ఏకశ్లోకి
https://cherukurammohan.blogspot.com/2013/10/blog-post.html
శంకరులవారు భూమిపై నవతరించిన అపర శంకరులన్న విషయం అందరకూ
తెలిసిందే . అసలు 'శం' అంటేనే శుభము, సౌభాగ్యము, సుఖము, శాంతి,సౌభ్రాతృత్వము
ఇట్లు ఎన్నిటికైనా అన్వయించుకొన వచ్చునని పెద్దలు చెప్పగా విన్నాను. 'కరుడు'
అంటే చేయువాడు. అంటే విశ్వానికి సర్వతోముఖమైన మేలు చేయువారని అర్థము .
ఆయన పరమేశ్వర స్వరూపుడు కావుననే ముప్పది రెండు సంవత్సరములే బ్రతికినా,
ఎన్ని శతాబ్దాలకైనా ఎదురీది నిలచే ధర్మ ప్రతిష్ఠ చేసి తమ అవతార పరిసమాప్తి
గావించినారు.
ఆయన గొప్పదనమును నేటికినీ అధిగమించినవారు లేరు. అందుకే ఆయన
జగద్గురువులు. వారి గొప్ప ఒక్క మాటలో చెప్పాలంటే
'అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ
శాస్త్రవిత్ l
షోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే
మునిరత్యగాత్' ll
అన్నారు. ఎనిమిదేళ్ళకు వేదాధ్యయనము ముగించి పండ్రెండు సంవత్సరములకు సర్వ
శాస్త్రములను ఆపోశనము పట్టి పదునారు సంవత్సరములకెల్లా భాష్య రచన పూర్తి
గావించి తన ముప్పదిరెండవ ఏట పరమపదించిన మహనీయులు. చివరి పదునారు
సంవత్సరములు ఆసేతు శీతనగము వరకు పర్యటించి ధర్మమును పునః ప్రతిష్ఠ
గావించిన
మానవాతీత మహిమాన్వితులు.
అది వేదవ్యాసుల వారి ఆజ్ఞ. అందుకు గాను వ్యాసులవారు తన తపః ఫలమునుండి
పదహారు సంవత్సరములు,కాశీ లో, శంకరులకు ధారపోసినారు.
ఇక అసలు విషయానికొస్తే శంకరుల శిష్యుడొకడు ఒకరోజు జగద్గురువుతో స్వామీ
మీరు ఎన్నో విషయములను ఎన్నో వివరణలతో విశధపరచినారు. కానీ నేను
మందబుద్ధిని. నాకర్థమయ్యే రీతిలో ఆ పరమాత్మను గూర్చి సులభ గ్రాహ్యముగా
ఎరుకపరచ గలుగుతారా అని విన్నవించు కొన్నాడు. దయామయులైన గురువుగారు
ఆ శిష్యుని వద్దనుండి కేవలము తన ప్రశ్నలతో జవాబులు రాబట్టి అతనికి కనువిప్పు
ఎట్లు కల్గించినాడో చూస్తే మహనీయుడైన శంకరులవారి మహాత్మ్యం
మనకర్థమౌతుంది. ఆ సంవాదము యొక్క శ్లోక రూపము ముందుగా వ్రాసి
అటుపిమ్మట ప్రశ్నోత్తరములను విశధ పరుస్తాను.
