హిందూకుష్ - 1
https://cherukurammohan.blogspot.com/2021/03/blog-post.html
భాగవతము లోని ప్రహ్లాద చరితము నుండి ఈ పద్యమును గమనించండి.
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్
మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక
వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ
ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ
సంసారముల్.
లోకంలో గుడ్డివానికి పండువెన్నెల ఉన్నా లేనట్లే, చెవిటివాని చేరి శంఖమ్ము నూదిన
ఎంక (ఎముక) గొరుకుచుంటివేల అన్నట్లే, మూగ వేదము వర్లిన్చినట్లే, నపుంసకుడు
సుందరి పొందు కోరినట్లే, కృతఘ్నులతో బంధుత్వము కుదిరించుకొన్నట్లే, బూడిదలో
పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనట్లే, పిసినిగొట్టుకు సంపద ఉపయోగపదనట్లే;
సూకరము సువాసనను గమనించనట్లే, విష్ణు భక్తి పైన విశ్వాసము లేనట్లే, మన
యువతకు మన దేశపు నిజచరిత్ర తెలుసుకొను ఉత్సాహము కనిపించదు.
హిందూకుష్ – 4
దక్షిణాసియాలో ‘ఇస్లాం’ యొక్క ప్రారంభమున ముహమ్మద్ ప్రవక్త మరణము తరువాత
మొదటి శతాబ్దంలో ఆటే 6వ శాతాబ్దములోనే వచ్చినది. డమాస్కస్లోని ఉమయ్యద్
ఖలీఫ్ 711 లో ముహమ్మద్ బిన్ ఖాసిమ్ నేతృత్వంలో బలూచిస్తాన్ మరియు సింధ్లపై
దండయాత్రకు పంపినాడు. ఆవిధముగా ఖాశీం సింధ్ మరియు ముల్తాన్లను స్వాధీనం
చేసుకున్నాడు. అతడు మరణించిన మూడు వందల సంవత్సరాల తరువాత, ఘాజ్నీకి
చెందిన క్రూరుడగు సుల్తాన్ మహముద్ కుట్ర, కుళ్ళు, కుతంత్రమును ఉపయోగించి,
ప్రాణభిక్షను పొందికూడా మళ్ళీమళ్ళీ దండయాత్రలుచేసి, రాజపుత్ర రాజ్యాలను మరియు
గొప్ప హిందూ దేవాలయాలను వరుస దాడులకు పాల్పడి భవిష్యత్తులో చొరబాట్ల
కోసం పంజాబ్లో ఒక స్థావరాన్ని స్థాపించినాడు. 1024 లో, ఈ క్రూరుడు అరేబియా
సముద్రం వెంట కతియవార్ దక్షిణ తీరానికి చేరి సోమనాథ్ నగరాన్ని మరియు అచటి
ప్రఖ్యాత మొదటి జ్యోతిర్లింగమును కల్గిన దేవాలయాన్ని కొల్లగొట్టి అసంఖ్యాకమగు
ధనరాశులను తనతో గోనిపోయినాడు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చినానంటే ఇబ్న్
బటూటా గారి ప్రతిపాదనలో వాస్తవము లేదు, అని తెలుపుటకే! ఎందుంటే ముస్లీములు,
బటూటా వచ్చిన 14వ శతాబ్దము కన్నా ఎన్న్తో ముందువచ్చి ఎక్కడ తమ రాజ్యాలను
స్థాపించుకొన్నారు. ముస్లిం లు ఎన్నడూ ‘హిందువులు’ గా పిలువ ఇచ్చగించనే
ఇచ్చగించరు కదా! మరి ఆయన ప్రతిపాదన వీగిపోతుంది కదా!ఈ వాస్తవము చూడండి.
18 వ శతాబ్దం చివరలో యూరోపియన్ వ్యాపారులు మరియు వలసవాదులు సమిష్టిగా
కొన్ని భారతీయ మతాల అనుచరులను హిందువులు అని పేర్కొన్నారు కానీ అందులో
ఇస్లాం మతస్థులు మాత్రము లేరు అని తెలియజేసినారు.
