MYINDMEDIA BROADCAST DATED
27th NOV. 2015
స్వోత్కర్షగా భావించరన్న మీ సంస్కారము నాకు తెలుసు కాబట్టి నా జీవితములో జరిగిన ఈ సన్నివేశమును మీతో పంచుకొను చున్నాను.
కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవేవి అన్నది తెలుసుకొనుటకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము చూడండి.
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి. ఇది సముద్ర మట్టమునకు 3,583 మీటర్ల (11,755 అడుగులు) ఎత్తులో వుంది.
కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని
చార్ధామ్లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్ లను చార్ ధామ్లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు ముఖ్యంగా భీముడు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
1998,99 ప్రాంతములో బంధు మిత్రులమైన కొంత మందిమి కలసి ఉత్తరాది యాత్రకు పోయినాము. అది సుదీర్ఘమైన యాత్ర. మా మా ఉద్యోగములకు నెలరోజులు శెలవు తీసుకొని బయలుదెరినాము. మా యాత్రలకు గానూ యాత్రాచాలకుల(TravelAgents)
సహాయము గైకొనక అంతా సొంతమే చూసుకోన్నాము. నేనిపుడు కేవలము నా కేదార్ నాథ్ అనుభవము మాత్రమే మీతో పంచుకొంటున్నాను. మేము ఋషీకేశ్ లో విడిది చేసినాము. ఆ చుట్టుప్రక్కల చూడతగ్గ మందిరములు మఠములు చూసిన తరువాత కేదార్నాత్కు పోయే రోజు రానే వచ్చింది. కేదార్ నాథ్ కు యంత్రచోడిత వాహన (Motor Vehicles ) సదుపాయము లేదు. అటువంటి వాహనములు గౌరీ కుండ్ వరకు మాత్రమె పోతాయి అని పైననే తెలియబరచటమైనది. మేము ఋషికేశ్ నుండి ఏర్పాటు చేసుకొన్నా Van లో బయలుదేరి ఎటువంటి ఉడుడుడుకులు లేకుండా గౌరికుండ్ చేరుకొన్నాము. ఆరాత్రికి అక్కడ అద్దెకు తీసుకొన్న విశ్రాంతి గృహములో ఆహార నిద్రలు ముగించుకొని తెల్లవారుజ్హాముననే లేచి దంతాదావన స్త్నాన సంధ్య పూజాది కార్యముల ముగించుకొని మా అమ్మమ్మ గారికి డోలీ ఏర్పాటుచేసి, నాపిల్లలిద్దరికి ఒక గుఱ్ఱము, నా శ్రీమతికి ఒక గుఱ్ఱము ఏర్పాటు చేసి మిగత వారంతా ఎవరికీ తోచిన ప్రయాణ సాధనమును వారు ఎన్నుకోనగా చివరకు నేను , వేరొక మిత్రుడు మాత్రము కాలినడకన 14 కిలోమీటరులు నడువ నిశ్చయించుకొన్నాము.అతను కాఫీ కొంచెము
ఎక్కువగా త్రాగే అలవాటు ఉన్నందువల్ల ఒక ఫ్లాస్క్ లో కాఫీ పోసుకొని , ఫ్లాస్కు కొంతసేపతను కాసేపు నేను మెడకు తగిలించుకొని,మేమిరువురము కాలినడకన బయలుదేరినాము. మేము తీసుకొన్న ప్రత్యెక జాగ్రత్తలు ఏమీ లేవు. నాకప్పటికి 55
సంవత్సరములు. అతనికి 50 సంవత్సరములు ఉండవచ్చును. నాకు నడక చాలా ఎక్కువ అలవాటు. ఒక 40 కిలోమీటర్లు అవలీలగా నడిచే వాణ్ణి. దయవుంచి అతిశయమనుకోవద్దు. ఆస్య గ్రంధి లో నున్న నా చిరకాల మిత్రులకీ వాస్తవము తెలుసు. ఆ రోజు మాత్రము నామనసు ఎదో
తెలియని ఆవేదన ఆలోచనతో నిండిపోయి వుండినది. ఆ శంభుడే దిక్కని బయలుదెరినాము. సగము దూరము నడచిన తరువాత ఆక్కడ ప్రాణవాయువు అతి తక్కువై వున్నదని, ఇంకా ఎత్తుకు పోయేవరకూ ఆమాత్రము కూడా ఉండదని, ఒక గంటలో స్వామీ దర్శనము ఆపుతారని, అన్నింటికీ మించి నేను ముందుకు , నామిత్రుని వేగముతో నడువలేనని, ఆతను నాతోనే వుంటే తానుకూడా ఆ రోజుకు దర్శనభాగ్యము కోల్పోతాడని అర్థమై పోయినది. నేనాయనకు నచ్చజెప్పి తానయినా దర్శనము చేసుకోనిమ్మన్న ఉద్దేశ్యముతో ముందుకు సాగానంపినాను. ఆతోన్దరలో 'తాను దూర సందు లేదు మెడకేమో డోలు' అన్నట్లు ఫ్లాస్కు నామేడకు శివుని హారమై కూర్చుంది.
కేవలము ఎక్కగలిగితే కేదారము, లేకుంటే అంతకన్నా ఎత్తయిన కైలాసము అన్న మొండి ధైర్యముతో అడుగు ముందుకు వేసినాను.
