Saturday, 19 August 2023

సంస్కృతవిద్య - ఆంగ్లవిద్య

సంస్కృతవిద్య - ఆంగ్లవిద్య

https://cherukurammohan.blogspot.com/2023/08/blog-post.html

(ఆంగ్లేయుల కాలములో వారు మన విద్యావిధాన్యము నాశనము చేయుటకు మునుపు  ఉన్న మన పరిస్థితి)

 సంస్కృత విద్యకు దూరమయి చెప్పలేనంత విజ్ఞానమును దూరము చేసుకొన్నాము. ఆంగ్లమును అంది పుచ్చుకొనుటచే వారి సాంప్రదాయములకు దగ్గరయి మన సంస్కృతికి దూరమయినాము. ఒక విషయమును శ్రద్ధగా గమనించండి. సంస్కృతమునకు మనము ఎంత దూరమయినా, తెలుగులో మనము దాదాపు 40% సంస్కృత పదములనే వాడుచున్నాము. సంస్కృతము దైవ భాష. ఆంగ్లములోని that, go, it, father, mother, brother, daughter, orange(నారంగ), punch(పంచ అనగా పిడికిలి), man(మను) ఈవిధముగా ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయినా మనకు సంస్కృతము, ఆంధ్రము వద్దు. ఆంగ్లమే ముద్దు. పోనీ అదయినా సరిగా వచ్చునా అంటే సందేహమే!

1984 ఏప్రిల్ 3 న collectrate చెంగల్పట్ Chairman Board of Revenue Madras Presidency కి వ్రాసిన లేఖలో,  Madras Presidency లో  551 పాఠశాలలు కలవు. విద్యార్థుల సంఖ్య వర్ణముల వారీగా ఈ విధముగా ఉన్నది. 1. బ్రాహ్మణులు – 688, శూద్ర – 4800. ‘సంస్కృతము సకలభాషలకు తల్లి’ అని ఏ శ్రీనాథుడో కృష్ణదేవరాయలో  చెబితే మన తలకెక్కదు, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే పాశ్చాత్య్లలో ఒకడగు SirWilliam Jones – High Court Judge Calcutta చెప్పినాడు ‘Sanskrit is the mother of all Languages’ అని. ఇక్కడ ఒక మాట చెప్పవలసి వస్తుంది. జోన్స్ గారి సేవాసముదాయములో ఒకరు ఒకరోజు కాళీదాసు విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలము’ అన్న నాటకములోని కొన్ని ముఖ్య ఘట్టములు వినిపించినాడు. అత్యంత ప్రభావితుడైన జోన్స్ పండితుడు పట్టుబట్టి సంస్కృతము నేర్చుకొని ‘అభిజ్ఞాన శాకుంతలము’ మనసు పెట్టి చదివినాడు. అందు 4వ ఆశ్వాసము చదివిన రోజు రాత్రంతా మేలుకోనియే ఉండిపోయినాడట. ఆయన అంతేవాసి ఆ అర్ధరాత్రమున కారణమడిగితే, ఈ కావ్యములోని రచనా విధానము ఉపమాలంకార ప్రయోగములు మానవ మాత్రులకు సాధ్యమా!’ అని ఆశ్చర్యమును వ్యక్తము చేసినాడట.

బాణ భట్టు గారి ‘హర్షచరిత్రము’ చదివిన పండితాగ్రేసరులమాట ‘బాణోచ్చిష్టం జగత్సర్వం’ అని.  ఇవి సంస్కృత కావ్యాలు. మనకు సంస్కృతము రాదు. అంతటి మహా కావ్యములు చదువలేక పోయినందుకు ఇసుమంత కూడా శిగ్గుపడము.

200 సంవత్సరములకు పూర్వము చదివిన వారి సంఖ్య Madras Presidency లో 97% ఉండేది. పరిపాలన పరజాతీయులచేత పడగానే వారిభాషను రాజభాష చేసి చదువుకొన్న మన పూర్వుల అక్షరాస్యతను తుంగల ద్రొక్కి మనవారికి ఆంగ్లము తెలియదు కావున మన పూర్వుల అక్షరాస్యతను ‘0’ చేసినారు. తిరిగీ 97% తెచ్చుకొనుట’కు ఎన్ని వందల వత్సరములు పడుతుందో గమనించండి. అసలు వారు సంస్కృతము నుండి సంగ్రహించిన పడజాలమును అతి క్లుప్తముగా మీముందు ఉంచుచున్నాను చూడండి.

