ఇంత
బ్రాహ్మణ నిరాదరణ సమంజసమా!
https://cherukurammohan.blogspot.com/2021/05/blog-post.html
బ్రాహ్మణుడు అంటే:
ఆగ్తతః చతురో వేదో పృష్ఠతః సశరం ధనుః l
యిదం బ్రహ్మం ఇదం క్షాత్రం శాస్త్రాదపి శరాదపిll
ముందు నాలుగు వేదాలున్నాయి ం వెనుక ధనుర్బాణాలు ఉన్నాయి. అనగా బేయహమతేజము క్షాత్ర తేజము కలకాలం ముందు వెనుక ఉంటాయి.
నిజానికి సత్వ గుణమునకు సాంప్రదాయమునకు బ్రాహ్మణులు ప్రతీక.
ఏ రాజును చూసినా రాజగురువు స్థానములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శ్రీ రామునికి
వశిష్ఠుని లాగా, ధర్మరాజుకు ధౌమ్యుని లాగా, మౌర్య చంద్రగుప్తునికి చాణక్యుని లాగా,
విక్రమార్కునికి వేతాళ భట్టు లాగా శ్రీ కృష్ణ రాయలుకు తాతాచార్యుల లాగా, శివాజీ కి
సమర్థ రామదాసు స్వామి లాగా, టిప్పుసుల్తానుకు పూర్ణయ్య లాగా రాజ గురువులై ఉన్నవారే!
ఏరోజూ తాము రాజులు కావలెనని కుట్రలు, కుతంత్రములు చేసిన వారు కాదు. ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి యుంది.
తన పరిపాలనా కాలములో టిప్పుసుల్తాను చేసిన దురాగతాలు ఇన్ని
అన్ని కావు. ఇపుడు తెలుపుచున్నది ఒకటి
మాత్రమే! కర్నాటకలోని మాండ్యా జిల్లాలోగల మెల్కోటే అనే ఊరు ఆలయాల పట్టణం(Temple Town). అక్కడ
ఉండేవారందరూ అయ్యంగార్ బ్రాహ్మణులు అనగా వైష్ణవులు .
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా మెల్కోటే
అయ్యంగార్ బ్రాహ్మణ వంశస్తురాలే. కొంతమంది మెల్కోటే వాసులు పాత వడయార్ ప్రభువు
పునరుద్ధానం కోసం పనిచేస్తున్నారనే వార్తను నమ్మి, ఆ ప్రాంతంపై దాడి చేసిన టిప్పు దాదాపు 800 అయ్యంగార్లను వధించినాడు.
అనేకమంది అయ్యంగార్లను జైలుపాలుచేసీనాడు. ఆరోజు నరక చతుర్ధశి(దిపావళి ముందురోజు).
నాటి నుండి నేటి వరకూ మెల్కోటే అయ్యంగార్లు,
నాటి వధ కారణంగా నరకచతుర్ధశి జరుపుకోరు.
ఇంత దారుణము బ్రాహ్మణులకు జరిగినా, టిప్పు సుల్తాను కౄరుడని
తెలిసినా పూర్ణయ్య స్వామి ద్రోహము చేయలేదు,
పైగా తన ముస్లిం సహచరులే బ్రిటీషువారికి టిప్పు వినాశనమునకై
తోడ్పడినారు. పూర్ణయ్య తన స్వామి సేవలో యుద్ధములో పాల్గొని తనువు
చాలించినాడు.
సాత్విక గుణ ప్రధానులైన బ్రాహ్మణులు ఏనాడూ, స్వామిద్రోహము చేయుటగానీ, నిమ్న వర్గముల వారిని
నీచముగా జూచుట గానీ చేయలేదు. ఎవరో ఆవిధముగా చేసిన వారు బ్రాహ్మణత్వమునకు కళంకము.
చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకొని క్షమించి వదలివేసింది, అంతకుమించి మన సాంస్కృతిక
వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి
విలాసవంతమైన
జీవితాన్ని అనుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి.
