Wednesday, 7 June 2023

దక్షిణామూర్తి స్తోత్రము (జగద్గురు ఆది శంకరాచార్య ప్రణీతము)

 

దక్షిణామూర్తి స్తోత్రము

                   https://cherukurammohan.blogspot.com/2023/06/blog-post.html

జగద్గురువులు ఆది శంకరులవారు సాక్షాత్తు శంకర స్వరూపులు. వారు 

కేవలము ధర్మ రక్షణము లోక హితమునకు అవతరించిన దక్షిణా మూర్తియే నేమో! 

ఆయన భూమిపైనున్న 32 సంవత్సరముల కాలములో ప్రస్తాన త్రయము అనగా 

బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తులు, భగవద్గీతలకు మనోహరము, సువిపులము 

నగు భాష్యమును వ్రాసినారు. సంసారబంధమును పోగొట్టుకొనుట, 

ఆనందరూపమగు మోక్షమును పొందుట ఆస్తికులందరికిని అవసరమే గనుక 

మందాధికారులకు గూడా సకల వేదాంత సిద్ధాంతసారం తెలియుటకు కొన్ని 

వేదాంతస్తోత్రములను కూడా రచించినారు. అందులో అతి ముఖ్యమైనది దక్షిణామూర్తి 

స్తోత్రము. దీనిని అద్వైతామృత కళశ స్వరూపముగా భావించ వచ్చును. పామరుడనైన 

నేను పరమ పావనులైన కామకోటి పీఠము వారు అనుగ్రహించి అందించిన ఈ స్తోత్ర 

సారము నా ప్రయత్నమునకు ఆలంబనము. మీకు  తప్పులేవి కనిపించినా అవి నావల్ల 

కలిగినవని తెలియ ప్రార్థన.

దాసుని దోసము దండముతో సరి.

1.       మౌనవ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం

    వర్షిష్ఠాన్తే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్ఠైః l

    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం

    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ll 

బ్రహ్మనిష్ఠా గరష్ఠులగు గురువుకన్నా వయోధికులు మరియు పరమ శ్రేష్ఠులైన ఋషి 

గణములచే,పరివేబ్రహ్మనిష్ఠా గరష్ఠులగు గురువుకన్నా వయోధికులు మరియు పరమ 

శ్రేష్ఠులైన ఋషి గణముల చేతపరివేష్ఠితుడైచేతి వ్రేళ్ళచే  చిన్ముద్రను కలిగి

అంతర్ముఖుడై తనయందే రమించుచున్న  ఆనంద మూర్తియై వికసిత వదనుడై,

ప్రభవించు గురుశ్రేష్ఠుడగు దక్షిణామూర్తిని  స్తుతించుచున్నాను.

ఆ పరమాత్మకుమనము పెట్టుకొన్నవే కానీ నిజానికి ఏపేరు లేదు. పేరు లేకపోతే 

సంబోధన ఎక్కడనుండి వస్తుంది. అందుకే గురువు గారికి ఆ మౌనము.

శబ్దములు 4 విధములు. అవి పశ్యపరవైఖరి, మధ్యమ. ఆ పరమాత్మను 

కీర్తించుటకివి చాలవు. పైగా శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-లింగ-అనుమానాది 

ప్రమాణములచే ప్రతిష్ఠించలేము. అందుకే మౌనము.

అందుచేతఅవాఙ్మానస గోచరమగు పరమాత్మను మౌనము చేతనే 

ప్రబోధచేయవలయునని జ్ఞానముద్రను చూపించుచు మౌనముగా నుండిరి. ఆ 

మౌనస్థితియే శిష్యులకు పరబ్రహ్మతత్వమును ప్రబోధించుట. ఆ మౌనస్థితియే 

శిష్యులందరు గుర్వనుగ్రహము వలన పరబ్రహ్మతత్వమును స్పష్టముగా తెలిసికొని 

సంశయమును పోగొట్టుకొనుట.

జ్ఞానముద్ర జీవబ్రహ్మలకు ఏకత్వమునుచూపించును. ఈ యర్ధమునే :

శ్లో. చిత్రం పట తరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువాl

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాఃll అను శ్లోకముకూడా 

చెప్పుచున్నది.

2వ శ్లోకమును గూర్చి తరువాత తెలుసుకొందాము.......

22. శ్లో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం|

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా|

యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం |

తస్మై శ్రీగురుమూ ర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

 

ఈ చరాచర ప్రపంచమునంతా ఆత్మ చైతన్యమయిన తనలో లీలా 

మాత్రంగాస్వానుభవంగాస్వాత్మగాఅద్దంలో కనిపించే నగరంవలెతన

కంటే భిన్నంగా ఉందన్న భ్రమకలిగించే విధముగా విశ్వమునే ఉదరమందు కలుగుతూ, 

మనకు దానిని వెలుపల ఉన్నట్లుగా తన మాయచే కనిపింపజేసే  జగద్గురువైన శ్రీ 

దక్షిణామూర్తికి నా నమస్కృతులు అన్నది అతి సామాన్యార్థము.

సామాన్య మానవులమగు మనము, అద్దమునందుప్రతిబింబించగా 

చూడబడుచున్నపట్టణముయొక్క మిథ్యా బింబమువలె మన అంతర్గతమునందు 

ఏప్రకారముగానిద్రాదోషముచేత అనగా స్వప్నావస్థయందుఅనేక రకములగు 

ప్రాపంచవిషయములను కల్పితమైననుబైటయున్నట్లుగా భ్రమపడుచున్నాము.

కానీ సకల ప్రపంచమునకు అధిష్టానము సచ్చిదానందరూపుడగు పరమాత్మయే గనుక 

అట్టి పరమాత్మయందే ఆరోపితమగు ఈ ప్రపంచ మున్నది యని అర్థము. అట్టి 

నిజాంతర్గతమగు విశ్వము భూతభౌతిక రూపమున సకల ప్రపంచముగను; ఆ 

ప్రకారముగాపరమాత్మయందుసత్వరజస్తమోగుణాత్మకమైన ఆవరణఅజ్ఞానముచేత 

కల్పితమైన నప్రపంచమునుబైటఅవిర్బవించిన దానివలె 

(ఉన్నదానివలె)చూచుచున్నవాడైఎవడుగురువులచేత ఉపదేశింపబడిన 

మహావాక్యముల వలన కలిగిన అఖండ బ్రహ్మ సాక్షాత్కారకాలమందురెండవది లేని 

అనగా అద్వితీయమగుఅనగా బ్రహ్మ పాక్షాత్కారముచేఅజ్ఞానము నశించును 

గనుక అద్వితీయమగును. అట్టి అద్వితీయమైన సచ్చిదానందరూపమగుప్రత్యగ్బ్రహ్మ 

స్వరూపమునేసచ్చిదానందాత్మకమగు బ్రహ్మను నేనైతిననిఅపరోక్షముగా 

తెలుసుకొనుచున్నాడో; అటువంటిశ్రీ గురుమూర్తియే బ్రహ్మరూపుడైదేశకాల వస్తు 

పరిచ్ఛేదరహితుడైన జ్ఞానమునుపదేశించుపురుషుడుఅట్టి స్వరూపుడై దక్షిణదిక్కుకు

అభిముకముగానున్నఅనగా దక్షిణదిక్కును చూచుచున్న శరీరముకల 

దక్షిణామూర్తికి  నమస్కారము.

