ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
https://cherukurammohan.blogspot.com/2018/04/blog-post_22.html
ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
విశధముగా ఈ క్రింది లంకెలో భక్తీ ధ్యాసలతో చదివి భావి దేశ పురోగతికి బాట వేసేది.
ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన
పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదురన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html
కల్లబొల్లి
పలుకు కడుతీయనై తోచు
ఉన్నమాటకేల
ఉలుకు నీకు
మసిని
పూసి చేయు మారేడుకాయలు
వైద్యగుణములెట్లు
బడయ గలవు
ఉన్నమాటకేల ఉలుకు నీకు (మన ప్రాచీన శాస్త్రజ్ఞత)
ఆపి స్వర్ణమయీ లంకా నమె లక్ష్మణ రోచతే l
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ॥
ఇది వాల్మీకి రామాయణములో లేని శ్లోకము కానీ ఈ
శ్లోకము యొక్క సాంద్రత మాత్రము వాక్కునకతీతము. శ్రీరామ చంద్రునితో లక్ష్మణుడు
లంకాపురీ ప్రవేశము చేస్తూ చెప్పే మాటకు శ్రీరాముని సమాధానమిది. 'మాతృభూమి
స్వర్గమునకన్నా గొప్పది'. మన పూర్వులు ఆ మాటను తు,చ,
తప్పక పాటించినారు. పేరుకు ఇసుమంత కూడా ప్రాకులాడలేదు.
వారి ఆవిష్కరణలు తెలుసుకొంటే అవాక్కయి పోతాము. 50 సంవత్సరముల క్రితము ఎవడయినా
నాలాంటివాడు వాళ్ళ గొప్పదనము చెబితే మనవాళ్ళే వెక్కిరించేవారు. నేడు పరిస్థితి
మారినది. రుజుమార్గమున నడిచే ఆలోచనలు కలిగిన వారు కష్టపడి గతమును త్రవ్వి
తెలుసుకొంటున్నారు. మిగతా వారి కొరకే నేను వ్రాసే ఈ రాతలు. వాస్తవాన్ని గ్రహించి
యువత దేశాభ్యున్నతికి భాషాభ్యున్నతికి పాటుపడగలిగితే మన ప్రగతి జగతికే తలమానికమౌతుంది.
ఆనోభద్రాః క్రతవో యంతు విశ్వతో వి దభ్దాసో అపరితాస
ఉద్బితఃI
దేవానో యథా
సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దేవేదివేII
ఋగ్వేదము 25-14.
సద్భావనా సుమసౌరభములు దశాదిశలనుండి మనల నలరించుగాక.
ఈ ఉపోద్ఘాతమంతా మీరు ఈ దిగువ కనబరచిన లంకెలో మన
పూర్వుల ఆవిష్కరణలు చదివి చైతన్యవంతులగుదు రన్నది నా ఆశ.
https://cherukurammohan.blogspot.in/2018/04/blog-post_22.html
ఎంచి జూచి నిజము నేర్పడ జెప్పెద
ఉన్న మాటకేల ఉలుకు నీకు
నాటి ఘనుల దారి నడువుము యువకుడా
దేశ హితము చేతి దీవిటీగ
ఆర్యావర్తము, అజనాభము అన్న
పేర్లను కలిగి అంకెలకు అందని కాలములోనే సృష్టికి ఆది యగు ఈ భారతావని మహనీయులకు
ఆటపట్టు. నిరంతర నియమనిష్టాగరిష్ఠులగు మహర్షులకు ఆలవాలము. శరదిందు చంద్రికా ధవళ
కాంతులతో కలకాలము మెరిసే శాస్త్రజ్ఞ తారకల
వినీలాకాశము ఈ దేశము.
కానీ
మన పూర్వుల గొప్పదనము తెలుసుకొనే సామర్థ్యమును మనలో మిగిలించలేదు మనలనేలిన
ఆంగ్లేయులు. మేలుకొంటే, అంతవరకూ మనమున్న స్థితిని నిద్ర అంటారు, అట్లు కాకుంటే మరణము అంటారు. మరణము
కన్నా మేలుకొనుట మేలుకాదా! కావున మేలుకొందాము, ఖర్చయినా పరవాలేదు మేలు కొందాము.
