భారతీయ
విజ్ఞానము- 1
https://cherukurammohan.blogspot.com/2016/10/blog-post_51.html
'జ్ఞ' అంటే ఎరుక అని అర్థము,నాకు
తెలిసినంత వరకు. జ్ఞానము ఇందు నుండి పుట్టినదే. 'విజ్ఞానము
అన్న మాటకు ఒకవిధంగా సపూర్ణ అవగాహన అని చెప్పుకోవచ్చు.'Science' అన్నది విజ్ఞానమునకు సమానార్థకము కాదు అన్నది నా ఉద్దేశ్యము. విజ్ఞానము
అంటే ఆంగ్లములో Worldly or profane knowledge, knowledge derived from
worldly experience. Monier Williams (1899; rev. 2008) provides the following
definition:
To
distinguish, discern, observe, investigate, recognize ascertain, know,
understand - Rig Veda (RV.), etc., etc. (with na and inf.: 'to know not how to');
To have
right knowledge - Katha Upanishad (KaṭhUp.)
To become
wise or learned - Mn. iv, 20;
To hear
or learn from (gen.) - Chandogya Upanishad (ChUp.); Mahabharata (MBh.);
To
recognize in (loc.) - Panchatantra (Pañcat.);
To look
upon or regard or consider as (two acc.), Mn. MBh. etc.; Kāv. etc.; to explain, declare -
BhP.
ఇక్కడ
ఎక్కడా విజ్ఞానము అంటే science
అని చెప్పలేదు. విజ్ఞత అన్నది
తనకు వస్తువునకు కల అనుభవాన్ని అనుబంధాన్ని తెస్తుంది.ఇది తనకు తాను
సహజీవనము చేసే సకల చరాచర వస్తు ప్రపంచానికి పరస్పర హితకరమైన మైత్రిని
కలుగజేస్తుంది. ఇక 'science' అన్నది ఆధునిక విజ్ఞానమన్న
పేరుతో ప్రపంచమున ప్రబలమై యున్నది. దీనికి, కొన్ని ఆధునిక
ఆవిష్కరణలను తప్పించి, ప్రకృతిని తన బానిసగా చేసుకొని
ప్రకృతికి ముప్పు తెప్పించడం తప్పించి లోక కళ్యాణము లోక హితమును గూర్చి తలచినదే
లేదు.
ఐన్
స్టీన్ గారి ఈ సంభాషణ గమనించండి:
“Student: Dr. Einstein, aren’t these the same questions as last
year's [physics] final exam?
Dr.
Einstein: Yes; But this year the answers are different.”
― Albert Einstein
ఈ
మాట చాలదా నేటి విజ్ఞాన శాస్త్రము ఎంత శీఘ్రముగా మార్పులకు గురియౌతూ వుంటుందో
తెలుసుకొనుటకు.
ఒక
చిన్న ఉదాహరణ తీసుకొందాము.బట్టలు ఉతుకుటకు గానీ పాత్రలు తోముటకుగానీ వివిధ
నామావళితో'detergents'
వస్తున్నాయి . 'Plastic scrubbers' వస్తున్నాయి.
వీటివల్ల చర్మ సంబంధమైన వ్యాధులు రావని ఏ శాస్త్రజ్ఞుడు అయినా చెప్పగలడా.మనము
గతములో వాడుచుండిన మెత్తటి మన్ను బొగ్గుల బూడిద , చింతపండు
పిప్పి, ఉప్పు ,
శ్రేయస్కరములుకావని చెప్పగలరా! ఇప్పుడు ప్రాచుర్యములో వుండే
పిజ్జాలు బర్గర్ల వంటి తిను బండారములు,కోకాకోల పెప్సీ వంటి
పానీయములు మంచి చేస్తాయని గానీ చెడుపు చేయవనిగానీ వారు చెప్ప గలరా! Trade
secret పేరు తో వానిలో ఉపయోగించే మూలకములను మూసిపెట్టుటేగానీ
ధైర్యముగా లోకమునకు చాటగలరా! లొగుట్టు ఇద్దరి ఎరుక .1.చేసేవానికి 2.వానిని
చేసేవానికి.