శ్రీ గురుమూర్తయేశ్రీ దక్షిణామూర్తయే అను పదములకు మరి యొక అర్థము-శ్రీఅనగా 

శ్రీమంతుడు అనగా సర్వ శుభములకు సకల సుఖములకు సిరి 

సంపదలకు  ఆలవాలమైన సచ్చిదానందరూపమౌగుర్వీ=అతి గొప్పదైన: 

మూర్తిః=స్వరూపముయస్యసః = శ్రీగురుమూర్తిఃశ్రీ గురుమూర్తియనగా 

సచ్చిదానందస్వరూపుడని యర్థము. శ్రీ దక్షిణామూర్తయే శ్రీ- అనగా 

అనాదియగుఅచింత్యమగుమాయాశక్తియని అర్థముఅట్టి 

మాయాశక్తిచేతదక్షిణ=సృష్టి స్థితి లయముల యందు నిపుణుడు అని యర్థము. శ్రీ 

దక్షిణామూర్తయే అన్నపుడు అకారప్రశ్లేషచేతఅమూర్తయే అని అర్థము వచ్చును. అనగా 

సృష్టిస్థితిలయములకు కారణభూతుడై కూడా అమూర్తి యనగా మూర్తిలేని వాడుఅనగా 

నిర్వికారుడై యున్నాడు అని అర్థము.

శంకరులవారు ‘బ్రహ్మ సత్యం జగన్మిధ్య’ అని చెప్పనే చెప్పినారు. ఆ జ్ఞానమును 

రానురానూ సంపాదించితే మనము భ్రమ నుండి బయట పడగలము. 4,5 

సంవత్సరముల వయసులో ఆడుకొన్న బొమ్మలు ఆటలు 14, 15 సంవత్సరముల 

వయసులో ఆడము. ఈ వయసులో ఆటలు అంటే బ్యాటులు (Bats) వస్తాయి చేతికి మరి 

పాత బొమ్మలతో ఆడవే అంటే అదేదో పిల్లతనము అంటాడు. 24,25 సంవత్సరములు 

వచ్చి పెళ్ళయిన తరువాత ఈ ఆటలు ఉండవు. అంటే పరిణతి పెరిగింది. సహజముగా 

పెరుగుతూ పోయే ఈ పరిణతికి హద్దు ఉంటుంది. అందుకే వయసు ఉన్నపుడే తత్వ 

జిజ్ఞాస ఏర్పడితే సాధనా బలముతో పరమాత్మ పరిచయము చేసుకొనవచ్చును.

మరొకమారు  మరియొక శ్లోకముతో.......

3.      బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః

       మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతమ్‌ l

       మాయావీన విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్ఛయా

       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ll

ఈ అనుభవంలోనున్న ప్రపంచమంతయుసృష్టి కంటె పూర్వమందునిర్వికల్పము అనగా భోక్తభోగ్యముకర్త, కార్యము అనువిషయములకు అతీతమై అనగా  వికల్పరహితమై (ఆకారము లేనిదై) పరమాత్మ స్వరూపముగానేఉండెనుమరి అది ఎట్లు సాధ్యము అంటే విత్తనములోపలఆకులు పుష్పములుకాయలుకొమ్మలుఊడలు మొదలగు ఆకారముతో కూడిన గొప్ప పరిమితిగల వృక్షమంతయు మొక్క రూపములో, పుట్టుటకు ముందు అనగా మనము గమనించుటకు ముందు, స్థూలాకారములేని కారణమగు బీజరూపముగా నుండెనని యర్థము. అటులనే ప్రపంచమంతయు సృష్టికి పూర్వమందు, ఈ  సృష్ఠికే కారణమగు పరబ్రహ్మ రూపముగా నుండెనని యర్థము. తిరిగిసృష్టిసమయమందు, ‘మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం’మాయా అనగా ఈశ్వరుని ఆశ్రయించిన మాయచేతకల్పిత అనగా కల్పింపబడినదేశకాలముల ‘కలనా’ సంబంధము చేతవైచిత్ర్య చిత్రీకృతం అనగా నానారూపమగు విచిత్రస్వరూపముతోఅనేక భేదములచేతను అనేక ఆకారములచేతను పరస్పర భిన్నముగా చేయబడినది. కుమ్మరి తనుగాక మట్టి మొదలగు సాధనములతో ఘటాది కార్యములను చేయుచున్నట్లు మనకు అనుభవసిద్ధమై యున్నది. ఇతర సాధనలులేని పరమేశ్వరుడు విచిత్రమగు ప్రపంచమును ఎటుల సృష్టించును అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నారు. ‘మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవయ స్స్వేఛ్ఛయా’ అనగా లోక ప్రసిద్ధమైన ఐంద్రజాలికునివలెగొప్పయోగివలెతన సంకల్పమాత్రము చేతనేయః=ఏ పరమేశ్వరుడుఇదం=ఈజగత్తునువిజృంభయతి=సృష్టిస్తున్నాడోతస్మై=ఆశ్రీగురుమూర్తయే=గురుమూర్తి అయినశ్రీ దక్షిణామూర్తయే=శ్రీదక్షిణామూర్తికినమః=నమస్కారము.

ఈ శ్లోకమునకు విశ్లేషణ మొదలుపెడితే తుదికి చేరేలోపే జీవితము తుది చేరుతుంది. అందుకు నా పరిపక్వత లేమి కూడా దోహదమైనది. అందుకే ఈ క్లుప్తతను అనుసరించినాను. మహా వాక్యములు నాలుగు ఉన్నవని అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ నాలుగు ఏవి అన్నది కొందరికి తెలిసియుండక పోవచ్చు. ఆ నాలుగు వాక్యాలు ఏవన:

1.  'ప్రజ్ఞానం బ్రహ్మ (प्रज्नानम ब्रह्म)అనగా అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము - ఐతరేయోపనిషత్తు -           ఋగ్వేదము

2.'ఆహం బ్రహ్మాస్మి (अहम ब्रह्मास्मि)అనగా నేనే బ్రహ్మము - బృహదారణ్యకోపనిషత్తు -యజుర్వేదము

3. 'తత్ త్వమసి (तत्त्त्वमसि)అనగా అదే నేను - ఛాందోగ్యోపనిషత్తు - సామవేదము

4. 'అయమాత్మా బ్రహ్మ (अयमात्मा ब्रह्म)ఈ ఆత్మే బ్రహ్మము - మాండూక్యోపనిషత్తు - అధర్వణవేదము

ఇవి చూచుటకు నాలుగు వాక్యములుకానీ ప్రతి మహావాక్యానికి ఒకదానికొకటి లంకె కలిగి చివరకు అన్నీ అహం బ్రహ్మస్మి లో లీనమైపోతాయి. ఆ స్థాయి చేరిన సాధకుడు, తానే పరమాత్మయౌతాడు. తరువాత ఏమున్నది, ‘సర్వం మిధ్య’ యే!

మొదటి వాక్యానికి ‘జీవాత్మయే బ్రహ్మ’ అని అర్థము. రెండవ వాక్యమునకు జ్ఞాన స్వరూపమే పరమాత్మ అని అర్థము. మూడవ వాక్యమునకు ‘నీవే ఆ బ్రహ్మము’ అని అర్థము. నాలుగవ వాక్యమునకు ‘నేనే ఆ బ్రహ్మము’ అని అర్థము.

ఎప్పుడయితే మనలోని బుద్ధి ఎంతగానో వికసించి జ్ఞాన వంతులమయినపుడు ఆ జ్ఞానమే పరబ్రహ్మ అని తెలుసుకొనగాలుగుతాము. అంటే బ్రహ్మముఅన్నది జ్ఞాన స్వరూపము. అప్పుడు అందులో జ్ఞాత అయిన జీవుడు జ్ఞేయమైన జగత్తు ఆ పదార్థము యొక్క రెండు కొసలు. ఈ రెండు కొసలు జ్ఞానములోనే ఉన్నాయి కదా.! ఒక పంచకు చివర  సరిగె అంచులు సమాంతరముగా ఉన్నా అవి పంచేలోని భాగమే! కావున ఈ రెండు కోసలూ పంచెలో లయమయి ఉన్నాయి. అప్పుడు జ్ఞానమనే ఆ పంచె అఖండము. ఆ ఎరుకనే ప్రజ్ఞానము అన్నారు. 

ఇప్పుడు ఆయమాత్మానం బ్రహ్మ మరియు తత్వమసి అన్న రెండు మహావాక్యాలను తీసుకొందాము.