హిందూ కుష్ అనే పేరు చారిత్రక కోణము నుండి చూచుట దాదాపు 18వ శతాబ్దము
మధ్యకాలనుండి మొదలయి ఉండవచ్చు. దీనిని గూర్చి అరబ్ భూగోళ శాస్త్రవేత్తలు ఇబ్న్
బటూటా కు మునుపు ప్రస్తావించిన దాఖలాలు లేవు. మొదటిసారి ఎబ్న్ బటూటాఅరబిక్
లో వ్రాసిన ‘రిహ్లా’ అనగా ‘ యాత్రా విశేషములు’ అన్న అర్థమును మనము
తీసుకొనవచ్చును (ca. 1330; tr., P. 53; Le Strange, Lands, p. 350). ర్క్కువగా ఈ
యాత్రలు ముస్లీము పాలనా దేశములను ఎక్కువగా పరిగణనలోనికి తీసుకొనుట
జరిగినది. కొంత ముస్లిం పక్షపాతము కూడా ఇందు కానవస్తుంది.
షాహిర్-అల్-దిన్ బాబర్ యొక్క హిందూ కుష్ కనుమల జాబితా కాబూల్ కు ఉత్తరాన
ఉన్న ఎత్తైన పర్వత శ్రేణికి పరిమితం చేయబడిందని తెలియవస్తుంది, అంటే
ముఖ్యముగా పశ్చిమ హిందూ కుష్, దీనిపై ముఖ్యమైన వాణిజ్య మార్గాలు భారతదేశం \
లేదా కాబూల్ నుండి ఖానాకాన్ లేదా టురాన్ (బాబోర్- nāma, foll. 130a-31a,
272b. tr. బెవిరిడ్జ్, పేజీలు 204-5, 485). భారతదేశం నుండి తుర్క్ మెనిస్తాన్ వెళ్లే
కనుమల గుండా ఎత్తైన పర్వత శ్రేణి దాటుతున్నప్పుడు ప్రమాదాలకు అనేకమంది
హిందూ బానిసలు బలైపోయారని అందువల్ల ఆ ప్రాంతానికి హిందూ కుష్ (హిందూ-
కిల్లర్) అనే పేరు వచ్చినట్లు ఇబ్న్ బటూటా వ్రాతల వలన తెలియవస్తూ వున్నది కానే
వాస్తవము ఎండమావి మాత్రమే!
కొంతమంది రచయితలు "హిందూ కుష్" కోసం హిందువులను చంపినారాను అర్థాన్ని
ప్రతిపాదించినారు, ఇది ఎన్సైక్లోపీడియా అమెరికానాలో కూడా వ్యక్తపరుపబడినది.
హిందువులు చారిత్రకమగు మతపరమైన హింసను అనుభవించినారు. బలవంతపు
మతమార్పిడి, హిందువుల ఊచకోత, దేవాలయాల కూల్చివేత మరియు అలవికి మీరిన
అపవిత్రత అలాగే విద్యా కేంద్రాల వినాశ రూపములో మనలను ఈ హింసకు గురి
చేసినారు.
చారిత్రాత్మకంగా, హిందూ కుష్ మీదుగా ఉన్న రహదారులు గొప్ప సైనిక ప్రాముఖ్యత
కలిగివున్నాయి, భారతదేశము యొక్క ఉత్తర మైదానాలకు. విదేశీ ఆక్రమణదారులగు,
క్రీ.పూ 327 లో అలెగ్జాండర్ మొదలుకొని, క్రీ.శ 1398 లో తైముర్లేన్ వరకు మరియు
1001 లో ఘజ్ని యొక్క మహముద్ నుండి క్రీ.శ 1739 లో నాదర్ షా వరకు
విడదీయలేని సంబంధము ఉన్నది. అందరూ ఈ కనుమల ద్వారా ప్రవేశించుతూ
హిందూ బౌద్ధజైనులను తమ కౄరతకు బలిచేసినవారే!
19 వ శతాబ్దం ప్రారంభంలో వాయువ్యంలో రంజితు సింగు ఆధ్వర్యంలో సిక్కు
సామ్రాజ్యం హిందూ కుష్ శ్రేణి వరకు విస్తరించింది. 1896 వరకు చివరి
బహుదేవతారాధకుల కోట "కాఫిరిస్తాన్” అని పిలువబడింది. అమీరు అబ్దురు రెహ్మాను
ఖాను ఆధ్వర్యంలో ఆఫ్ఘన్ల దండయాత్ర జరిగే వరకు ఇక్కడి ప్రజలు హిందూ మతాన్ని
మాత్రమే అవలంబించి యుండినారు.
మరొకమారు చివరిభాగము.........