Mother-Matter-Matru From Sanskrit

Father- paster - pitar- pitru Sanskrit

Brother - Biradar - Bhraatar Sanskrit

Daughter - Duhitar Sanskrit

Dhoti Fro Dhouti Sanskrit

Sanskrit बन्धन bandhana, "a bond" Eng

from Hindi baniyaa ultimately from Sanskrit वणिज  Banyan (Eng)which means "a merchant"

Brinjal from Portuguese bringella or beringela, from Persian بادنجان badingān, probably from Sanskrit vātiṅgaṇa.

Cheetah which is from Sanskrit चित्रस chitra-s "uniquely marked".

Copra from sanskrit karpara meaning skull, refers to hard and white substanace with in coconut.

Crimson which is ultimately from Sanskrit कृमिज krmi-ja literally: "red dye produced by a worm".

Datura ultimately from Sanskrit धत्तूर, a kind of flowering plant.

Ginger from Sanskrit श्रङ्गवेर, from śrnga "horn" + vera- "body",

ఈ విధముగా ఆంగ్లములోనూ అన్య భాషలలోనూ సంస్కృతమునుండి తీసుకొనబడిన పదములు పుంఖానుపుంఖములు.

ఇక కాల్డ్ వెల్ మహాశయులు సంస్కృతమునకు మరియు దక్షిణాది ఆషలకు చేసిన అన్యాయములగూర్చి పరిశీలింతము. ద్రవిడము అను శబ్దము సంస్కృత జన్యము. కాల్డ్వెల్  దయవలన ద్రావిడ భాషలయిన దక్షిణ భారత, కాదు కాదు భారతదేశపు దక్షిణ ప్రాంతపు భాషలను ఒక చట్రములో బిగించి వానిపై ప్రచ్ఛన్నముగా తమిళమునకు అగ్ర తాంబూలము నోసగినారు. కాల్డ్వెల్ ను అనుసరించిన మన తెలుగు విద్వాంసులు క్రొత్త బాణీని పట్టుకొని కృత్రిమముగా ఏర్పడిన ద్రావిడముమునకు తెలుగు కన్నడ మళయాళములను సామంత భాషలుగా చేసినారు. మళయాళములో అక్షర సంపద ఎక్కువ. పైగా ఆ భాషలోనున్న  సంస్కృత పదజాలము, తమిళ పడజాలమునకన్నా ఎక్కువ. తమిళభాషకు తదనంతర భాషయైనందువల్ల కొన్ని పోకడలను గ్రహించియున్దవచ్చును. అయినాను వారి సంస్కృతి తమిళ సంస్కృతికి భిన్నముగా ఉంటుంది. ఇక వారి తీరు తెన్నూ తెలుగు కన్నడిగులతో కలువాడు. కానీ తెలుగు కన్నడములలో కూడా సంస్కృత పదములు విశేషముగా, అశేశాముగా కనిపించుతాయి. నాలుగు భాషలలోనూ దేని వ్యాకరణము దానిదే! ఈ వ్యాకరనములన్నింటికీ పాణిని 

అసలు తెలుగు యొక్క ప్రాచీనతను గూర్చి నేను గతములో సుదీర్ఘ వ్యాసమును వ్రాసియుండినాను. అసలు మహాశయుల అష్టాధ్యాయియే మూలకమని చెప్పనగును,  తమిళులు చెప్పుకొనే సంఘ సాహిత్యములోనే ఎన్నో తెలుగు పదములు ఉన్నాయి. ఇరుగు పొరుగు ప్రాంతీయభాషలయిన తరువాత కాలక్రమములో పదాలు, ఇటుఅటు జరిగే అవకాశము ఉంటుంది. 

తెలుగు విషయానికొస్తే అసలు తెలుగునకు మాత్రమే ఆంధ్రము తెలుగు అన్న రెండు పేర్లున్నాయి. శుద్ధ తెలుగులో అసలు మాట్లాడితే ఆక్షరము ముక్క గూడా ఎవరికీ అర్థము కాదు. ఈ అచ్చ తెనుగు పద్యమును ఒకపరి పరికించండి. 