ఈ
ఉపోద్ఘాతమును ఇక్కడ నిలిపి నాటి మన ద్రష్టల, ఋషుల, శాస్త్రజ్ఞుల,
ఇతిహాసకారుల ఆవిష్కరణల గూర్చి తెలుసుకొందాము. తాళ పత్రములలోని మన
యొక్క విజ్ఞానమును దోచుకొని తమవిగా తమ పేరును ఆయా ఆవిష్కరణలకు తగిలించుకొనిన
పయోముఖవిషకుంభములను ప్రభంజనములై పగులకొట్టుట నేటి యువత కర్తవ్యము.
ఇక
ఈ వాస్తవాలను గమనించండి.
గర్భవతులు,
భక్తిగాథలు వీరగాథలు వినవలెనని, మనసును ప్రశాంతముగా వుంచుకోనవలెనని, భీతావహ, విషాద సంఘటనలకు దూరముగా
ఉండవలెనని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కృతయుగములో ప్రహల్లాద చరిత్ర, ద్వాపరములో
అభిమన్యు వృత్తాంతము ఇందుకు ప్రబలమైన ఉదాహరణలు. అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం
శ్రీరాముని లేక శ్రీకృష్ణుని
చిత్రపటాన్ని చూలాలు తన మంచమునకు దగ్గరగా గోడకు తగిలించియుంచుకొనవలెనన్నది పెద్దల మాట. మరి ఈ గొప్పదనమును ఫ్రాయిడ్ కు అంటగట్టుట
న్యాయమా! మన పెద్దలు మనకు మంచిని ఉపదేశము చేసినారేకానీ మేమే లోకానికి చాటినదని చంకలు
గుద్దుకోలేదు. మన ఆవిష్కరణలకు తమ పేర్లను ఎంత చక్కగా అతికించుకొన్నారో గమనించండి.
పాశ్చాత్యులు
‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ని ప్రతిపాదించి ఒక మహాగ్నిగోళం బ్రద్ధలయి సృష్టి ఏర్పడిందని
తేల్చినారు కదా! A
Belgian priest named Georges Lemaître first suggested the big bang
theory in the 1920s when he theorized that the universe began from a single
primordial atom.
మరి
ఈ భారత భూమిలోని అనామకుడు కూడా "బ్రహ్మాండం బద్దలయ్యిందనే"
అంటున్నాడుకదా! మరి ఈ వేదచోదిత వాస్తవాన్ని సామాన్యుని నాలుకపై నాన జేసియు పేరుకు
ప్రాకులాడని మన ద్రష్టలు ఎంతటి గొప్పవారు, ఒకపరి ఆలోచించండి. భూమి
మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్టులు
చెబుతున్నారు కదా!
పాశ్చాత్యుల
ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన
ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,123 సంll (2021 వరకు) అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు.
“మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్
జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల
ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5119 (2022 నకు) సంవత్సరములైనది. ఇంత
నిర్డుష్ఠముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”. మరి మనశాస్త్రములు నిరాధారమయినవా!
సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి
పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు అయిన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు
ఆటవికులా! అనాగారికులా!
బిగ్
బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల
ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది మళ్ళీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా
జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముకుళిత సూత్రము కదా!
మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పాంతమునందు సకల
ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పారంభములో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని
భగవానుడు చెప్పినట్లు వున్నది కదా! అసలు మనవారి సిద్ధాంతమునకు మూలము భగవంతుని నిశ్వాసమగు
వేదము కాదా!
'ప్రతీ
చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుం'దనేది (For every actio there is equal and opposite reaction)న్యూటన్ చెప్పిన సూత్రముగా మనము పాఠ్యాంశములలో
చదువుతూనే ఉన్నాము కదా!
మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే
కర్మసిద్ధాంతము చెప్పేది అదికాదా! ఒకచేతితో చేస్తే వేరొక చేతితో అనుభవించవలసిందే
అన్న నానుడి ఏ చదువురాని వ్యక్తిని అడిగినా చెబుతాడు. మరి అంతమాత్రానికి న్యూటన్ ఎందుకు? అసలు ఎవరు ముందు
చెప్పినట్లు?
ఇక
తొలివిమాన నిర్మాణము చేసిన మేధావులు రైట్
సోదరులు అని కదా
మనచేవులలో
ఆంగ్లేయ విద్యావేత్తలు బాకాలూదినారు.