నా శ్రీమతి, పిల్లలు బంధువులు , మిత్రులు చివరకు నాతో బాటూ నడచిన మిత్రుడు కూడా దర్శనము ముగించుకొని వెనుదిరిగినారు. దారిలో నాకు కనిపించి దర్శ్హన సమయము ముగిసి పోయినదని కూడా తెలిపినారు. నాకు ఊపిరాడుట లేదు, ఎముకలు కోరికే చలి , వదలని వాన నాకు తోడురాగా , చెమటతో తడిసిన మేనితో ( అంటే శరీరము ఏమాత్రము సహకరించుట లేదు . నాపని ఐపోయినదన్న నిర్ణయానికి వచ్చివేసినాను .) తడబడే అడుగులతో ప్రయాణమును ముందుకే సాగించినాను. పుణ్యక్షేత్రము లోనికి అడుగుపెట్టుటకు చివరిమీట్టు నుండి అడుగు ముందుకు వేయబోయేటపుడు అక్కడ వున్నా 'chaivaalaa' 'chai' త్రాగమన్నాడు. దేవును దర్శనము చేసుకొని వచ్చి త్రాగుతానన్నాను. ఆతను ఆలయ ద్వారములు మూసివేసినారు ఇక దర్శనము రేపే అన్నాడు. అతనికి జవాబుకూడా చెప్పే పరిస్థితి లేని నేను మౌనముగానే లేని శక్తిని క్రోఢీకరించుకొని శివ నామమును మదినిండా మననము చేసుకొంటూ ఆలయ ప్రాకారము వద్దకు చేరినాను. మూసినా తలుపులగుండా అసలేమయినా కానీ పించుతుందేమో అని చూసినాను. ఏమీ కనిపించలేదు. ఎంత పాపము చేసినానో మా అంతమందిలో నాకొక్కనికే స్వామి దర్శనము ల్బించాలేదని వ్యాకుల చిత్తుడనై ఒక్క సారి ప్రహరీ చుట్టూ ప్రదక్షిణము చేసి తిరోగామానము చ్యుతకు సిద్ధపడి మూడు వంతుల ప్రదక్షిణము నా శక్తినంతతిని కూడగట్టుకొని చేసినాను. అక్కడ జరిగింది ఒక చమత్కారము. స్వామి ప్రహరీ గోడకు ఆదిక్కున ఒక వామన ద్వారము (wicket door ) సరిగా నేనక్కడికి చేరుతూనే తెరువబడింది. లోపలినుండి ఒక వ్యక్తీ బయట ఉన్న ఒకతనితో గట్టిగా చెబుతున్నాడు. ఆయన మాటలు అయ్యే వరకు పరమేశ్వరధ్యాయుదనైన నేను , హిందీలో నా పిడచ గట్టుక పోయిన నోటితోనే స్వామిని చూడాలన్న నాకోరిక తెలుపుకోన్నాను, 'దైవం మానుష రూపేణ' అంటారు కదా! ఆయన ఆర్ద్రత నిండిన హృదయముతో రండి అని నా చేయి పట్టుకొని నడిపించుకు గర్భగుడిలోనికి తీసుకు పోయి కేదారనాతుని దర్శనము చేయించినాడు. నాతో బాటూ ఒక పెళ్ళయిన జంట మాత్రమె ఆసమయములో దేవుని సన్నిధానము లో వుండినారు. నాకంతినీరు మందాకినిలో కలిసేతంత ప్రవహిన్చినదేమో అన్నంత ముకిలిత హస్తములతో అశ్రుపూరిత నయనములతో తదేక ధ్యానముతో కేదార నాథుని చూసి వెనుదిరిగినాను. నాకు దర్శన భాగ్యము కలిగించిన వ్యక్తికి త్రికరణ శుద్ధిగా నమస్కరించి , ఒక్క క్షణము పరాంగానములో కూర్చొని వెనుదిరిగినాను.
chai vaalaa నన్ను ఆదరముగా కూర్చుందజేసి ఒక tea త్రాగిన పిదప రెండవది కూడా ఇచ్చి డబ్బు వద్దన్నాడు. ఆయన ఎంత ఉన్నత మనస్కుడో! ఆయనకు డబ్బు చెల్లించి ఒక గుర్రమును ఏర్పాటు చేయంజన్నాను. వెంటనే ఒక అబ్బాయిని పిలిచి గుర్రమును ఏర్పాటు చేయమన్నాడు. ఆ పిల్లవాడు గుర్రమును నావద్దకు తెచ్చి ఎక్కమన్నాడు. నేను ఎక్కగాలిగేతుగా వుంటే అసలు నడచి పోయి వుమ్వాడేవాడినన్నాను , tea వాళ్ళ కలిగిన శక్తి తో ! ఆ బాలుడు tea కొట్టు యజమాని నన్ను జాగ్రత్తగా గుఱ్ఱము మీదికి ఎక్కించినారు.
ఆ పిల్లవాడు ఒక్కసారి గుఱ్ఱము వీపుపై గట్టిగా చరిచి 'చల్' అన్నాడు . ఆ గుఱ్ఱము నన్ను ఏ రాణా ప్రతాప్ గానో, ఏ శివాజీ గానో , ఏ ఝాన్సీ లక్ష్మిబాయ్ గానో తలచి ఆఘ మేఘాలపై మేము తీసుకొన్న విడిదికి చేర్చింది. అక్కడ ఉన్న గుర్రపు తాలూకు వ్యక్తీ నన్ను క్రిదికి దించి కూర్చుండ జేసినాడు. ఆటరువాతనే మావాల్లంతా ఒక్కొక్కరు గూడు చేరినారు.
పరమేశ్వరుని సంకల్పము లేనిదే , నేను తిరిగి నా అనుభవము మీతో పంచుకొని యుండి ఉండలేను.
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్
నమః పార్వతీ పతే హరహర మహాదేవ్
కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవేవి అన్నది తెలుసుకొనుటకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము చూడండి.
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
హిమాలయాల్లోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి. ఇది సముద్ర మట్టమునకు 3,583 మీటర్ల (11,755 అడుగులు) ఎత్తులో వుంది.
కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని
చార్ధామ్లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్ లను చార్ ధామ్లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు ముఖ్యంగా భీముడు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. . సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి దేవప్రయాగ, రుద్రప్రయాగ మీదుగా అగస్త్యముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. సాయంత్రం 7తర్వాత ఈ రూటులో ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
1998,99 ప్రాంతములో బంధు మిత్రులమైన కొంత మందిమి కలసి ఉత్తరాది యాత్రకు పోయినాము. అది సుదీర్ఘమైన యాత్ర. మా మా ఉద్యోగములకు నెలరోజులు శెలవు తీసుకొని బయలుదెరినాము. మా యాత్రలకు గానూ యాత్రాచాలకుల(TravelAgents)
సహాయము గైకొనక అంతా సొంతమే చూసుకోన్నాము. నేనిపుడు కేవలము నా కేదార్ నాథ్ అనుభవము మాత్రమే మీతో పంచుకొంటున్నాను. మేము ఋషీకేశ్ లో విడిది చేసినాము. ఆ చుట్టుప్రక్కల చూడతగ్గ మందిరములు మఠములు చూసిన తరువాత కేదార్నాత్కు పోయే రోజు రానే వచ్చింది. కేదార్ నాథ్ కు యంత్రచోడిత వాహన (Motor Vehicles ) సదుపాయము లేదు. అటువంటి వాహనములు గౌరీ కుండ్ వరకు మాత్రమె పోతాయి అని పైననే తెలియబరచటమైనది. మేము ఋషికేశ్ నుండి ఏర్పాటు చేసుకొన్నా Van లో బయలుదేరి ఎటువంటి ఉడుడుడుకులు లేకుండా గౌరికుండ్ చేరుకొన్నాము. ఆరాత్రికి అక్కడ అద్దెకు తీసుకొన్న విశ్రాంతి గృహములో ఆహార నిద్రలు ముగించుకొని తెల్లవారుజ్హాముననే లేచి దంతాదావన స్త్నాన సంధ్య పూజాది కార్యముల ముగించుకొని మా అమ్మమ్మ గారికి డోలీ ఏర్పాటుచేసి, నాపిల్లలిద్దరికి ఒక గుఱ్ఱము, నా శ్రీమతికి ఒక గుఱ్ఱము ఏర్పాటు చేసి మిగత వారంతా ఎవరికీ తోచిన ప్రయాణ సాధనమును వారు ఎన్నుకోనగా చివరకు నేను , వేరొక మిత్రుడు మాత్రము కాలినడకన 14 కిలోమీటరులు నడువ నిశ్చయించుకొన్నాము.అతను కాఫీ కొంచెము
ఎక్కువగా త్రాగే అలవాటు ఉన్నందువల్ల ఒక ఫ్లాస్క్ లో కాఫీ పోసుకొని , ఫ్లాస్కు కొంతసేపతను కాసేపు నేను మెడకు తగిలించుకొని,మేమిరువురము కాలినడకన బయలుదేరినాము. మేము తీసుకొన్న ప్రత్యెక జాగ్రత్తలు ఏమీ లేవు. నాకప్పటికి 55
సంవత్సరములు. అతనికి 50 సంవత్సరములు ఉండవచ్చును. నాకు నడక చాలా ఎక్కువ అలవాటు. ఒక 40 కిలోమీటర్లు అవలీలగా నడిచే వాణ్ణి. దయవుంచి అతిశయమనుకోవద్దు. ఆస్య గ్రంధి లో నున్న నా చిరకాల మిత్రులకీ వాస్తవము తెలుసు. ఆ రోజు మాత్రము నామనసు ఎదో
తెలియని ఆవేదన ఆలోచనతో నిండిపోయి వుండినది. ఆ శంభుడే దిక్కని బయలుదెరినాము. సగము దూరము నడచిన తరువాత ఆక్కడ ప్రాణవాయువు అతి తక్కువై వున్నదని, ఇంకా ఎత్తుకు పోయేవరకూ ఆమాత్రము కూడా ఉండదని, ఒక గంటలో స్వామీ దర్శనము ఆపుతారని, అన్నింటికీ మించి నేను ముందుకు , నామిత్రుని వేగముతో నడువలేనని, ఆతను నాతోనే వుంటే తానుకూడా ఆ రోజుకు దర్శనభాగ్యము కోల్పోతాడని అర్థమై పోయినది. నేనాయనకు నచ్చజెప్పి తానయినా దర్శనము చేసుకోనిమ్మన్న ఉద్దేశ్యముతో ముందుకు సాగానంపినాను. ఆతోన్దరలో 'తాను దూర సందు లేదు మెడకేమో డోలు' అన్నట్లు ఫ్లాస్కు నామేడకు శివుని హారమై కూర్చుంది.
కేవలము ఎక్కగలిగితే కేదారము, లేకుంటే అంతకన్నా ఎత్తయిన కైలాసము అన్న మొండి ధైర్యముతో అడుగు ముందుకు వేసినాను.
నా శ్రీమతి, పిల్లలు బంధువులు , మిత్రులు చివరకు నాతో బాటూ నడచిన మిత్రుడు కూడా దర్శనము ముగించుకొని వెనుదిరిగినారు. దారిలో నాకు కనిపించి దర్శ్హన సమయము ముగిసి పోయినదని కూడా తెలిపినారు. నాకు ఊపిరాడుట లేదు, ఎముకలు కోరికే చలి , వదలని వాన నాకు తోడురాగా , చెమటతో తడిసిన మేనితో ( అంటే శరీరము ఏమాత్రము సహకరించుట లేదు . నాపని ఐపోయినదన్న నిర్ణయానికి వచ్చివేసినాను .) తడబడే అడుగులతో ప్రయాణమును ముందుకే సాగించినాను. పుణ్యక్షేత్రము లోనికి అడుగుపెట్టుటకు చివరిమీట్టు నుండి అడుగు ముందుకు వేయబోయేటపుడు అక్కడ వున్నా 'chaivaalaa' 'chai' త్రాగమన్నాడు. దేవును దర్శనము చేసుకొని వచ్చి త్రాగుతానన్నాను. ఆతను ఆలయ ద్వారములు మూసివేసినారు ఇక దర్శనము రేపే అన్నాడు. అతనికి జవాబుకూడా చెప్పే పరిస్థితి లేని నేను మౌనముగానే లేని శక్తిని క్రోఢీకరించుకొని శివ నామమును మదినిండా మననము చేసుకొంటూ ఆలయ ప్రాకారము వద్దకు చేరినాను. మూసినా తలుపులగుండా అసలేమయినా కానీ పించుతుందేమో అని చూసినాను. ఏమీ కనిపించలేదు. ఎంత పాపము చేసినానో మా అంతమందిలో నాకొక్కనికే స్వామి దర్శనము ల్బించాలేదని వ్యాకుల చిత్తుడనై ఒక్క సారి ప్రహరీ చుట్టూ ప్రదక్షిణము చేసి తిరోగామానము చ్యుతకు సిద్ధపడి మూడు వంతుల ప్రదక్షిణము నా శక్తినంతతిని కూడగట్టుకొని చేసినాను. అక్కడ జరిగింది ఒక చమత్కారము. స్వామి ప్రహరీ గోడకు ఆదిక్కున ఒక వామన ద్వారము (wicket door ) సరిగా నేనక్కడికి చేరుతూనే తెరువబడింది. లోపలినుండి ఒక వ్యక్తీ బయట ఉన్న ఒకతనితో గట్టిగా చెబుతున్నాడు. ఆయన మాటలు అయ్యే వరకు పరమేశ్వరధ్యాయుదనైన నేను , హిందీలో నా పిడచ గట్టుక పోయిన నోటితోనే స్వామిని చూడాలన్న నాకోరిక తెలుపుకోన్నాను, 'దైవం మానుష రూపేణ' అంటారు కదా! ఆయన ఆర్ద్రత నిండిన హృదయముతో రండి అని నా చేయి పట్టుకొని నడిపించుకు గర్భగుడిలోనికి తీసుకు పోయి కేదారనాతుని దర్శనము చేయించినాడు. నాతో బాటూ ఒక పెళ్ళయిన జంట మాత్రమె ఆసమయములో దేవుని సన్నిధానము లో వుండినారు. నాకంతినీరు మందాకినిలో కలిసేతంత ప్రవహిన్చినదేమో అన్నంత ముకిలిత హస్తములతో అశ్రుపూరిత నయనములతో తదేక ధ్యానముతో కేదార నాథుని చూసి వెనుదిరిగినాను. నాకు దర్శన భాగ్యము కలిగించిన వ్యక్తికి త్రికరణ శుద్ధిగా నమస్కరించి , ఒక్క క్షణము పరాంగానములో కూర్చొని వెనుదిరిగినాను.