किं ज्योतिस्तव भानुमानहनि मे रात्रौ प्रदीपादिकम्
स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे ।
चक्षुस्तस्य निमीलनादिसमये किं धीर्धियो दर्शने
किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो ।।
- एकश्लोकी
अन्वयः
किं तव ज्योतिः । मे अहनि भानुमान् रात्रौ (च) प्रदीपादिकम् । स्यात् एवं । रविदीपदर्शनविधौ किं
ज्योतिः मे
आख्याहि । चक्षुः । तस्य निमीलनादिसमये किं (ज्योतिः) । धीः । धियः दर्शने किं (ज्योतिः) । तत्र
अहम् ।
अतः भवान् परमकं ज्योतिः । तत् अस्मि प्रभो ।
కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ
ప్రదీపాదికం
స్యాదేవమ్ రవి దీప దర్శన విధౌ కిం
జ్యోతిరాఖ్యాహిమే
చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం
ధీర్తియో దర్శనే
కిం తత్రాః మతో భవాన్ పరమకం జ్యొతిః
తదస్మిప్రభో
-ఏకశ్లోకి
kiṃ jyōtistava
bhānumān-ahani me rātrau pradīp-ādikam
syād-evaṃ ravi-dīpa-darśana-vidhau kiṃ jyotirākhyāhi me |
cakṣustasya
nimīlanādi-samaye kiṃ dhīrdhiyo darśane
kiṃ tatrāhamato
bhavān paramakaṃ jyotistadasmi prabho ||
- ēkaślokī
A sishya of jagadguru Sankaracharya submits himself
asking Oh great guru "I am a fool and I cannot follow the
abundant literature you have showered to the world cannot
be read and assimilated by me. Kindly explain me everything
in a nut shell" Then the Jagat guru tells him in the simplest
way in the
question answer form.
The Dialogue translates like this :
Guru: How do you see (What is that light/power which
helps you see?)
Sishya: I see with the help of sunlight
Guru: How do you see in the night?
Sishya: I see with the help of a lamp
Guru: Let that be so. How do you see the light? How do you
see (your
visualizations) even before you open your eyes?
Sishya: It is with my intellect
Guru: What helps you see (know) that intellect?
Sishya: This is me (me as pure consciousness)
Guru: (Indeed) You are that supreme light
Sishya: I realize that I am
అన్వయము
ఆ గురుశిష్య సంవాదము ఈ క్రింది
విధముగా సాగినది:
గురువు: కిం జ్యొతిస్తవ? ---------- వస్తు ప్రకాశమైన జ్యోతి ఏది ?
శిష్యుడు: భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం ---------- పగలు సూర్యుడు రాత్రి
దీపము
గురువు: స్యాత్ ఏవం, రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిః? ----------అపుడు సూర్యుణ్ణి
దీపాన్ని గుర్తించే జ్యోతి ఏది?
శిష్యుడు: చక్షుః ----------కన్నులు
గురువు: నిమీలనాది సమయే, కిం?----------కళ్ళు మూసుకొన్నపుడు చూసే
వెలుగేది?
శిష్యుడు: ధీః ----------బుద్ధి
గురువు: ధియః దర్శనే కిం?----------బుద్ధిని చూసేజ్యొతి ఏది?
శిష్యుడు: తత్ర అహః ----------అక్కడ
నేను (అంటే నా ఆత్మ),బుద్ధిని చూస్తున్నాను
గురువు: అతః భవాన్ పరమకం జ్యొతిః
----------కనుక నీవే ఆ పరంజ్యోతివి
శిష్యుడు: ప్రభో తత్ అస్మి ----------గురుదేవా ఆ నేనే (అహమే) పరంజ్యోతియని
తెలుసుకొన్నాను.
ఇంతకంటే సులభంగా తత్వ బోధ చేసిన మహనీయులు లేరంటే అతిశయోక్తి
కాదేమో.సభక్తీకంగా ఆయన పాదాలకు మానసిక నమస్కారము చేసి ఈ రచన
ముగించుతాను.
దీపావళి సమీపిస్తూవున్నది. ఈ సమయములో మనసునంతర్ముఖముజేసి, మనలోనున్న
ఆ జ్యోతిషాం జ్యోతిని అంటే ఆ వేలుగులకే వెలుగును, మన భృకుటి యందు నిలిపి
తదేకముగా ధ్యానింతుముగాక! అసలు సన్యాసులు సైతము ఈ పండుగనాడు
తలంటుకొని ఆత్మజ్యోతిని ధ్యానించవలెనని ధర్మసింధువు
చెబుతూవుంది.
అంతర్జ్యోతిర్బహిర్జ్యోతిః
ప్రత్యగ్జ్యోతిః పరాత్పరఃl
జ్యోతిర్జ్యోతిస్వయంజ్యోతి రాత్మర్జ్యోతిః
శివోమ్యహంll
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్l
నమామి భాగవత్పాదం శంకరం లోకశంకరమ్ ll
శివోహం
No comments:
Post a Comment