ముక్కంటి యరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు మిత్తిగొంగ

గట్టువిల్తుఁడు గఱకంఠుఁ మిక్కిలి, కంటిదేవర బేసికంటివేల్పు

వలిమలల్లుఁడు మిన్నువాలతాలుపు కొండ, వీటిజంగము గుజ్జువేల్పుతండ్రి

వలరాజుసూడు జక్కులఱేనిచెలికాఁడు, బూచులయెకిమీఁడు పునుకతాల్పు

 

తే. విసపుమేఁతరి జన్నంపు వేఁటకాఁడు

బుడుతనెలతాల్పు వెలియాల పోతురాజు

తోలుదాలుపు ముమ్మొనవాలుదాల్పు

నాఁగ భవదాఖ్య లొప్పు (నంధకవిపక్ష)   (ఆంధ్రనామ సంగ్రహము)

ముక్కంటి=మూడు నేత్రములుగలవాడు, అరపదిమోములవేలుపు= ఐదుముఖములు గల దేవుడు, మినుసిగదయ్యంబు=ఆకాశము జుట్టుగా గలదేవుడు, మిత్తిగొంగ=మృత్యువునకు శత్రువు, (మిత్తి-ప్రకృతి,మృత్యువు), గట్టువిల్తుడు= మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు, కఱకంఠుఁడు=నల్లని కంఠము కలవాడు, మిక్కిలి కంటిదేవర=హెచ్చునేత్రములు గల దేవుడు, బేసికంటివేల్పు=మూడునేత్రములు గలదేవుడు, వలిమలల్లుడు=మంచుకొందయొక్క (హిమవంతుని) అల్లుడు, మిన్నువాకతాలుపు=(మిన్ను=ఆకాశము, వాక=నది) ఆకాశగంగను శిరసున ధరించువాడు, కొండవీటిజంగము=కైలాసపర్వతము నివాసముగాగల భిక్షుకుడు, గుజ్జువేల్పుతండ్రి=పొట్టిదేవర యగు విఘ్నేశ్వరుని జనకుడు, వలరాజు సూడు= మన్మధునికి శత్రువు, జక్కులఱేని చెలికాడు=(జక్కులు=యక్షులు, వారికి ఱేడు కుభేరుడు, అతనికి స్నేహితుడు) కుబేరునికి మిత్రుడు, బూచులయెకిమీడు=పిశాచములకు అధిపతి, పునుకతాల్పు=కపాలధారి, విసపుమేతరి=విషము తిన్నవాడు, జన్నంపువేటకాడు=దక్షునియజ్ఞము ధ్వంసము చేసినవాడు, బుడుతనెలతాల్పు= బాలచంద్రుని శిరమున దాల్చినవాడు, వెలియాలిపోతురౌతు=తెల్లనియాబోతు నెక్కు యోధుడు, తోలుదాలుపు= పులితోలుచర్మమును) ధరించువాడు, ముమ్మొనవాలుదాల్పు=మూడుమొనలుగల ఆయుధమును (త్రిశూలమును) ధరించినవాడు, నాగన్ =అని ఈ ఇరువదిరెండును, అంధకపక్ష=అంధకాసురునికి శత్రుడా, భవత్ ఆఖ్యలు ఒప్పును= నీ పేళ్ళనదగును) (ఈ పద్యములో 22 ను ఈశ్వరుని పేర్లు). పదములు అర్థము కానివారి సౌలభ్యము కొరకు ప్రతిపదార్తములను మీ మున్డున్చినాను.

 శ్రీనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు, నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు, బ్ర.శ్రీ వే, శ్జరీ చిలుకూరు బ్టానారాయన రావు గారు,వల్లభుల పురుషోత్తం గారు ఈ విధముగా ఎందరో సంస్క్రుతమును ఆంధ్రమునకు మాతృకగా పేర్కొన్నారు. 

అసలు ఆంధ్రులెవరు అన్న అంశమును గూర్చి ఎంతో విస్తారముగా గతములో వ్రాసియుండినాను. కొందరు చెప్పెవిధముగా వారు శపింపబడిన విశ్వామిత్ర సంతానము మాత్రము  కాదు. ఎంతో సంస్కృతి కలిగిన వీరి ఆంధ్ర  భాష సంస్కృత జన్యము.

ఈ విధముగా

ఆంధ్రము గోలుపోయి మన అమ్మకు జేసితిమెగ్గు గాంచగా

సాంద్రత గల్గినట్టి ఘన సంస్కృత సంస్కృతి వీడి నేడు ఈ 

రంద్ర విశేషమౌ కృతక రంజన హీన విదేశాభాషయౌ

మంద్రత గల్గు నాంగ్లమును మచ్చిక జేసిరి పశ్చిమాధముల్

 స్వస్తి. 

No comments:

Post a Comment