Sunday, 5 June 2016

మేధోవిధ్వంసము

 

మేధో విధ్వంసము

పెరవారి కుట్రలన్నియు

నిరతము యోచించి మనము నిర్మూలనమున్

మరి చేయ వచ్చు నక్కట

దురితాత్ములు మనలనున్న దుర్గతె రామా!

 

ప్రపంచములో 84 లక్షల జీవరాసులున్నాయన్నది ఒక అంచనా. నిజానిజాలు పరమాత్మునికే ఎరుక కానీ ఆలోచన, ధారణ, గ్రహణ, ప్రతిస్పందన, రసానుభూతి, సుఖదుఃఖానుభవము  స్థితిస్థాపకత, మొదలగు గుణములు మానవునికి మాత్రమే స్వంతములు. మరియటువంటి మానవుడు తాను గౌరవించ వలసిన వివిధ విషయములపై భక్తి శ్రద్ధ ఉంచుటయేకాక పరులు నిష్కారణముగా దూషణకు గానీ, అవహేళనకు గానీ, ఆక్రమించుటకు గానీ గడంగినపుడు తగిన ప్రతిఘటన చూపక పోతే శత్రువు  తనను చేతగాని వానిగా నే జమ కడుతాడు. అట్లు జరిగిన అది ఆత్మహత్యా సదృశమే! మన దేశపు విషయములో జరిగినదే!  కొందఱు ఉదాసీనులై ఉండిపోగా కొందరు స్వార్థము చేతను, కొందరు భయము చేతను ఆంగ్లేయులకు తలయొగ్గి ‘బసవన్న ఉలవలు తింటావా’ అన్నా ‘గడ్డి తింటావా’ అన్నా రెంటికీ తలవూపి తమ ఉనికినీ తమ దేశపు ఉనికినీ కాపాడుకోలేక పోయినారు. ఇదే ‘మేధో విధ్వంసము’ నకు  నాందియై నిలచినది.

     ఈ విధ్వంసమునకు మన విద్య విధానము, భాష, నిర్లిప్తత, విదేశీ విలాసములపై, విధానముల పై, వికాసములపై అవసరమునకు మించిన అభిలాష మన వేష భూషలను కూడా వదిలి పరాసంస్కృతి పై పనికిరాని వ్యామోహము ఇందుకు కొన్ని కారణములు. స్వతహాగానే పుచ్చిన కర్రను విరచుట గొప్ప విషయమేమీ కాదు గదా! మన సనాతన ధర్మ విరోధులు చేసినది కూడా అదే! ఉత్తర దక్షిణ భాషలుగా చీల్చిన Bishop Robert Caldwell గారిని నమ్మినంత మన మేధావులను నమ్మరు గదా! అరవిందుల వారి ఆలోచనను ఒకసారి గమనించండి. ఇదే మాటను , శ్రీనాధుడు, కృష్ణ దేవరాయలు, కంచి పరమాచార్యులు, చిలుకూరి నారాయణ రావు గారు ఇంకా ఎందరో చెప్పిన మాటలను పేడ చెవిన బెట్టి పాశ్చాత్య భావాలను నెత్తికెత్తు కొన్నాము. వాడుక భాష పేరుతో గ్రాంథిక భాషకు దూరమైనాము. మనకు ఇపుడు ‘ కాకి నడకా లేదు హంస నడకా రాదు!’

Sri Aurobindo did not subscribe to the theory that the languages of North and South India are unrelated. Sri Aurobindo’s study of the Tamil led him to discover that the original connection between the Sanskrit and Tamil languages was far closer and more extensive than is usually supposed. These languages are two divergent families derived from one lost primitive tongue. And, my first study of Tamil words had brought me to what seemed a clue to the very origins and structure of the ancient Sanskrit tongue. See The Secret of the Veda, V 10, the Centenary Edition, p 36, 46. Sri Aurobindo also noted that a large part of the vocabulary of the South Indian languages (Tamil, Kannada, Telugu and Malayalam) is common with Sanskrit.

ఇక విదేశీయుడైన మన దేశ సంస్కృతి, వేదం పురాణేతిహాస వేదంగా, ఉపవేదములను గూడా ఆపోశనము పట్టిన DAVID FRAWLE (పండిత వామదేవ శాస్త్రి) ఏమంటున్నారో గమనించండి.

David Frawley on Dravidians:

For example, if we take a typical person from Punjab, another from Maharashtra, and a third from Tamilnadu we will find that the Maharashtrians generally fall in between the other two in terms of build and skin color. We see a gradual shift of characteristics from north to south, but no real different race. An Aryan and Dravidian race in India is no more real than a north and a south European race. Those who use such terms are misusing language. We would just as well place the blond Swede of Europe in a different race from the darker haired and skinned person of southern Italy. Nor is the Caucasian race the "white" race. Caucasians can be of any color from pure white to almost pure black, with every shade of brown in between. The predominant Caucasian type found in the world is not the blond-blue-eyes northern European but the black hair, brown-eyed darker skinned Mediterranean type that we find from southern Europe to north India. Similarly the Mongolian race is not yellow. Many Chinese have skin whiter than many so-called Cauca-sians. In fact of all the races, the Caucasian is the most variable in its skin color. Yet many identification forms that people fill out today in the world still define race in terms of color.

ఈ దేశ వాసులమై యుండి కూడా మనము ఈ మార్గమున ఆలోచించినామా!

మరి మన దిశా నిర్దేశకులైన మహనీయులను వదిలి Well (బావి) లో పడిపోతున్నామే ఇది న్యాయమా! వీరిని అనుసరించుట వల్ల భారతీయత, ఏకత్వము, అఖండ సంస్కృతి మొదలయిన వాని నుండి మనము విడివడుచున్నాము. నేను ఎక్కడయినా ‘హిందువు’ అన్న శబ్దము వాడితే అది సనాతన ధర్మావలంబులకు మారుగా వాడుచున్నట్లు  గ్రహించేది .

ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తూవుందంటే ఈ ఆధునిక యుగంలో ఏ దేశవాసి యైనా, తాను ఇస్లాం పాటించే వాడయితే  ముస్లిం అని చెప్పుకుంటాడు. క్రైస్తవమును పాటించేవాడు క్రైస్తవుడినని చెప్పుకుంటాడు. మరి ఈ సనాతన ధర్మమును పాటించేవాడు ఏమని చెప్పుకుంటాడు? ఒకవేళ హిందువు అని చెప్పుకోవచ్చు అన్నది జవాబైతే హిందు దేశ వాసులంతా హిందువులే కదా ! బ్రిటీష్ వారంతా బ్రిటిషర్స్ అయినట్లు, అమెరికా వారంతా అమెరికన్స్ అయినట్లు. మరి మనకంటూ ఒక ఉనికేదీ?  అంటే మన దేశములోనే మనమెవరో చెప్పుకోలేని స్థితి మనది.

మిగిలినది మరోమారు.....

మేధో విధ్వంసము 2

ఈ దేశములోని అన్య మతస్తులు అల్ప సంఖ్యాకులు గా (Minorities) గా వర్గీకరింప బడుతారు. వారికి ప్రభుత్వము ఎన్నో తాయిలాలను ఇస్తుంది. మరి ప్రభుత్వానికి ఈ డబ్బు ఎక్కడిది అంటే అధిక సంఖ్యాకుల నుండి రాబట్టినదే! దీనిని అత్త సొత్తు అల్లుడు దానము చేయుట అనే గదా అంటారు. మరి ఈ వివక్ష కాలమెరుగని కాలము నుండి మనదైన దేశమును కలిగిన మనకు ఎందుకు? ఇది గమనించితే

జానుదేమొ బండి జాకోబు డీజలు

జోన్సు తోలె మిగుల జోరుగాను

పరుల వస్తువెపుడు పంచదారను బోలు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

అన్న మాట నిజమనిపించదూ?  

ఎవరైతే ఈ లబ్ధులను పొందుచున్నారో అవి తమ చేత పడే వరకూ తాము హిందువులమనే చెప్పుకుంటారు. ‘ఏరు దాటే వరకే ఎంగన్న తరువాత పింగన్నే’ మరి ఈ కడగళ్ళకు నిష్కృతి లేదా! చదువు విషయానికి వస్తే మార్కుల రాయితీతో పై చదువులు చదివే వారి మేధస్సు దేశానికి ఉపయోగకరమేనా? ఈ దేశము ప్రపంచ పటములో ఉన్నంత వరకూ reserved candidates ను మనముంచుకొని deserved ను అమెరికాకు పంపి ఆ దేశమును సాటిలేని మేటి దేశముగా చేసి ఆ దేశపు మోచేతి నీళ్ళు త్రాగుతూ వుండవలసినదేనా? ఇదే మేధో విధ్వంసము అంటే. పాశ్చాత్య కమ్యూనిస్ట్ దేశాల కుట్ర ఇది. దీనిని సమర్థవంతముగా త్రిప్పి కొట్టగలిగిన నాయకత్వమేదీ మనలో!

దేశమును సంస్కృతములో రాష్ట్రము అంటారు. ఒక రాష్ట్రము సప్తాంగములు కలిగియుంటుందని మను ధర్మ శాస్త్రము మరియు చాణక్యుని అర్థ శాస్త్రము చెబుతూ వున్నాయి. అవి ఏవంటే

1. రాజు 2. అమాత్యుడు 3. జన పదము 4.దుర్గములు 5. కోశము 6. దండము/బలము

7. మైత్రి/సుహృత్.

రాజు రాజ్యమునకు శీర్షము. మంత్రి కళ్ళు మెదడు. జనపదము గుండె. జనము అంటే ప్రజలు పదము అంటే ప్రాంతము (The subjects and the province)

దుర్గములు శిరస్త్రాణములు. ఆపదలను అడ్డగించేవి. కోశము ఊరువులు అంటే తొడలు అవి సమకూర్చేదే శక్తి. ఆర్ధిక శక్తి అంటారు గదా (Economic Strength)

దండము/బలము అనగా బాహువులు. బాహు బలము అంటారు కదా! మైత్రి/సుహృత్ అన్నది స్వచ్చమైన గాలి. సహవాసము స్వచ్ఛతకు మారుపేరు కదా! మరి ఈ అంగములలో నేటి ప్రభుత్వములో ఎన్ని సక్రమముగా పని చేస్తున్నాయి? మంచి చెడుగు అన్న విషయాలు వదిలేస్తే మొదటి మూడు, ఐదు, ఉన్నాయి. ఆరు అంటే దండము\బలము ఉన్నాయి కానీ దండము అందరికీ ఒకటే వుండేది నాడు. మరి మన దేశములోనో ముస్లిం చట్టము వేరు. ఇది చేసిన వారు నేడు లేరు. నేడెవరూ ఈ చట్టమునడ్డగించ రారు. వారా దేశము వదలి పోరు. ఇక సైన్యము (బలము) అన్న అర్థమునకు వస్తే సర్దార్ పటేలు గారు సైన్యముతో పోయి

మన కాశ్మీరు లోని పరాయి వారిని తరిమి కొడతానంటే వారిని వారించుటయే గాక గోపాలస్వామి అయ్యంగారిని తన ప్రతినిధిని జేసి (Minister without Portfolio) వ్రాయించి కాశ్మీరుకు భయంకరమైన ప్రత్యేక ప్రతిపత్తిని కలికిప జేసినారు. నెహ్రు గారు ఈ జటిల సమస్యను అయ్యర్ కు వదిలి విదేశాలకు వెళితే పటేలు గారు ఎంత కష్టపడి ఈ మాత్రమైనా సాధించినారో  గమనించండి. మోడీ గారు పదవి చేబట్టి, పదవిలో స్తిమితపడిన తరువాత గాని ఈ కంపు వేరెవరూ కడుగలేక పోయినారు.

మేధో విధ్వంసము 3

పటేల్ గారి గొప్పదనము గమనించండి.