రైట్ సోదరుల కంటే ముందు శివకర్ బాపూ తల్పాడే
అనే పండితుడు భరద్వాజుని ‘యంత్ర సర్వస్వము’ అన్న గ్రంధములోని ‘విమాన శాస్త్రము’ ఆధారంగా
తయారుచేసిన ‘మరుత్సఖి’ గాలిలో ఎగిరింది
కదా! ఆయనను మభ్యపెట్టి ఆ విమాన నిర్మాణ సూత్రములను గ్రహించిన ఆంగ్లేయులు రైటు
సోదరులకమ్మి సోమ్ముచేసుకొని తల్పాడే గారిని పిచ్చివానిగా చేసి, ప్రప్రథమ విమాన నిర్మాతలుగా
వారికి పట్టము కట్టినారు. ఆ విమాన నిర్మాణమునకు మన తెలుగువాడయిన వేదమూర్తులు
సుబ్బరాయ శాస్త్రిగారి సహకారము తల్పాడే గారికి ఉండినదని ఎంతమందికి తెలుసు.
మొక్కలకు
ప్రాణము వున్నదని నిరూపించినది మన దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా! ఆ
ఆవిష్కరణకు ఆధారము అధర్వణవేదము కాదా! మన గ్రంధాలలో వృక్షముల ప్రస్తావనలు
లెక్కలేనన్ని ఉన్నాయే! మన ఋషులు యాగాది క్రతువులకు దర్భ మొక్కలను భాధ పెడుతున్నందుకు క్షమించమని ప్రార్థించే
దర్బలను కోసేవారని, ఆవిధములగు మంత్రములు వేదములలో వున్నాయని పెద్దల ద్వారా విన్నాను.
మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా!
వృక్షాదిః ప్రాణ సంబంధి 16.57
ఛాందోగ్యోపనిషత్తు
అస్య సౌమ్య
మహతో వృక్షస్య యహా మూలే అభ్యాహన్యాత్ జీవన్ స్రవేత్, యోమధ్యేభ్యాహన్యాత్
జీవన్ స్రవేత్
యహ అగ్రే
అభ్యహన్యాత్ జీవన్ స్రవేత్ సహా ఏతేన జీవేన ఆత్మనా అనుప్రభూతః తెతీయమానః మోదమానః తిష్ఠతి.
వృక్షము యొక్క
మొదలుకు దగ్గగ్గరగా ఒక బలమైన గాటు పెడితే ఆ గాటు నుండి ఒక రసమేదో ఊరుతుంది. దానిని
సంస్కృతములో నిర్యాసం అంటారు. తెలుగులో నాకు తెలిసి 'రసి' అని పిలుస్తారు. చెట్టుకు మధ్యలో గాటు పెట్టినా ఆ 'రసి' వస్తుంది. పైన గాటు పెట్టినా వస్తుంది. మనకు కూడా అంతే కదా ఎక్కడ
గాటు పెట్టినా ఒక ఎర్రటి ద్రవము ముఖ్యముగా వస్తుంది. దానిని మనము 'రక్తము' అంటాము. అంచనా వేయలేని కాలముననే ఇటువంటి వాస్తవములు చెప్పిన మనపూర్వులు గొప్పవారు కాదా!
పెద్దపెద్ద
వృక్షాలగా రూపు దిద్దుకొనే మొక్కలను రూపలక్షణములు మారకుండా కుండీలలో
చిన్నమొక్కలుగా
పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్త్రమని అనుకోనుచున్నాము కదా!
మరి
భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను
వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం
చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్ని
తెలిపినాడే! దానిని గూర్చి ఏనాడయినా విన్నామా చదివినామా!
తులసి
మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు
ఇప్పుడు ఒప్పుకుంటూ వుంటే , మరి యుగాల
కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజించుచున్నామని మనలోనే ఎందఱో మూర్ఖులు
ఎగతాళి చేసేవారే ఎందువల్ల?
సముద్రగర్భంలో
అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటున్నాము కదా! మరి
మన వేద పురాణాలలోనే ఈ
"బడభాగ్ని"ప్రస్తాపన ఏవిధముగా వచ్చినది?
భారతీయ
సంతతికి చెందిన గోవు మానవుని ఆరోగ్య ప్రదాత అని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు
నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ అనంత యుగకాలము నుండి మనకు
ఎవిధముగా సంక్రమించినది చెప్పవచ్చు?