మనిషిలో
సంతృప్తి సమసిపోయింది.సంపాదనే సర్వస్వమైపోయింది. ఇటువంటి స్థితిలో తీరుబడి
ఎక్కడిది. దేవుణ్ణి తలచుకోనుటకు కూడా సమయము లేదు. తిరుమల కొండకు flight లోపోయి దేవుని
దర్శనానికి special ticket' తీసుకొని దానికి recommendation
జోడించి 15 నిముషాలు దైవ సన్నిధిలో యుండి తిరిగి flight లో వూరు చేరి భగవంతుడే నేరుగా వచ్చి దర్శనమిచ్చినాడని గొప్పలు చెప్పుకొనే
ఈ భాగవతోత్తముల భక్తిని ఏమని పొగడవలె. ఆడంబరాలే భక్తీ అనుకునేటంత అమాయకుడా
భగవంతుడు. మన ఆత్మను తనకు ఎంతవరకు అనుసంధానము చేసినాము అన్న విషయము తెలుసుకోలేడా ఆ
పరమాత్ముడు. లేక ఈ భక్తాగ్రేసరులు భగవంతుని కూడా నమ్మించినామనే భ్రమలో ఉన్నారా !
ఇదీ మన ప్రగతి. ఇది నమ్మితే కలిగేది అధోగతి. వదిలేదెప్పుడు మనలనీ దుర్గతి. దీనికి
పరిష్కారము నివ్వగలిగినది యువత ధర్మ నిరతి.
సర్వేపిస్సుఖినస్సంతు
సర్వేసంతు సమాశ్రయా
సర్వే
బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
కాసింత
కూడా దుఃఖము లేని సౌఖ్యమును సకల జీవరాశికీ కోరిన వేదభూమి మనది.
వేద
చోదితమైన మన యంత్ర, తంత్ర, మంత్ర నిర్మాణమంతా విశ్వ శ్రేయస్సుకే మన పూర్వీకులు వినియోగించినారు గానీ విశ్వ
వినాశనమునకు గాదు.5,౦౦౦ సంవత్సరముల జరిగినదని నిర్ధారింపబడిన
భారత యుద్ధము ముగిసిన వెంటనే వివిధ విధములుగా సంపాదించిన తమ మారణాయుధములనెల్లా
సముద్రములో పడవేయుటే ఇందుకు తార్కాణము .
పెద్ద దేశములకే పెద్దదయిన అమెరికా తన మారణాయుధాలను పారవేయ గలుగుతుందా! చేయలేదు.
ఎందుకంటే దేశాలమీద యుద్ధాలు రుద్ది ఆయుధాలు అమ్ముకోనుటే వారి గుణము. ఆ దేశములోవేరు
పరిశ్రమలు ఏవైనా వున్నా దీని తరువాతనే.
ఏతావాతా
నేను చెప్పదలచుకోన్నదేమిటంటే మన విజ్ఞానము కోరేది
'లోక హిత'మైతే వారి science కోరేది 'లోక హతము'.ఈ దృక్పథముతో భారతీయ వినీలా కాశములో కనిపించే కొన్ని తారకలను చూస్తాము.