అయమాత్మా లో ఈ అయం అనగా జీవ భావముఆత్మానం అంటే ఆత్మ అంటే ఆత్మా రూపములో మనలోన ఉన్నదానిలోలయమైపోతూ ఉంది.  అంటీ జీవ భావము ఆత్మలో లయమై పోయింది. కావున నశ్వరము లేని ఆత్మయే బ్రహ్మ. ఇక తత్వమసి అన్న మహా వాక్యమును తీసుకొందాము. ఈ వాక్యము 'స య ఏషోణిమా ఐతదాత్మ్య మిదగ్ం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసిఅన్న మంత్రములోని చిన్న ఖండము. పై మంత్రము లోని 'ఐతదాత్మ్య మిదగ్ం సర్వంఅంటే ఈ సమస్త ప్రపంచమూ బ్రహ్మమేనని. జగద్భావమును త్రోసిపుచ్చుచున్నది. ఈ విధముగా జీవజగత్తులు రెండూ అవాస్తవమే  అనియుప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమేయని ఈ మూడు వాక్యములు చెప్పుటతోఈ బ్రహ్మము పరోక్షమా! అపరోక్షమా! అన్న ప్రశ్న ఉదయించుతుంది. పరోక్షము అనుకొంటే అది కేవలము సిద్ధాంతమును ప్రతిపాదిన్చినట్లవుతుంది కానీ అనుభవము లోనికి రాదు. అనుభవమునకు రాకుంటే ఈ సమస్యకు పరిష్కారమేదీ! ఆ పరిష్కారమే నాలుగవ వాక్యమగు 'అహం బ్రహ్మస్మిని చాటుతూ ఉంది. కాబట్టి ఆత్మ అనయము కాదు 'బ్రహ్మమే' ! ఇక్కడ నేను వాదనాపూర్వకమైన వాస్తవమును తెలియజేసినాను కానీ అది అనుభవపూర్వకము కాదు. దానికి నిరంతర సాధన అవసరము. ఆ సాధనకు సోపానము ఈ శ్లోకము.

మరొకమారు  మరొక శ్లోకముతో..........

5. నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం,

జ్ఞానం యస్యతు చక్షురా కరణద్వారా బహిస్పందతే

జనామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమ స్తంజగత్‌

తస్మై శ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయేll

అనేక రంధ్రములతో కూడినకుండయొక్కలోపల,ఉన్నటువంటిపెద్దదీపముయొక్కవెలుతురువలెప్రకాశించుచున్నఏపరమేశ్వరునియొక్క,  నవరంధ్రములతో కూడిన శరీరమందున్న అంతఃకరణయందు ప్రతిబింబించియున్న సాక్షిచైతన్యము,  నేత్రములు శ్రోత్రములు మొదలగు ఇంద్రియములద్వారాబయటికి,  వెళ్ళుచున్నదని నేను  తెలుసుకొనుచున్నాననివేరు ఎటువంటి ఆపేక్షలు లేకుండా విషయములను ప్రకాశింపచేయుచు స్వయముగా ప్రకాశించుచున్నఆ సాక్షిచైతన్యమునేఅనుసరించిసమస్తమయినప్రపంచముప్రకాశించుచున్నది అని ఎరుకపరచుకొనుచున్నానని. దానికి కారణమగు ఏ పరమేశ్వరుని యొక్క స్వరూపభూతమయిన జ్ఞానము ప్రకాశించుచున్నదోశ్రీ గురుమూర్తియైన శ్రీ దక్షి ణామూర్తిస్వామికొరకునమస్కారము.

ఇక్కడ నేను నా స్వంత వ్యాఖ్యానము చేయకుండా పరమేశ్వర స్వరూపుడగు ఆది శంకరుడు ఒకే ఒక శ్లోకములో తన శిష్యుని చింతదీర్చి బ్రహ్మతత్వమును విశదీకరించిన ఉదంతమును మీ ముందుంచుచున్నాను.

 కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం

స్యాదేవమ్ రవి దీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమేl

చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్తియో దర్శనే

కిం తత్రాః మతో భవాన్ పరమకం జ్యొతిః తదస్మిప్రభోll-ఏకశ్లోకి

అన్వయము:

ఆ గురుశిష్య సంవాదము ఈ క్రింది విధముగా సాగినది:

గురువు: కిం జ్యొతిస్తవ? ---------- వస్తు ప్రకాశమైన జ్యోతి ఏది?

శిష్యుడు: భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం -----పగలు సూర్యుడు రాత్రి దీపము

గురువు: స్యాత్ ఏవంరవి దీపదర్శన విధౌ కిం జ్యోతిః? ----------అపుడు సూర్యుణ్ణి

దీపాన్ని గుర్తించే జ్యోతి ఏది?

శిష్యుడు: చక్షుః ----------కన్నులు

గురువు: నిమీలనాది సమయేకిం?----కళ్ళు మూసుకొన్నపుడు చూసే వెలుగేది?

శిష్యుడు: ధీః ----------బుద్ధి

గురువు: ధియః దర్శనే కిం?----------బుద్ధిని చూసేజ్యొతి ఏది?

శిష్యుడు: తత్ర అహః ----------అక్కడ నేను నా ఆత్మను చూస్తున్నాను

గురువు: అతః భవాన్ పరమకం జ్యొతిః ----------కనుక నీవే ఆ పరంజ్యోతివి

శిష్యుడు: ప్రభో తత్ అస్మి ----గురుదేవా ఆ నేనే (అహమే) పరంజ్యోతియని తెలుసుకొన్నాను.

ఇంతకంటే సులభంగా తత్వ బోధ చేసిన మహనీయులు లేరంటే అతిశయోక్తి కాదేమో. సభక్తీకంగా ఆయన పాదాలకు మానసిక నమస్కారము చేసి ప్రస్తుతమునకు మీ వద్ద శెలవు తీసుకొంటాను.

శివోహం

వచ్చే గురువారం మరియొక శ్లోకముతో మీముందు ఉంటాను......

6. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |

మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

కొందరు వేదశాస్త్ర ఇతిహాస పురాణ విరుద్ధమగు పర మతములను ఆశ్రయించి మోక్షమార్గమునకు దూరమై జీవితమును వ్యర్థము చేసికొని నరకముల పాలగుదరని దయతో జీవులను వుద్ధరించు టకై శంకర భగవత్పాదులవారు ఆ మతముల నిరాకరించుచూ స్వమతస్థాపనమునకై ఈ శ్లోకమును ఉదహరించిరి.

ఆత్మతత్వమును తెలియజాలని కొందరుఆత్మ దేహమనియుప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలెచిన్నపిల్లలవలెమూఢులవలెవిషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనైశరీరమే సత్యమనీప్రాణమే సత్యమనీఇంద్రియాలనే సత్యమనీమనస్సే సత్యమనీనిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీశూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువగు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.

అదే భావార్థమునే ఇంకా కాస్త విశ్లేషణతో ఈ దిగున ఉంచుచున్నాను.

ఆత్మా తత్వమును తెలియజాలని కొందరు, కాళ్ళుచేతులుశిరస్సు మొదలగు అవయవములతో కూడిన స్థూలశరీరమునుప్రాణఅపానవ్యానఉదానసమానములను పేరుతో వ్యవహరింపబడుచుశరీరముతోనే ఉంటూముక్కునుండిబైటికి లోపలికి సంచరించుచున్న ప్రాణవాయువునుఆయా స్థానములయందుండి తమ బాధ్యతలు నిర్వహించునేత్రములు మొదలగు ఇంద్రియములనుచంచలము, క్షణికమగు బుద్ధినిఅభావమునుస్త్రీలు బాలురుఅంధులు బుద్ధి మాంద్యులులేక పిశాచగ్రస్తులవలెవివేకజ్ఞానము లేనివారుఒక విధముగా నున్న తత్వమును, అంటే తత్వమును తెలుసుకొనవలసిన రీతిలో తెలుసుకొనక, వేరు విధముగా తెలిసికొనినవారైఅదే గట్టిగా వాస్తవమని నమ్మి ఇతరులకు బోధించుచున్నవారైశరీరమే నేననిఇంద్రియములే నేననిప్రాణమే నేననిఒక అవాస్తావికతను వాస్తవికతగా తెలిసికొనుచున్నారు.