ధర్మ పరిరక్షణకు సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు
మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురి యగుతూనే ఉన్నారు. గత రెండు శతాబ్దాలుగా ఈ
విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది. ఈ దుష్ప్రచారమునకు మూల
కారణము క్రైస్తవులైన ఆంగ్లేయులే! ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది
అత్యంత అసమంజసము అవాస్తావికము అసహ్యకరము. బ్రాహ్మణుల చేత నడుపబడిన నాటి
గురుకులములు అన్ని వర్ణముల వారికీ, అన్ని వర్గములవారికీ తమ తమ వృత్తులకు తగిన విధముగా విద్య నేర్పినవి కానీ
ఎవరినీ ఉపేక్ష చేయలేదు.
బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా
రూపొందించుకున్నారని సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది
కుహనా మేధావుల అభిప్రాయము. అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక
ఆధారాలుగానీ కనిపించనే కనిపించవు. ఒక అబద్ధాన్ని పదేపదే
చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.
కుల వ్యవస్థలో బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే! వారికెన్నడూ
భారతదేశాన్ని పాలించవలెనను చెడు తలంపులేదు. తప్పనిసరిఐతే వెనుదీసింది లేదు.
బ్రాహ్మణులై మహామంత్రులుగాఉన్న ఎందరో మహా యుద్ధానిపుణులు.
పాశ్చాత్యులు, ముఖ్యముగా మెకాలే, జోన్సు, మాక్స్ ముల్లర్(జర్మన్ దేశస్థుడైనా ఆంగ్లేయులకు పని చేసినాడు) వంటి
ఆంగ్లేయులు, చరిత్రను వక్రీకరించి సమస్త
దేశప్రజలను తప్పుదారి పట్టించినారు.
సమైక్య భారతావనికోసం,
చంద్రగుప్త మౌర్యునికి,
తన సర్వస్వము చాణక్యుడు ధారపోసినాడు. చంద్రగుప్తుడు
చక్రవర్తి అయినపిదప చాణక్యుని కాళ్లపై పడి
రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని బ్రతిమాలినా చాణుక్యుడు ‘నేను
బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మము, వారు మధుకరమెత్తి తెచ్చినదే నాకు జీవనాధారము కావున నేను నా గ్రామమునకు పోవుటయే
ధర్మ’ మన్న వేదబద్ధుడు.
పురాణాలలోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా మనము చెప్పగలమా?
కృష్ణ భగవానుడి జీవితగాథలో సుదామునికి (కుచేలునికి)
ప్రత్యేక స్థానం ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. ఆయన రాజ
వంశజుడు. ఇరువురిలోనూ మనము అహంకార ఛాయలు ఏమాత్రమూ చూడము. యాదవులు శాప వశమున
రాజ్యములనేలలేదు, వారు గోరక్షణావ్రత దీక్షాపరులుగా నిలచిపోయినారు. ప్రస్తుతము పశుకాపరులు యాదవులుగా పిలువబడుతూ, ఇతర వెనుకబడిన కులాల
(ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం.
బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ
కులాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహుడు,దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు?
వామనుడు బ్రాహ్మణుడు మరియు
అవతారమూర్తి అయినా ఆయనకు గుళ్ళు గోపురాలు నిర్మించబడలేదే, కనీసము బ్రాహ్మణ గృహములలో
నయినా ప్రత్యేకముగా పూజించుట
లేదే! భోళా శంకరుని విషమే తీసుకొందాము. ఆయన కిరాతుడని
పురాణాలు చెబుతున్నాయి
కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు. ఏ
బ్రాహ్మణుడైనా దానికి అడ్డు తగిలినాడా! లేక శివుని పూజించుట లేదా!
మిగిలినది మరొకమారు .............