But it was Patel finally who managed the crisis and navigated most of the amendments sought of the Sheikh through the Congress party and the Constituent Assembly to ensure that Article 370 became part of the Indian Constitution. (Updated: May 29, 2014 22:54 IST)

 అంటే సర్దార్ గారు లేకుంటే విధ్వంసము ఇంకా ఎంత తీవ్రముగా ఉండేదో చూడండి.

మన బాహువులు కోలుకోలేనంత బలహీనము గావింపబడినాయి. ఇదీ మేధో విధ్వసమే! ఇక చివరిది మైత్రి\సుహృత్ అంటే ఇరుగు పొరుగు రాజ్యాలతో స్నేహ సుహృద్భావ సంబంధములు. నేపాలు చేయి జారినది. భూటాను చేయి జారుటకు సిద్ధముగా వుంది, శ్రీలంకకు మైత్రి పాకిస్తానుతో ఏర్పడినది. ఒకప్పటి మన మాలా ద్వీపాలు Maldives గా  ముస్లిం పాలనలోనికి పోయింది. మిగిలిన ఈ స్వతంత్ర దేశములో కూడా మొన్నటి వరకు పరతంత్రులమై బ్రతుకుతూ వుండిన వాస్తవమును ఇప్పుడిప్పుడే మరువలేము.

చాణక్యుడు ‘వసుధైవ కుటుంబకం’ ఆన్న మాట వాస్తవమే  కానీ మాయింటి తలుపులు అన్నీ తెరిచియుంచినాము మీరు  నిరాఘాటముగానూ, నిరాటంకముగాను వచ్చి మమ్ముల పరిపాలించండి అని మాత్రం కాదన్నది ఆయన రచించిన అర్థ శాస్త్రమును సంపూర్ణముగా శ్రద్ధతో చదివితే మనకు అవగతము కాగలదు. కాందిశీకులకు, కారణాంతరములచే  వలస వచ్చినవారికి నగరపు పొలిమేరలలో  ఉపనివేశము (Colony) కల్పించి వారిని తగిన జాగరూకతతో గమనించ వలెనని చెప్పినాడు. నేటి Visa, Passport విధానమును గూర్చి కూడా ఆయన విశదముగా వ్రాయుట జరిగింది ఆ గ్రంథములో! కానీ అసలా గ్రంధమును చూచినవారెందరు? చూడమన్నవారెందరు? కమ్యునిష్టు, క్రైస్తవ, మహమ్మదీయ మేదావులేరోజూ మనకు మన పరమ విజ్ఞానవంతులైన పూర్వీకులు వ్రాసిన గ్రంధములను పాఠ్యాంశములలోనూ చేర్చ లేదు , సంస్కృత భాషను అందుబాటు లోనికీ తేలేదు. మన పరిస్థితి ఏమిటంటే మనవద్ద మన సద్ది పెట్టె, శీత కరండము (Fridge) వున్నది గానీ అందులో మన వస్తువొకటీ లేదు. అన్నీ పరదేశముల నుండీ వచ్చిన Plastic మూటలే!

జ్ఞాన సంపన్నులమనే పాశ్చాత్య క్రైస్తవులు “Aryan Invasion Theory’ ని మనలోనే వారి తోత్తులైన కొందరి సహాయముతో మన పైన రుద్దినారు. వారు చెప్పిందేమిటంటే మీరు కూడా పురాతన కాలంలో వేరెచట నుండీనో వచ్చినవారే! మీకు మాకు కాస్త ముందు వెనుక తప్పించి వేరే తేడా ఏమీ లేదు కావున ఇద్దరమూ  ఈ భూమిని అనుభవిద్దాము అని. ఈ ప్రయత్నము అంత సానుకూలము కాకపోవుటతో Anglo Velsh వేదాంతి Sir William Jones (1746 – 1794 ) మన దేశ మాతృ భాష యైన సంస్కృతమునకే  ఆఘాతమును కలిగించినాడు, హిందు యూరోపియన్ భాషలకు మూలమైన భాష ఏదో వున్నదని.

ఆ సిద్ధాంతమునకు నాటి పాలక విధేయులైన విజ్ఞులు గాలికి ఊగే కొమ్మలవలె అప్రయత్నముగానే తలలూపినారు. ఇది ఫలించకముందే Bishop Robert Caldwell (7 May 1814 – 28 August 1891). ఈయన తన మత ప్రచారమునకు చదువుకొనని, నిరుపేదలైన పల్లె పట్టున నివసించే పేదలను సేవా భావమన్న పేరుతో ఆర్ధిక సహాయమును విరివిగా చేసి, నిధులు పై నుండి అంటే వారి దేశము నుండి వచ్చేవి కదా!, వారిని మతాంతరీకరణ గావించుటయే గాక తానూ తిరునల్వేలిలోని ఇదయంగుడి అన్న వూరికి 800 మైళ్ళు వెళ్లి అక్కడ Society for the Propagation of the Gospel అన్న సంస్థను ఏర్పాటు చేసుకొని జీవితాంతము మతాంతరీకరణ లోనే గడిపి మరణించినాడు. వైదిక ద్వేషమును గలిగించి ద్రావిడ అన్న లేని తెగను సృష్టించి కలకాలమూ మనలను కదలనీకుండా గందరగోళములో పడవేసినాడు. మద్రాసు మెరీనా బీచ్ లో 1967 లో ఆయన విగ్రహము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బహుమతిగా ప్రతిష్ఠింప బడినది. అంటే మార్పిళ్లు  ఆయన చేయించుటకు తన జీవితమే వెచ్చించినాడు. ఆయన పేర తపాలా బిళ్ళ కూడా జారీ చేయబడినది. ఏది ఏమైనా మతాంతరీకరణ మహత్తర శక్తి యని భావి తరాలకు క్రైస్తవ వర్గాలకు నిరూపించి చూపించినాడు. ఇది మనపై జరిగిన విలోహిత సంగ్రామము (Non Blood-shed Battle).  ఆర్య ద్రావిడ భాష విభేదములను సృష్టించుటలో కూడా కృతకృత్యుడైనాడు. ఇందులో కలిగిన ఓటమిని యువత కన్ను తెరువక పోతే కలకాలమూ భరించ వలసినదే!He arrived first at Madras in 1838 as a non-conformist minister under the auspices of the LMS (London Missionary Society). There he learnt Tamil and was so attracted by the beauty of the language that he also explored its rich literature and poetry and became familiar with some of the other languages of the region. He therefore transferred to the Anglican SPG (Society for the Propagation of the Gospel) who sent him to Tinnevelly. He walked the 800 miles south to the village of Idaiyangudi where he established his mission station: it was to be his home for the next 36 years.