సత్వరస్తమోగుణాత్మకమైన పరులను భ్రమింపచేయు మాయాశక్తి చేతకల్పింపబడిన మహావ్యామోహ వివశులై దేహేంద్రియాదులే ఆత్మయనే గొప్పభ్రమను వారిలో నశింపచేయు శ్రీ గురుమూర్తియైన శ్రీదక్షిణామూర్తిస్వామి కొరకు ఈ నమస్కారము.

ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా|

పాపోపహత బుద్ధీనాం తద్వార్తాపి నరోచ తే||

అని ప్రమాణవచనమున్నది. అనగా పూర్వజన్మలయందుగానిఈ జన్మయందుగానిఅతిభక్తితోభగవదర్పణబుద్ధితో శాస్తోక్తకర్మలను ఆచరించినవారికే ఈశ్వరానుగ్రహము కలుగును. అట్టి ఈశ్వరానుగ్రహము కలవారికే అద్వైతశాస్త్రమందు ఆదరము శ్రద్ధ కలుగును. అట్టి శ్రద్ద కలిగినపుడే శాస్త్రోక్తప్రకారము గా శ్రవణ మనములను చేయుదురు. నిది ధ్యానమును కూడా చేయుదురు. అట్టివారికే పరమాత్మ సాక్షాత్కారము కలుగును. అట్టి సాక్షాత్కారమువలననే మూలాజ్ఞానము. దానివలన ఏర్పడిన దేహేంద్రియములయందు నేను అను భ్రమ మొదలగు సర్వభ్రమలు నశించును.

అగ్ని నుండి దహనశక్తిని వేరుచేయలేనటులసాధారణ స్థితిలో, విత్తములనుండి మొలకెత్తు లక్షనమును వేరుచేయలేనటుల, మంత్రతంత్ర ఓషధులయందు నిర్దేశితమైన కార్యములను ప్రతిబంధించే శక్తియున్నటుల, సచ్చిదానందరూపమగు పరమాత్మయందు సత్వరజస్తమోగుణములతో కూడిన మాయాశక్తి ఆశ్రాయించియుండును. మాయాశక్తి పరమాత్మకంటే వేరుకాదు. అట్టి మాయాకూడా అనాదియైన అరోపమే గనుకను అదిష్ఠానమగు పరమాత్మకంటే వేరుకాదని పరమార్థము.

వ్యవహారదశయందు అనగా అజ్ఞానదశయందు మాయాశక్తియుక్తమగు పరమేశ్వరుని ఆరాధించవలసినదే. ఈశ్వరానుగ్రహమును పొందవలసినదే పరమాత్మ సాక్షాత్కారమును పొందిన తరువాత అజ్ఞానమువలన ఏర్పడిన జీవత్వముఈశ్వరత్వము కూడా అజ్ఞానముతో సహా నశించును గనుకనిర్గుణమగు స్వప్రకాశానందస్వరూపమగు పరమాత్మే మిగులును. ఇట్టి మహా పరమార్థమును తెలిసికొనుటకు ఈశ్వరారాధన చేసి పెద్దలను సేవించినిష్కామకర్మానుష్ఠానముచేసిఈశ్వరానుగ్రహమును సంపాదించవలయును.

ఆధ్యాత్మికదృష్ఠి మనుష్యజన్మలో చాలా శ్రద్ధచే సాధించవలసిన విషయం. ఆధ్యాత్మిక విద్య చాలా కష్టమయినది. నాకున్న పరిధిలో  సులభముగా అందరికి అర్థముగునను నమ్మకముతో, వ్రాసిన విషయములనే కొన్ని విశేషములతో మరల వ్రాయవలసి వచ్చినది. తప్పుగా తలువ వద్దు.

రేపు గురువారము మరొక శ్లోకముతో.............

7. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యోభూత్సుషుప్తః పుమాన్ |

ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

అనృత జడమగు ప్రపంచముకంటే విలక్షణమగు పరమేశ్వరుడురూపాది విషయజ్ఞానములకు కారణమగు నేత్రములు మొదలగు ఇంద్రియములయొక్క ఉపసంహారమువలన అనగా ఇంద్రియములు పనిచేయకుండా ఆగినందువలనఏవిధమైన భేదములేకండా సచ్చిదానందరూపుడుగా నుండిసుషుప్త్యవస్థను పొందినవాడుఆయెనుముక్తుని కంటేసుషుప్త్యవస్థయందున్న ఆత్మకు తేడా ఏమనగామాయ అనాది అయిన అజ్ఞానముచేతఅవరణ వలనఅందువలన సన్మాత్రుడయి యున్నాడు.

ఈ విషయములో దృషాంతము ''రాహుగ్రస్త దివాకరేందు సదృశః '' అనగా  రాహువుచేతగ్రసింపబడిన అనగా ఆవరింపబడినసూర్యునితో ఇందు చంద్రునితోసమానుడై సుషుప్తిని పొందియుండెను. గ్రహణము పట్టినప్పుడుకూడా సూర్యచంద్రులున్నారు. సుషుప్త్యవస్థయందు ఆత్మ వుండుటలో ప్రమాణమేమనా- ''ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే''- సుషుప్తిసమయమందుసన్మాతృడుగా నున్న సత్మమెళుకువవచ్చిన సమయమందుప్రత్యభిజ్ఞను పొందుచున్నాడుఎటులగనగా ప్రాగస్వాప్సమితినేనుఇంతకు ముందు సుషుప్త్యవస్థయందు సుఖముగా నిద్రపోతినోఆ నేనే ఇపుడు మేలుకొనుచున్నాను. అని ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడు ఆ అయినశ్రీ దక్షిణామూర్తిస్వామికొరకుఈ నమస్కారము.

 జాగ్రదవస్థయనిస్వప్నావస్థయనిసుషుప్త్యవస్థయని జీవునకు మూడు అవస్థలు కలవు. బాహ్యేంద్రియములతో జ్ఞానము కలిగే అవస్థ జాగ్రదవస్థఅనగా బైటిఇంద్రియములతో ప్రపంచవిషయములను తెలుసుకొను సమయమునిద్రాసమయమునందు ఇంద్రియములు పనిచేయవు. ఇంద్రియములు పనిచేయకపోయిననుఅంతరాత్మయందు మనస్సుయొక్క పరిణాములవలన ఏర్పడు స్వప్నపదార్థములను తెలుసుకునే సమయము స్వప్నావస్థ. జ్ఞానేంద్రియములు మనస్సుకూడా పనిచేయకఅజ్ఞానమందు అంతయు లీనమయి అవిద్యావృత్తియందు ప్రతిఫలించిన ఆనందమును అవిద్యాకారావిద్యావృత్తియను అజ్ఞానానుభవమును పొందు అవస్థసుషుప్త్యవస్థ. సుషుప్తి అనగా కల కన్నా గాఢమైనది. కలలో వున్నా బయట జరుగుతున్నదేదో ఏదో కొంత శాతమైనా మనస్సు గ్రహించే అవకాశముంటుంది. కానీ సుషుప్తి వ్వస్తలో అలా వుండదు. పూర్తిగా లీనమైన స్థితి ఇది.

ఈ మూడు అవస్థలయందును ఆత్మ అనుగతమైనేను జాగ్రద్దశయందు ఆయా విషయములను చూచితినిస్వప్నదశయందు మంచి ఆశ్చర్యకరమగు దృశ్యములను చూచితిని. సుషుప్త్యవస్థయందు ఏమి తెలియదు. సుఖముగా నిద్రించితినని జాగ్రద్దశయందు అనుకొనుచున్నాడు. జాగ్రద్దశయందు స్వప్నముస్వప్నదశయందు జాగ్రద్దశసుషుప్త్యవస్థయందు ఈ రెండునుఅనుగతమై గోచరించకపోయినప్పటికిని తెలుసుకొను ఆత్మ, ఒకే వ్యక్తి మూడు అవస్థలయందును స్పష్టముగానున్నట్లు సర్వజనులకును అనుభవమున్నది. అందువలన సుషుప్త్యవస్థయందు కూడా ఆనందరూపుడయిన అత్మయున్నది.