ప్రాచీన
భారతము అంటేనే, ఇప్పుడు కుంచించుకు పోయిన మన ఎల్లలను, సుదూర తీరాలకు
విస్తరించవలె. పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్,ఉజ్బెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ మరియు రష్యాలోని
కొన్ని భాగాలు ఇరాన్, సౌదిఅరేబియా, టర్కీదేశాలు,సింగపూర్ ,మలేసియా, థాయిలాండ్,మయాన్మార్ మొదలగు దేశాలు ఈ భారత ఖండములోని భాగములుగా ఉండేవి.(Indian
Kshatriyas Once Ruled from Bali to Baltic & Korea to Kaba (1966)-By
P.N.Oak) నేటికీ మన సంస్కృతికి ప్రతీకలైన గుళ్ళు, గోపురాలు,విగ్రహాలు, శిలలు,శిల్పాలు ఈ దేశాలలోనే కాక జపాన్,చైనా లాంటి దేశాలలో
కూడా చూడవచ్చు. మక్కా ఒకప్పుడు మఖేశ్వరాలయము. మఖము అంటే యజ్ఞము. అంటే ఇక్కడ
విరివిగా యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉండుటవల్ల ఆపేరు వచ్చియుండవచ్చు. అరబ్బీ
భాషలో ఈ పేరునకు మూలము దొరకదు. పైగా ఈ ఆలయమును మహమ్మదు ప్రవక్త మరియు వారి
అనుచరులు విద్వంసము చేయక మునుపు 'సాయిర్-ఉల్-ఓకుల్' అన్న పద్య సముదాయము అరబ్బీ భాషలో బంగారు ఫలకముపై వ్రాసి ఆ ఆలయము లోపల
కుడ్యమునకు వ్రేలాడదీయబడి యుండెడిదట.దానిని నేటికినీ 'మాక్క్తాబ్-ఎ-సుల్తానియా'
అన్న, టర్కీ కి రాజధానియైన 'ఇస్తాంబుల్'నగరములోని ప్రభుత్వ గ్రంథాలయములో
చూడవచ్చునని చదివినాను . ఇది ప్రవక్త గారి uncle అయినటువంటి 'ఉమర్-బిన్-అస్నాం' ఉర్ఫ్'అబల్-హికం'
అనునతడు,మన 'భేతాళ కథలకు'
పరిమితమైన 'విక్రమార్కుని'గురించి,ఆయన దక్షతను గురించి అత్యున్నతముగా వ్రాసినాడు.ఆ కవి, ప్రవక్త గారి మతములో చేరలేదన్నకారణానికి
నూతన మతావలంబకులచే హతమార్చ బడినాడట. బ్రిటీషు చారిత్రికులు వారి హిందూదేశ
అనుయాయులు వ్రాసిన చరిత్రలో మహాపురుషుడైనఈ 'విక్రమార్కునికి'
చరిత్రలో స్థానమే లేకుండాపోయింది.అసలు 'అర్వము'
అంటే గుఱ్ఱము. 'వ బ యోరభేదః' అన్న సూత్రము ప్రకారము ఆ దేశము కాలానుక్రమణములో 'అరేబియా'
అయినదని 'P.N.Oak' గారు నిర్ధారించినారు.
అరేబియా గుఱ్ఱములకు ప్రసిద్ది యన్న విషయము మనకు తెలిసినదే కదా !
అసలు
విషయానికొస్తే ప్రాచీన భారత దేశములో, భౌతిక ఉపయోగములకై, అనేక
యంత్రాలను వాడినట్లు సప్రమాణముగా మన వాఙ్మయము ద్వారా తెలియ వచ్చు చున్నది.'యంత్రార్ణవము' 'సమరాంగణ సూత్రధార' ఇత్యాది గ్రంథ పరిశీలనము చేసిన మనకు వాస్తవాలు గోచరిస్తాయి. వీని మూలములను
మనము అధర్వణ వేదములో చూడ వచ్చు. ఈ గ్రంథాలు గృహోపయోగములకు, వ్యవసాయానికి,యుద్ధ ఆయుధములకు,రోబో లకు సంబంధించిన ఎన్నో
విషయములను గూర్చిన వివరాలనందిస్తాయని విజ్ఞులు చెప్పగా విన్నాను. కానీ ఈ
ఆవిష్కరణలేవీ అటు ధ్యేయాన్ని ఇటు ప్రకృతి పై ధ్యాసను ఏమరలేదు.ఇవి నేటి కొన్ని
యంత్రములవలె దారుణ మారణ హోమములను సృష్టించవు. 'jaguar naught' అన్న పేరుతో పిలువబడుతూ మారణ హోమమును సృష్టించే అతి పెద్ద 'tanker'
కు ఆ పేరును 'జగనాథ' రథము
నుండి తీసుకోన్నారంటే ఆ జగన్నాథుని పాదాశ్రితులమైన మన మనసెంత నోచ్చుకొంటుందో
గమనించండి. ఆపేరు,చాలా పెద్దదైన ఆ రథము లాగుటలో చక్రముల కింద
పడి మరణించు వారిని జూచి, ఆ రథము పేరు పెట్టినారు. మనమో,
అలా జరిగితే ఆ భక్తుడు వైకుంఠ గతుడౌతాడని నమ్ముతాము.
మిగిలినది మరోమారు.....
No comments:
Post a Comment