ఇంత బ్రాహ్మణ నిరాదరణ ఎందుకు ? – 2
·
బ్రాహ్మణ వర్ణము కేవలము
వేదాధ్యనము పౌరోహిత్యమునకు మాత్రమే పరిమితము కాబడలేదు. వారు చతుషష్టి కళలలో నిష్ణాతులయి
వుండవలె. ‘ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రయం’
అన్న నానుడిని నిజం చేస్తూ కృప ద్రోణ అశ్వథ్థామ, తిక్కన, మొదలగు బ్రాహ్మణులు
యుద్ధము చేసినవారే! గౌర్ బ్రాహ్మణులు ఒకప్పుడు యుద్ధాలకు ప్రసిద్ధమైన వారు. వారిలో
కొందరు సైన్యంలో చేరి,
యుద్ధాలలో పాల్గొనేవారు. మోహియల్ బ్రాహ్మణులు సరస్వతి నది
ఒడ్డున నివసించినవారు. వారు ఒకప్పుడు హిమాలయాల నుండి అరేబియా
సముద్రం వరకు ప్రవహించే సరస్వతి నది ఒడ్డున నివసించారు. వారు భారతదేశాన్ని ఆక్రమించటానికి వచ్చిన ప్రతి ఆక్రమణదారుని మార్గంలో
వచ్చారు, అని ఒక పుస్తకం KW Publishers ద్వారా చెప్పబడింది. మోహియల్ బ్రాహ్మణులు సరస్వతి నది ఒడ్డున
నివసించినవారు. వారు ఒకప్పుడు హిమాలయాల నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహించే
సరస్వతి నది ఒడ్డున నివసించారు. వారు భారతదేశాన్ని ఆక్రమించటానికి వచ్చిన ప్రతి
ఆక్రమణదారుని మార్గంలో వచ్చారు, అని ఒక పుస్తకం KW Publishers ద్వారా చెప్పబడింది. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు అతని బ్రాహ్మణ సైన్యం ముస్లిం
సైన్యంతో పోరాడినట్లు చరిత్రలో చెప్పబడింది.
మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే
పౌరోహిత్యము-బ్రాహ్మణులకు వేదము చెప్పిన
సాంప్రదాయము, భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో జీవితము గడుపుట
వారి విధి.
బ్రాహ్మణుడు వేతనమేమీ లేకుండానే విద్య నేర్పించేవారు. కానీ
లబ్ది పొందినవారు ఈ క్రింది శ్లోకార్థమునకు కట్టుబడి ఉండేవారు.
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాl
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపలబ్ధతేll
విద్యను అభ్యసించే
విషయంలో మూడు విధానాలు చెప్పబడినాయి.1.గురువుగారిని సేవించి,సపర్యలు చేసి ,2.ఆయనకు సమ్మతమైన మేరకు పుష్కలమైన ధనమును ఇచ్చి ,3.తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్య
ను నేర్చుకొనుట మినహా నాలుగవ విధానము
లేదు అని.
పైగా విద్య బ్రాహ్మణులకు మాత్రమే! అనికూడా చెప్పబడలేదు. మరి
ఇవేమయినా సమాజంలో అత్యున్నతమైన పదవులా?
నా
అనుభవములో తిప్పాభట్ల వెంక టసుబ్బయ్య తాత గారిని భోజన వసతి కల్పించి ఉచితముగా వేద,
పౌరోహిత విద్య నేర్పించేవారు.
వాస్తవముగా ఆలోచించితే రాజస గుణోపేతులైన భూస్వాములు –తమ ఆధిపత్యమును చూపుటకు దళితులను దాక్షిణ్య రహితముగా జూచినారేమో? అంతియే గానీ ఆ పని చేసిన
వారు బ్రాహ్మణులు కారు. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైనే! బ్రాహ్మణులే
ఇప్పటికీ
ఆ నింద మోస్తున్నారు. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతము ఉండవచ్చు. ఇప్పుడు
దానికి కూడా దళితుల నుండి పోటీ ఏర్పడినది.
మరి దానికి బ్రాహ్మణులు పెద్దగా ప్రతిఘటించినది కూడా లేదు. అంతా విధి
నిర్ణయమునకే వదలివేసినారు.
చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదు. అసలు
త్రేతాయుగమున ఎందఱో బ్రాహ్మణులు జనక మహారాజు వద్ద తాము ఎన్నో సందేహములను
నివృత్తి చేసుకొనే వారు. జాబాలి మహర్షి, మాతంగుడు ముఖ్యముగా గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు బ్రాహ్మణేతరులై
బ్రహ్మణ త్వమును సాధించినవారు. వీరు అష్టాంగయోగ సాధకులు . పతంజలి యోగ సూత్రాలలో
జాబితా చేయబడిన అష్టాంగములు:
1.యమ 2.నియమ 3.ఆసన 4.ప్రాణాయామం 5.ప్రత్యాహారం 6.ధాణ
7.ధ్యాన 8.సమాధి, ఈ ఎనిమిదింటినీ కలిపి అష్టాంగయోగము అంటారు.
