కులము
https://cherukurammohan.blogspot.com/2013/08/blog-post_26.html
తెలిసి కొంత మరియు తెలియక ఇంకొంత
కలిగియుండి సకల కల్పితముల
కలుష వర్ష ధార కద్దుము లో నాన్చి
తేల్చుతారు అజ్ఞ ప్రధిత మతులు
కొంత తెలిసి కొంతతెలియక అంతా తెలుసుననుకొని స్వకపోల కల్పితములైన దట్టమగు (కద్దుము) వర్షపు ధారలో ముంచి తేల్చుతూ ఉంటారు కొందరు తమను తామే పండితులమనుకొనే వారు. ఇట్లు చేయుటచే డోలాయమాన మానసులయిన సాధారణ జనులమైన మనము స్మ్లేష లో పడిన ఈగ చందమున కొట్టు మిట్టాడుచుంటాము. ఆ విషయములు సమాజ శ్రేయస్సుకు విబీజములు అని తెలుపుట ఈ వ్యాసము యొక్క ప్రధాన లక్ష్యము, మనకు దిశా నిర్దేశము చేసిన మన పూర్వులు అసమాన ప్రతిభావంతులు అన్న విషయమును ఎల్లకాలమూ జ్ఞాపకము ఉంచుకొండి.
కులము అన్న మాటకు అర్థము కొరకు నేను 3 భాషా నిఘంటువు లను పరిశీలించితే మూడింటిలోనూ ఈ విధమైన అన్వయము చూచుట జరిగినది .
[తెలుఁగు]వంశము, జాతి, తెగ, ఇల్లు, శరీరము, అంతఃపురము
[తమిళము]కులమ్, వంశమ్, జాతి, ఇనం, ఉడల్, వీడు, అరమనై, కుడి.
[కన్నడము]వంశము, మనె, తెగె, వంగడ, శరీర.
ఈ మూడింటిలోనూ వంశము జాతి తెగ అని చెప్పినారే గానీ వేరేమీ తెలుపలేదు. ఇప్పుడు కులము అన్నది చెడ్డ మాట అనుకొందాము,అప్పుడు వంశము ,తెగ , జాతి అన్న మాటలు కూడా తప్పే కదా! కులము సంస్కృత పదమే అయినా వర్ణం అన్న పదాన్ని నాకు తెలిసినంతవరకూ ఆ భాషా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినారు. గీతాచార్యులు కూడా 'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః
తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' అని చెప్పినారు. అంటే వారి వారి గుణాలు కర్మల ననుసరించి తగిన విధంగా నేనే ఈ నాల్గు వర్ణములను సృజించినాను అని అన్నారు.వర్ణము అన్న మాటకు బంగారు అన్న అర్థము కూడావుంది.
మరి నాల్గు వర్ణములలో ఏది మేలిమి బంగారము, ఏది కాదు అని మనము నిర్ణయించ గలమా !ప్రాణికోటిని గూడా నాల్గుభాగాలుచేయడము జరిగింది.
స్తావరములని,జంగమములని,జలచరములని,వాయుచరములని. వీనిని ఒకదాని స్థితి నుండి వేరొకదాని స్థితికి తేలేము. అప్పుడు భగవంతుని చేత ఏర్పరుపబడిన ఈ విభాగమును కాదనుట సమంజసమేనా. కులము లాగానే తెలుగు లో 'వాడు' అనే మాటను కూడా తప్పుగా అర్థము చేసుకొంటారు. తెలుగు భాగవతము లో బమ్మెర పోతనామాత్యుడు కృష్ణు ని తలపోసే గోపికలతో 'నల్లని వాడు పద్మనయనమ్ములవాడు ... ఒకడు ... ' అనే వాడుతాడు . ఇంకొక సన్నివేశములో 'కలడు కలండనెడువాడు' అని ఉపయోగించుతాడు.గతము లో మనము కూడా ఈ ప్రయోగము చేసేవాళ్ళమే కానీ నేడు పరభాషా వ్యామోహ ప్రవాహాములో అన్నిటి తో బాటు ఇదీ కొట్టుకుపోయింది.ఇపుడు దేవునికే ఉపయోగించిన ఆ మాట ఇప్పటి సమాజములో తప్పయి పోయింది. అదే విధంగా 'కులము'కూడా. 'క్యాస్ట్' అనేది ఆంగ్ల పదము కాదు అది 'పుర్తగల్లు' పదము. from Portuguese casta meaning race, breed,ancestry.
Breed అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో 'A group of organisms having common ancestors and certain distinguishable characteristics, especially a group within a species developed by artificial selection and maintained by controlled propagation.' అని యున్నది. అదే విధముగా
Race అంటే 'A local geographic or global human population distinguished as a more or less distinct group by genetically transmitted physical characteristics.' అని వుంది . మరి మన 'వర్ణం' 'కులం' అన్న మాటలకివి సమానార్థకాలౌతాయా? ఇక 'ancestry' అన్న పదాన్ని మన 'కులము' నకు జత కలుపలేము. కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి (మంగళకరమైన ప్రతి పనికీ ముందుండేవాడు) అని వాడితే తప్పా.