‘జనని సంస్కృతంబు సకల భాషలకును ... దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తలచి ఆంధ్ర భాష సేవ జేసిన  మహామహా సంస్కృతాంధ్ర పండితులైన నన్నయ, తిక్కన, పాల్కురికి సోమన, నాచన సోమన, శ్రీనాధ, అష్టదిగ్గజ, కృష్ణదేవరాయ మొదలైన మహనీయులు వేరుగా చూడని సంస్కృతాంధ్రములను విడదీసి, తమిళమునకు పట్టముగట్టి దానిని మూల ద్రావిడమని దాని  సామంత భాషగా తెలుగును ఏర్పరచిన గమనిషండి. Bishop Robert Caldwell మహాశయుడు మనకు మహానీయుడై పోయినాడు ఎంతటి విధ్వంసమో!

మేధో విధ్వంసము   4

ఇది ఇట్లుండగా  వేరొక మహామారణ విధ్వంసమెట్లు జరిగినదో గమనించండి. 

బైబిలు ప్రకారము ఆది మానవుడైన ఆదాము పుట్టుకనుండి విశ్వసృష్టి, మానవ సృష్టి ని వర్ణించుటకు కాల నిర్ణయము చేయబడకుండెను. ఈ కాల నిర్ణయము చేసిన గాని వారి చరిత్రకారులకు పని దొరకదు. అందుకని క్రైస్తవ ఫాదరీల సభ (Chamber) క్రీ.శ. 1849 లో Usher అను Archbishop నాయకత్వాన ’ జూలియన్ క్యాలండరు ప్రకారము  22 October 4004 B.C. ఇంచుమించు సాయంకాలము 6 గంటల సమయమున  సృష్టి జరిగినదని నిర్ధారించినారు.దాని ప్రామాణికతను గూర్చి  ఆయన లోకమును నమ్మించిన మాటలు ఈ విధముగా వున్నాయి.

As the memory of man extends back only to some point in his early boyhood, so the memory of our race extends back only to about 3000 years from the present date, leaving an indefinite space before that, during which the infancy of the species must have been transacted. Nor does the scriptural account of the creation settle this point. As many as two hundred different calculations as to the age of our species have been founded, by different divines on the statements of the sacred records the discrepancy arising from the uncertainty of those texts of the Old Testament in which Numbers occur. The longest of those calculations, dates the creation of man at about 8,800 years from the present time or about 7,000 years before the birth of Christ; the system usually adopted by historians is that of Archbishop Ussher, which fixes the event at B.C. 4004 or 5853 years from the present date. (viz.1849 A.D.)

James Ussher (or Usher; 4 January 1581 – 21 March 1656) was the Irish Archbishop of Armagh and Primate of All Ireland between 1625 and 1656. He was a prolific scholar and church leader, who today is most famous for his chronology that sought to establish the time and date of the creation as "the entrance of the night preceding the 23rd day of October... the year before Christ 4004"; that is, around 6 pm on 22 October 4004 B.C. according to the proleptic Julian calendar.

మనుజుని జ్ఞాపకశక్తి గతము వైపు మరలించితే చిన్నతనములో కొంత వరకే వ్యాపించును. ఆ ప్రకారముగానే మన జాతి యొక్క జ్ఞాపకశక్తి మూడువేల సంవత్సరముల వెనుకకు మాత్రమె వ్యాపించుచున్నది. అంతకు ముందు యింకను కొంత అనియమితమైన కొంత కాలము మానవ వికాస పరముగా కొంత కేటాయించటమైనది. పవిత్ర గ్రంధములో నెచ్చటనూ ఈ కాల నిర్ణయము చేయబడలేదు. వివిధములైన 200 అంచనాలు ఫాదరీల వల్ల పంపబడినవి కానీ అవియన్నియు పవిత్ర గ్రంధములోని సూచనలకు విరుద్ధముగానున్నవి. ఈ అంచనాలలో హెచ్చుకాలముగా ఇవ్వబడిన లెఖ్ఖ ఇప్పటినుండి (1849 A.D.)8800 సంవత్సరములు వెనుకకు వెళ్ళుచున్నది. కావున Ussher గారి అంచనాలను వాస్తవమునకు దగ్గరయినవిగా గ్రహిస్తూ B.C. 4004 ను ప్రాణికోటి ఆవిర్భావ సంవత్సరముగా గ్రహించడమైనది. అంటే 3000+1004+1849= 5853, అదే 2016కు అయితే   5853+ 167= 6020 సంవత్సరములుగా తీసుకొనవలసిన వస్తుంది. దీనినే విస్సన్న చెప్పినది వేదము జేమ్సు చెప్పినది చరిత్ర అంటారు.

మరి వారి ఆధునిక శాస్త్రజ్ఞులు  ఇప్పటికి నిర్ధారించిన (ఇప్పుడు 5000 నుండి 9000కు పోయినది, ముందు కాలానికి ఇంకా ఎంత వెనక్కు పోతుందో!) 9000 సంవత్సరముల హరప్పా నాగరికత ప్రకారము వారి దేవుడు వారలను పుట్టించుటకు 3000 కు పూర్వమే మనము భూమిపై ఉన్నాము. అంటే మనము ఆ దేవుని బిడ్డలము కాదనే గదా! మరి ఇది మన మాతృ భూమియే కదా! కానీ క్రిస్టియన్ పెట్టుబడి విధానములకు (Christian Capitalism) పూర్తిగా విరోధులైన క్రైస్తవ, ముస్లిం, కమ్యునిస్టు వర్గాలు  మాతృభూమి అన్న సద్భావనను గుర్తించలేదు, అసలు కలిగించుకొని యుండియుంటేనే కదా! ఆ భావన కలిగిన అతిపురాతన పురాతన వర్గములు రెండే! 1. హిందువులు 2. యూదులు. ప్రపంచములోని అన్ని ప్రాంతములు వారి దండయాత్రలకు తగినవే! అసలు ఆమాటకొస్తే ఈ భారత భూమి పుత్రులైన S.C., S.T. తెగలను ఈ గడ్డ కు దూరముచేసి వైరము సృష్టించినారు. మిగతా వారంతా అసలు ఎక్కడినుండీనో వచ్చిన వారలన్నారు. అంటే దీనిని   No Man’s Land గా చేసినారన్న మాట.