హిందూకుష్ – 5 (చివరి భాగము )
Hindu.org అంతర్జాల క్షేత్రము (Website) లో శ్రీనందన్ వ్యాస్ గారు ఈ విధముగా
తెలియజేసినారు.: 'పెర్షియన్ భాషలో, "కుష్" అనే పదం కుష్తార్ అనే క్రియ నుండి
వచ్చింది - వధ లేదా మారణహోమం, ఎందుకంటే అక్కడ నివసిస్తున్న
హిందువులందరూ వధించబడ్డారు. ఎన్సైక్లోపీడియా అమెరికానా హిందూ కుష్ గురించి
చెప్పింది: ఈ పేరుకు "హిందువులను చంపిన ప్రదేశము" అని అర్ధము. భారత
ఉపఖండానికి చెందిన హిందూ బానిసలను, మధ్య ఆఫ్రికాలోని వివిధ ప్రాంతముల
నుండి వారి ఉత్పత్తులను హిందూదేశ ముస్లిం పాలకులు రవాణా చేసుకొనుచున్నపుడు,
బదులుగా మార్పిడి చేయు కాలమున కఠినమైన ఆఫ్ఘన్ పర్వతాలలో అనేక హిందూ
బానిసలను అనేకానేక హింసలకు గురిచేసి చంపిన రోజులను గుర్తుచేస్తుంది.
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా క్రీస్తుశకం 1333 లో మొదట హిందూ కుష్ అనే పేరు ఇబ్న్
బటుటా యొక్క రచనలలో కనిపించింది, మధ్యయుగ బర్బర యాత్రికుడు, ఈ పేరుకు
"హిందూ హంత" అని అర్ధము చెప్పినాడు. కానీ ఆ మాటను శీతోష్ణస్థితికి ఇముడలేక
హిందూబానిసలు చచ్చినారని, వాస్తవాలను కప్పిపుచ్చినాడు.హిందువుల సాంప్రదాయ
శత్రువులైన ఆఫ్ఘన్ పర్వత ( ఈపేర్లన్నీ ముస్లీములు పెట్టుకోన్నవి) నివాసులు ఇప్పటికీ ఈ
పర్వత శ్రేణికి ఆపాదించిన పేరు ఇదే!
యూదుల మారణహోమము వలె, ‘హిందూ కుష్’ పేరున జరిగిన హిందూ
మారణహోమము యొక్క ఖచ్చితమైన సంఖ్య అందుబాటులో లేదు. అయితే ఈ సంఖ్య
సులభముగా లక్షల్లో ఉండవచ్చును. ‘ఈ అంచనాను సమర్థించడానికి కొన్ని తెలిసిన
చారిత్రక వ్యక్తుల చరిత్రలనుండి గ్రహించవచ్చును. క్రీస్తుశకం 1398 లో, తైముర్లేన్
50,000 డిల్లీ యుద్ధానికి ముందు కనీసం 50,000 మంది బందీలను ఉరితీయాలని
ఆదేశించినట్లు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గుర్తుచేసుకుంది; అదేవిధంగా, తైముర్లేన్
సైన్యం చేత చంపబడిన బందీల సంఖ్య సుమారు 1.00,000.
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో మొఘల్ చక్రవర్తి అక్బర్ 'క్రీస్తుశకం 1568 ఫిబ్రవరి 24 న
పట్టుబడిన 30,000 మంది రాజ్పుత్ హిందువులను ఊచకోతకు ఆదేశించాడని,
చిత్తౌడ్ కొరకు చేసిన యుద్ధము తరువాత, అక్బర్ ఆస్థానచరిత్రకారుడు అబుల్ ఫజల్
ధృవీకరించిన సంఖ్య' గా పేర్కొనబడినది. హిందూ రాజ్యాలలో భాగమైన పశ్చిమ
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ నగరంపై పలుసార్లు జరిగిన దండయాత్రలలో '15,00,000
మంది నివాసితులు మరణించినారు' అని ఆఫ్ఘన్ చరిత్రకారుడు ఖొండమిర్ నమోదు
చేసినాడు. ఇంతటి అవమానమును ఈనాతికే ఎంతో నిర్లిప్తముగా, నిమ్మకు
నీరెత్తినట్లుండుట మనకే సాధ్యము. ప్రపంచములోని అత్యంత అవమానకర
నామధేయము కలిగిన ఏకైక దేశముగా మనము ఎంతో వన్నె వాసి చేకూర్చుతూనే
ఉన్నాము.
హిందూకుష్షను నామ మెంత ఘనమో హేమంపు సాదృశ్యమో
సందేహమ్మిసుమంత లేక మదిలో సంతోషమున్ గూర్చగా
నిందాపూర్వము హీనమానము మరిన్ నీచంపు భావార్థ మే
ఉందా మాటనటంచు నాకు తెలియన్ ఔర్వంబుతో మ్రగ్గితిన్
ఔర్వము = బడబానలము, సముద్రములోని విపరీతాగ్ని.
స్వస్తి.
No comments:
Post a Comment