క్రైస్తవములో ఈ విచక్షణ లేదా. వాళ్ళూ 'బ్లాక్ స్మిత్' 'పోట్టరర్' 'వీవెర్' మొదలగు పదాలను వాడుతారుకదా. అదేవిధంగా అరబ్బీ,ఫార్సీ, గ్రీకు, లాటిన్లలో కూడా ఆయా పనులకు సంబంధించిన పేర్లు ఆయా పనులు చేసే వారికున్నాయి వున్నాయి . ఈ నాటికీ బ్రిటీషు పార్లమెంటు లోని విభాగాలను 'హౌస్ ఆఫ్ లార్డ్స్' హౌస్ ఆఫ్ కామన్స్' అంటారు. 'లార్డు' 'కామన్' అన్న అంతరాలు వాళ్ళలో ఈ నాటికీ లేవా. మనమెంత కాదనుకొన్నా ఇవి ప్రకృతి జన్యములు. ఇది భగవత్ సృష్టి. మనము లేదనుకోన్నంత మాత్రాన అవి లేకుండా పోవు. కులాన్ని గురించి మాట్లాడే గుణవంతుని ఇంట్లో పనిమనుషు లెందుకు. అంతా సమమే అయితే ఎవరి పని వారే చేసుకోవచ్చు కదా.
స్థావరముల విషయానికొస్తే వెంపలి మఱ్ఱి రెండూ చెట్లే. ఏ జాతి చెట్టును ఆ పేరు తోనే పిలుస్తాము. కానీ దేని విలువ దానిదే. పనస పండు ఆకారము వికారముగా నున్నా అది మనకు ఇచ్చే తొనలను ఎంతో ఆనందముగా తీసుకొని తింటూ ఉన్నాము. కాకర చెడు అని తెలిసికూడా దానిని ఎన్నోవిధములుగా వండుకొని తింటూ ఉన్నాము. పైపెచ్చు అది మధుమేహమునకు గొప్ప మందాయే! భగవంతుని సృష్టి లో ఏదీ ఎక్కువ కాదు ఏదీ తక్కువ కాదు. రెండూ పండ్లే యని 'మామిడి పండుకు' బదులు 'ఊస్తిపండు' ను తినగల్గుతామా! అట్లని అమిత చేదైన ఊస్తిని వాడనేవాడమా. మధు మేహమున కది కూడా అత్త్యుత్తమ ఔషధము. ఆకాశములో ఎగిరేవి అన్నీ పక్షులే. గండభేరుండాలు గ్రద్దలు కాకులు పిచ్చుకలు రామచిలుకలు, దేని ప్రత్యేకత దానిదే. అట్లే జలచరాలలోగూడా. భగవంతుని సృష్టి అంతా 'భిన్నత్వములో ఏకత్వమే. '
ఇక మనుషుల విషయము లోనికి వస్తాము. అమెరికా లో స్థానికులైన Red Indians ను ఆంగ్లేయులు ఊచకోత కోయ లేదా! నీగ్రోలను శతాబ్దాల తరబడి బానిసలుగా వాడుకోలేదా! పూర్వము, వర్ణ విచక్షణ సమగ్రముగా పాటించు కాలములో ఊచకోతలు, బానిసత్వాలు మన దేశములో వుండినవా! ఇప్పటికీ పశ్చిమ దేశాలలో,'తెలుపు' 'నలుపు' తారతమ్యాలను చూస్తూనే ఉన్నాము. ప్రపంచములోని ప్రబలమైన రెండు మతములవారు అన్య మతస్తులను వారి వారి భాషలలో 'పాగాన్స్' అనీ 'కాఫిర్' అని అంటారు. అంటే పరవాలేదు. వారి వారి దేవుళ్ళు వాళ్ళకు, బలవంతముగా నైనా అన్య మతస్తులను తమ తమ మతములలో చేర్చుకొమ్మని చెప్పినారు. అట్లు చేరని వారిని రంపాలతో కోసి చంపినారని లోతులకు పోయి అధ్యయనము చేస్తే తెలుసుకొనవచ్చును.ఇతరులను గూర్చి చెడ్డగా చెప్పి మన మంచితనము నిరూపించుకో నక్కర లేదు అట్లని వాస్తవాలను గూర్చి తెలుసుకోకుండానూ వుండనక్కర లేదు.
అసలు వేదాలేమి చెప్పినాయో తెలుసుకొందాము.
యజుర్వేదములోని పురుష సూక్తములో 'బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఉరూ తదస్యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత' అన్నారు. నాకు తెలిసిన మేరకు దీని అర్థాన్ని వివరించుతాను.