మిగిలినది మరొకమారు ........

మేధో విధ్వంసము   5

నేటి విద్యావేత్తల పరిశోధనలు నిజాయితీని ప్రతిబింబింప జేయుట లేదన్న వార్తలు విరివిగా వినవస్తున్నాయి. ఈ విషయాని ధృవపరుస్తూ జరిగిన ఒకటి రెండు ఉదంతాలు ఈ విధంగా వున్నాయి.

ఖురాన్ రచనల పరిశోధకుడు, ప్రపంచ ప్రఖ్యాతి వహించిన  ఒక పాశ్చాత్య పండిత  మిత్రునికి కొన్ని గుండె చెదిరే వాస్తవాలను చూపి, మరి సహేతుకముగా వానిని ప్రకటించ కూడదా అని    అతడు అడిగినపుడు అతను ఈ విషయాలను నేను ప్రకటించితే ముస్లీములు అమితమైన కలత చెంది ఆగ్రహించే అవకాశము కూడా ఉన్నదని తెలియజేసినాడు. మరి వాస్తవికతను ప్రతిబింబించే విమర్శలు వచ్చే అవకాశము ఎంతవరకు వున్నది?

Islam and Intellectual Terrorism (Turbans of the mind are disallowing and disavowing proper intellectual engagement with Islam.) by Ibn Warraq అన్న పుస్తకములో పై రచయితా ఈ విధంగా వ్రాస్తాడు, ఆయన భావము ఆయన మాటలలోనే తర్జుమా చేయకుండా మీ ముందుంచుచున్నాను:

Very recently, Professor Josef van Ess, a scholar whose works are essential to the study of Islamic theology, cut short his research, fearing it would not meet the approval of Sunni Islam. Gunter Luling was hounded out of the profession by German universities because he proposed the radical thesis that at least a third of the Qur'an was originally a pre-Islamic, Christian hymnody, and thus had nothing to do with Mohammed. One German Arabist says academics are now wearing "a turban spiritually in their mind", practicing "Islamic scholarship" rather than scholarship on Islam. Where biblical criticism has made important advances since the 16th century, when Spinoza demonstrated that the Pentateuch could not have been written by Moses, the Qur'an is virtually unknown as a human document susceptible to analysis by the instruments and techniques of biblical criticism.

ఈ విషయాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ముఖ్యముగా ఇస్లామును గూర్చి తమ మనోభావాలను ధైర్యముగా ప్రాణమును పణము గా పెట్టి   ప్రకటించగలిగిన రచయితలు ఎవరుంటారు. ఒకవేళ ఎవడైనా కొట్లలో ఒకడున్నా వాడు ‘సల్మాన్ రుష్ది’ కావలసి వస్తుంది. పుట్టినవాడెవడూ అకాలమరణము గానీ జీవచ్ఛవములా ఉండుట గానీ కోరుకోడు కదా!

దీనివల్ల వాస్తవాలు వెలికి రాక పోవుట వల్ల వెలుపల ఉన్నవే వాస్తవాలు కావటం వల్ల వారి మత పెద్దలు చెప్పేదే వాస్తవము. అందుకే వారు మనసులు విరిచి మానవ శతఘ్నులను తయారు చేయగలుగు చున్నారు.

ఇక వైవిధ్యము, బహుళత్వము (Diversity, Pluralism ) అన్న పదాలను కొంత విశ్లేషించుదాము. బహుళత్వము అన్నది భారతీయ జీవన స్రవంతి యందు లేనిది. ఇది వలస విధాన చోదిత పాశ్చాత్య క్రైస్తవ విధానము(Western Colonial Christian concept). ముస్లిములపై తీవ్ర వాడ ముద్ర వేసి , వారినుండి ప్రపంచమును కాపాడు దైవాంశ సంభూతులుగా తమకు తామే ముద్ర వేసుకొని ప్రత్యక్షం గానో, ప్రచ్ఛన్నంగానో, పరోక్షంగానో ఇరాక్ లాంటి దేశాలపై యుద్ధాలనే ప్రకటించి ఆయా దేశాల పెట్రోలియం నిక్షేపాలను  తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నారు. ఈనాటికీ ‘మధుఫేన విషకుంభము’లై ( తేనే నురగ కలిగిన విషపు కుండలు) వ్యవహరించుతూ ప్రపంచ దేశాలను తమ హస్తగతం చేసుకునేందుకు నిర్విరామముగా కృషి సలుపుతూనే ఉన్నారు. అట్లు కాకుంటే తమ దేశాలలో తమ మత పరమైన పద్ధతులను తమ సంస్కృతి గా ప్రకటించి దాని అనువర్తులై యుండనివారిని అన్యులుగానే  ముద్రవేసి తమ జనజీవన ప్రవాహమున కలుపుకొనకుండా వారిపై సవతి తల్లి ప్రేమను కలిగియుంటారు.  ఆస్ట్రేలియా, రష్యా, ఐరోపా దేశాలు తమ నాగరికతకు జై కొట్టిన వారికే తమ దేశ పౌరసత్వాన్ని ఇస్తుంది కానీ అన్యధా కాదు.

