Wednesday, 31 March 2021

నేటి తెలుగు – లఘు టిప్పణి

 

నేటి తెలుగు లఘు టిప్పణి

https://cherukurammohan.blogspot.com/2021/03/blog-post_31.html


ఇది 1 ఏప్రిల్ 2015 నాటి మాట.

ఈ రోజు vvs శర్మ గారు ఒక చిన్న మాట - సామవేదం  వారి  నోట వచ్చినది 

ప్రకటించినారు.

దానికి వారి మాటలు , నామాటలు జోడించి ఈ క్రింద ప్రచురించు  చున్నాను.

ప్రశ్న  : "గురువుగారు! అచ్చ తెలుగంటే ఏమిటి?"

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు : "ఇప్పటి తెలుగు వారికి అర్థంకానిది నాయనా!"

Vvs శర్మ గారి మాట: తమిళులు రైల్లో పక్కవారికి తమిళం వస్తుందని తమిళంలో 

పలకరిస్తారు. తెలుగు వాళ్ళు పక్కవాళ్ళకి రాదు అని ఊహించుకుంటారు. మద్రాసులో 

అరవం నేర్చుకున్నారు, హైద్రాబాదు వెళ్ళి నాలుగు ఉర్దూ పదాలు నేర్చుకున్నారు. 

కాన్వెంటుకి వెళ్ళీ బట్లరు ముక్కలు ఒంట పట్టించుకున్నారు. సినిమాలుచూచి సుత్తి, కేక

కొత్త జాతీయాలు సృష్టించారు. ఆత్మ న్యూనతాభావం (inferiority complex) 

అనుకుంటాను. ఆత్మ విశ్వాసం ఉండాలి. భాషపై అభిమానం ఉండాలి. ఇవి ఇంట్లో 

నేర్పాలి.

నాలుగు  నా  మాటలు  : శర్మగార్లుభయులు చెప్పిన మాటలు అక్షర సత్యములు. 

కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రములలో వారి వారి మాతృభాష తప్పనిసరి. మన 

పూర్వులు కొందరు తమ పేరుపలుకుబడి కొరకు కంకణము కట్టుకొని, ఆంగ్లేయ 

ప్రభువుల ప్రాపు గోరి,  మరీ వాడుకభాష అన్న పేరుతో ఈభాషను నాశనముచేయుటకు 

నాంది పలికినారు. అసలువారు కూడా తమ చేతనయినంత నాశనము చేసినారు. 

అందులకు గానూ బ్రిటీషు దొరలతో Sir అన్న బిరుదును కూడా పొందినారు. 

మరియొకరు Madras University SEnate Member అయినారు. ఇవి చాలదన్నట్లు 

దివంగతులయికూడా, ఇప్పటి తెలుగు, వారు పెట్టిన భిక్ష అన్న ఒక అభిప్రాయమును 

కలుగజేసి గౌరవమును పొందుచున్నారు. ఈ రోజు భారత, భాగవత, రామాయణ, 

కావ్యములను చెదలు పట్టినాయా లేదా అని చూచుకొనే అవకాశము కూడా లేకుండా 

చేసినారు.  Vvs శర్మగారుచెప్పినట్లుగా దిశానిర్దేశము లేని యువత తాము మాట్లాడేదే 

తెలుగన్న భ్రమలో పడినారు. తప్పు ఒకరిది కాదు. కానీ మహా పండితులైవుండికూడా 

తెలుగు వినాశనమునకు నడుము కట్టుకొని మరీ వాడుక భాష అన్న విషబీజము 

నాటిన వారిని తెలుగునాడు క్షమించుతుందో లేదో చదువరులవితరణకు వదులుచున్నాను.