నాటి బ్రాహ్మణునికి
ఇది విధించబడిన నియమము . మరి నేటి బ్రాహ్మలలో కానీసము యమ నియమాలు పాటించేవారుకూడా
కరువైపోయినారు.
ఆ మాటకొస్తే నాడు జ్ఞాన సముపార్జనే వారి ఆశయము. ఇదే వారిని
శక్తిమంతుల్ని చేసింది.
ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణము. ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి
బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని
ఎట్లు రాయగలిగినాడు? ఆయన బ్రాహ్మణుడు కాడే! వ్యాసుడు వేదమునకు వ్యాసములనేర్పరచి, అష్టాదశ పురాణముల రచించి, భారత ఇతిహాసమును న భూతో న భవిష్యతి అన్నట్లు వ్రాసి మనకిచ్చిన వేదవ్యాసుడు
బ్రాహ్మణుడా! నాయనార్లు ఆళ్వారులు అందరూ అన్నిజాతులకు చెందినవారునై ఉన్నారు, అన్నివిధముల దళితులతో సహా!
పైగా బ్రాహ్మణులు గుళ్ళలో ఉన్న వీరి విగ్రహాల
పాదాలకు మ్రొక్కి, వానిన్ ఇ కడిగి ఆజలమును తమపై ప్రోక్షించుకొంటారు. ఇంకా తరచి చూస్తే, ఇతర కులాలకు చెందిన ఎందరో
సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేసినారుకదా?
వశిష్టుని భార్య అరుంధతి, వాల్మీకి, శబరి, మతంగ మహర్షి, సూతుడు, రాముడు, కృష్ణుడు బుద్ధుడు. మహావీరుడు,కబీరు, వివేకానందుడు మొన్నమొన్నటి బాలయోగి, సాయిబాబా, సత్యసాయిబాబా వీరంతా బ్రాహ్మణేతరులే! అనేకులగు బ్రాహ్మణులు వీరి భక్తులు. వీరు
చేసిన బోధనలను మనము శిరౌధార్యముగా భావించుట లేదా?
అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు
కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు. కానీ ప్రాచీన
గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చి గౌరవించినాయి.
అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే గాక పరిరక్షించడమే!
అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు
నరికినారు. గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు లక్షలాది బ్రాహ్మణులను ఎంతో
దారుణముగా చంపినారు. వారిలో సెయింట్ క్సేవియారు ప్రథముడు. The
Basilica of Bom Jesus అన్న చర్చి లో ఉండే ఆతని భద్రపరచిన శవమును
చూచుటకు ఎందఱో హిందువులు ఎగబడుతారు. మరి అర్తను ఎంతో మంది ముస్లిములను కూడా
చంపించినాడు. ఒక్క ముస్లిము కూడా ఆతని శవము చూచుటకు పోడు.
మనకు ఇటువంటి విషయములలో స్వాభిమానము సున్నా. తమపాటికి తాము
ద్వేషరహితముగా జీవించే బ్రాహ్మణులను తిట్టుటకు మాత్రము ప్రతీయొక్కరూ సిద్ధము.
నాడు పాశ్చాత్య మిషనరీలు బ్రాహ్మణులను అనేక వేధింపులకు
గురిచేసినాయి. ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు
గురిచేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడినారా?
వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోసినాడు, పది మైళ్ళ దూరంనుండి
చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోసినాడని
చెబుతారు. మరి ఎన్ని తలలు తెగిఉంటే అంత పెద్ద గుట్ట అయినదో?
ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు
తెగనరికి, వారి స్త్రీల, కుమార్తెల, కోడళ్ళ మాన ప్రాణములు తన అనుచరులతో దోచుకొనజేసినాడు.
వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి
కాచుకున్నాడని అంటారు. ఆతడు అందులకు కూడా సమర్థుడే!
కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు
పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోసినారు.