మన దేశము కలకాలమూ వైవిధ్యమునకే (Diversity) ప్రాధాన్యత ఇచ్చినది.  శరణన్న వారిపై కరుణ చూపుటే మనము పెద్దలనుండి నేర్చుకున్న నీతి. అసలది మన జీవిత రీతి.  మన దేశమునకు కాందిశీకులుగా వచ్చిన యూదులు, ఫార్సీలు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తామన్నా కూడా వాడని మనలో ఒకరిగా ఉండిపొయినారు. అదే ముస్లీములు క్రిస్టియన్లు మతము మారి, కన్న తల్లిని కాలితో తన్ని కూడా ప్రత్యేక వసతులు కావాలన్నారు ఇంకా కావాలని అంటూనే వున్నారు. వీరిది బాతు బంగారు గుడ్డు తంత్రము. కానీ వీరు బాతును చంపరు. తనకు తాను బాతు చచ్చేవరకు గుడ్లను పొందుతూనే వుంటారు. ఒక్కసారి మన దేశములోని ఈ మతావలంబకులు, మన పూర్వులపై ఎన్నెన్ని కుట్రలు పన్ని, ఇందరు తల్లులను బలవంతముగా చెరిచి  ఆయా మతస్తులు  తమ మతానుయాయులను పెంచుకున్నారో చెప్పుట మాటలకందని విషయము. భారతీయులమైన మన దేశములో మనకొక ధర్మశాస్త్రము, ముసల్మానుల కొక ధర్మ శాస్త్రము. నలుగురిని వివాహము చేసుకొనగల వెసలుబాటుతో ముస్లిం జనాభా ఎంత పెరిగిందో ఈ వాస్తవాన్ని గమనిస్తే తెలుస్తుంది.

మిగిలినది మరొకమారు........

మేధో విధ్వంసము   6

1947 లో 20% హిందు జనాభా వున్నా పాకిస్తాన్ లో నేడు 1% వుంది, బంగ్లాదేశ్ లో 38% వున్నా హిందువులు 8% కు దిగజారినారు. మరి మన దేశములోనో 10% వున్నా ముస్లీములు 15% అయినారు (గూగుల్ సౌజన్యం తో). ఎంతటి విధ్వంసకరమైన విషయమో చూడండి.

సబక్తజీను కొడుకు మహమ్మదు ఘజనీ ఆఫ్ఘాన్ పాలకుడై ఈ దేశావాసులను లక్షలాది సంఖ్యలలో చంపి దేవాలయాలోని దేశ సంపదలను ఎంత కొల్ల గొట్టినాడు అన్నది   అల్-ఉత్బీ, ఫెరిష్తా, మున్నగు మహమ్మదీయ చరిత్రకారులు ఆనాడు జరిగిన అకృత్యాలను గర్వముతో విపులముగా చిత్రించారు. నవంబరు 27, 1001 న మొదలైన 17 దాడులు 1027 సంవత్సరము వరకు సాగాయి. గంగా మైదాన ప్రాంతములో మథుర మున్నగు పలు దేవాలయములు ధ్వంసము చేసి తన చర్యలకు 'జెహాద్' ముద్ర వేసినాడు. ఈ దాడులలో వేలాది హిందువులను చంపి వారి పుర్రెలతో గుట్టలు పోసి వినోదించాడు. మథుర దేవాలయ విధ్వంసము పిదప దొరికిన సంపద చెప్పనలవి గాదు. (గూగుల్ )

మహమ్మదు ఘజినీ తో బాటు భారతదేశము వచ్చిన పారశీక చరిత్రకారుడు అల్ బిరూని మాటలలో

"Mahmud utterly ruined the prosperity of the country, and performed there wonderful exploits, by which the Hindus became like atoms of dust scattered in all directions, and like a tale of old in the mouth of the people. Their scattered remains cherish, of course, the most inveterate aversion toward all Moslems" (Google)

దీనిని బట్టి తీవ్రవాదము ఎప్పటిదో మీరు అర్థము చేసుకొనవచ్చును.

క్రీస్తు శకము 1580 వరకు మన దేశమునకు చుట్టూవున్న నేపాల్, భూటాన్ , థాయిలాండ్, సింగపూర్, మలేషియా, బర్మా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన దేశములోని భాగాములుగాను, అనుబంధములు గానూ వుండినవే. కానీ ఆంగ్లేయుల కుట్ర వల్లనూ, మహమ్మదీయుల ఆక్రమణల వల్లనూ అవి మనకు దూరమగుటయే గాక మనతో మైత్రీ సంబంధములు గూడా లేవనియే చెప్పవచ్చును. హిందూ మత దేశమైన నేపాలు కమ్యూనిస్ట్ దేశామైపోయినది. భూటాన్ కావటానికి సిద్ధముగా వున్నది. లంక పాకిస్తాను జాలమున తగులుకొన్నది. ఇక పాకిస్తాన్, బాంగ్లా దేశ్ లు సరే సరి. ఇండోనీషియ, మలేషియా, బ్రుని, దక్షిణ ఫిలిప్పీన్స్ మరియు దక్షిణ థాయిలాండ్ ఆదిగా గల దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయినాయి. పోనీ ఇండియా అనబడే మిగిలిన భూభాగమైనా మనదేనా అంటే మేము వున్నామంటూ క్రిస్టియన్లు ముస్లిములు తయారు. ఇది అంతా మేధో విధ్వంసమునకు ప్రణాలికా బద్ధముగా చేసిన గూడుపుఠానీలే!

వీనికి తోడుగా మన Gujral Doctrine వల్ల R&A W పాకిస్తాను విషయములో కార్యకలాపాలను నిలిపివేయ వలసి వచ్చింది. దానితో  తీవ్రవాదము మన దేశములో ప్రబలినది మనకు తెలిసిన విషయమే!

మిగిలినది మరొకమారు.........

మేధో విధ్వంసము 7

మనము తప్పక గుర్తుంచుకొన వలసిన విషయమేమిటంటే ప్రపంచములో ఈ రెండు స్వార్థ పూరిత మతముల తరువాత వరుసలో వున్నది సనాతన ధర్మమే. ఎంతటి పెను తుఫానుకైనా ఊగే చెట్టే గానీ విరిగి ఆగే చెట్టు కాదు.  అందుకే 6వ శతాబ్దము నుండి జీహాదులు ఎంత పోరకాడినా దాదాపు 10వ శతాబ్దము వరకు మన దేశముపై  తమ ఉక్కు పాదమును మోపలేక పోయినారు. అస్సాము ఒరిస్సా, దక్షిణమున మధుర ( ముస్లీములు పాలించినది 30 సంవత్సరములు మాత్రమె ) చాళుక్యులు మొదలయిన ఎన్నో రాజ వంశములు ముస్లీములను ప్రతిఘటించినవి. దారిద్ర్యము, యుద్ధము రెండే తెలిసిన వారి ఘాతుకమునకు ఎట్టకేలకు ఈ దేశము తల యొగ్గక తప్పలేదు.