నిజానికి మనము పెద్దగా పట్టించుకోని  కేరళ రాష్ట్రములో తెలుగుపై, కర్నాటక 

సంగీతము పై మక్కువ ఎక్కువ. సంస్కృతము వారి సంస్కృతిలో ఒక భాగము. 1980, 90 

దశకములలో వారి చలన చిత్రములలో సందర్భోచితముగా త్యాగరాయ కీర్తనలు యథాతథముగా వాడేవారు. సంస్కృతములో నయితే ఎన్నో పాటలు రచించి గానము చేసినారు. అట్టి రచయితలలో యూసుఫ్ అలి కెచేరి అన్న ముస్లిం రచయిత కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో సంస్కృత గీతములు వ్రాసినాడు. మళయాళ సినిమా రంగములో అవి నేటికీ సుప్రసిద్ధములు. నేటి తమిళ సంగీత కళాకారులు తమిళ సాహిత్యము పై మక్కువ ఎక్కువ చూపుచూ, కర్నాటక సంగీతమునకే నవ రత్నఖచిత మకుటాయమాన మగు తెలుగును తుంగల ద్రొక్కుట ప్రారంభించినారు. నేటికీ కన్నడ, మళయాళ కళాకారులే కర్నాటక సంగీత త్రిమూర్తుల కీర్తనలను శ్రద్ధతో ఆలపించుచున్నారు. తెలుగులోని సంగీత రత్నములు రాలిపోగా ఒక ముగ్గురు నలుగురు అశాదీపమును జగతికి కనిపింపజేయుచున్నారు. ఒక మళయాళ చలన చిత్రములోని ఈ పాటను గమనించండి.

జానకీ జానే రామా! జానకీ జానే

కదన నిదానం నాహం జానే

మోక్షకవాదం ణాహం జానే

జానకీ జానే రామా రామా రామా

జానకీ జానే రామా!

 ఈ సంస్కృత గీతము ‘ధ్వని’ (1988) అన్న మళయాళ చిత్రములోనిది. ఈ శ్రీరామ పరమైన గీతమును వ్రాసినది యూసుఫ్ అలి కెచేరి, బాణీ కట్టినది సుప్రసిద్ధ హిందీ చలనచిత్ర సంగీత దర్శకుడు నౌషాద్ మరియు పాడినది యేసుదాసు మరియు మన సుశీలమ్మ (వేరు వేరుగా పాడినారు). కర్ణపేయమైన ఇటువంటి పాట మనకు కలలోని మాట. ఎందుకంటే సంస్కృతము అంటే బూతుమాటల సముదాయ మనియే కదా మన అర్థము. అందువల్ల సంస్కృతము జోలికి పోము.

అసలు తిరిగీ తెలుగు విషయమునకు వస్తే, ఈ దిగువ తెలిపిన తెలుగు పదాలకు 

అర్థముతెలిసిన వారు బహు తక్కువ అని నా అభిప్రాయము. తుటుము, గమి, అన్నవి 

గుంపునకుపేర్లు. వెలిచెనుఅంటే వెడల గొట్టెను అని అర్థము. తెక్కలికాడు అంటేదొంగ 

అనిఅర్థము. వదచక్కేలిక అంటే కుబేరుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మ, సోకుదయ్యము 

అంటే గాలి, పక్కిడాల వేల్పు అంటే విష్ణువు, పాపతాల్పు అంటే శివుడు,. ఈవిధంగా ఈ 

కాలము వారికి అర్థము కాని ఎన్ని పదములైనా చెప్పవచ్చును. ఇదీ అచ్చ తెలుగు.

మరి తత్సమశబ్దములతో కూడిన తెలుగు తెలుసునా అంటే అదీ అంతంతే. ఇక తత్సమ 

శబ్దముల విషయానికి వస్తే లేలిహాన, జిహ్మగ అన్నవి పాములకున్నఅనేకమయిన పేర్లలో 

రెండు మాత్రమే. చంచుక, సారిక, సుచీముఖ అన్నవి పక్షుల పెర్లగు తత్సమ శబ్దములు. 