ఈ సమాజాన్ని పురుషాకృతి గా వూహించుకొంటే జ్ఞానము(బ్రహ్మ జ్ఞానము కల్గిన వాడు బ్రాహ్మణుడు) తలలో వుంటుంది. బ్రాహ్మలు కాని ఎంతోమంది పరమ జ్ఞానులైనారు లైనారు. ఊదాహరణకు విశ్వామిత్రుడు,వాల్మీకి,మతంగుడు,శౌనకుడుసూతుడు మొదలగు వారంతా తమ సాధనతో జ్ఞానమును పొంది బ్రాహ్మణులైన వారే. జ్ఞానమును సంపాదించనూ వలసిందే,దానిని కపాడనూ వలసిందే. జ్ఞానమును(సైన్స్) కాపాడుకొంటే సమాజానికి ప్రగతి వుంటుంది. వీరికి(ఈ జ్ఞానులకు లేక ఈ బ్రాహ్మలకు) సలహాలిచ్చుట తప్పించితే సంపాదించే హక్కు లేదు. సలహా తీసుకొనే వాళ్ళే వారి అవసరాలు తీర్చేవారు. దీనికి సైనిక బలగము అవసరమేకదా. మన అణు కేంద్రాలు అంతరిక్ష కేంద్రాలు మొదలైన ఎన్నో ముఖ్యమైన కేంద్రాలకు సైనిక రక్షణ వున్నదా లేదా? కావున జ్ఞానమునకు రక్షణ క్షత్రియులు. క్షత్రియ శబ్దమునకు అర్థమేమంటే 'క్షతయేన త్రాత ఇతి క్షత్రియః' అన్నారు. అంటే గాయము కలుగకుండా ఉండుటకు రక్షణే కాని నిజానికి గాయము చేయు అధికారము వారికిలేదు. అంటే 'డిఫెన్సు' తప్పించితే 'అఫెన్సు' లేదు. ఏమన్నా ఎదుటివానిని గాయపరుచవలసి వచ్చినా లేక చంప వలసి వచ్చినా అది రక్షణ లోని భాగమే ఔతుంది.పైగా బాహువులకుండేది బలమౌతుంది. బాహు బలము సైనిక బలము మనకు తెలిసిన పదాలే. కావున ఈ బాహు బలము జ్ఞానమునకు అతి చేరువలో వుంటుంది. మరి ఈ రక్షణ కు వలసినదేది? ధనము. ఈ క్షత్రియబలగపు ఖర్చంతా భరించుటకు కావలసింది ఆర్థిక శక్తి. ఈ ఆర్ధిక శక్తికి కావలసినవారు ఆర్ధిక నిపుణులు 'వైశ్యులు.' ఈ వైశ్యుల వృత్తి వ్యాపారమే కాదు వ్యవసాయము కూడా. వీరికి మాంస భక్షణ నిషిద్ధము. ఈ మాంస భక్షణము త్రిగుణములలోని సత్వము ను నశింప జేసి తామసము తో గూడిన రాజసమును పెంపొందించుతుంది కావున.వ్యాపారము లోనూ వ్యవహారములోను ఓర్పు చాలా అవసరమన్న విషయము అందరికీ తెలిసిందే. మరి వ్యవసాయదారులు ఏవిధముగా నాల్గవ వర్ణమునకు జారినారో తెలియలేదు.ఇప్పటి వ్యవసాయదారులలో చాలా వర్ణములవారు రాజ్యములేలినవారే. రాజులకు మాంసము, వేట నిషిద్ధము కాదు.రానురాను రాజ్యాలులేక వ్యవసాయము నవలంబించినారేమో తెలియదు. సమాజము లేక దేశము యొక్క ఆర్ధిక స్థోమతను 'ఆర్ధిక శక్తి' (ఎకనామిక్ స్ట్రెంగ్త్) అంటారు.తొడలలో వుండేది శక్తియే కదా. కావున ఊరువులు అంటే తొడలు 'వైశ్యులు'. ఇక మిగిలినవి పాదాలు. పాదాలను శూద్రులతో పోల్చబడింది . ఈ సమాజము, దేశము నడవాలన్నా సాటి దేశాలకన్నా వేగంగా పరిగేత్తాలన్నా పాదాలుండి తీరవలసిందే. సమాజ ప్రగతికి 'సేవ' లేకపోతే అసలు సమాజమే లేదు.వృత్తిని ఎన్నుకొన్న వాళ్ళు శూద్రులు.
సమాజశ్రేయస్సే వారి మీద ఆధార పడివుంది. ఎవరైనా సాష్టాంగ నమస్కారము కాళ్ళకు చేస్తారు కానీ తలకు చేయరు. ఇంకొక ముఖ్య విషయం. తోమ్మిదిగజాల నేత చీరను అగ్గిపెట్టె లో పెట్టి ఇచ్సినాడట ఒక సాలెవాడు. ఆయన నైపుణ్యమునకు నమస్కరించకుండా ఉండగలమా. శిల్పము చిత్రలేఖనము వడ్రంగము కంసాలి పని, అది ఇది ఏల అన్నిరంగములలో సర్వతోముఖ అభివృద్ధి చెందినదీ వైదిక దేశము.కారణము సంతానము వారసత్వమును పుణికి పుచ్చుకోవడమే. వారి వారి తెలివి తేటలతో తమ తమ పరిశ్రమలను సర్వతోముఖముగా అభివృద్ధి చేసుకోవడమే. మరి నేడీ దేశము ఎందుకింత వెనుక బడినది?ఆంగ్లేయానుకరణ,ఆంగ్లేయానుసరణ. కమ్యూనిష్ట్ క్రిస్టియన్, ముస్లిం వర్గముల ప్రచారము మన ఉదాసీనత. వీటికి తోడు వాస్తవములు తెలుసుకొనే తపనను తామసము ఆవరించుట.