ప్రాణాలిచ్చినారు కానీ ఒక్క బ్రాహ్మణుడైనా
తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా?
ఎందుకంటే వారు సాత్వికులు, ధర్మనిరతులు, అహింసా వాదులు.
మిగిలినది మరొక మారు .........
ఇంత బ్రాహ్మణ నిరాదరణ ఎందుకు ? – 3
భారత దేశమునకు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్
పోర్చుగీస్ లో ఉన్న తమ రాజుకు ఓ ఉత్తరము వ్రాసినాడు, దాని సారాంశమేమిటంటే ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే
అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని.
ఆహింసావాదమునకు కట్టుబడి, సనాతన ధర్మమునే సర్వస్వముగా భావించిన బ్రాహ్మణులను
విపరీతంగా ద్వేషించేవాడు సెయింట్ జేవియర్.
జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని
కట్టుబట్టలతో గోవాను
వదలి వెళ్లిపోయినారు,
లక్షలాది బ్రాహ్మణులు మరణించినారు.
కాశ్మీర గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని
భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోసినారు. ఇప్పుడు ఈ ప్రాంతములలో
సారస్వత బ్రాహ్మలే కాదు ఏ బ్రాహ్మణులూ
మచ్చుకైనా కనిపించరు.
ఇంత మారణహోమం జరిగినా ఏ బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు
ఉన్నాయా?
ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్నవారు, తామస
జీవనాన్ని కాదు.
పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక చావగా మిగిలిన
కాశ్మీరీ పండితులు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయినారు. కాశ్మీరీ పండిట్లు ఇంత
పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా? అసలు ఆవిధముగా వలస పోయిన పండితులలో
ఒక సమూహము జమ్మూ ప్రాంతములో ఉంటే క్రిస్టియన్ మిషనరీలు కొందరు వాటికన్ సిటీ పనుపున
వచ్చి ఎక్కడలేని ప్రలోభాములు చూపి క్రైస్తవ మతాంతరీకరణ చేయబోతే, అక్కడ ప్రాణాలు తీస్తామని
బెదిరించినా ఆ ముస్లిం జీహాదీలకు లొంగక మా ఆస్తిపాస్తులన్నీ వదలుకొని వలస
వచ్చినాము. అట్టిమేము మీ
ప్రలోభములకు లొంగి మతము మార్చు కొంటామా అన్నారు. ఇంతమంది
గోప్పవారున్న ఈ బ్రాహ్మణ సమాజములో, క్రైస్తవ, ఇస్లాం మతములకు మారి కోట్లు గడించిన వారు కొందరున్నారు. వారి భవిష్యత్తు
భవిష్యత్తుకే ఎరుక. వీరంతా చంద్రబింబము పై
మచ్చలాంటి వారు.
భారత దేశము పైకి
దండెత్తి వచ్చిన అరబ్బులలో మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ
చేయించుకోవాలని షరతు విధించాడట. దానికి
నిరాకరించిన పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట.
ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన
వాస్తవమిది.
‘భారత దేశము పై దండయాత్రలు జరిగిన
సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురియైనారు కానీ బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు
ఒక్కటీ కనబడవు. ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక
గుణాలనే సంపదగా భావించేవారు’ . వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు చదివితేనే తెలియగలవు.
వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులే
అన్న విషయము ఎంతమందికి తెలుసు? ఢిల్లీ రైల్వే స్టేషన్లలో
బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం
కలుగుతుంది కానీ ఇది నిజం. అసలు డిల్లీలో పాకీ పనికి వెళ్ళే
బ్రాహ్మణులు కూడా వున్నారని విన్నాను. మరి మన ధర్మములోని
ఎంతమంది భూస్వాములు ఇటువంటి వృత్తులను చేపట్టినవారు వున్నారు.
న్యూ ఢిల్లీలోని పటేల్ నగర్ లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతము మంది బ్రాహ్మణులే!
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లలో పనిచేసేవారు వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే !
మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు, వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస
పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, పూజారులుగా, పురోహితులుగా
స్థిరపడుతున్నారు. ఏఉద్యోగమునకూ అర్హత లేకుంటే Mals లో Sales Boys గాను Petrol bunks లో Tank Fillers గానూ జీవితాన్ని గడుపుచున్నారు. Trump గారు అమెరికా అధ్యక్షుడయిన తరువాత అందరినీ స్వశతాళలకు వెళ్ళమని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు?సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది.
మిగిలినది మరొకమారు .......
ఇంత బ్రాహ్మణ నిరాదరణ ఎందుకు ? – 4(చివరి
భాగము)
బ్రాహ్మణులు వేదాధ్యయనము, గణితము, ఖగోళ శాస్త్రము, జ్యోతిషము, ఛందస్సు, ఆయుర్వేదము, శస్త్ర చికిత్స, యోగ శాస్త్రము, కామసూత్రములు ( ఇదులో ఎన్నెన్నో కళ్యాణ కారకములగు సద్విషయములున్నవి), నాట్య శాస్త్రము, వృక్ష శాస్త్రము, జంతు
శాస్త్రము మొదలయినవెన్నో వేదముల నాపోశనము పట్టి వెలికి దీసి
పాశ్చాత్యులవలె తమ పేర్లను ప్రకటించునే సంకుచితత్వము లేక నిస్వార్థముగా లోకానికి
సమర్పించినారు.
బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే విలువైన ఈ
శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ
పేర్లు లిఖించుకుని ఉండేవారు.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాఃl
సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ll
‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అంటూ లోక కళ్యాణము, మానవాళి సంక్షేమము కోరి జ్ఞాన సంపదను ఇంతగా వృద్ధి
చేయుటకు తమ జీవితాలను త్యాగం చేసేవారు
కారు. వారు గావించిన ఈ మహోన్నత
జ్ఞాన దానమునకు కృతజ్ఞతగా నేటి సంఘము తలా ఒక రాయిని
బ్రాహ్మణుల పైకి విసరుతూ వుంది. మనసున్నవారు,
తమ మనసు పెట్టి ఆలోచించితే ఇది ఎంతో విచారకరమైన విషయమని
అర్థము కాదా!
‘గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం’ అన్న మాటకు గోవులతో బాటు బ్రాహ్మణులు
మాత్రమే సుఖముగా ఉండవలెనని కాదు వారు శోభస్కరముగా ఉంటే యజ్ఞ యాగాది క్రతువులు నిరాఘాటముగా జరుగుతూ, దేవతలను తృప్తి పరచుతూ వారి
అనుగ్రహముచే ఎటువంటి ఉడుదుడుకులూ లేకుండా ఆనందమయ జీవితమును ఈ
ప్రపంచము అనుభవించవలెనని అర్థము. అదే స్వస్తి వాచన
మంత్రములలో లోకాసమస్తా సుఖినోభవంతు" అని,
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ।
అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం ॥
అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన. ఇది లోక కళ్యాణము
కోరేదే కానీ బ్రాహ్మణులకు మాత్రమే కాదు. అంతేకాక ‘గోబ్రాహ్మణేభ్యః’ అన్నది ఏకవచన
ద్వివచనములుకాదు. అడిబాహువచ్చనము అంటే అందులో మిగత అన్ని వర్ణములవారు కూడా
చేరుతారు. పూర్వులగు బ్రాహ్మణులు వాస్తవాలను
మాత్రమే చెప్పినారు. వారికి సంఘభయము అన్నది తెలియదు. ఆవులూ -బ్రాహ్మణులు ఆ
మాటకొస్తే అన్ని వర్ణములవారు శుభకరంగా
ఉందురు గాక అనుటలో, ssఅరవులకూ. సమస్త జగత్తుకూ,శుభము చేకూరితే ఈ లోకము ధర్మ సంవృద్ధమయి సుభిక్షంగా
ఉంటుందని
అర్థము.
ఇప్పుడు ఆవులకూ విలువ లేదు బ్రాహ్మణులకూ విలువ లేదు.
బ్రాహ్మణులకు విలువ తగ్గుటకు నాకు కొన్ని కారణాలు
కనిపించుతూ వున్నాయి.
1. పరాయి పరిపాలనలో 800 సంవత్సరములు మ్రగ్గుట
2. ఆ కాలములోని రాజులకు తమ మతము వృద్ధి చెందుటకు
బ్రాహ్మణ వినాశనమే అన్న ధృఢ సంకల్పము.
