దివినుండి
భువికి ...
కవిత్వము, చక్కటి కావితా వస్తువు, మబ్బులేని
ఆకాశము వంటి భావము,భావమునకు వలసిన భాష కలిస్తే జాషువా
కవిత్వమౌతుంది. అటువంటి లబ్ధ ప్రతిష్ఠుల కవిత్వము చదివితే అవి మన కవితలకు దిశా
నిర్దేశము చేస్తాయి.
ఆయన పెద్ద పెద్ద పదములు వాడగలడు. కానీ భావానికి తగిన భాష నే వాడుట ఆయన గొప్పతనము.పెద్దల, ఆధునికులే
కానీగాక, కవిత్వము చదవండి, ఆకళింపు
చేసుకోండి, ఆపైన వ్రాయండి. ఎంతో సృజనాసక్తి,సృజనాశక్తి కలిగినవారు ఈ తరము వారు . భాష పై పట్టు ఒక్కటే వారికి
కావలసింది. పసిబాలుని లీలలు, బోసి నవ్వులు... ఎవరికి ఇష్టం
ఉండవు ? మచ్చునకు గుఱ్ఱం జాషువా గారు అలతి పదాలతో అందమైన
పోలికలతో వ్రాసిన ఈ పద్య చూడండి...
గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు
ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !
No comments:
Post a Comment