ఆ కాలము లో కూడా స్త్రీపురుషులు కామాతురులై అనులోమ, విలోమ వివాహములను చేసుకొని, అంటే నాడు నిర్దుష్టముగా అమలులో నుండిన వర్ణ ధర్మమును పాటించక,వర్ణ సాంకర్యము జరిగితే, దానికి తగిన కఠినమైన దండన వుండేది, కావున వారిని దేశ బహిష్కృతి గావించే వారని పెద్దల మూలమున విన్నాను. వారు రాను రాను సమాజ బహిష్కృతులుగా ఆటవిక జన జాతులుగా(నేటి S.C.,S.T. లు ఆవిర్భవించి పంచమ జాతి యన్న క్రొత్త వర్గమును ఏర్పరచుకొని యుండవచ్చును.) యుండవచ్చును.
చతుర్వర్ణ సంకలితమైన ఈ దేశ విభవమును దోచుకొనుటకే అన్య జాతులు ఈ దేశముపై దండయాత్ర సాగించి మన ధన మాన ప్రాణములను దోచుకొన్నారు.ఎంతమంది హిందూ స్త్రీలను చెరిచి మత మార్పిడి చేసినారో చెబితే బహుశా మాటలతో తీరదెమో. ఇతర మతముల దేవుడంతటి కౄరుడా. మన దేశములోని నేటి అన్య మతస్తులొకప్పుడు ఆర్ష ధర్మాన్ని పాటించిన వారే కదా. వారిని పాశవికంగానో, ప్రలోభాలతోనో నే కదా మార్పిడి చేసింది.
మన దేశానికీ దుర్దశను ప్రసాదించిన ఘజని, ఘోరి, మీర్ ఖాసీం, సర్ విలియం జోన్సు మెకాలే కాల్డ్వెల్ మాక్స్ ముల్లర్లను మనము మరచి పోలేము. పురుషులను కౄరముగా భయపెట్టి, స్త్రీలను పాశవికముగా చెఱచి తమ మతములోనికి, వారి మతగ్రంధము ననుసరించి, ముస్లీములు మార్చితే, కిరస్తానీలు సామ దాన భేద దండోపాయాలతో, వక్ర భాష్యములతో, తమ మత గ్రంధము చెప్పిన విధముగా మార్చినారు. కానీ వారు ఏ రోజూ మన వేదాంతులతో వాడమునకు నిలిచి తమ గొప్పదనము చాటుకొన్నది లేదు.
caste అన్న పోర్చుగీసు పదము 'వర్ణము' 'కులము 'నకు
సమానము కాదు. విద్య నేర్పించే గురువు వద్ద వున్నా అనేక రఖముల
విద్యార్థులను కలిపి గురు కులము అనేవారు . 'కుల్యుడు' అంటే గౌరవింప
దగినవాడు .
కుల్యా అంటే ఒక చిన్న నీటి ప్రవాహము . అంటే ఇవన్నే కలిసే
'భగవంతుడు' అనే సముద్రము చేరుతాయి అని
అర్థము . పెద్దలు ఏపనీ విచాక్ష్నారహితముగా చేయలేదు . మన పెద్దలను
మనము గౌరవిద్దాం .
Etymology
The English word "caste" derives from the Spanish and
Portuguese casta, which the
Oxford English Dictionary quotes John Minsheu's Spanish
dictionary (1599) to mean,
"race, lineage, or breed." When the Spanish colonized the
New World, they used the word
to mean a "clan or lineage." However, it was the Portuguese
who employed 'Casta' in the
primary modern sense when they applied it to the many in-
marrying hereditary Indian
social groups they encountered upon their arrival in India in
1498. The use of the spelling
"caste," with this latter meaning, is first attested to in English
in 1613.
In the western world, this misconception is one of the most
misunderstood and misinterpreted concepts of Hinduism. The correct term in a
spiritual context is ‘Varna’ (Class), and not ‘Jaati’ (Caste), as misused in the western
world. – The social system of the four classes (varnas) was created to assist everyone in
society to behave as per their natural temperament, i.e. their constitution, which is
composed of the three subtle components (trigunas) and to assist in their spiritual
evolution. In other words, the system of the four classes is incorporated into Hinduism to provide guidance on behavior and spiritual practice (sādhanā) according to one’s potential and requirement, to enable one to experience Bliss. Unfortunately, there is ignorance about
this purpose of the social system and thus its portrayal is misleading.
తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' Division of labour is adapted in those days with a concept of one for each and each for all.
మొదలు మన పెద్దలు చేసిన విభజనలో తప్పులేదన్నది గ్రహించండి.పిదప
అందులోని మంచిని మీరు పాటించండి. ఎవరికి వారు మంచికి మారిపోతే
మార్చవలసిన వారి అవసరము ఉండదు. గుణానికి,భక్తికి,పేద పెద్ద
తేడా లేదు. కులము గుణము వేనికవే . అందుకే
కులములోన ఒకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత అన్నారు పెద్దలు.నేటి తరము లో
ధనము వుండీ ప్రజలకు పంచిన
గుణవంతులైన మహనీయులు ఎందఱో వున్నారు . లేనివారిలో
బాగుపడేవాని కాలులాగేవారూ చాలామంది
వున్నారు.
మనం ఘంటసాల మాస్టారు గారి గళములో నవయుగ కవిత చక్రవర్తి బిరుదాంకితుడు గుఱ్ఱం జాషువా గారి రచనలు పద్యాలు విని ఉంటాము. ఓ సారి జాషువా గారి మద్రాసులోని మాస్టారు గారి ఇంటికి తానూ వ్రాసిన కవిత మీద చర్చ జరపడానికి.. వెళ్ళగా ఆయన ఇంటి ఆవరణ లోని ఓ గడ్డ మీదే కూర్చుని ఉండగా.. లోనికి రమ్మని మాస్టారు వారు ఆహ్వానించారట. దానికి నేను అంటరాని వాడిని అని జాషువా కవి గారు చెప్పగా.. మాకు అటువంటి పట్టింపులేవీ లేవని చెప్పి లోనికి తీసుకు వెళ్లి కవితా చర్చలు.. జరిగాక. కల్సి భోజనాదులు అయ్యాక . ఆ కవితకు తాని విలువ కట్టలేనని కానీ తనకు ఉన్నది తన తృప్తి కోసమై తీసుకొమ్మని ఆయన పాదాలకు నమస్కారం చేసి తాంబూలాదులతో అందించారట. జాషువా గారు కళ్ళు చెమ్మగిల్లి.. ఆశీర్వదించారట. ఆ మహాకవి రచ్సించిన గబ్బిలం కావ్యం నుండి.. నాడు వారు అంటరాని తనము మూలాన పడిన మనో వేదన అంతా ఈ పద్యములో చెప్పుకున్నారు..
"చక్కని కవితకు కులమే
యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ!
దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ"
యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ!
దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ"
"నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే
ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి' యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర వచింప సిగ్గగున్ "
ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి' యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర వచింప సిగ్గగున్ "
తిరుపతి వేంకట కవులు వారి పాదానికి కంకణం తొడిగి ఇంత గొప్ప కవి కాలు తాకి గండపెండేరం వేసిన తమ జన్మ ధన్యం అయిందని చెప్పుకున్నారట. ఎన్నో బిరుదాలు అందుకున్న కవి జాషువా గారు.. ఇదే తనకు జీవితములో జరిగిన మరపురాని మహా సన్మానం అని.. ఆ కవివరేణ్యుల విశాల హృదయానికి తానూ ఎప్పుడు కృతజ్ఞుడనని చెప్పుకున్నారు. అలాగే " సహింపదయ్యె శైశవమందె నా చిన్నిచిత్తంబు తెలవారి పెత్తనంబు " అంటూ తెల్లవారి పెత్తనాన్ని నిరసించిన దేశ భక్తుడు జాషువా.
ఈ సందర్భములో అపర శంకరుల అనుభావవములో ఏమి జరిగినదో చూస్తాము.
మనీషా పంచకం ఆదిశంకర విరచితం.
ఎందరో పాశ్చాత్య విమర్శకులు ఆదిశంకరులు అగ్రకుల పక్షపాతి అనీ,
ఆయన అద్వైతం కేవలం బ్రాహ్మణులకే అన్నట్టుగా ఆయన రచనలన్నీ
ఉన్నాయని నిందిస్తారు.
కానీ ప్రస్థానత్రయ భాష్యం రాసేప్పుడు భాష్యకారుల చేతులు కట్టుబడి
ఉంటాయన్న సంగతి వాళ్ళకు తెలీదు.
శంకరులు వారి అద్వైతం - సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి
చెప్పుకునేందుకు వీలు కలిగేలా కొన్ని శాస్త్ర విషయ అనుబంధం లేని
రచనలు చేసారు. వాటిలో ఈ మనీషా పంచకం ఒకటి.
అద్వైతం అనగా భగవంతుడు-భక్తుడు ఒకటే అని నమ్మే సిద్ధాంతం. అహం
బ్రహ్మాస్మి తత్త్వం. అద్వైతానికి కుల, మత, స్త్రీ/పురుష, చిన్నా/పెద్దా, తేడాలు
లేవు. ఎందుకంటే ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలమందరమూను.
ఈ శ్లోకాల వెనుక సన్నివేశం కాశీ (వారాణసి) లో జరిగినది.