chai vaalaa నన్ను ఆదరముగా కూర్చుందజేసి ఒక tea త్రాగిన పిదప రెండవది కూడా ఇచ్చి డబ్బు వద్దన్నాడు. ఆయన ఎంత ఉన్నత మనస్కుడో! ఆయనకు డబ్బు చెల్లించి ఒక గుర్రమును ఏర్పాటు చేయంజన్నాను. వెంటనే ఒక అబ్బాయిని పిలిచి గుర్రమును ఏర్పాటు చేయమన్నాడు. ఆ పిల్లవాడు గుర్రమును నావద్దకు తెచ్చి ఎక్కమన్నాడు. నేను ఎక్కగాలిగేతుగా వుంటే అసలు నడచి పోయి వుమ్వాడేవాడినన్నాను , tea వాళ్ళ కలిగిన శక్తి తో ! ఆ బాలుడు tea కొట్టు యజమాని నన్ను జాగ్రత్తగా గుఱ్ఱము మీదికి ఎక్కించినారు.
ఆ పిల్లవాడు ఒక్కసారి గుఱ్ఱము వీపుపై గట్టిగా చరిచి 'చల్' అన్నాడు . ఆ గుఱ్ఱము నన్ను ఏ రాణా ప్రతాప్ గానో, ఏ శివాజీ గానో , ఏ ఝాన్సీ లక్ష్మిబాయ్ గానో తలచి ఆఘ మేఘాలపై మేము తీసుకొన్న విడిదికి చేర్చింది. అక్కడ ఉన్న గుర్రపు తాలూకు వ్యక్తీ నన్ను క్రిదికి దించి కూర్చుండ జేసినాడు. ఆటరువాతనే మావాల్లంతా ఒక్కొక్కరు గూడు చేరినారు.
పరమేశ్వరుని సంకల్పము లేనిదే , నేను తిరిగి నా అనుభవము మీతో పంచుకొని యుండి ఉండలేను.
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్
నమః పార్వతీ పతే హరహర మహాదేవ్
ఈ క్రింది సంస్కృత
శ్లోకములో రెండు ప్రశ్నలు కలవు. జవాబు మాత్రము రెంటికీ ఒకటే పదమే! కానీ మొదటి ప్రశ్నకు
సమాధానము సంస్కృతము లోనూ రెండవ ప్రశ్నకు సమాధానము ఆంధ్రము లోనూ ఇవ్వ వలెను. రెండు భాషల
లోనూ పదము మాత్రము ఒకటే!
ఆ శ్లోకము ఇది :
ప్రభాతే కీ దృశం
వ్యోమః?ప్రమాణే కీ దృశమ్ వచః
గీర్వాణాంధ్ర
భాషాభ్యాం ఏక మేనోత్తరం వదః
అర్థము ఉషః కాలమున(ప్రాతఃకాలము) ఆకాశ మెట్టిదిగా నుండును?ప్రమాణము చేయునప్పుడే మాట చెప్పుదురు?అని సంస్కృతాంధ్రములలో ఉన్న ఈ రెండు ప్రశ్నలకు సమాధానము ఒకే పదముగా నుండవలెను. పైగా అది తెలుగు పదము గాను సంస్కృత పదముగాను యుండ వలెను.
సమాధానము: 'నీతోడు' అని.
సంస్కృత సమాధానము
మొదటి పాదమునకు నీత
=మాసిపోయిన ఉడు=నక్షత్రములు గలది=నీతోడు(నీతః+ఉడు=నీతోడు).
తెలుగు సమాధానము
తెలుగులో ప్రమాణము
చేయునప్పుడు 'నీతోడు'
అని అంటారు కదా!
సంస్కృతము ఆంధ్రము
ఎంత గొప్ప భాషలో గమనించండి.
ఒక అడుగు ముందునకు వేసి నేటి అజరామర సూక్తి ని విని ఆనందించుదామూ, ఆలోచించుదాము, ఆచరించుదాము.
న
మాతా శపతే పుత్రం న దోషం లభతే మహీ
న
హింసాం కురుతే సాధుర్న దేవః సృష్టినాశకః
-సుభాషితరత్నభాణ్డాగారము
తల్లి
తన తనయుని శపించదు. ధరిత్రికి అనగా భూమికి ఎటువంటి దోషము అంటదు. సజ్జనులు ఏ
పరిస్థితిలో కూడా ఇతరులను
హింసించరు. భగవంతుడు సృష్టి నాశము చేయడు.