3. ఆంగ్లేయులు మన పండితులను
కవులను చేరదీసి అన్నివిధములా ప్రలోభపెట్టి వారిచేత దాసోహం అని అనిపించుకొని,
సంస్కృతమును తుంగల దరొకకి ఆంగ్లమునకు పెద్దపీట వేసి వారి ప్రాపు సంపాదించుట
4.పరాయి పాలన ముగిసిన తరువాత
కూడా బుద్ధికి పాశ్చాత్య ముసుగులు తొడిగిన వారే ప్రజలనేలుట.
5. ఇతర మతములపై తల్లి ప్రేమ మన ధర్మము పై సవతి ప్రేమను జూపుట.
6. ముఖ్యముగా ప్రభుత్వ
ఉద్యోగమును జీవనాధారముగా చేసుకొన్న బ్రాహ్మణులపై దెబ్బకొట్టి వారిని బలహీనతలకు
బానిసలను జేయుట.
7. అసలు
బ్రాహ్మణులలోనే డబ్బుపైన, సంఘ గౌరవము పైన, ఉన్నతుల యొక్క ప్రాపు పైన విశేషమైన ఆకర్షణ కలిగియుండుట.
8. పౌరోహిత్య
పరమైన ధర్మ కర్మలకు హద్దుమీరి విచక్షణా రహితముగా ప్రతిఫలము నిర్ధనుల వద్ద కూడా కోరుట.
9. యువత, అసలు ధర్మము పైనే విశ్వాసమును తగ్గించుకొని వేద శాస్త్రాదుల ఔన్నత్యము
తెలుసుకొనుట యందు నిర్లిప్తతను ప్రకటించుట.
10. ముఖ్యముగా
పిల్లల పెంపకములో తల్లిదండ్రులు ఏమాత్రమూ శ్రద్ధ వహించక ధనార్జనకు దాసోహమనుట.
ఇన్ని కారణాల వల్ల సమాజములో బ్రాహ్మణ గౌరవము ఇంత దిగాజారి
పోయినది. నేటి బ్రాహ్మణ యువత పోకడను గూర్చిఈ పద్యములను ఎంతో బరువైన హృదయముతో
వ్రాసినాను. తల్లిదండ్రులకు పెంచే తీరుబాటులేదు. పిల్లలకు వినే అలవాటూ లేదు. దిశా
నిర్దేశము చేసే నాటి పండితులు నేడు లేరు. సినిమాలు,
క్లబ్బులు, పబ్బులు, internet, restaurants, ఆడమగ తేడాలేని friendships, junk food,
ఒకటేమిటి బలహీనమైన మనసును ప్రతియోక్కటీ తనవైపు లాగెదే.
బ్రాహ్మణుడు రుజువర్తన కలిగినవాడయితే సాటి మనుషులకు, సమాజానికీ చెప్పగలుగుతాడు. ఎవరయినా
నాలాంటి వారు చెప్ప ప్రయత్నించినా అవి అన్నీ మాకు తెలిసినవే అంటారు. అట్లు కాకుంటే
'ఆఁ ఈ కాలము
చెబితే ఎవరు వింటారండీ' అన్న మాట వస్తుంది. మనము చెప్పకుండానే 'ఎవరు వింటారు అంటే ఎవరు వింటారు. 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ‘ఆరంభింపరు నీచమానవులు...'అన్న నానుడులు మీకు తెలిసినవే కదా!
ఒకరి గుర్తింపు మనకు అవసరములేదు. ఆత్మ తృప్తి ఒకటి కలిగితే
ఆరోగ్యముగా ఉండవచ్చును. ఈ వాస్తవమును నీళ్ళు నిండిన కళ్ళతో మీ ముందుంచుచున్నాను.
ఈ మాట చెప్పుటకు ముందు కర్ణాటక రాష్ట్రములో ధార్వార్ , బేనగళూరు వాటి ఒక 3,4 నగరాలలో ఏదో Competitive Examination కు వెళ్ళిన బ్రాహ్మణ అభ్యర్థుల యజ్ఞోపవీత ముల బలవంతముగా తీయించి పరీక్షకు పంపినారాట.