లోహవిజ్ఞానంలో
ఆధునిక Scientists ఎంతో పురోగతి సాధించినట్లు చెబుతున్నారుకడా! మరి ఢిల్లీలో వున్న
ఉక్కు స్తంభము (విష్ణు ధ్వజము) ఇప్పటికీ త్రుప్పు పట్టకుండా నిలిచి వున్నది, అది
కాక కొల్లూరులో జాలరులచేత నిర్మింపబడిన త్రుప్పు పట్టని స్తంభము ఇంకొకటి నేటికీ వున్నది. నేను కుటుంబముతో కూడా వెళ్ళినపుడు చూచినాను. ఇంతటి
విజ్ఞానము తమవారికి ఆ కాలములో లేదని నేటి Scientists కూడా ఆ రహస్యము తెలియలేదని తెలియజేయుచున్నారా! మరి జాలరులు బ్రాహ్మణులు కాదుకదా! మరి వారికి ఇంత విజ్ఞానము ఎట్లు అబ్బినట్లు?
యశదమును
(zinc) ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ దేశములలో ఎవరికీ
తెలియని కాలములోనే మనకు తెలుసు. యశదమును ఖనిజము నుండి వేరు పరచు విధానము మన వారికి
మాత్రమే 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము ఒకసారి
గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో
ద్రవీభవించుతుంది. అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది.
అంటే ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ పరివర్తన
జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి పట్టి
లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో,
సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని శీతలీకరణ విధానముతో దానిని యశదముగా మార్చుతారు. మరి మనవారు అంతటి
ఘనులని ఎవరయినా Scientists తెలిపినారా!
నిర్మాణ
రంగంలో ఆధునిక సాంకేతిక నిపుణులు (Engineers) చాలా ముందున్నట్లు చెప్పుకుంటారు కదా!
అయితే
వేలకు వెల వేల సంవత్సరాల నాటి ఆలయాలు
కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే, గత 500 సంII లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
మన
పూర్వులగు శాస్త్రజ్ఞులు గొప్పవారా కాదా!
గోల్కొండకోటలోని
శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై
చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ..... ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో
నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో
వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి
ప్రపంచం ఇచ్చే సమాధానము ఏమిటి?
అణువు
పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!
మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల
గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని వ్రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు
తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు??
రామాయణములో, లంకలో విద్యుత్ ఘటములు (Cells) వాడి విద్యుదుత్పాదనతో కోట తలుపులు యాంత్రికముగా మూసి తెరిచే విధానము, విద్యుద్దీపముల వాడకము ఉండినది. అనార్ద్రఘటము (Dry Cell) ఆవిష్కరించిన మహనీయుడు అగస్త్య మహర్షి.
మెండలీఫ్
ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మన
Scientists కు తెలియదని కదా మన శాస్త్రజ్నులపై ఒక అపప్రథ. మరి రసవిద్య నాగార్జనుడు ఏవిధముగా
నేర్చుకొని లోకానికి చాటగలిగినాడు.
సూర్యుడు
ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల
విజ్ఞానం కదా!
మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ
మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పినారనుకుందామా?
భూమినుండి
విడివడిన శకలమే అంగారకుడు అని నేటి Scientists చేబుతూవున్నారే మరి అంగారకుని ‘భూమి
పుత్ర’ అనేకదా వేదాలు చెబుతూ వున్నాయి.
ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం
గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు
పూర్వమే చెప్పిన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయినట్లు?ఆయన తయారు చేసిన
"తురీయ బ్రహ్మ"అనే దూర్భిణి (Telescope) సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించినాడే, (ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం) మరి దాని మాటేమిటి?
ఈ
విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చిచెప్పిన
విషయమును ఎంతమందిమి చదివినాము, ఎందరికి తెలుసు?
ఖగోళము, జ్యోతిషముల యందు ఎన్నో ఆవిష్కరణలు చేసిన మన పూర్వులు అసామాన్యులు. గణితమునకు వారు అందించిన ఆవిష్కరణలు అపారము. త్రికోణమితి (Trigonometry) కలనము (Calculus), బీజగణితము(Alzebra), రేఖాగణితము (Geometry) ఈవిధముగా ఎన్నో గణిత శాఖలలో మంనవారు పేరుకు ప్రాకులాడక చేసిన ఆవిష్కరణలకు ఆంగ్లేయులు తమ పేరును ముందు ఉంచుకొన్నారు. మన ఇస్రో నాసా వారు కూడా, తమసందేహములను, వేదపరమైన సమాదానములతో, నేటికి కూడా పూరీ శంకరాచార్యులగు నిశ్చలానంద సరస్వతి స్వాములవారి నివృత్తి చేసుకొంటూ ఉంటారు.