ఈ
సుభాషితము నిజానికి సులభ గ్రాహ్యము. కానీ మనసు పెట్టి చదివిన తరువాత నాలుగు మాటలు
వ్రాయవలెనని అనిపించి నందువల్ల వ్రాస్తున్నాను. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము లో జగద్గురువు శంకరాచార్యులవారు ఈ విధముగా చెబుతున్నారు.
పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం
త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి
అమ్మా
విశ్వమాతా నేను నీకు చేసిన సేవ ఏదీ లేదు. ధనకనక వస్తువాహనాది కానుకలను
సమర్పించినదీ లేదు . కానీ నీవు నాపై ఎంతో అనురాగాన్ని చూపించుతావు తల్లీ. ఈ జగతిలో
కుపుత్రులు కొల్లలుగా కనిపించవచ్చును గానీ కుమాత కానరానే కానరాదు కదా !
తల్లి
గుణమును వర్ణించుటకు, ప్రపంచ భాషల అలంకారాలు అన్నీ కలిపినా సాధ్యము
కాదు.
నేటి 'సుపుత్రులు' అందుకేనేమో
తల్లిదండ్రులకు వృద్దాశ్రమములను స్థావరములుగా చేసి తమ కృతజ్ఞతను చాటుకొంటున్నారు.
ఇక
భూమిని గూర్చి చెప్పవలసివస్తే భూసూక్తము లోని మొదటి మంత్రము ఈ
విధంగా వుంది.
హరి:
ఓం ||
భూమిర్భూమ్నా
ద్యౌర్-వరిణా అంతరిక్షం మహిత్వా | ఉపస్థేతే దేవ్యదితే
గ్నిమన్నాదమన్నాద్యాయాదదే|| 1 ||
ఓ
భూమాతా! నీ ఖనిజ సంపద అపారము అనంతము. అందుకే నీవు భూమి వైనావు. నీ ఔన్నత్యము,నీ పొడవెడల్పులగూడి విస్తారమైన నీ వైభవము
జగన్నుతము . ఈ
విశ్వమే నీవు. ఓ దేవీ! అకారణ కరుణ
( నిర్హేతుక దయ ) మరియు (అజ్ఞాత
నిగ్రహము) అకుంఠితక్షమా వైఖరి కలిగిన నీ సమీపంలోని
ఉండటం ద్వారా మాకు నీ సహాయం సదా సిద్ధించుతూవుంది. నీవు 'అదితి' వి
అంటే హద్దులు లేని దానివి (న+దితి)జగన్నుతము.
ఎంత
త్రవ్వినా ఎంత ఆశుద్ధమును మోసినా మాకు సస్యములు ఖనిజములు,నీరు,నిప్పు
,గాలి అన్నీ ఇస్తూనే వుంటావు.
అట్టి
యాతల్లిని ఏదోషమూ అంటదు గావుననే అన్ని సుఖాలను మనకు సమకూరుస్తూవుంది.
ఇక
సజ్జనుని గూర్చి. భాగవత పురాణములోని నవమ స్కందములో రంతిదేవుని చరిత్రము చదివితే ఈ
క్రింది విషయము తెలియవస్తుంది :
నత్వహం కామయే రాజ్యం న స్వర్గం, న
పునర్భవం.కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశనం.
నేను
రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను.
సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి
దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.
సజ్జనుల ఆలోచనలు ఏ
విధంగా ఉంటాయో చూడండి. అదే దుర్జనుడు ఎవరైనా దారిలో రూపాయి బిళ్ళ పారేసుకుంటే
వగిరించుతూనైనా పరుగెత్తుకోనిపోయి అతనికి ఇచ్చి తన నిప్పు లాంటి నిజాయితీ
చాటుకొంటాడు. అదే వెయ్యి రూపాయలైతే నిజాయితీని నిప్పులో పడవేసి వెయ్యి జేబులోనుంచుకొని
మిన్నకుంటాడు.
ఇక పరమాత్మ సృష్టి కర్త
సృష్టి భర్త అయినపుడు సృష్టిహర్త ఎట్లు కాగలుగుతాడు. మట్టితో తాను చేసిన కుండ
నెరెలు చీలిందంటే దానిని పగులగొట్టి కుంభారుడు మళ్ళీ మంచిది చేసినట్లే ఎప్పుడు
ధర్మము బీటలు బారుతుందో అప్పుడు దానిని త్యజించి క్రొత్తది తయారు
చేస్తాడు. అదేకదా పరమాత్మ భగవద్గీత లో చెప్పింది.
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్తానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం
కాబట్టి పరమేశ్వరుడు దయుడే గానీ లయుడు కాదు.
మాట - వరహాల మూట
మాట వలన జరుగు మహిలోన కార్యముల్
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
నా ఉద్దేశ్యంలో మాటకు ఇంత ప్రాధాన్యత వుంది. మాటే జంత్రము(సంగీత
వాద్యము)మాటే మంత్రము ,మాటే
యంత్రము ,మాటే తంత్రము.
గాలికి కదిలే మీ కురులు వేయి వీణియల తంత్రులై నా
హృదయములో అనురాగ మను రాగాన్ని మీటుతున్నాయి అంటే అప్పుడు మాట జంత్రమేకదా. (జంత్రమంటే
సంగీత పరికరమని ఒక అర్థము)
సరియైన సమయములో సరియైన సలహా చెప్పి సమస్యను సర్దుబాటు
చేయగలిగిన నిజమైన స్నేహితుని మాట మంత్రము కాదా!
సమయానికి సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పని చేయ నివ్వదా!
సమయానికి సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పని చేయ నివ్వదా!
అన్నీ మాటలే. కొన్ని తేనె ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు, కొన్ని మంచికి బాటలు, కొన్ని హాయిని పాటలు, కొన్ని అందాలీనే తోటలు. కొన్ని రక్షించే
కోటలు, కొన్ని
అతి మెత్తని దూటలు (దూటను అరటి బొందె లేక బోదె అనికూడా అంటారు),కొన్ని కష్టాలిచ్చేపూటలు, కొన్ని చెడ్డను చెరిగే చేటలు, కొన్ని ఎండిన చెట్లకు తాటలు ( అంటే చెట్టు
బెరడు, Bark),కొన్ని జీవితముతో ఆడుకొనే ఆటలు,కొన్ని గాయము చేసే ఈటెలు,తుపాకి పేల్చే తూటలు, కొన్ని నీటి మూటలు,కొన్ని పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కొన్ని విషపు విత్తులు, కొన్ని రెండుగా చీల్చే కత్తులు, కానీ సుమతి శతక కారుడు
మాటను, సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు.