Muslim historian Firishta [full name Muhammad Qasim Hindu Shah, born in 1560 and died in 1620], the author of the Tarikh-i Firishta and the Gulshan-i Ibrahim, was the first to give an idea to the medieval bloodbath that was India during Muslim rule, when he declared that over 400 million Hindus got slaughtered during Muslim invasion and occupation of India. Survivors got enslaved and castrated. India’s population is said to have been around 600 million at the time of Muslim invasion. By the mid 1500’s the Hindu population was 200 million. (The Muslim Issue—Genocide in History)

అయినా ఈ మహమ్మదీయ పాలకుల కాలములో ఎందరో మహనీయులైన వేదాంతులు, నిజమైన భక్తులు జ్ఞానదేవుడు మొదలు నామదేవుని వరకు వర్ణ వివక్షత లేక విచక్షణ లేక జన్మించి ఈ సనాతన ధర్మమూ నేలకొరగ కుండా కాపాడినారు. చైతన్య మహాప్రభు చాంద్ కాజిని ఏ విధముగా నిలువరించినాడో నేను ‘గోమాత సకల శుభదాత’   అన్నశీర్షిక క్రింద విపులముగా ఇంతకు మునుపు తెలియబరచియుండినాను.

ఇంత జరిగినా ఇన్ని తెలిసినా మన మహా మేధావులైన నెహ్రు వంటి నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయినారంటే వారిలో భారతీయ రక్తము కనుమరుగే నన్నది, మన దేశములో నిషేధమునకు గురికాబడిన,  మథాయ్ గారి Reminiscences of Nehru Age by Mathai చదివితే తెలుసుకొన గలుగుతాము. నేటి భారతదేశ అతలాకుతల పరిస్థితికి ఇటువంటివారి స్వార్థపూరిత పాలనమే కారణము. గాంధి, కాంగ్రెసు మనకు స్వాతంత్ర్యము తెచ్చినారు అని అనుకొంటే ఈ రోజు ఆయన లేదు కాంగ్రెసూ లేదు. ఇప్పుడుండేది నెహ్రు గాంధి కాంగ్రెస్సు. ఇప్పటి రాజకీయ గాంధీలలో నిజానికి గాంధీ నేతి బీర లోని నెయ్యే!

ఇదంతా మేధో విధ్వంసమే! వాస్తవాలను తెలుసుకొనక పోవుట నా దృష్టిలో నేరము, అదే విధముగా తెలిసిన విషయములను జన బాహుళ్యమునకు  తెలుపక పోవుట అంతకు మించిన నేరము. ఇదీ ఒక విధముగా మేధో విధ్వంసమే!

హిందుదేశము నుండి విడిపోగానే పాకిస్తాను ప్రభుత్వము కరాచీ లోని రాం బాగ్ (రామ వనము) ను ‘ఆరాం బాగ్’ గా మార్చివేసింది. ఈ నాటికి సనాతన కాలమునుండి వున్న మన పట్టణములు ప్రాంతముల పేర్లను ముస్లిం పేర్లకు మార్చినా మనము తిరిగి పాత పేర్లు వానికి పెట్టుకోలేని దయనీయ స్థితి లో ఉన్నందుకు నిజముగా సిగ్గు పడవలెను. ఒక ప్రసిద్ధ చరిత్ర కారుడు చెప్పిన మాటను గమనించండి.

మిగిలినది మరొకమారు.......

మేధో విధ్వంసము 8 (చివరి భాగము)

 

If you want to weaken a nation, confuse its identity, distort its heritage, belittle its achievements, highlight its failures, divide it into as many fragments as possible, tarnish its ancient scriptures, and rewrite its history.

ఒక దేశమును బలహీన పరచుటకు ముందు దాని ఉనికిని గూర్చిన సందేహాలను తలకు మించినన్ని చేయి. మూలములు సమూలముగా పెకలించు, విజయాలను మరుగు పరచి అపజయాలను ఆకాశామునకెత్తి, బలహీనతలను చేవలేని తనముగానూ, చేతగానితనముగానూ చేతనయినంత ఎక్కువగా చూపించి , వారి పురాతన శాస్త్ర గ్రంధములను ఆ దేశస్థుల ఆత్మా స్థైర్యమును అన్నివిధాలా చక్కలు ముక్కలు చేసి అప్పుడు ఆ దేశ చరిత్ర వ్రాసేది అని. మన దేశపు విషయములో జరిగినది అదే! ఇదీ మేధో విధ్వంసమే!

క్రైస్తవులకు, మహమ్మదీయులకు కమ్యూనిష్టులకు అసలు ఒకరికొకరు సరిపోరు కానీ సనాతన ధర్మముతో మాత్రము సదా ఉంటుంది వారి పోరు. కావున అట్టి వారితో తీవ్రవాద వ్యతిరేకోద్యమములో మనము చేతులు కలపకుండా మనమే ప్రతిఘటించుతూ చూస్తూ ఉండుట మంచిది వారి మధ్యన పోరు.

మానవతా వాదమంటూ  కొన్ని సంస్థలు కమ్యూనిష్టుల చేత క్రైస్తవుల చేత నడుపబడుతూ వాని వ్యవస్థాపకులు గత ప్రభుత్వమూ నుండి పద్మ భూషణ పద్మ విభుషణ పద్మశ్రీ బిరుదములను పొందిన వారున్నారు. అరుంధతి రాయ్ గారు

The hanging of Afzal Guru is a stain on India's democracy వ్రాసినారు. ఎందుకు అంటే వారిని అన్నివిధాలా ప్రోత్సహించే భారతీయ వ్యతిరేకులున్నారు కాబట్టి. ఇవన్నీ నిరూపించా లేని నిజాలు. ఇదీ మేధో విధ్వంసమే!