ఇయాన్
స్టీఫేన్సన్ అన్న psychiatrist
పునర్జన్మ ఉన్నది అని ప్రయోగ పూర్వకముగా నిరూపించినాడు. ఒక
నడుము నొప్పిచేత బాధ పడుచున్న వ్యక్తిని trans లో ఉంచి వివరాలు తెలుసుకొంటే గత
జన్మలో తన ఊరిని ఆనుకొని ఉన్న అడవికి వెళితే దుండగులు బలంగా కొడితే నడుమోనొప్పి
కలిగినట్లు తెలిపినాడు. యథా స్థితి చేరిన పిదప ఆ నొప్పి
మాయమయ్యింది. అంటే అంతకాలమూ అనుభవించినది ఆత్మగతమగు నొప్పి అని అవగతమైనది. ఇటువంటి
ఎన్నో ఉదాహరణలు 1960 ప్రాంతములో మనదేశములో కూడా తెలియవచ్చినాయి. పునర్జన్మ లేదు
అని వాదించే అనంత మేధావులంతా తమ మతమును కాపాడుటకు అబద్ధములు చెబుతున్నారు అని కుండ
బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరి 'వాసాంసి జీర్ణాని యథా నిహాయ' అని చెప్పిన భగవద్గీతకంటే ఈయన ముందువాడు కాదుగదా!
యాజ్ఞవల్క్య
స్మృతి, మను స్మృతి, పరాశర స్మృతులను పెట్టుకొని న్యాయ శాస్త్రము కొరకు
వెంపర్లాడ వలసిన అవసరము మనకేమి పట్టినది. ఏతా వాతా కాలానుగుణమగు మార్పులు
చేసుకోవలసి రావచ్చు అంతేకదా! మరి
ప్రస్తుత భారతదేశం న్యాయవ్యవస్ద, విదేశాలను అనుసరించింది అని వాదిస్తుంటారే! అది
తప్పు కాదా!
శుశ్రుతుడు
మొదటి శస్త్ర చికిత్సకుడు. దివోదాసు,చరకుడు మొదలగువారు ఈ
భారత ఖండమునకు ఆదివైద్యులు. అప్పటికి ఐరోపీయులే కన్ను తెరువలేదు, ఇక వైద్యమెక్కడిది.
ఇలా
చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! మన పూర్వుల ఆవిష్కరణలను గుర్తించక పోగా అంతా తమ
తెలివి తేటలే అన్న వారి మాటలకు బసవన్నల మాదిరి తలలూపుచున్నామే, మరి ఇకనైనా కనులు
తెరువనవసరము లేదా! మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది.
జలవనరులనుపయోగించుట
, flush Toilets అన్నపేరుతో నెడు మనము ఉపయోగించే ప్రసాధనలు (Toilets),ఆ మలినజలము పోవుటకు భూగర్భ జలమార్గములు సింధూనాగరికతలో బయల్వెడలినవని జిజ్ఞాసవున్న ప్రతి చదువరికీ తెలుసు. అంటే నేటి
ఈ Toilet విధానము మన పూర్వులకు క్రొత్త కాదు అన్న విషయము తెలియుట లేదా!
గ్రీకులు
తోళ్ళు కట్టుకొనే కాలానికే మనము నూలు వస్త్రములు కట్టేవాళ్ళము. ఎవరి
నాగరికత ముందు అన్నది ఒకపరి ఆలోచించండి.
నేడు
చీడ పురుగులచే వక్రీకరింపబడిన మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను,
గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో దయవుంచి
వుండిపోవద్దు.
వివేకానందుడు
పదే పదే మనకు ప్రభోదించిన కఠోపనిషద్వాక్యము
“ఉత్తిష్ఠ జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధార నిశితాదురాత్యయ” – (Arise, Awake and Stop not, until
the goal is reached) మరువవద్దు.
భారతమాత
బిడ్డలుగా పుట్టినందుకు గర్వించుదాము. ఇప్పటికీ మనము ఎందులోనూ తక్కువ కాదు.
ప్రయత్నిస్తే మనము మాధ్యందిన మార్తాండులము కాగలము.
స్వస్తి.
No comments:
Post a Comment