అదేమిటంటే
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
అన్నాడు. కోటకు భటులు, నాతికి అంటే స్త్రీ కి మానము, వ్రాతకోతలకు చేవ్రాలు ఎంత ముఖ్యమో మాటలకు
సత్యము అంతకన్నా ముఖ్యము. మాట ఎంత విలువ కలదో చూడండి.
ధృతరాష్ట్రుడు భారతములో తన కొడుకు చర్యలు సరియైనవి కావని
చెబుతూనే తనకు గల పుత్ర వ్యామోహము ఆ విధంగా చేయిస్తున్నదని బాధ పడతాడు. కర్ణుడు
తాను కుంతీ పుత్రుడని తెలిసిన పిదప గూడా తన మాటకు కట్టుబడి దుర్యోధనునితో
ఉండిపోతాడు. యుద్ధానికి ఆరంభములో ధర్మజునికి, తగిన సమయములో తన మరణ రహస్యము తెలిపెదనని తాను ఇచ్చిన
మాటకు కట్టుబడి భీష్ము డాతనికి తన మరణ రహస్యమును ఆ విధంగానే తెలుపుతాడు . దుర్యోధనుడు తానూ చేసేది తప్పే అని తెలిసినా తానూ దాయాది
మాత్సర్యము వీడలేనంటాడు. అంటే మన పూర్వుల సత్య నిష్ఠా గరిష్ఠత
మనకవగతమౌతుంది. ఇందులో మంచి వారు చెడ్డవారు అన్న తారతమ్యము లేదు. అసలు
నిజము గజము వంటిది. అందుకే మరి ఏనుగు నడుస్తూవుంటే ఎంత హుందాగా ఉంటుందో చూడండి. నిజము
గజమైతే అబద్ధము అజగరము అంటే పాము. కాబట్టి పాముతో చేలగాట మెన్నటికీ మంచిది కాదు.
ఈ పద్యము వినండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
ఇది కూడా సుమతి శతక కారుని ఇంకొక పద్యము. సక్రమముగా వినుట, లేక మనసు పెట్టి చదువుట, విన్నది ఆకళింపు చేసుకొనుట,ఆకళింపు చేసుకొన్నదాని అర్థమెరిగి
ప్రవర్తించుట మనిషి కి చాలా ముఖ్యము. అంటే ఒక మాటను ఆకళింపు చేసుకోనేదానికి ఎంత
అవగాహన అవసరమో అర్థము చేసుకోన గలరు. అసలు ఇవన్నీ డబ్బు తీసుకొని చెప్పే Management Science లోని భాగాలే!
నేను వ్రాసిన ఈ పద్యము వినండి.
మనసు మాటలోన మాటేమొ పనిలోన
పనికి పట్టుదలను పదిలపరచి
కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి
అంటే మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము మొదట మనస్సులో కలుగుతుంది.
అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున
పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు.
అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి
ఆనందము.
ఇక విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అన్నది నోటికి వచ్చినట్లు
మాట్లాడుట కాదు. చదరంగములో పావులను ఆలోచించి కదిలించిన రీతిలో అక్షరములను ఏర్చి
పేర్చి కూర్చవలె. అప్పుడే ఆమాటకు కలుగుతుంది అర్థము అది మన కందిస్తుంది పరమార్థము.
అందుకే విమర్శ చిరుజల్లులు
కురిసినట్లుండాలి కానీ జడివాన లాగా కాదు. అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కానే కాకూడదు.
హాయిగా పూల జల్లు వలె ఉండవలెను.
ఎంత హాయిగా వుండాలనుటకు సుమతి శతకకారుని మాటే కొలబద్ద :
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
అని అన్నాడు.
దీనిని సరదాగా నేను ఇంగ్లీషుతో కలిపి ఇట్లు చెప్పినాను (యతి
ప్రాసలు చూడవద్దు,
నవ్వొస్తే నవ్వుకొండి )
ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికా టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ
కాబట్టి ఒక వ్యక్తిని 'మీకు బుద్దిలేదు' అనుటకంటే 'మీరు ఈ పని చేయుటలో బుద్ధినుపయోగిన్చినట్లు
లేదు' అని అనుట ఎంత ఉభయతారకముగా ఉంటుందో గమనించండి.
‘ బుద్ధి వుంటే గదా ఉపయోగించటానికి’ అన్న అర్థము అందులో చెప్పకనే
వినిపించినట్లవుతుంది. అందుకే మాట మహిమాన్వితమైనది.
అసలు ఈ చాటువు మాటను గూర్చి ఎంత మంచిమాట చెప్పిందో చూడండి
మాటలచేత దేవతలు మన్నన చెంది వరంబులిత్తురున్
మాటలచేత భూవరులు మన్నన చెంది పురంబులిత్తురున్
మాటలచేత భామినులు మన్నన చెంది మనంబులిత్తురా
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్
దేవతల నుండి వారములు పొందుటకు , వారిని ముందు ప్రసన్నులను చేసుకొని పిదప మన
కోరికలను నివేదించు కొనవలె. అందుకే సహస్ర నామాలతో ఆష్టోత్తరాలతో ఆరాధిస్తూ వుంటాము.
అందరికీ తెలిసిన ఈ చాటువు ఒక సారి గుర్తు చేసుకొందాము.
సీ: రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
గీ: భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను.
ఇది ప్రెగ్గడ నరసరాజను ఉద్దండ పండితుడు
రాయలవారి ఆస్థానములో చెప్పిన పద్యము. దీనికి బదులుగా 'మేకతోకుమేక' అన్న పద్యమును తెనాలి రామలింగడు చెప్పి
అర్థమడిగి,
ఆయన చెప్పలేకపోతే పరాభవము
చేస్తాడు.