ఇక పై చదువులు పరాయి దేశాలు అన్న అంశమును ఒకసారి పరిశీలించుదాము. జపాను దేశమును ఉదాహరణకు తీసుకోండి. అది స్వతహా గానే సాంకేతిక విజ్ఞానము సంవృద్ధిగా కలిగిన దేశము. అయినా కూడా ఒకవేళ ఎవరైనా ఒక జపాను విద్యార్థి విదేశములకు పోయి చదువ తలచితే ప్రభుత్వము అడ్డుపెట్టదు కానీ  వారి చేత ఒక ఒడంబడిక వ్రాయించుకొంటుంది (agreement). అది ఏమిటంటే ‘ నా విద్య ముగిసిన తరువాత నేను తిరిగి స్వదేశమునకే వచ్చి నేను సేవ చేస్తాను’ అని. మరి మన దేశములో ఈ దిశగా నాటి ప్రభుత్వములు ఎందుకు యోచన చేయలేదు. నేటి ప్రభుత్వమైనా చేయవచ్చు కదా! ఒబామా మన గత ప్రధాన మంత్రితో చెప్పినట్లు వచ్చే హ్లాదిని (Joke) చాలామంది చూసే ఉంటారు.

You take reserved –We take deserved అని. ఇందులో వ్యంగ్యము ఉన్నా వాస్తవమున్నది కదా! ఇదీ ఒక విధమైన విధ్వంసమే కదా!

వీని నుండి మనము నేర్చుకొన వలసిన పాఠములు

1. సహనము మంచిని సాధించుటకే గానీ చెడుగును స్వీకరించుటకు కాదు. ఆకస్మికముగా విద్యుత్తు పోతే కొవ్వొత్తి వెదకుట కూడా కష్టమే! క్షాత్రము లేకుంటే మిగిలేది క్షతి మాత్రమె!

2. ధనార్జన అవసరమే! ధనము ఘనము వంటిది, వర్షించితేనే తనకు మనకు మేలు. గాలిలో తేలుతూ వుంటే కనిపించకుండానే పోతుంది. వర్షము మన చేలో పడితే హర్షము పడకుంటే ఫలితము వికర్షము.

3. నీ పెద్దల పై అపనమ్మకము చూపినా, వారిని అవమానము చేసినా నీది ఆత్మ వంచన లేక ఆత్మ ద్రోహమే! పెద్దలు ‘ఆత్మా బుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్విశేషతః   పరబుద్ధిర్వినాశాయ’ అన్నారు. అందువల్ల విదేశీ బుద్ధులను ఆత్మ బూనవద్దు.

4. మనకు జ్ఞాన దాతలని చెప్పుకునే విదేశీయులు వారి స్థానిక అనుచరులు మన వస్తువులను వారి ఒరలో (Cover) లో పెట్టియిస్తున్నారు. అందువల్ల అది వారిదే అనే భ్రమలో ఉండిపోతున్నాము.

5. మనది అత్యంత పురాతన సంస్కృతి. నాటి ధర్మములందు కొన్ని  నేటి పరిస్థితులకు  సరిపోక పోవచ్చు. మనలో మనము తర్కించుకొని నిర్ణయించుకొనవలసి యుంటుంది.. ఇది మన మానసిక సదవగాహనకు సంబంధించిన విషయము.

6. ఆత్మ గౌరవము ఆత్మ సమ్మానము ఉంటేనే అడుగు ముందుకు వేయగలము. అది లేకుంటే అనుచరులుగా వుంది పోవలసినదే! స్వతంత్ర భారతమన్న పేరే గానీ మనము భావ, భాష, వేష, భూషాది దోషములకెరయై స్మ్లేష లో  ఈగ వలె దారీ తెన్నూ గానక కొట్టుమిట్టాడుతున్నాము.

7. అసలు వాస్తవ దేశ చరిత్రను ప్రజ్ఞావంతులై నమ్మదగిన పండితులతో వ్రాయించవలెను.

8. మహనీయులైన. వశిష్ట, వామదేవ, విశ్వామిత్ర, వాల్మీకి, వేదవ్యాస, గౌతమ, భరద్వాజ, కాణాద, బోధాయన, ఆర్యభాట, వరాహమిహిర, భాస్కర, దండి, భవభూతి, భారవి, మాఘ, భాణ, మొదలయిన వారలనేకులను మనము  తేనె పూసిన కత్తులగు పాశ్చాత్యుల  కుతంత్రములకు బలిచేసి మెదలకుండా ఉన్నాము. మన సొత్తు దొంగలించి తమదనే వారి వ్రాతలను, అదే నిజమని నమ్మి పాఠ్యాంశములుగా పాఠశాలలలో చదువుచున్నాము. దీనిని మార్చుటకు ధృడ సంకల్పమును యువత ఏర్పరచుకొంటేగాని దేశాన్ని గౌరవించిన వారలము గాలేము.

9. నిజమైన దేశభక్తులు క్రొత్తగా యువత లోనుండి పుట్టుకొనివస్తే ఇరుగుపొరుగు దేశములను సామదానభేదదండోపాయాలలో దేనిని ఉపయోగించియైనా మనతో సంపూర్ణ సుహృద్భావ వాతావరణమును నెలకొల్పుకొన వలసి యున్నది.

10. సంస్కృతానికి పునర్వైభవము ప్రాప్తింప జేయుటచే మన శాస్త్రముల, శాస్త్ర కారుల ఔన్నత్యమును సాధికారముగా జగతికి చాటగలము.

ఈ విధముగా లొసుగులను అధిగమించి మనము మనది యన్న భావముతో పరభావ దాస్యమునకు పోక స్వదేశము పై వినయముతో ధీరత చేబూని కష్టాలను , ఎంత కష్టమైనా సరే అధిగమించితే దేశ కేతనమును హిమాలయాలపై ఎగురవేయ గలము.

స్వస్తి.

 

 




No comments:

Post a Comment