ధార్వార్ లో అయితే జంధ్యమును కట్టరాతో కత్తిరించి చేతిలో పెట్టి ఇక పోయి పరీక్ష
వ్రాయమన్నాడతా ఆ Security Officer. బ్రహ్మలు సామూహికముగా
ప్రతిఘటించి నిరసనలు ఉద్యమాలు చేపట్టినారు. మరొక ఉదంతము ఏమిటంటే అనురాగ కాశ్యప అనే
హిందీ సినిమాల నిర్మాతదర్శకుడు బ్రహ్మణుని పైన మూత్ర విసర్జన చేస్తానన్నాడట. ఎంతో
బలవంతము మీదట క్షమాపణ చెప్పినాదట. ఇక డా. Professor కత్తి
పద్మారావ్ గారు బ్రహ్మలను అత్యంత హీనాటి
హీనముగా దుర్భాషలాడీనారు. అంటే బ్రహ్మణునిది ఎంత దాయనీయమైన పరిస్థితి అన్నది
గమనించండి. ఆత్మవిమర్శ చేసుకొంటే నీటినీయమములు తప్పి సంచరించువారు మనలో ఉండుట ఒక
కారణమేమో అనిపిస్తుంది. నామనోగతాన్ని ఈ క్రింద ఆశరుపూరిత నాయణాలతో
తెలియజేయుచున్నాను.
ఉపనయన కార్యమ్ములొనరించుటయెగాని
జంధ్యముల్ గూటమ్ము జతను గూడె
భుజము పై జంధ్యంపు ప్రోవులుండినగూడ
సంధ్య వార్చుట మలి సంధ్య జేరె
మంత్రముల్ గొణుగుట మాత్రముండినగూడ
మనసంత మగువలే మసలుచుండె
తర్పణంబులకెల్ల తర్పణము గావించి
తనదైన సుఖముకై తపన బడియెఁ
రెంటికింజెడు
రేవడ రీతి గాను
నడచుచుండగ
బ్రాహ్మణ నవత యువత
నలువ
తలలకు నెనరుతో నయముగాను
అమృతాంజన
మునుబూని యలదె వాణి
మదిరా మాంసము నందునన్ మరులతో మానెన్ సుశాఖమ్ములన్
చెదరెన్ గౌరవ మెల్లపెద్దల యెడన్ చేరంగ దుర్భాగ్యులై
చెదయై పట్టిన దుష్ట మిత్రతతితో చిందేయుచున్ ఊబిలో
పదిలంగా పడి పోగ లేచుటకు నే పంథాలు కన్పట్టకన్
బాపడు ధర్మమున్ విడచి బాయని దుర్గతి పాలుచెంద నా
లోపము అన్యవర్ణములు రూఢిగ జూపుచు గేలిచేయగా
పాపము, ఆపలేక అలవాటును బాపగలేక యాతనా
తాపము చేత తాను పరితాపము చెందుచు నిల్చె బాధతో !
కాబట్టి మనమంతా గ్రహించవలసినది ఏమిటంటే:
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః l
తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్ ll
“చంపబడిన ధర్మము ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది; రక్షింపబడిన ధర్మము అ
ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది; కనుక, ధర్మము చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనము ఆ ధర్మాన్ని సదా
రక్షించవలెను”.
స్వస్తి.
హృదయవిదారకము😢
ReplyDeleteనిజాన్ని నిర్భయంగా, ఎటువంటి దురుద్దేశం లేకుండా తెలియజేసిన మీకు శత సహస్ర కోటి ప్రణామములు.ఆంగ్లేయులు చాలా చాకచక్యం గా హిందువులను విభజించి పాలించారు, దాని పర్యవసానమే ఈ బ్రాహ్మణ ద్వేషం, పరాయిపాలన ముగిసి77 యేళ్ళు అయినా కూడా ఆ ప్రభావం ఇంకా ఉంది కాబట్టే మీలాంటి వారి రచనల అవసరం చాలా ఉంది.జై హింద్.
ReplyDeleteWhile appreciating the agony depicted, Being a Brahmin from an Orthodox Brahmin family, the past history& present trend hurts me too much.
ReplyDelete