Friday, 20 August 2021

తెలుగు తేనెఊట పై తేట ( కస్తూరి ని గూర్చి కూడా చదువండి)

 

తెలుగు తేనెఊట పై తేట (కస్తూరిని గూర్చి కూడా చదువండి)

https://cherukurammohan.blogspot.com/2021/08/blog-post.html

ఈ వ్యాసము వ్రాయుటకు ఒక ప్రత్యెక కారణమున్నది. ముందు నేను వ్రాసిన ఈ 

పద్యమును గమనించండి.

అరవకన్నడములు ఆముదము కస్తూరి

ఒకటి తెలియలేము ఒకటి ఘాటు

తెనుగు తేనె ఊట తేటరా గమనించు

రామమోహనుక్తి రమ్యసూక్తి

ఆముదము(తమిళము)=అమృతము(తెలుగు)

తమిళులు అరవమును అమృతముతో పోల్చుకొంటారు. కానీ దాని రంగు రుచి వాసన 

భూమిపైన ఎవరికీ తెలియదు.

కన్నడమును కస్తూరి అంటారు. కస్తూరి వాసన దూరము నుండి పీల్చితే ఎక్కడలేని 

సువాసన కలిగియుంటుంది. అంతమంచి వాసనను దగ్గరకు పోయి 

పీల్చుదామనుకొంటే ముక్కు బెదిరి రక్తము కారుతుంది.

కానీ తెనుగు అట్లుకాదు. అది తేనె పుట్టుటకు కారణమైన ఊట. అంతేనా అంటే 

అదీకాదు, ఆ ఊరిన తేనెపై గల తేట. ఆ తేట ఎంత త్రావినా కడుపు నిండదు సరికదా 

ఇంకా త్రావాలనే ఉంటుంది. ఇదీ మన తల్లిభాష గొప్పదనము.

ఇది నేను జూలై 3, 2018 న ఆస్య గ్రంధిలో ప్రకటించి యుండినాను. 20 మందికి 

నచ్చినది, 11 మంది తమతమ కుడ్యములపై ఇతరులకు పంచినారు. 10 మంది 

అభిప్రాయములను ప్రకటించగా 8 మంది భేషుభేషని మెచ్చుకొన్నారు తెలుగులో. 

ఇద్దరికీ మాత్రము నచ్చలేదు అందువల్లనేమో,  తమ నిరసనను ఆంగ్లమున తెలిపినారు. వారి నిరసనలు ఈ దిగువన కనబరచినాను.

కస్తూరీ తిలకం లలాట పలకే ........ I am a Telugu, studied Kannada. Kasturi is used 

a medicine also. It's smell cures cold. My mother used to give us Kasturi 

matra (tablets). Your poetry is nice to hear being Telugu man but feel sad on Kasturi Being a Kannadiga by birth and AmRtaM (amudam ) since I can read and speak Tamil. Tirukkural, Barathiar the poetry.....,

Thank you sir, my uncle a Telugu Pandit in Bangalore used to tell all this. Nice 

recollection తెలుగు తేటనే ఎవరూకాదనరు

I can understand your feelings Sri. -------

Unfortunately it has become a habit to many to degrade others and score a 

point. I am also a Telugu speaking person and I apologize for the bad 

remarks made on the other languages.

ముందు, ఇతర భాషలను కించపరుచరాదు అన్న అభిప్రాయమును పైన ఇరువురు వ్యక్తులు వెలిబుచ్చినారు. మరివారి అభిప్రాయ ప్రకటనలో సాటి వ్యక్తినయిన నాలో సంస్కారము లేదు అని చెప్పకనే చెప్పినారు కదా! దానిని వారు లెక్కచేయలేదు. సరే జ్ఞానులగు వారు చెప్పిన మాట నాకు శిరౌధార్యము.

అసలు వారికి ఇటువంటి ఆలోచన వచ్చియుండకూడదు. ఎందుకంటే ‘అరవము 

ఆముదము’ అన్న వారు ఆ భాషను మాతృభాషగా కలిగిన వారే! నేను అన్నది కాదు. తల్లి 

భాషను ప్రతి వ్యక్తి గౌరవించుతాడు. వారి మాతృభాషాభిమానమునకు శిరసు వంచి 

నమస్కరించుచున్నాను. ఒక పరి విందుకు పోయినట్లు ఊహించుకొందాము. 

