అవగాహన
అంధేందూదయముల్
మహాబధిరశంఖారావముల్ మూకస
ద్గ్రంథాఖ్యాపనముల్
నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు
భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస
ద్గంధంబుల్
హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.
పై పద్యము హరిభక్తిలేనివారికి జీవితమే
నిరుపయోగము అని తెల్పుటకు ఎన్నో ఉపమానములను జొప్పించి, సప్తస్కంధములోని
ప్రహ్లాద చరిత్రమున పరమ భాక్తాగ్రేసరుడగు
పోతన ఈ పద్యముద్వారా మనకు సందేశమును ఇచ్చుచున్నాడు.
ఈ
పద్యమును ఇటు హరిభక్తికే కాదు అటు మన సంస్కృతి, వేదవిద్య, శస్త్ర
వైదుష్యము వంటి అనేక విషయములకు అన్వయించుకొనవచ్చును.
హరిభక్తి లేకుండా (మన సంస్కృతి, వేదవిద్య, శస్త్ర వైదుష్యము వంటి అనేక విషయములు లేకుండా) ఈ లౌకిక వలయంలో పడటం ఎటువంటిదంటె గుడ్డివానికి వెన్నెల, చెవిటవాని ముందు శంఖద్వానం,
మూగవానితో ఉత్తమ గ్రంథాలు చదివించడం, నపుంసకుడికి
సుందరాంగితో పెండ్లి చేయడం, కృతఘ్నుడితో బాంధవ్యం, బూడిద పోసిన హవ్యం, లోభి దగ్గర ధనం, పంది ముందు పన్నీరు పోయడం వంటిది.
ఎదో
పోస్టులో నియత్, సహీ అన్న పదములు అరబ్బీ నుండి వచ్చినవి అని ఎవరో వ్రాసినారు.
నియత్ అన్న పదమునకు సంస్కృతమూలము ‘నియతి’ అదేవిధముగా ‘సత్య’ అన్న సంస్కృత మూల
జన్యము ‘సహీ’ అన్న పదము. ‘’సింధు’ అరబ్బీ లో ‘హిందు’ అయినట్లు. ఈ విశ్వ భాషలకు
మూలము సంస్కృతము అని ప్రాక్పశ్చిమ దేశ పండితులేందరో వాకృచ్చినారు. నా బాధ ఆయన ఎవరో
వ్రాసినదానికి కాదు. ఆ మాటలకు ఆహా ఓహో అంటూ, నాకు వెంటనే అరబ్బీ నేర్చుకొనవలెనని
వున్నదని ఒక మహాశయుడు అభిప్రాయ వేదిక పై వ్రాసినందుకు. ముందు మనభాష ఔన్నత్యమును
దాని మాతృక యొక్క ఆధిక్యతను తెలుసుకొందాము. తరువాత అన్యభాషలు నేర్చుకొందాము. ప్రతి
భాషకూ దాని ప్రత్యేకత దానికుంటుంది. అందులకు
సందేహము ఎందులకు. స్వస్తి.
మనం మరిచిపోయింది వేదాలను
కాదు, ఒక మహా జాతి వైభావాన్ని. వేదాలు సమస్తం జ్ఞానానికి మూలము విదేశీయులు చెప్తున్నారు.
Schopenhauer,
regarded them as: "It has been the solace of my life -- it will be the
solace of my death."
Lord Warren Hastings (1754-1826), was the first governor general of British India:
He wrote with a prophetic and resounding pronouncement on the whole body of Indian writings: "The writers of the Indian philosophies will survive, when the British dominion in India shall long have ceased to exist, and when the sources which it yielded of wealth and power are lost to remembrances."
He wrote with a prophetic and resounding pronouncement on the whole body of Indian writings: "The writers of the Indian philosophies will survive, when the British dominion in India shall long have ceased to exist, and when the sources which it yielded of wealth and power are lost to remembrances."
Repelled
by the increasing materialism of the West, Emerson turned to India for solace: "The
Indian teaching, through its clouds of legends, has yet a simple and grand
religion, like a queenly countenance seen through a rich veil. It teaches to
speak truth, love others, and to dispose trifles. The East is grand - and makes
Europe appear the land of trifles. ...all is soul and the soul is Vishnu
Wilhelm von Humboldt
(1767- 1835) Prussian minister of education, said about Bhagavat gita that
" this episode of the Mahabharata was the most beautiful, perhaps the only
true philosophical song existing in any known tongue ....perhaps the deepest
and loftiest thing the world has to show."