ఏమి తెలియలేదన్నాడు గనుక ఆజ్ఞానముకూడా ఉన్నది. గనుక సుషుప్త్యవస్థయందు ఏమియు లేదు. శూన్యమేయనిశూన్యమే ఆత్మయని చెప్పుటకు అవకాశములేదు. శూన్యమని చెప్పినను శూన్యమును గుర్తించే జ్ఞానమున్నట్లే కదా. జ్ఞానమే ఆత్మజ్ఞానముంటే ఆత్మ వున్నదనియే చెప్పవలయును. ఇదియేగాక బంగారులోనుండి తయారయిన భూషణములు బంగారురూపముగానే యుండును. రాగినుండి తయారయిన పాత్రలు రాగి పాత్రలుగానే కనిపించుచున్నవి. వికారములన్నియు ప్రకృతికి సజాతీయములుగానున్నవి. గనుక శూన్యములోనుండి ప్రపంచం పుట్టినయడల అంతయు శూన్యముగా నుండవలసి వచ్చును. ప్రపంచమంతయు సత్యముగా కనిపించుచున్నది. అంతా శూన్యమని చెప్పినపుడే అంతా శూన్యమని గుర్తించి చెప్పువాడున్నాడు కదా వాడే ఆత్మఅట్టి ఆత్మ శూన్యమని చెప్పుట యుక్తిలేని మాట గనుక శూన్యవాదమును భోదించు బౌద్ధమతము ప్రమాణ విరుద్ధమనియుక్తివిరుద్ధమని వదిలివేయవలయును. గ్రహించతగినది కాదు. ఇట్లు ఏడవశ్లోక తాత్పర్యవివరణము సమాప్తము.

రేపు మరొక శ్లోకముతో .........

8. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి l

వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదాl

స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయాl

తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ll

బాల్యముకౌమారముయౌవనముముసలితనము మున్నగు స్వరూపముగానున్నట్లేజాగ్రదవస్థస్వప్నావస్థసుషుప్త్యవస్థజన్మ జరామరణాది రూపముగానున్న సమస్తమయినఅవస్థలు అనగా నేత్రములతో చూచుటచెవులతో వినుట మొదలగు భిన్నభిన్న జ్ఞానములు కలిగే అవస్థలయందును, ఆయా దశలయందుకూడాపరస్పరం వేరుగానున్న అవస్థలయందుఅనుగతముగా వుంటున్నఎల్లపుడు మనలోన నేనను భావన భాసించుచున్న ప్రత్యగాత్మను ఏ పరమేశ్వరుడు సచ్చిదానందస్వరూమయినతన ఆత్మస్వరూపముగాశుభరూపమయిన (మంగళప్రదమయిన) జ్ఞానముద్రతోభక్తులకుతెలియజేయుచున్నాడో అనగా భక్తులకువారిలో నేను నేను అని గోచరించుచున్న ఆత్మను కర్తృత్వాది ధర్మరహితమైన సచ్చిదానందరూపమయిన పరమాత్మకంటే అభిన్నముగా ఏపరమేశ్వరుడు బోధించుచున్నాడోఆ శ్రీగురుమూర్తి రూపమయినశ్రీదక్షిణామూర్తి స్వామికొరకుఈనమస్కారము.

బాల్య యౌవ్వన కౌమార వార్ధక్య దశలు మనవ జీవితములో అందరికీ అనుభవమునకు వచ్చేవే! ‘యోహం దాల్యే పితరౌ అస్వభూవంసోహమిదానీంప్రణప్తౄన్ అనుభావామి' . నేను బాల్యావస్తయందు తల్లిదండ్రులను జూచితిని. ఇపుడు మునిమనుమలను జూచుచున్నాను. అని తలచుచున్నాడు శరీరి.  పైన చెప్పిన అన్ని అవస్థలూ అనుభవించిన తరువాత ఇపుడు చివరిదయిన వార్ధక్యమున పైవిధముగా తలపోయుచున్నాడు. అంటే తాను అనుస్యూతముగానుండి మారనట్లు గుర్తించుచున్నాడు. అదేవిధముగా జాగ్రదస్వప్నసుషుప్తులు మారుచున్ననూ ఈ అవస్థలను అనుభావించుచూతాను అట్లే ఉండిపోవుచున్నాడు. అహం అహం అంటే 'ఏనునేనుఅని అనుక్షణమూ తలపోయుచునేయున్నాడు. జ్ఞాన ముద్రతో దేహాది వివిక్త (చర్మ చక్షువులకు కనిపించకుండా) సచ్చిదానంద ఆత్మ స్వరూపములను  భక్తులకు ప్రకటించుచున్న ఆ దక్షిణామూర్తికి నమస్కారము.

ఈ భావమును విశ్లేషించుకొనుటకు మునుపు వ్యావృత్తి అనగా flux లేక పరిణామ సత్యముమరియు 'అనువర్తమాన’ మను పదములు ఏమి తెలుపుచున్నవి అన్నది మనము ఒక పరి పరిశీలించవలసియున్నది. ఈ విషయమును ఒకపరి పరిశీలించుదాము.  నిత్యవ్యవహారములో అనేక వృక్ష జాతుల నుండిఅనేక రూపములలో మనకు ఆహార పదార్థములు లభ్యమగుచున్నవి. అంటే ఆ వస్తువులయండలి పోషక పదార్థములుఇవి పంచ భౌతికములే గానీ అన్యములు గావుమన శరీరమునందలి సప్త ధాతువులగు  రసరక్తమాంస,మేద,ఆస్తి,మజ్జ,శుక్రములు భౌతిక పదార్థము యొక్క సూక్ష్మరూపమగుమనస్సుగా,  రజో  గుణ ప్రదానమగు ప్రాణ శక్తిగానూ పరిణామమును పొందిఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుగా మన లౌకిక పారమార్థిక వ్యవహారనిర్వహణకుసాధనములగుచున్నవి.   ఈ ఆహారమే లేనియెడల మన శరీరమే గాకసూక్ష్మమగు మనస్సు కూడా క్షీణించి కార్యనిర్వహణ చేయజాలదు. పదార్థమునకు స్వరూప నిత్యత్వము లేకపోయిననూప్రరినామ నిత్యత్వము ఇక్కడ సాదిమ్పబడినది. అదే మనము గమనించవలసిన విషయము.  పదార్థమురూపాంతరములు పొందినామరూపములుగా (flux) నామరూపములుగా స్పూర్తిని కలిగియున్నది కానీ నామరూపములు లేకుండా నశించుటలేదు.  ఈవిధమగు రసాయనిక మార్పులకే ( Chemical disintegration and molecular combination) మాయాశక్తి విలాస కార్యమని వ్యవహారము. 'విలాసముఅనగా సంతోషము కలిగించు కార్యము గాడుప్రయోజనకరమగు మార్పు (Purposeful Metamorphosis). దీనినే వ్యావృత్తి అంటారు.