భోజనము ముగియు సమయానికి కొన్ని పదార్థములు ఆకులో నిలువ వుంది పోతాయి. కారణమేమి అంటే, ఆ ఆకులో భోజనము చేసిన వ్యక్తి ఆ పదార్ధములో రుచి తక్కువ అనియో, తీపుఎక్కువ అనియో చెబుతాడు. ప్రశ్నించిన వ్యక్తి మిగత భోక్తల ఆకులు చూసినపుడు, తనకు చెప్పిన వ్యక్తి మాటలో వాస్తవమున్నది అని గ్రహించుతాడు, అట్లు చూడకపోతే వీడు మహా గొప్పగా వందేవాని మాదిరి తప్పు పడుతున్నాడు అని అనుకొంటాడు. బాగోగులు చెప్పుటకు పాక శాస్త్ర జ్నిపునుడు కానక్కరలేదు.

పైన చెప్పిన పద్యములో వారు చెప్పిన ఉపమానముల గుణము నేను తెలియజేసినాను. 

వేరెవరినీ కించ పరుచలేదు.

ఇక అభిప్రాయములు వ్రాసిన ఇరువురూ తెలుగువారయి కూడా ఆంగ్లములోనే తమ 

అభిప్రాయములు తెలిపినారు. అది బహుశ వారి మాతృభాషాభిమానమునకు 

తార్కాణమేమో!

అరవము అమృతతుల్యమగు భాష కాదు అని నేనెక్కడా అనలేదు. అమృతమును 

నాబోటి మానవమాత్రులు చూసే అవకాశము లేదు అన్నాను. అదేవిధముగా కన్నడ భాష విషయములో కస్తూరిని ముక్కుకు దగ్గరగా ఉంచుకొని ఆఘ్రాణించితే ముక్కు బెదిరి రక్తము వస్తుంది. అది ఆ వస్తుగుణము. అది తప్పు అంటే వారు ఆ విషయమును నిరూపించవలసి వస్తుంది.  వారి నిరూపణలో వాస్తవముంటే నన్ను దుర్భాషలాడినా నాకు సమ్మతమే! అసలు ఇప్పుడు కస్తూరిని ఆ మృగము నుండియే తీయుటలేదు. కావున కృత్రిమ వ్దానముల వాళ్ళ తీసే కస్తూరి వాసన చూసినా ముక్కు బెదరదు.

కావున నేను చెప్పవచ్చినదేమిటంటే పాఠకులు తమ అభిప్రాయమును వ్రాసే ముందు, 

వ్యాసమును శ్రమ అనుకోకుండా చదివి ‘కష్టపడి వ్రాసిన వ్యక్తి మనసును నొప్పించని 

విధముగా తమ అభిప్రాయములు తెలిపే విధానము పై దృష్టి సారించితే మంచిది అని 

నా అభిప్రాయము. ‘సామాన్య భాషా వాదమును’ ఆంగ్లేయుల ప్రీతికోరకు లేవనెత్తి వారిచే 

‘Sir’ బిరుదులూ, బహుమతులు పొంది, తెలుగును చరమస్థాయికి చేర్చినారు. ఇంకా ‘

దింపుడు కళ్లము’ లో ఉంచిన దాని ‘కొన ఊపిరులకు ఊపిరుల’ 

నూదండి.స్మశానమునకు ఈడ్చి నిప్పు పెట్టకండి. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని 

చెప్పిన మహనీయులు ఆమాట చెప్పుటచే పరభాషలను కించపరచినట్లు 

అన్వయిన్చుకోకండి. ఇది ‘క్రీడాభిరామము’ లో వినుకొండ వల్లభరాయులే చెప్పినాడో 

 శ్రీనాథుడే చెప్పినాడో అన్న్క వివాదము ప్రక్కనుంచితే ఇరువురిలో ఒకరు నిర్దుష్టముగా 

చెప్పియున్నారు. ఇక రాయలవారి నోట వేలువడినదని మనము వింటూ ఉండేదే!

ఇంతదూరము వచ్చిన తరువాత కస్తూరిని గూర్చి నేను తెలుసుకొన్న మేరకు 

తెలియజేస్తాను. శృంగార రస వర్ణనలోనూ, దేవీ దేవతల స్తోత్రములలోనూ కస్తూరిని 

విరివిగా నాటి మహా పండిత కవులు వేదజల్లినారు. ఒకసారి చదవండి.

కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక 

గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ 

సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి 

గంధాన్ని, తెలుసుకొనలేని కస్తూరి మృగం దాన్ని గడ్డిలో వెతుకుతుంది.—కబీర్.

అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. కస్తూరికి ఆంగ్ల నామమైన మస్క్ 

సంస్కృత పదమైన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. శ్రీకృష్ణుని స్తోత్రములో 

‘కస్తూరీతిలకం.....’ ఐయు, శివస్తోత్రములో ‘చందనాగారుకస్తూరి చారు కుంకుమ 

భూషితం’ అని దేవీభాగావతమున మణిద్వీప వర్ణనలో ఆ సుందర వనములో కస్తూరి 

మృగములు సంచరించేవని, కస్తూరిని, శని రాహుగ్రహములకు, రోహిణి భరణి మూల 

నక్షత్రములకు హోమద్రవ్యముగా వాడవలెనని చెప్పినట్లు విష్ణు ధర్మోత్తర పురాణములో 

చెప్పబడినదని పెద్దలు చెప్పగా విన్నాను.

19వ శతాబ్దము చివరివరకు కస్తూరి కేవలం సహజ వనరులనుండే లభ్యమయ్యేది. 

అయితే ప్రస్తుతం చాలామటుకు కృత్తిమంగా తయారుచేసిన పదార్ధాలనే వాడుతున్నారు. 

1195వ సం.లో మొరాకో సుల్తాన్ మారకేష్‌ కాలంలో వెయ్యి మూటల కస్తూరి కలిపిన 

సున్నంతో నిర్మించిన మసీదు ఈనాటికి కూడా కస్తూరి సువాసనలు వెదజల్లుతున్నదట. 

కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు 

ముస్కోన్.

నుదుట తిలకమునకు, జలుబుకు, దగ్గుకు ఆయర్వేదంలో చాలా రకాల చిట్కాలు

మందులు ఉన్నాయి. వీటన్నింటిలో కస్తూరి వాడే వారు కానీ తగిన లేక తక్కువ 

మోతాదులో వాడుతారు కావున ఆ వస్తువులను ముక్కుదగ్గర ఉంచుకొన్నా 

ముక్కునుండి నెత్తురు రాదు.  ఆయుర్వేదములో గంగా కస్తూరి మాత్రలను పూర్వకాలం నుండీ అనేక వ్యాధులకు నిపుణులు ఔషధంగా సూచిస్తున్నారు. కస్తూరి మృగం నాభి నుండి వెలువడే ఘాటైన ద్రవ్యమును ఉపయోగించి వీటిని తయారు చేస్తారు కాబట్టే కస్తూరి మాత్రలు అని పిలుస్తారు. ఇవి నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వేటిని వాడినా మన సమస్యకు గుణం కనిపిస్తుంది. ఈ మాత్రల్లోని ముఖ్య ద్రవ్యాలు కస్తూరి, మిరియాలు, గోరోచనం, రస సింధూరం, పిప్పళ్లు, అక్కలకర్ర, ఇంగలీకం ముఖ్యమైనవి. తమలపాకు రసంలో నూరి, తేనెతో కలిపి ఇస్తే చక్కని ఫలితం ఉంటుంది. అజీర్ణ సమస్యలు ఎదురైనప్పుడు, వాత వ్యాధులకి, కఫం పెరిగినప్పుడు, అతిసారానికి, అధికంగా చెమటలు కారడం వంటి సమస్యలకు సరియైన జవాబుగా ఇదిపెట్టింది పేరు. ఒకటి రెండు మాత్రల చొప్పున బాలింతలకు తొలిమూడు మాసాల వరకు ఇవ్వవచ్చు. దీని వల్ల వారికి ఒళ్లునొప్పులు, వాతం తగ్గుతాయి. జ్వర భారం తగ్గాలంటే ఒకటి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవచ్చు. చంటి పిల్లలకు కలిగే దగ్గు, అజీర్ణ విరేచనాలు, జ్వరం, జలుబు, వాంతులు మొదలగు వాటికి ఒకటి రెండు మాత్రలు చొప్పున అవి తగ్గేవరకు ఇవ్వవచ్చు. ఆరునెల్ల నుంచి ఎవరైనా, ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఉదయాన్నే తేనెతో పాటు లేదా అల్లపురసంతో ఇస్తే మేలు.

ఏది ఏమయినా మృగమదము పొందుటకు ఆ జింకను చంపి వృషణముల వద్దనున్న ఆ 

గ్రంధిని వెలికి తీసి ఎండబెట్టి నలుపు రంగునకు మారిన తరువాత పైన తెలిపిన మేరకు 

వాడుతారని చదివినాను, పెద్దల ద్వారా విన్నాను. ఇప్పుడు ఆ విధానము చట్ట 

విరుద్ధంయ్యయ్య్య్యినది. కావున మనకు లభించే కస్తూరి ‘మృగ మదము’ కాదు.

ఈ అవకాశమును కలుగజేసిన ఆ ఇరువురు పెద్దలకు నమస్కరించుతూ శెలవు 

తీసుకొనుచున్నాను.

స్వస్తి.

No comments:

Post a Comment