ఈవిధంగా పైన
తెలిపినవారే కాకుండా ఈ దేశమును, వేదములను, భగవద్గీతను తమ తమ గురువులుగానెంచి పొగడినవాళ్ళు
అనేకులు వున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధములోని అక్ష
రాజ్యములలోని ప్రధాన రాజ్యమయిన జర్మనీ నియంత, మిత్ర
పక్షాలకు పనిచేయుచున్న భారత దేశ వేదసంపదను గుర్తెరింగి ఇచ్చటి ఒక మహా వేదపండితుని
తన గూఢచారుల సహాయముతో జర్మనీకి రప్పించుకొని ఏవిధముగా తన అణ్వస్త్ర సంపదను అభివృద్ధి చేసుకొన్నాడో
అచటి పార్లమెంట్ The German Bundestag భవనము మనకు
చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.
ఆ మహానుభావుని పేరే
బ్ర.శ్రీ.వే. దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు.
ఒక్క యజుర్వేదమే
నాలుగు ముఖములుగా, నాలుగు రూపములలో అవగతమవుతుంది అని పెద్దలు
చెబుతారు. అంతటి సమున్నత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయనను
జర్మనీకి రప్పించుకొన్నారు.
రాజమహేంద్రవరం లో
వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి ఇప్పుడు తెలుసుకొందాము.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి
అధికారులు తమ కార్యాలయములను దర్శింప జేయుచుండగా ఓ చోట ఒక సనాతన భారతీయ
విప్రవర్యుని చాయా చిత్ర పటము కనిపించింది. విస్మితుడైన ఆరాయబారి ఆయన ఎవరు అని
జర్మనీ అధికారులను అడుగుటతో వారు అతనికి బ్ర.శ్రీ.వే.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారిని గూర్చి విపులముగా చెప్పవలసి వచ్చినది.
తొలి ప్రపంచ యుద్ధం అనగారి
పోవుట, జర్మనీలో కెయిజర్ ప్రభుత్వం పతనమగుట,
ప్రపంచమంతా ఆర్థికమాంద్యము నెలకొనుట మనకు ఎరుకపడిన అంశాలే! ఆ యుద్ధమునందు బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు
హిట్లర్. ఆయన ఆ అవమానమును దిగమింగుకోలేక, ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్న తన
విశ్వాసమును పుష్టి చేయదలచి, తమ జాతి ఆధిపత్యమును నిరూపించదలచి ఆయన నాజీ పార్టీ
స్థాపించి, వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి
ఎన్నో సంస్కరణలు ప్రారంభించినారు. అదే రీతిలో కొత్త కొత్త మారణాయుధాల అన్వేషణ
ప్రారంభించినారు. సంస్కృతము తమ జాతి మూలభాష అని తాను నమ్మి సంస్కృత భాషాధ్యాయనం
పట్ల జర్మన్లకు ఆసక్తి పెంపొందించినారు.
భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయములలో మారణాయుధముల
రహస్యములు దాగియున్నవని ఆయన గ్రహించి,
ఒకవైపు సంస్కృత
సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేసినారు. ఆ విధంగా తొలిసారిగా
ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుండి జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టిచర్యలు తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల
నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం
ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చినారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి
తెలుసుకున్న హిట్లర్ గుప్తచరులు ఆయన కోసం భారత దేశములో అన్వేషణ ప్రారంభించినారు.
దండిభట్ల
విశ్వనాథశాస్త్రి తమ ఇంటికి వచ్చేవారితో నిత్యం శాస్త్ర విషయాలు చర్చలు జరిపేవారు
తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కారు. ఒకానొక దినమున ఆయన విశాఖపట్టణపు సమీపానవున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి
వెళ్లవలసి వచ్చింది. ఆ కాలములో బస్సుల వసతి తక్కువ. వ్యక్తులలో దార్ఢ్యము ఎక్కువ.