  అనువర్తమానముగా ఈ వ్యావృత్తి ని సదా అనుసరించి ఆ మార్పులకు  అనువగు రూపముల బొందించు ఈ ప్రపంచము యొక్క అధిష్ఠాన దేవతలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ వ్యావృత్తి  ఇంకనూ సూక్ష్మాతి సూక్ష్మమగు శక్తిగా (Energy)మాయాతత్వము యొక్క కార్య రూపముగ ఊదా పరినమించుచున్నది. ఇందుకు ప్రమాణము 'ప్రశ్నోపనిషత్తు’న 'ఆదిత్యోహవై ప్రాణో రయిరేవ చంద్రమా' అన్న శ్లోకములో మనము చూడగలము. ఇది జిజ్ఞాసువుల అభీష్టమునకు విదిచిపెట్టుచున్నాను.                                                                                                                                                                                                                             

ఇట్టి ఆత్మ శరీరేంద్రియములయందు బుద్ధి ధర్మములగు కర్తృత్వభోక్తత్వాదులతో బుద్ధివృత్తిలో గోచరించుచుండును. పూర్వపుణ్యవిశేషముచేత అంతఃకరణశుద్ధికలవారైగురుసేవచేసిఈశ్వరారాధన చేసిపరమపవిత్రులైతమ సమీపమునకు పరమభక్తులై వచ్చినవారికితత్వబోధచేయుటకుగానుఅవతరించిన దక్షిణామూర్తి స్వామివారు మౌనముగా నుండి బొటనవ్రేలుచూపుడువ్రేలు కలిపిన జ్ఞానముద్రతో మీలో నేను నేను అని గోచరించు ఆత్మసచ్చిదానందస్వరూపమగు నాస్వరూపమే నని జీవబ్రహ్మైక్యమును బోధించిరి. దక్షిణామూర్తి స్వామివారి యనుగ్రహమువలన ఇట్టి జీవబ్రహ్మైక్యసాక్షాత్కారమునుపొంది ముక్తులు కావలయునని తాత్పర్యము.

రేపు మరియొక శ్లోకముతో ...........

9. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయేll

ఏ ఉపనిషత్తులయందు ప్రసిద్థమయిన, పరిపూర్ణమయిన పరమాత్మతనకు ఉపాధిభూతముగానున్న సత్వరజస్తమోగుణాత్మకమయి ఆవరణవిక్షేపశక్తితోకూడిన శరీరేంద్రియరూపముగా పరిణమించిన ఆవిద్యారూపమగు మాయాశక్తిచేతభ్రమను పొందించబడినవాడైసర్వులకు ప్రత్యక్షముగా నున్న జీవుడై. కర్తృత్వ భోక్తృత్వాది సంసారమును పొందినవాడైప్రపంచమునుఅనేకభేదములతోఅనేక విధములుగా భ్రాంతుడైచూచుచున్నాడు. అనగా ఒక్క మాటలో మానవుడు పరమాత్మచే మాయావివశుడై భ్రమ యందు తగుల్కొని ఈ ప్రపంచముచే ఆకర్షితుడాయి ఉన్నాడు.

భేదముగా చూచుట ఎటులననగా కార్యముకారణము అనే స్వరూపముతో హక్కుగల గృహముధనముస్వామి వాటికి అధిపతిరెంటికి గల సంబంధ స్వరూపముతోనువిద్యను నేర్చుకునే శిష్యుడువిద్యనుచెప్పే గురువు అనే స్వరూపముతోనుఅలాగేతండ్రికుమారుడుతల్లిఅనే స్వరూపముతోనుస్వప్నమందు గానిజాగ్రద్దశయందుగానిప్రపంచమును చూచునోఆ శ్రీగురుమూర్తిఅయినదక్షిణామూర్తిస్వామి కొరకుఈ నమస్కారము.

పై విషయమును ఇంకా సులభతరముగా అర్థము చేసుకొనుటకు గాను భావమును ఇంకా సంక్షిప్తముగా మీముందు ఉంచుచున్నాను.

ఎవరి మాయవలన ఈ ప్రపంచమున చేతన స్వప్నావస్థలయందు, గురువు శిష్యుడుతండ్రి కొడుకు మొదలగు అనేక రూపముల అనుభూతి కలుగుచున్నదోఅట్టి  శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షినామూర్తికి ఈ నమస్కారము.

ఈ శ్లోకము యొక్క తాత్పర్య వివరణ నా జ్ఞాన పరిధిలో ఉన్నంత మేరకు తేటతెల్లము చేయ ప్రయత్నించుతాను. ఈ జగతిలో కనిపించునది ఏదియూ ఆత్మ కాదు. అది అంతయూ అనాత్మ మాత్రమే! ఎందుకంటే, ఆత్మ అగుపించదు. దానిని ఒక్క బ్రహ్మవేత్త మాత్రమే తెలుసుకోనగాలుగుతాడు.అట్టి బ్రహ్మవేత్తకు ఆత్మానాత్మ విచారణతో పని లేదు. అతను అనాత్మలో కూడా ఆత్మను చూడగలడు. సాధారణ జీవికిది సాధ్యము కాదు. అతనికి అంటే మనలాంటి వారికందరకూ అది ద్రాక్ష పిండు, అరటి పండు, మామిడి పండు వంటిది కాదు, అది పనస పండు వంటిది. దేహమే తాను అని విశ్వసించుచున్నంతవరకూ మనిషి భ్రమలో ఉన్నట్లే!

అవిద్యా భ్రాంతిచేత కప్పబడి మాయామయమైన మానవుడు తన ఆత్మ వేరని తలచుటయే గాక, ఈ విధమగు కార్యకారణ ప్రక్రియ ద్వారా యజమాని-సేవకుడు, తండ్రి-కుమారుడు, గురువు-శిష్యుడు  అనబడు ఈ విధమగు అన్ని సంబంధములను వేరు వేరని తలచును. నిజమునకు  వారు వేరు అనుకోనుతయే భ్రమ. ఉదాహరణమునకు తండ్రి కుమారులను తీసుకొందాము. నిజామునకు కుమారునికి తండ్రి కారణము. అదేవిధముగా ఆ తండ్రి అయిన వ్యక్తి తండ్రియగుటకు కుమారుడే కారణము. లోతుగా పరిశీలించితే ఈ అనుబంధము కలిగియున్నది ఒకే ఆత్మ. ఇదే విధముగా గురువు శిష్యునకు కూడా ఈ ఆత్మీయతయే కారణము. అదేవిధముగా యజమాని తాపేదారుడు కూడా! దీనికి ఉదాహరణగా మానవుడు జాగ్రద్ స్వప్న సుషుప్తుల అనుభవములను తాను స్మృతిలో ఉన్నపుడు ఆయా అవస్థల అనుభవముల ఎరుక తానూ కలిగియే యున్నాడు. ఆ ఎరుకకు కారణము ఆత్మ. ఈ ఆత్మల సంకలనమే పరమాత్మ. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఒక పెద్ద మళిగె (Mall) ను తీసుకొందాము. అందులో ప్రతి విభాగమునకు, ప్రతిమూలన  ముకుళపరిపథ చిత్రదర్శిని(Closed Circuit Tele-Vision), ఉంటుంది. ఆ మొత్తము చిత్ర సముదాయమును అందుకు సంబంధించిన అధికారి చూచుటకు వీలుగా ఏర్పరుపబడి ఉంటుంది. బయట మనము చూచినా చోటల్లా వేరువేరుగా కనిపించినా అవి అన్నీ ఒకే యంత్రరచనకు (Mechanism) కట్టుబడి ఉన్నాయి అన్నది మనకు తెలిసిన విషయము. అంటే ఈ ఉదాహరణ వల్ల సకలాత్మ సంయోగమే పరమాత్మయని మనకు అర్థమగుట లేదా! ఆ ఎరుక కలిగినవాడు స్వయముగా పరమాత్మయే! అట్టి పరమాత్మ స్వరూపుడగు శ్రీ గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము.

రేపు మరొక శ్లోకముతో.........

10.  భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం ।

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

భూమియుజలముఅగ్నియువాయువుఆకాశముసూర్యుడుచంద్రుడుకర్మకాండకుజ్ఞానకాండకు అధికారి యైన జీవుడుఏపరమేశ్వరుడైనసర్వజ్ఞుడైనసర్వశక్తిగల సచ్చిదానందరూపుడైన సదాశివుని యొక్కయేమూర్తులయొక్కఎనిమిదింటి యొక్క సముదాయముఅంతట ప్రకాశించుచున్నదోఅనగా_ఈ ఎనిమిది స్వరూపములుగల ఈశ్వర స్వరూపుడనే నేనని అహంగ్రహోపాసన చేయమని యర్థముఈశ్వరానుగ్రహమువలన కలిగే తత్వ సాక్షాత్కారమే మోక్ష సాధనమని శ్రవణాది విచారణ చేయువారికిసర్వకారణమైనఅనేకరూపములుగల ప్రపంచరూపముగా వివర్తమానమైనదేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైనయేసకల ప్రపంచాధిష్ఠానమైన సచ్చిదానందరూపమైన పరమాత్మకంటేవేరుకొంచెము కూడాకాదోశ్రీ గురుమూర్తి అయినశ్రీ దక్షిణామూర్తి స్వామికొరకు, నమస్కారము.