స్నాన-సంధ్యాదులు ముగించుకుని శంకరులు శిష్యగణంతో గుడి వైపుకు
వస్తూ ఉంటారు. దారిలో ఎదురుపడి ఒక చండాలుడు (తక్కువ జాతి వ్యక్తి)
వస్తూ ఉంటాడు. అతన్ని చూసి దూరం జరిగి దారికి పక్కగా పొమ్మని
శంకరుడు అంటాడు. ఆ చండాలుడు స్వయానా శివుడే!
అలా శంకరులు అనిన మాటలకు చండాలుని రూపంలో ఉన్న శివుడు ఇలా
అంటాడు :
అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,
ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి॥
ఓ మహానుభావా! చెప్పు. నన్ను దారికి పక్కగా తొలిగిపొమ్మని నువ్వన్నది,
నేను తక్కువ జాతికి చెందినవాడననా? అన్నంతో రూపొదిన ఒక శరీరం,
అన్నంతోనే రూపొందిన మరో శరీరాన్ని పక్కకు తొలగమంటుందా లేక
ఒక శరీరంలో ఉన్న ఆత్మ, మరో శరీరంలోని ఆత్మను పక్కకి తొలగిపొమ్మని
చెబుతుందా?
ఈ రెండిటిలో ఏది పక్కకి తప్పుకొని దూరంగా ఉండాలి? చెప్పు
మహానుభావా, చెప్పు!
ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః॥
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే॥
నాకు జవాబు చెప్పు, ఓ మహానుభావా! నీటి ఉమ్మతో సహా అన్ని చోట్లా
నీటిలో మెరిసే సూర్యుడి ప్రతిబింబం లాగానే ఆ పరమాత్మ అయిన పరబ్రహ్మ
ప్రతి జీవిలోనూ ప్రతిబింబిస్తాడు. మరి ఈ విభేదాలెందుకు? ఈ ఎక్కువ
తక్కువలెందుకు? ఒకడు బ్రాహ్మణుడా, చండాలుడా అనెందుకు చూడాలి?
ఎవరిద్దరిలో గొప్ప? గంగలో కనిపించే సూర్యుడి ప్రతిబింబానికీ, చండాలుడి
వీధులలో కనిపించే నీటిపై పడే సూర్యుడి ప్రతిబింబానికీ తేడా ఉందా?
నీటి పాత్ర బంగారందో లేదా మట్టిదో అయితే అందులోని నీరు కూడా
మారిపోతుందా?
(ఈ స్పందన వచ్చిన వెంటనే శంకరులకు ఎదుటున్నది సాక్షాత్పరమశివుడే
అన్న బోధ కలుగుతుంది. ఆ పరవశంలో శంకరులు ఈ కింది ఐదు
శ్లోకాలను మనీషా పంచకంగా మలిచి అందించారు!)
జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే-
చం డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ
ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో- మెలకువగా, నిద్రపోతూ, కలలో విహరిస్తూ -
అన్ని సందర్భాలలో కనిపించే ఆత్మను తానేనని గుర్తిస్తాడో, విధియయిన
బ్రహ్మ మొదలు అతి చిన్నదయిన చీమ వరకూ అన్ని జీవాలలో, అన్ని
వస్తువులలో ఉన్న పరమాత్మనే తానని అర్ధం చేసుకుంటాడో. అన్నిఁటా
ప్రతిధ్వనించే, కనపడని, అందరినీ గమనించే ఆ పరమాత్మను తానుగా
భావించి - తనను అన్నిటిలో చూసుకొనే వ్యక్తిని - అతడు ద్విజుడయిన
బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ - నా పరమ గురువుగా అతడిని నేను
నమ్ముతాను.
బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,
ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే
చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ
ఈ జగత్తంతా ఆ పరమాత్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అజ్ఞానం వలనో,
త్రిగుణాల(సత్త్వరాజసతమో గుణాలు) ప్రభావం వలనో ఈ ప్రపంచమంతా
వివిధ వస్తువుల చేత రూపొందించబడిందని అనిపిస్తుంది - ఆ ప్రభావంతో
పరబ్రహ్మ స్వరూపాన్ని చూడలేము. వీటికి అతీతంగా ఎవ్వరయితే తనని
తాను నిర్మలమయిన, అనంతమయిన పరమాత్మ పరబ్రహ్మగా
గుర్తిస్తాడో, అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ - నా
పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను.
శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ
ఈ లోకం మాయతో రూపొందించబడింది. ఇది అశాశ్వతము,
నశించిపోతుంది. ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, పూర్తి
నమ్మకంతో (ఎలాంటి అనుమానాలు లేకుండా) ధ్యానంలో దర్శించి,
కర్మఫలము ద్వారా సంపాదించుకున్న ఫలాలను (అవి పాపాలే గానీ,
పుణ్యాలే గానీ) పరమాత్మ యొక్క పవిత్రమయిన అగ్నియందు
కాల్చివేస్తారు. ఈ విషయాలు చెప్పిన పరమగురువుల బోధనలను నేను
నమ్ముతాను.
యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః
తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ
ఏ విధంగా యితే మేఘాలు సూర్యుడిని కనిపించకుండా కప్పేస్తాయో, అదే
విధంగా అజ్ఞానం పరమాత్మను జీవాత్మకు కనిపించకుండా చేస్తుంది. ఈ
ప్రపంచంలో జరిగే ప్రతీదీ ఆ పరమాత్మ పరబ్రహ్మ వలనే అవుతుంది. ఈ
సత్యాన్ని తెలుసుకున్న యోగులు ఉత్తములని నేను నమ్ముతాను.
యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి
ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ
ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముతో నిరంతర ధ్యానములో
ఉండేవాడు, పరిపూర్ణ శాంతుడై ఉంటాడు. అతను ఆ పరబ్రహ్మమును
తెలిసికున్నాడని, అతనే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.
- ఆళ్వారులను గూర్చి కాస్త తెలుసుకొందాము
- పొయ్గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు
తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ
సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే
నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది
మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)
ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని - తిరుమళిశై యాళ్వార్ (తిరుమలసాయి ఆళ్వార్)
క్రీ.శ. 720 ప్రాంతానికి చెంది ఉండవచ్చును. పుట్టుక రీత్యా పంచముడు.
వైష్ణవం, బౌద్ధం, జైనం సిద్ధాంతాలలో పండితుడు. పెరుమాళ్ళను తన
మిత్రునిగా తలచి మంగళాశాసనాలు పాడాడని చెబుతారు. ఈ ఆళ్వారు,
అతని శిష్యుడు కాంచీపురం వదలి వెళ్ళిపోదలిస్తే ఆవూరి గుడిలోని
పెరుమాళ్ళు తన చాపను (ఆదిశేషుని) చుట్టగా చుట్టుకొని వారివెంట
బయలుదేరాడట. ఈ ఆళ్వారు చెప్పినట్లు చేయడం వలన ఆ దేవునికి
'యధోక్తకారి' అన్న పేరు వచ్చింది.
- తిరుమంగయాళ్వార్ (తిరుమంగై ఆళ్వారు)
క్రీ.శ. 776 కాలంనాటివాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు.
పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను
స్తుతించాడు.
- తిరుమంగయాళ్వార్ (తిరుమంగై ఆళ్వారు)
క్రీ.శ. 776 కాలంనాటివాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు.
పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను
స్తుతించాడు.
- తిరుప్పాణాళ్వార్ (తిరుప్పాన్ ఆళ్వారు)
క్రీ.శ. 701 ప్రాంతం వాడు కావచ్చును. ఉరయూర్లో పానార్ ("అంటరాని
జాతి" అనబడేది) కుటుంబంలో పెరిగాడు. తన అందమైన పాశురాలతో
పెరుమాళ్ళను అర్చించాడు. పది పాశురాలు మాత్రం గల కావ్యం వ్రాసి
ఉత్తమకవిగా వాసికెక్కినాడు.
- నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో
నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. మిగిలిన ఆళ్వారు
లందరూ శరీరం, నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను
తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి
ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని'
పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు
క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ
నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.
ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని
శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును
- మధురకవి యాళ్వార్
ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా
మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని
గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన
ఇక 64 మంది నాయనార్లలో అతి తక్కువ కులమునకు చెందినా వారే
ఎక్కువ.
వీరందరూ ఉన్నత కులస్తులమని విర్రవీగే వారికి కూడా ఆరాధ్యులే !
అందుకే పెద్దలు ఏర్పరచిన వ్యవస్థను దూషించుటకంటే మన తప్పులను
మరియు అహంకారమును సరిదిద్దుకొంటే మన సమాజమునుఆకాశమును
హద్దుగా అభివృద్ధి చేయవచ్చును.
ఇంకా కొంత అవగాహన పాఠకులలో కలిగించుటకు 24.9.17 న నేను వ్రాసిన
విశ్లేషణను పొందుపరచుచున్నాను.
ఆస్య గ్రంధిలో విరివిగా కుల ప్రస్తాపన వచ్చి, ఎవరి అభిప్రాయము వారు
తెలుపుచున్నా కూడా ఎక్కువమంది కులము వుందా కూడదు అన్న
అభిప్రాయమును వ్యక్తము చేయుచున్నారు. ఈ విషయమై విస్తారముగా
అసలు వర్ణము అన్న మాట వేదవేదాంత భగవద్గీతలలో మనము వింటాము.
కులము కాదు. అసలు కులము అన్న మాట కూడా ఆంగ్ల శబ్దము CASTE కు
సమానము కాదు. అది PORTUGUESE పదము. దాని అర్థమే వేరు. 'కులము' అన్న
అంశమును గూర్చి 'సరసరస' అన్న నా వ్యాస సంపుటిలో విస్తారముగా వ్రాసినాను.
