రీలను గూర్చి మనువు ఇంకాఈవిధముగా చెబుతాడు.
శోచంతి జామయోయత్రl వినశ్వత్యాశు తత్కులంl
నశోచంతితు యత్రైతాlవర్ధతే తద్ధిసర్వదాll
అనగా ఆడపడుచులు ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది.
అని తెలిపి ఇంకా ఈ విధముగా చెబుతాడు.
తస్మానేతాన్సదా పూజ్యాఃl భూషణాచ్చాదనాశనైl
భూతికామైర్నరైర్నిత్యంl సత్కారేషూత్సవేషుచll
తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకోనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు,భూషణాదులనిచ్చి సంతృప్తి పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలోకూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం.ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది.
ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.—వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివేమంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.
సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్మేమాయోష్టా:l
అనగా ఈ ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! ఆపత్సు మిత్రం జానీమః కష్టాలలో ఆదుకొను వాడేమిత్రుడు. అట్టిమిత్రభావముతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు,
ఆవేశకావేశములు, అసమానతలకుతావు లేకుండా నిత్య వసంతములా వారి జీవితం సాగిపోతుంది.
ఇంకా—
సంతుష్టో భార్యయాభర్తాl భర్తా,భార్యా తధైవచl
యస్మిన్నేవ కులేనిత్యంl కళ్యాణం తత్రవై ధృవంll
అనగా
భార్యా,భర్తలు పరస్పరం ఒకరిని,ఒకరు గౌరవిచుకొంటూ,ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో ఆయిల్లునిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లుతుంది అని చెబుతూనే
యదిహ స్త్రీనరోచేతl పుమాంసంన ప్రమోదాయేత్l
అప్రమోదాత్ పునః పుంసఃl ప్రజనం నప్రవర్తతేll
భార్యను భర్త కష్టపెడితే, ఆభార్య భర్తకు సహకరించదు. అపుడు ఆ ఇంట వశం వర్థిల్లదు. అని వివరించి,
అనుకూల కళత్రోయఃl తస్య స్వర్గ యిహైవహిl
ప్రతికూల కళత్రస్యl నరకో నాత్ర సంశయఃll
స్త్రియాంతు రోచమానాయాంl సర్వం రోచతేకులంl
స్త్రియామరోచమానాయాంl సర్వమేవ నరోచతేll
భార్యలు అనుకూలంగా ఉండి, సంతోషంగా ఉంటే ఆ గృహం స్వర్గమే. లేకుంటే నరకమే. ఇలా ఎన్నోవిధాలుగా వేలవేలసంవత్సరాలకు పూర్వమే స్త్రీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది, అని మన ప్రాచీనసాహిత్యం తెలుపుతోంది.
మరి ఈకాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము.
ఆధునికులు కొందరు పిల్లలకు స్వేచ్చనిస్తే, దానిని బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు అన్నభావన కలిగించే విపరీతవస్త్రధారణ, పాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికి, వర్తించదు. సెల్ ఫోనుసంబాషణ, చదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూ, బైకులపై షికారులు చేస్తూ కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ,పతనమే పరమావధిగా యువతను మనము చూస్తున్నాము. ఇది ఆడపిల్లల్లో ఏర్పడిన వ్యసనముగా మనము తలువవచ్చు. ఈ విధానంలో ఆడపిల్లలే కదా ఎక్కువగా నష్టబోతున్నారు. విసుగు,కోపం, అలజడి, మానసిక అశాంతి, అసంతృప్తి, భార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యం, పిల్లల్ని సరిగాపట్టించుకోనందున అధిక
స్వేఛ్చ వంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధ, బాంధవ్యాలను తెంచుతూ, వైదిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణం ప్రాచీన సంప్రదాయాలను, పెద్దలమాటలను పట్టించుకోకుండా కొత్త వింత పాత రోత అనుకొనుటయేనని, గమనిన్చినచో అనిపిస్తుంది.
మరి ఈకాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము.
ఆధునికులు కొందరు పిల్లలకు స్వేచ్చనిస్తే, దానిని బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు అన్నభావన కలిగించే విపరీతవస్త్రధారణ, పాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికి, వర్తించదు. సెల్ ఫోనుసంబాషణ, చదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూ, బైకులపై షికారులు చేస్తూ కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ,పతనమే పరమావధిగా యువతను మనము చూస్తున్నాము. ఇది ఆడపిల్లల్లో ఏర్పడిన వ్యసనముగా మనము తలువవచ్చు. ఈ విధానంలో ఆడపిల్లలే కదా ఎక్కువగా నష్టబోతున్నారు. విసుగు,కోపం, అలజడి, మానసిక అశాంతి, అసంతృప్తి, భార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యం, పిల్లల్ని సరిగాపట్టించుకోనందున అధిక
స్వేఛ్చ వంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధ, బాంధవ్యాలను తెంచుతూ, వైదిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణం ప్రాచీన సంప్రదాయాలను, పెద్దలమాటలను పట్టించుకోకుండా కొత్త వింత పాత రోత అనుకొనుటయేనని, గమనిన్చినచో అనిపిస్తుంది.
ఉదయకాల ఉషోదయాలని తిలకిస్తూ, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, వికసించే పుష్పాలు, వాటిలోని పుప్పొడిపైనుండి వచ్చే చల్లని పిల్లగాలుల సుఖస్పర్శలు, వెన్నెల రాత్రులలో నదీ సైకత వేదికపై విహారాలు, పచ్చని కంబళ్ళు పరచినట్లుండే పర్వత సానువుల సోయగాలు తిలకిస్తూ, కదిలేమబ్బుల్ని,ఎగిరే కొంగలబారుల్నిచూస్తూ, దేవాలయాల మంగళ వాద్యాలను,ఘంటా నాదాల్ని,గుడిి గోపుర గుహలలోని పావురాయి కువకువలు వింటూ,
ఒడ్డును తాకి విరిగి, ఒరిగే సముద్రకెరటాలను, పసిపాపల నవ్వులను, పతంగాల(గాలిపటాల) విహారాలను, రంగు రంగుల సీతాకోక చిలుకలను, నీలిమేఘాలలో,గాలికెరటాలలోదోబూచులాడే నిండు పున్నమి చంద్రుని, ఎలమావి
చివురులు మెసవి కూసే పీక కూజితాలను, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి పరమైన అందాలను ఆనందాలను అనుభవించమని పరమాత్మ మనకిస్తే, ప్రకృతిని కలుషితంచేస్తూ,మనం ఇంకేదో కావాలని, లేనిదానికోసం,తెలియని దానికోసం పరితపిస్తూ,పరిభ్రమిస్తూ కాలాన్నిమేధస్సును,మన విజ్ఞానాన్ని వృధాపరుస్తూ నిస్సారమయిన బ్రతుకు బ్రతికుచున్నాము. అలాకాకుండా శృతి,స్మృతి, వేదోపనిషత్తులలో చెప్పిన విషయాలకు సంబంధించిన వ్రాతలను చదివి ఆకళింపుజేసుకుని, మన సంప్రదాయాలని ఆచరిస్తే జగమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది అనుటలో సందేహంలేదు. లేకుంటే నిత్యానందమన్నది గగనకుసుమ, అరణ్యరోదన, బధిరశంఖారావ, అజాగళ స్తన న్యాయములవలె కనరానిదై, వినరానిదై, జీవితము వ్యర్ధమైపోతుంది.
ఇదినిజము. ఇదేనిజము.
No comments:
Post a Comment