నిత్యానిత్య వస్తువివేకముఇహామృతార్థ ఫలభోగ విరాగముశమాది షట్కసంపత్తి, ముముక్షుత్వమను సాధన చతుష్టయ సంపత్తి కలవారై సూక్ష్మబుద్ధికలవారై సర్వకాలములయందు బ్రహ్మవిచారము చేసిఅనగా పరమాత్మయందే ప్రపంచమంతయు ఆరోపింపబడినదిగనుక ఆరోపింపబడిన ప్రపంచము అధిష్ఠానమైన పరమాత్మకంటే వేరుకాదు గనుక. అధిష్ఠానమైన బ్రహ్మయే సత్యం. ఆరోపిత ప్రపంచమంతయు మిధ్యయని భావించి శ్రవణ మనన నిదిధ్యాసనలు చేసి అహం బ్రహ్మస్మీ అని బ్రహ్మ సాక్షాత్కారమును పొంది ముక్తిని పొందువారు. ఉత్తమాధికారులు.

సాధనసంపత్తి సరిగాలేకసూక్ష్మబుద్ధిలేక శ్రవణాదులు చేయలేనివారు మందాధికారులుశ్రవణమనగా సమస్త వేదాంతములు అనగా ఉపనిషత్తులు. అద్వితీయమైన పరబ్రహ్మను తాత్పర్యముతో బోధించుచున్న వని వినిమనస్సులో నిశ్చయజ్ఞానం కలుగునట్లు చర్చచేయుట. మనన మనగా శ్రవణము చేసిన విషయమును అనేక హేతువులతోనుఅనేక దృష్టాంతములతోను సంశయములేకుండా మనస్సులో దృఢపరచుకొనుటనిదిధ్యాసనమనగా శ్రవణమననములతో సందేహములేకుండా నిశ్చయింపబడిన పర బ్రహ్మ స్వరూపమును నేను జీవుడను కాదు. పరబ్రహ్మ నేనే నని ధ్యానము చేయుట.

ఇట్టి కష్టతరమైన శ్రవణమనన నిదిధ్యాసలను సూక్ష్మబుద్ధి లేని వారు చేయజాలరు గనుక ఇట్టి రెండవరకమగు అధికారులకే ఉపనిషత్తుల యందు సగుణ బ్రహ్మోపాసనలుచెప్పబడినవి. ఆ సగుణ బ్రహ్మోపాసనల వలన పరిపక్వస్థితిని పొందిదేహము పడిపోయిన తరువాత సగుణ బ్రహ్మలోకమునకు పోయి ఆ లోకమందు ఆ సగుణ బ్రహ్మ అనుగ్రహము వలన నిర్గుణ బ్రహ్మ విచారం చేసిఆలోకమందే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొందిఆ సగుణ బ్రహ్మతోకూడా ఈ సగుణ బ్రహ్మోపాసకులు నిర్గుణ బ్రహ్మస్వరూపముతో ఐక్యమును పొందుదురు. ఇదియే క్రమముక్తి. ఈ క్రమముక్తి సగుణ బ్రహ్మోపాసనవలన కలుగును.

ఆ సంప్రదాయానుసారముగా శంకర భగవత్పాదులవారు ఈ శ్లోకమందు సగుణోపాసన చెప్పిరి. ఉపాసన ఎటులననగాకొద్దిదాని యందు గొప్పదృష్టిని ఉంచుట ఇదియే ఉపాసనకు మొదటి లక్షణముపృధివిజలముతేజస్సువాయువుఆకాశము ఈ పంచభూతములుసూర్యుడుచంద్రుడుకర్మజ్ఞానాధికారియగు జీవుడుఈ ఎనిమిది అష్టమూర్తులుఈ అష్టమూర్తులతో కూడి అనగా ఈఅష్టమూర్తులు ఈశ్వరునికి శరీరమని అనుకుందాము. ఇట్టి ఈశ్వరుడు సమష్ట్యుపాధికుడు. ఇట్టి ఈశ్వరునితో తనకు ఐక్యమును భావించి ఉపాసన చేయవలయును.

ఎటులననగా! తన శరీరం పంచభూతములతో తయారైనది గనుక శరీరంలో పంచభూతములున్నవి. ప్రపంచంలో నున్న సమష్టి మహాపంచ భూతములనుతన శరీరంలోనున్న వ్యష్టి పంచభూతములను ఒకటిగా భావించవలయును. అష్టమూర్తులలోని సూర్యచంద్రులనుతన శరీరములోనున్న ప్రాణాపానవాయువులను ఒకటిగా భావించవలయును జీవుడు తనే అయియున్నాడు. గనుక వ్యష్టి శరీరము ఉపాధిగాగల తనకు అష్టమూర్తులనే సమష్టి ప్రపంచము ఉపాధిగాకల పరమేశ్వరునుకుఐక్యమును భావించవయును.

అనగా సర్వవ్యాపకమై అష్టమూర్త్యభిమానిఅయిన సదాశివుడనే నేనని అహంగ్రహోపాసన చేయవలయును. ఇట్టి ఉపాసనవలనఈశ్వర సాయుజ్యమును పొందిఆ ఈశ్వరానుగ్రహమువలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొందిముక్తిని పొందుదురు. ఇదియే క్రమ ముక్తి సాధనమనిశంకర భగవత్పాదులవారు అతిదయతో అనుగ్రహించిరి. ఇట్లు తాత్పర్యవివరణ సమాప్తం.

ఈ శ్లోకమును ఉపాసనా సూచకమని తరువాతి శ్లోకమును ఫలశ్రుతి యని పెద్దలు చెబుతారు. వారి మాటను కాదను అర్హత నాకు లేదు. కానీ ఈ శ్లోకము దీని తరువాతిది కూడా మనకు ఎంతో వేదాంతమునందజేయుచున్నది. కావున ఈ శ్లోకములు కూడా ఎంతో పారమార్థిక ప్రాధాన్యత కలిగియున్నాయి.

11. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే,

తేనాస్యశ్రవణాత్త దర్థమననార్థ్యనాచ్చ సంకీర్తనాl

త్సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతస్సిద్ధ్యే

త్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతంll

ఇంతవరకూ పై శ్లోకములలో తెలిపిన రీతిగా ఈ దక్షిణామూర్తిస్తోత్రమునందుశృతులయందు చెప్పబడినపరమాత్మ సర్వరూపస్థితి స్పష్టముగా తెలియచేయబడినది. ఆకారణముచేతఈ స్తోత్రమును యధావిధిగా గురువుచే వినుటవలనశ్రవణంచేసి విషయమును చిత్తశుద్ధితో, అనేక దృష్టాంతములతోనుఅనేక యుక్తుల తోనుమనస్సుతో చింతనచేసినందువలన ఆ పరమాత్మ తత్వమును గ్రహించాగాలుగుచున్నాము.  శ్రవణమననములతో నిర్ణయింపబడిన సర్వాత్మకమయిన సచ్చిదానందమయిన నిత్యసిద్ధ బుద్ధ ముక్తస్వరూపమయిన పరమాత్మనే నేనని తైలధారవలె ఇతర వృత్తితో వ్యవధానములేనిపరమాత్మాకారవృత్తి ప్రవాహరూపమైన నిది ధ్యాసనవలనఇతరులకు తెలియజేయుతవలన ఈ స్తోత్రమును చదివినందువలనసర్వాత్మభావమనే మహదైశ్వర్యముతో కూడిన సత్యజ్ఞానానందరూపమైన తత్వము ఆ శృతుల యందు ప్రసిద్ధమైన పరమాత్మభావము సిద్ధమయినదే అని గ్రహించగలుగుచున్నాము. పరమాత్మభావము సిద్ధమేగాని ప్రయత్న సాధ్యము ఆనుకొన తగదు. ప్రయత్న సాధ్యమయ్యే దయినచో అనిత్యమగునని యర్థముఈ తత్వమును సాధించిన ముముక్షువు  అణిమాద్యైశ్వర్య సిద్ధిని పొందుచు పరబ్రహ్మైక్యత సాధించును. చును;

సకల వేదాంత సిద్ధాన్తమంతయుఈ దక్షిణామూర్తి స్తోత్రమందుండుటచేత ఈ దక్షిణామూర్తి స్తోత్రమును గురువుల వద్ద బాగుగా శ్రవణం చేసిమననం చేసి శ్రవణమననములతోనేను పరమాత్మను కాననే అసంభావననునేను జీవుడననే విపరీతభావనను పోగొట్టుకొని నిశ్చితమగు పరమాత్మతత్వమును ధ్యానం చేసిఆత్మ సాక్షాత్కారము పొందగలడు. అదియే మోక్షము. దీనినే మహావిభూతి యందురు.