MACAULAY మనదేశములో చిచ్చు పెట్టనంతవరకు ఈ దేశ వాసులలో తమ
ధర్మము కాదు పై ఎంతో అవగాహన వుండేది. న్యూనత అన్న మాటకు ఎక్కడా తావు
లేదు. సంస్క్రుతమును సంపూర్ణముగా మన స్మృతి పథము నుండి తొలగించి
ఆంగ్లమును మన నెత్తినరుద్ధి భాషా దాస్యము, భావ దాస్యము, మానసిక దాస్యమును
మనకు ఎంతగా కట్టబెట్టినాడంటే, మనమీద మనకే అసహ్యము వేసేటంత.
ముఖ్యముగా 15, శతాబ్దముతో మొదలుపెట్టి దాదాపు 19వ శతాబ్దము వరక్లు
పాశ్చాత్యులు చేసిన జ్ఞాన, గ్రంధచౌర్యము అంత ఇంత కాదు. ఆ జ్ఞానము తమదని
నమ్మించి మనలను నిరంతర మానసిక రుగ్మతకు గురిచేసినారు.
ఆళ్వారులు, నాయనారులు వైష్ణవ మరియు శివ భక్తులు. వారిలో ఎక్కువగా
బ్రాహ్మణేతరులు, పంచములు వున్నారు. వారి విగ్రహ ప్రతిష్ఠలున్న
దేవాలయములలో ధూపదీప నైవేద్యములను ఆచరించేది రోజూ బ్రాహ్మణుడే! భక్తికి,
దైవత్వమునకు తరతమ భేదములు లేవు. బ్రాహ్మలకు వేదము నిర్దేశించినది
నిస్వార్థ సంఘ సేవ. ఇది కూడా పాశ్చాత్యుల మాయలోపడి ధర్మాన్ని
మంటగలిపినాము
శూద్రులుగా భావించే 'రాజులు, రెడ్లు, కమ్మలు, కాపులు' అందరూ రాజ్యములను
ఏలిన వారే! క్షాత్రముంటేనే కదా రాజులయ్యేది. 'నా విష్ణుః పృథివీ పతిః' అన్నది
శాస్త్ర వచనము. అప్పుడు వారు బ్రాహ్మలచే కూడా అరాధ్యులేకదా. ఇక వైశ్యుల
విషయానికొస్తే వానిజయమే కాదు వ్యవసాయము కూడా వారిదేనని శాస్త్ర నిర్దేశము.
రాజ్యాలు అంతరించిన తరువాత వ్యవసాయమును వారు రాజ్యములనేలిన వారికి
అప్పగించి ఈ దేశపు ఆర్ధిక వ్యవస్థ చెదరకుండా కాపాడినారు.
ఇక శూద్రులు తమ కులవృత్తి చేసుకొంటూ భగవధ్యానము చేసుకోవచ్చు. వారు
బ్రాహ్మలవలె మంత్రం సాధనాలు చేయనవసరము లేదు. మొల్ల, గోరా కుంభర్,
భక్తనందనార్, తుకారాం అంతెందుకు స్వామి పరమహంస యోగానంద, బాలయోగి
మొదలగువారు పరమాత్మను చేరినవారే తమ మనోబలముతో మరియు తమదయిన
సాధన తో. ఏవృత్తికావృత్తి పారంపర్యముగా అభ్యసించితే అందు తాము
అప్రతిహతమగు నిష్ణాతులు కావచ్చు. ప్రపంచములో ఏదేశముకూడా కలుగనన్ని
కళలు, కళల తో ముడిపడిన వృత్తి విద్యలు మనము కలిగియున్నాము. డిల్లీ
మరియు కొల్లూరు లోని త్రుప్పు పట్టని ఉక్కు స్తంభాలు నిలిపినది వృత్తి విద్యా
నిపుణులేకానీ పాశ్చాత్య Scientists కాదు (Science మరియు శాస్త్రము ఒకటి కాదు,)
మనము పెడ త్రోవ పట్టింపబడినాము.
ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా
నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
(Awake ! arise! stop not till the goal is reached. Path is as sharp as razor’s edge
and hard to go by.) లేవండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి.
ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైంది. అయితే సంకల్ప బలం ఉన్న
హృదయానికి సంభవం కానిది ఏముంది?
పెద్దలను తప్పుపట్టకండి. ఈ ధర్మము ఎంత సనాతనమో అంత అధునాతనము.
పెద్దల గొప్పదనమును గూర్చి ఒక్కమాట చెప్పి ఈ వ్యాసమును ఇక్కడ
ముగించుతాను. సున్నము-రాయి, పోక-చెట్టు, తమాలము-తీగ. తగుపాళ్ళలో వీనిని
మిశ్రణము చేసి మనము అనుదినము సేవించుట ఆరోగ్యదాయకము అని చెప్పుట
వారికి ఏవిధముగా సాధ్యమయినదని యోచించినారా! యోచించి సమయము వృధా
చేసుకొనేకంటే వారిని అనుసరించుదాము. అది చాలు మన భవితకు బంగారుబాట
వేసుకొనుటకు.
స్వస్తి