కానీ ఈ పద్యానికి వేదమూర్తులు దీపాల
పిచ్చయ్య శాస్త్రి గారు ఈ విధం గా అర్థం చెప్పుట జరిగింది.
ఈ సీస పద్యంలోని మొదటి చరణము, తేటగీతిలోని మొదటి పాదముతో, రెండవది రెండవదానితో,
మూడవది మూడవదానితో, నాల్గవది నాల్గవ దానితో
క్రమంగా అన్వయించిన మనకు అర్థము ఈ విధముగా స్ఫురించగలదు.
రాజ నందన = చంద్రుని కొడుకైన బుధుడు,
ర = సమర్థుడైన, అజ= ఈశ్వరుడు
రాజ = దేవేంద్రుడు
ఆత్మజులు = బ్రహ్మదేవుడును
తలపన్ = ఆలోచించగా
అల్లయ వేమ ధరణిపతికి = అల్లయ వేమారెడ్డి అనే
రాజుకు
సాటి = సమానులు
భావ = బుద్ధియందు
భవ = ఐశ్వర్యమునందును
భోగ = వైభవంలోనూ
సత్కళా = శ్రేష్టమైన విద్యలయొక్క
భావములను = అతిశయమందును
బుద్ధియందు, ఐశ్వర్యమందు, వైభవంలోను, శ్రేష్టమైన విద్యల యొక్క అతిశయములందూ, చంద్రుని కుమారుడైన బుధుడు, సమర్థుడైన ఈశ్వరుడు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సమానులు.
రెండవ చరణద్వయాల అర్థం, అన్వయం:
ర + అజ + నందన = మనోహరుడైన శివునికి
కుమారుడైన కుమారస్వామి
రాజ = కుబేరుడు
ర + అజ = శ్రేష్ఠుడైన , రఘువు కుమారుడైన యజుడు
ఆత్మజులు = చంద్రుడును
తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా
అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.
భావ = క్రియ యందు
భవ = ధనమునందు
భోగ = పరిపాలనలో
సత్కళా = శ్రేష్ఠమైన కాంతి యొక్క
భావములను = సమూహమునందును
క్రియయందు, ధనమునందు, పరిపాలనలో శ్రేష్ఠమైన కాంతి సమూహమునందును, మనోహరుడైన శివుని కుమారుడైన కుమార స్వామి , కుబేరుడు, శ్రేష్ఠుడైన రఘువుకు కొడుకైన అజుడు, చంద్రుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సమానులు.
మూడవ చరణద్వయాల అర్థం, అన్వయం:
ర + అజ + నందన = బంగారం వంటి కాంతిగల
బ్రహ్మకు పుట్టిన సనత్కుమారుడు
ర + అజ = శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన
వశిష్ఠుడు
రాజ = క్షత్రియుడైన
ఆత్మ + జ
= బృహస్పతియందు పుట్టిన కచుడును
తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా
అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.
భావ = ఆత్మ జ్ఞానమునందు
భవ = పుట్టుకయందు
భోగ = అనుభవమునందు
సత్కళా = అభివృద్ధియొక్క
భావములను = పద్ధతులందును
ఆత్మ జ్ఞానమునందు, పుట్టుకయందు, అనుభవమునందు, అభివృద్ధియొక్క పద్ధతులందును బంగారువంటి
కాంతి కలిగిన బ్రహ్మకు కుమారుడైన సనత్కుమారుడు, శ్రేష్ఠుడైన బ్రహ్మకుపుట్టిన వశిష్ఠుడు, క్షత్రియుడై బృహస్పతి వలన పుట్టిన కచుడునూ, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సమానులు.
నాలగవ చరణద్వయాల అర్థం, అన్వయం :
ర + అజ + నందన = శ్రేష్ఠుడైన మన్మధుని
కుమారుడైన అనిరుద్ధుడును
ర + అజ = సర్వ వ్యాపకుడైన విష్ణువు
రాజ = యక్షుడును (నలకూబరుడు ?)
ఆత్మజ = మన్మధుడును
తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా
అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు ( అన్ని పాదాలకీ ఒకే అర్థం)
భావ = ఆకారమునందును
భవ = సంసారమందును
భోగ = సుఖానుభవమునందును
సత్కళా = సౌందర్యము యొక్క
భావములను = రీతియందును
ఆకారమునందు, సంసారమందు, సుఖానుభవమునందు, సౌందర్యముయొక్క రీతియందును, శ్రేస్ఠుడైన మన్మధునికుమారుడైన అనిరుద్ధునికి, సర్వ వ్యాపకుడైన విష్ణువు, యక్షుడైన నలకూబరుడు, మన్మధుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సమానులు.
గీత
పద్య పాదానికి,
సీసపద్యపాదానికీ మధ్య ఉన్న
క్రమాలంకారం గమనించితే కవి గొప్పదనము మనకు అర్థమౌతుంది. ఇంతటి ప్రశంశ కు లొంగని
రాజు ఎక్కడ ఉంటాడు! కాబట్టి మాటకు అంత గొప్పదనము వున్నది. ఈ పద్యములోని భావమును
నిజానిజాల దృష్టితో కాక కవి కల్పనా చాతుర్యమును భావాన్వయమును మనము గమనించ వలసియున్నది.
అందుకే దీనిని కళలకు తలమానికముగా రాజులు పూజించినారు. 'భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ' అంటే ఇదే!