ఆత్మను సంపాదించనవసరమలేదుకాదా! ఒక ప్రశ్న. మోక్షమనగా అవస్థాత్రయాతీతమగు ఆత్మయేకదా. అట్టి ఆత్మసిద్ధించి మన స్వరూపముగానేయున్నదికదా. అయితే అఖండానందరూపమగు మోక్షము మన కెందుకు గోచరించడంలేదు. అంటే అజ్ఞానము ఆ స్వరూపానందమును అవరించి మనకు గోచరించకుండా చేసింది. అయితే ఆ మోక్షము ఎంత దూరములో నున్నది. అంటే ఆత్మస్వరూపమే. మోక్షమని చెప్పితిమికదా. ఆత్మకంటే దగ్గరిది లేదుకదా. అయితే ఎంతోదూరముగా నున్నట్లు లభించనట్లు దేనినైనా సంపాదింపవచ్చును గాని మోక్షమును సంపాదించుట చాలాకష్టమనిదేనినైనా పోగొట్టుకొనవచ్చునుగానిజన్మమరణ సంసార బంధమును పోగొట్టుకొనుట చాలా అసాధ్యమనిచాలా బాధపడుచున్నామే అంటే అజ్ఞానముకంటే దగ్గర ఉన్న దానినికూడా దూరంచేసేది మరియొకటి లేదుఅజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లుచేసేది మరొకటిలేదు. ఇదియే కాదు అజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లు చేయుటయేగాక ఎక్కడనోనున్నదని దానిని సంపాదించుటకు వెతికించేది. తిప్పేదిబాదపెట్టేది మరియొకటిలేదు. అజ్ఞాన ప్రభావమును గురించి ఒకసారి పెద్దల మాట వినండి:

ఈ అజ్ఞానము చాలా బలమైనది. అత్యంత శక్తి కలిగినది. ఆత్మను ఆవరించి జీవునిగా తయారుచేసి లేని ప్రపంచమును చూపించి సత్యమనిపించిందే, ఎంతటి శక్తివంతమయినదైతేగాని ఇంత పని చేయగలుగుతుంది. అంటే సందేహం లేదు. ఈవిషయమును సంక్షేపశారీరకంలో సర్వజ్ఞముని ఈ విధముగా చెప్పుచున్నారు.

ఏకశ్శతృ ర్నద్వితీయో స్తి శతృ రజ్ఞానతుల్యః పురుషస్య రాజన్‌ l

యేనావృతః కురుతే సంప్రమత్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని ll

ఆ శ్లోక భావము ఇది. నాయనా! జీవునికి ఒక మహాశతృవు ఉన్నాడు. అజ్ఞానమే ఆ శతృవు. అట్టి అజ్ఞానమనే శతృవుతో సమానమైన శత్రువు మరియొకటి కానరాదు. ఎందుచేతనంటే జీఇయండు ఉండే ఈ సచ్చిదానందరూపుడు, అజ్ఞానమనే శతృవుతో నావరింపబడినవాడై యున్నందువల్లస్వరూపమును మరచి జీవుడ ననే భ్రాంతినిపొంది అహంకార మమకారములు కలవాడై చేయతగినది చేయకూడనిది తెలిసికొనలేక ఈ లోకమందు భయంకరమైన పనులనుపరలోకమందు నరకమును కలుగజేయు పాపకృత్యములనుకూడా చేయుచున్నాడు. ఇదంతయు అజ్ఞానప్రభావమే. అందువలన దూరముగా నున్న పుణ్యలోకములను పుణ్యకర్మలుచేసి పొందుట సులభంగానిబాగుగా సమీపమైన తన స్వరూపమును తెలిసికొని అజ్ఞానమును పోగొట్టుకొనుట చాలాకష్టము. కర్మ ప్రతిబంధమును పోగొట్టుకొనుటకంటే అజ్ఞాన ప్రతిబంధమును పోగొట్టుకొనుట చాలా కష్టమని గ్రహించవలయును.

వేదాంతవిద్యను బాగుగా నభ్యసించినపండితులవద్ద అప్పుడపుడు వినుట చాలా అవసరము. అటులచేసినయడల గ్రంథములనుచూచినను చాలా బాగుగా నిస్సందేహముగా సిద్ధాన్తం తెలిసికొనవచ్చును.

నహి ప్రపంచో నచభూతజాతం నచేంద్రియం ప్రాణగణోనదేహః|

నబుద్ధిచిత్తం నమనోనకర్తా బ్రహ్మైవసత్యం పరమార్థరూపం||

అని స్వాత్మప్రకాశికయందు శంకర భగవత్పాదులవారు చెప్పిరి.

ప్రధానంగా ఆద్వితీయమగు బ్రహ్మ విచారముచేయువారు. ఆ రోపమును నిషేధించుచునే అధిష్ఠానమగు ఆత్మను తెలుసుకొనవలయునుగనుక ప్రపంచము ఆత్మకంటేవేరుగాలేదుభూతములేమియు లేవుఇంద్రియములులేవుప్రాణములేదుదేహములేదు. వృత్తిభేదము చేత అంతఃకరణయే మనస్సనియుబుద్ధియనియుఅహంకారమనియుచిత్తమనియు నాల్గువిధములుగా వ్యవహరింపబడుచున్నదిగనుక అవి ఏవియులేవు. కర్తయనిభోక్తయని వ్యవహరింపబడుచున్న జీవుడుకూడా లేడు. అంతయు పరమాత్మయే అనగా బ్రహ్మయేయని. అదియే పరమార్థమనిఅదియే నేనని తెలుసుకొని కృతకృత్యులు కావలయునని తాత్పర్యము.

 

నాకు చేతనగురీతి ఈ స్తోత్రమునకు నేను తెలుసుకొన్న మేరకు అర్థవివరణ తో మీ ముందు ఉంచినాను.

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్l

కరోమి యద్యః సకలం పరస్మైః నారాయణాయ ఇతి సమర్పయామి.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వే సంతు సమాశ్రయాః l

సర్వ్ భద్రాణి పశ్యంతు మాకశిత్ దుఃఖ భాగ్భావేత్ ll

స్వస్తి.

 

 

 

 

2 comments:

  1. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములోని ఆఖరి శ్లోకమును యిచ్చి,దాని తాత్పర్యమును చాలా విశాలంగా విశ్లేషణ చేసేరు. జీవాత్మ,పరమాత్మల అభేదాన్నితెలిపి
    జ్ఞానము,ఆజ్ఞానములను గురించి చెపుతూ తనలోనే పరమాత్మను మానవుడు అజ్ఞానము చేత చూడలేక పోవడాన్ని గురించి వివరించారు. గురువుల నుండి వారి బోధనలతో జ్ఞానమునందవలసిన అవసరమునూ, ఆధ్యాత్మిక సాధనల యొక్క ఆవశ్యకతను చాలా బాగా వివరించారు...ఎంతో క్లిష్టమైన,లోతైన మీ విశ్లేషణలకు అనేక అభినందనలండీ....రామ మోహన రావు గారూ.

    ReplyDelete