అందువల్ల ఊళ్ళు వెళ్ళుటకు కాలినడకను ఉపయోగించేవారు. ఆ విధంగా వారు వెళుతూవున్న
సమయంలో హిట్లర్ గూఢచారులు ఆయనను సమీపించి ప్రతిఘటనకు తావులేని రీతిలో ఆయనను అక్కడినుండి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత
కలకత్తాకు ఆపైన జర్మనీకి తరలించినారు. ప్రతిఘటన వుండినదా లేదా అన్నది నాకు తెలియని
విషయము. దండిభట్ల గారు జర్మనీ చేరుకొన్న
సమయానికి రెండో ప్రపంచ యుద్ధానికి(1939-1945) రంగం సిద్ధమయి వుంది.
బాంబులు మిక్కుటముగా తయారుచేస్తున్నారు
కానీ నిలువ చేయుటలో ఏర్పడు వత్తిడికి అవి ప్రేలిపోతూవుండుటతో
విపరీతమైన ధన జన అస్త్ర నష్టము సంభవించేది.
తమ దీన స్థితిని వివరించి వేదములనుండి తగిన ఉపాయమును సూచించమని అర్థించినారు. హిట్లరు
గునగణములు తెలియని శాస్త్రిగారు ఆర్త రక్షకుడై యజుర్వేదం నుండి ఆ సమస్యకు పరిష్కారం సూచించినారు.
వారి సలహా ఫలించింది. సైనిక దళపతులు దానితో ఆయనకు బ్రహ్మరతము పట్టినారు. అప్పటినుండి
ఆయన వారికి పరమ పూజనీయులైనారు.
తన వేదపాండితీ ప్రకర్షచే
జర్మనులకు తనవంతు సహకారం అందించి జర్మనీ పురోభివృద్ధికి ఇతోదికముగా పాటుబడినారు. కానీ
వారు తర్వాత కాలములో తిరిగీ భారతదేశమునకు
రాలేక పోయినారు. కారణములు నేను చదివిన మేరకు పెద్దలద్వారా విన్నమేరకు
తెలిసిరాలేదు.
దండిభట్ల వారు జర్మనీకి
పోయినప్పటి నుండి వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందేదని
వినికిడి. ఆయన మరణం తర్వాత కుటుంబ భృతిగా తొంభై రూపాయల
వంతున వారి శ్రీమతికి అందేదట. ఆ తరువాత ఎప్పుడు ఆగిపోయింది అన్నది మనకు ఊహకు అందని
విషయము.
వేదమూర్తులగు దండిభట్ల
వారు దేశానికి దూరమైనా, తర్వాత కాలములో దేశ స్వాతంత్ర్యము వచ్చినా, అటు దేశము, ఇటు
రాష్ట్రము కూడా ఆయనను వెనుకకు తెప్పించే ఆలోచన చేయలేదు. అసలు అటువంటి ఒక మహనీయుడు
ఆంధ్రుడై రాజమహేంద్రి లో నివసించినాడు అన్న విషయమునే పట్టించుకోని వుండరు. కానీ జర్మనులు
మాత్రం ఆయనను తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికి జర్మనీలో విదేశాంగ
శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్ర పటమును
ఉంచుకొనుట వారి కృతజ్ఞతా హృదయమునకు, వారి పై గురుత్వమునకు వేదము పై భారత దేశము పై గౌరవ
భావమునకు మనము ధన్యవాదములు చెప్పవలసి వుంటుంది. ఉంటుంది..
అది మన జ్ఞాన సంపద, అది మన జాతి
వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని
ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనముకూడా వారి నికృష్ట కార్యములకు మన మూఢ జ్ఞానమును
జోడిచి మన సంస్కృతిని, మన వేదములను, మన సంస్కృతమును అవహేళన చేస్తూ అవనత శిరస్కులమై
అవమానముల ఊబిలో కూరుకొని యుండుతకే ఇచ్చగించుచున్నాము. గుర్తుపెట్టుకోవలసినది
ఏమిటంటే భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన
జ్యొతి, మనము పాలు త్రాగిన రొమ్మునే గుద్దుతూ వున్నా ఆతల్లిని ఆదరించే
సంస్కారవంతులు విదేశాలలో వుండుటయేగాక అంకిత భావముతో ఆ తల్లి సేవ చేస్తున్నారు.
గురుత్వమును గురించి దాని ప్రయోజనమును గురించి చెబుతూ ఈ మహనీయుని తలపోయుట
జరిగినది.
Could I know the source please
ReplyDelete