తల్లి తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు
మీనాన్న అంటే అది ఆశిశువు గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము
ఏర్ప్రచుకోవడము జరుగుతుంది. తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు
తెలుసుకొన్న పిదప గురువుకు అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్థకము కాదు. Teacher అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో ముగుస్తుంది. 'గురుత్వ'మది కాదు. అసలు
గురుత్వము అంటే 'density', లేక 'Gravity' అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక
పోయిరమ్మనుట కాదు గురువు యొక్క బాధ్యత. శిష్యుడు తనంత వాడయ్యేవరకు తన ఛత్ర ఛాయ (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఇంకా వినీతుడు అన్న
మాటను వాడే వారు విరివిగా. ఎంత మంచి మాటో చూడండి. అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు హస్తిమశకాంతరము, అజగజ సామ్యము,పర్వత పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి
మాట్లాడవలె ఎట్లు మాట్లాడవలె ఎంత మాట్లాడవలె అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా
చెబుతాడు. అందుకే నేను ఈ విధముగా అంటూ వుంటాను:
అమ్మ మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా మాట చూడ అందు పెరుగు
గురువు గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి రమ్య సూక్తి
మనకు నచ్చని విషయాలు సూన్నితగా చెప్పడమనేది ఒక కళ. ఇందులో చెప్పేవానికి చెప్పించుకొనే వానికీ అవగాహన వుంటే వారి మధ్యన పొరపొచ్చులు రావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ :
పెళ్లి పెత్తనానికి వచ్చిన అబ్బాయి యొక్క తండ్రి ఒక కుర్చీ పై
కూర్చొని, మిగత నలుగురిముందు భార్యతో ఇట్లన్నాడు. ఇందూ
! రా యిలా కూర్చో. చెప్పింది ఒక మాటే అయినా అర్థాలు మాత్రము రెండు. ఒకటి నా
ప్రక్కనవచ్చి కూర్చో ఐతే రెండవది మాట్లాడకుండా రాయి లాగా కూర్చోమనుట. ఇది ఆమెకు
మాత్రమే అర్థమౌతుంది. ఎందుకంటే వారి మధ్యన అవగాహన వుంది
కాబట్టి.
మాటకున్న ఇంకొక ప్రాధాన్యత చూస్తాము
భర్తృహరి సుభాషితాలలో 'విద్యా దదాతి వినయం'అన్న ఒక శ్లోకాన్ని ఈ విధమైన పద్యంగా తెనిగించినారు ఏనుగు లక్ష్మణ కవి గారు.
విద్య యొసగును వినయంబు
వినయమునను
బడయు పాత్రత, పాత్రత వలని ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు".
బడయు పాత్రత, పాత్రత వలని ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు".
మనము నేర్చుకొనే విద్య వినయప్రదానమై వుండాలి. అప్పుడే
మనలపెద్దల ఆదరమును పొందే పాత్రత లభించుతుంది. పాత్రత వలన అంతా
మంచే జరుగుతుంది. పాత్రత వుంటే ధనము, ధనము వుంటే దానధర్మాలు, వాని
వల్ల ఇహ లోకములో పేరు ప్రతిష్ఠ పరలోక సుఖాలను పొందుతాడు నరుడు.
జిజ్ఞ్యాస, వయసు తో నిమిత్తము లేకుండా, అందరికీ ఉండవలసిందే. అడిగే పధ్ధతి
ఎదుటివారికి ఆనందము కలిగించాలి. కొందరి మాటలు వింటే మొక్క
బుద్ద్ఘి పుడుతుంది. కొందరివి వింటే మొట్ట
బుద్ది పుడుతుంది. మన మాటలో
ఎపుడూ నిజము నిజాయితీ నిండి ఉండాలి, నిండుకొని గాదు(అంటేఅయిపోవడం. ) అస లింకొక మాట చెప్పవలసినది వుంది. నీతి
శతకములో ఒక శ్లోకము ఈ విధంగావుంది .
సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతమ్ భ్రూయాత్ ఏషా ధర్మః సనాతనః
అంటే ఎదుటి వ్యక్తికి సంతోషము కలిగించే నిజము చెప్పవలె. నిజమైనా
కష్టము కలిగించేది చెప్ప గూడదు. అట్లని ప్రియమును చేకూర్చే అబద్ధ మాడరాదు. ఇది మన
పురాతన ధర్మము.
హనుమంతుడు మారు వేషములో వెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను
చూసి వారిని ప్రశ్నించిన తీరును, రాములవారు, వాల్మీకి రామాయణము లో
ఈ విధంగా మెచ్చుకొంటాడు :
నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః
న సామవేద విదుషః సక్యమేవాభ్యభాషణం
అంటే ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం
చేసిన వాడు. యజుర్వేద ధారిణుడు అంటే ఉదాత్త అనుదాత్త స్వరితములతో షడంగా
సముపెతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత
సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన ప్రాధాన్యమైన
సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి కలిగించినవాడు.
మాటకు అంత ప్రాధాన్యత వుంది. అడుగుటలో
అణకువ వుండాలి.
మాటను గూర్చి ఇంకా ఎంతయినా వ్రాస్తూనే పోతూ వుండవచ్చు.
మనకు తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో
ముగించుతూ నన్ను తప్పుగా తలవ వద్దని తెలుపుకొను చున్నాను .
జ్ఞానము అనంతము. జ్ఞానము అసలే లేనివారు ఎవరూ వుండరు కావున
అంతో ఇంతో ఎంతో కొంత అందరమూ జ్ఞానులమే. అట్లని
పరిశోధన లేక విచికిత్స చేయకుండా ఒకరిని తూలనాడుట తప్పు.
ఒకసారి రాయల ఆస్థానమునకు ప్రెగ్గడ నరసరాజు వచ్చి ఇంతవరకు
వ్రాసిన కవుల కవిత్వాలలో తప్పులు క్షణంలో పడతానంటాడు కానీ రామకృష్ణుడు ఒక
పద్యమిచ్చి తప్పు చూపించమంటే ఏదో ఒక పదము తప్పని చెబుతాడు ప్రెగ్గడ. రామకృష్ణుడు ఆ
పదము తప్పుకాదు అని సహేతుకముగా నిరూపించుతాడు. ఆ సందర్భములో ఈ పద్యాన్ని చెబుతాడు:
తెలియనివన్ని తప్పులను దిట్ట తనాన సభాంతరంబునన్
తెలుపగా రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముపడ భావ్యమెరుంగక పెద్దలైనవా
రాల నిరసింతువా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా బుసా
అని తూలనాడుతాడు.
కావున మన విమర్శ పెదవి దాటకముందే మెదడుకు పంపి జల్లింపబడిన
తరువాత (after scanning ) పెదవి దాటించడము శ్రేయోదాయకము.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక
సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ మాట యొక్క మహిమ
మనసు పెట్టి వింటారని చదివియుంటారని ఆశ. మనసారా మాట్లాడుతారని అత్యాశ.
శుభమ్ భూయత్