మనకు తెలుసునా అన్నది ఆత్మ విమర్శ చేసుకొనవలసిన విషయము. కులీన, సువినీత, 

మహాజన ఇవి గౌరవనీయుడయిన వ్యక్తిని సంబోధించు తత్సమ శబ్దములు. మనకు 

తెలుసునా అన్నది మనము ఆత్మావలోకనము చేసుకొనవలసిన విషయము.

ఈస్థితిలో నన్నయ , తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథ, పెద్దన, విశ్వనాథ, గడియారం, 

పుట్టపర్తి,  మొదలయిన మహానుభావుల గ్రంథాలు తాకుటకు కూడా యోగ్యత కలదా! 

అని కూడా మనల మనము ప్రశ్నించుకోవలసిన దయనీయమైన పరిస్థితిమనది. ఏమిచేస్తాము.

గొరగంగా మిగిలింది జుట్టు.

విడువంగా మిగిలింది కట్టు

చెరపంగా మిగిలింది బొట్టు

చెప్పంగా మిగిలింది గుట్టు

దొరకంగా మిగిలింది పట్టు

మాడంగా మిగిలింది అట్టు

ఉతకంగా మిగిలింది మట్టు

వదలంగా మిగిలింది జట్టు

ఊడంగా మిగిలింది కుట్టు

కొట్టంగా మిగిలింది చెట్టు

నోటిలో మిగిలింది షిట్టు

ఈ పద్యమును కూడా ఒక మారు చిత్తగించండి.

ఏనాటి అగ్రహారమొ

మా నాటికి మాన్యమాయె మాపని దీరన్

మీ నాటి కండ్రిగాయెను

నానాటికి తీసి కట్టు నాగం భొట్టు

ఈ విధముగా తెనుగును రేవుకు చేర్చుటకు ఎందఱో మహనీయుల అవిరల కృషి 

దాగియున్నది. కర్ణుని చావుకు అర్జునుడొకడే కాదు కారణము. శ్రీకృష్ణుడు చెప్పిన 

ఈమాట వినండి.

నరవర నీచే నాచే

వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్

ధరచేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

స్వస్తి.


Wednesday, 17 March 2021

హిందూకుష్

హిందూకుష్ - 1

 https://cherukurammohan.blogspot.com/2021/03/blog-post.html

భాగవతము లోని ప్రహ్లాద చరితము నుండి ఈ పద్యమును గమనించండి.

అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.

లోకంలో గుడ్డివానికి పండువెన్నెల ఉన్నా లేనట్లే, చెవిటివాని చేరి శంఖమ్ము నూదిన 

ఎంక (ఎముక) గొరుకుచుంటివేల అన్నట్లే, మూగ వేదము వర్లిన్చినట్లే, నపుంసకుడు 

సుందరి పొందు కోరినట్లే, కృతఘ్నులతో బంధుత్వము కుదిరించుకొన్నట్లే, బూడిదలో 

పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనట్లే,  పిసినిగొట్టుకు సంపద ఉపయోగపదనట్లే

సూకరము సువాసనను గమనించనట్లే, విష్ణు భక్తి పైన విశ్వాసము లేనట్లే, మన 

యువతకు మన దేశపు నిజచరిత్ర తెలుసుకొను ఉత్సాహము కనిపించదు.

దయతో యౌవకులైనా పెద్దలయినా ఒకమారు ఆలోచించండి. మన దేశము గౌరవమైన 

స్థితిలో ఉంటె మనకు గౌరవము దక్కుతుంది. అది లేకుంటే ఇది లేదు. దేశానికి 

గౌరవము దక్కవలెనంటే, నాదు ఆ గౌరవము ఇప్పటికన్నా మించియుండినదా! లేదా! 

అన్నది తెలుసుకొనుట మిక్కిలి అవసరము. మనము పుట్టిన తరువాత చూడని ఒక 

ఆజానుబాహువు చిత్రపటము చూపించి 'ఆయన మా తాత, పెద్ద జమీందారు' అని 

పరిచయము చేస్తాము. మనము చూడలేదే అంటే, చూచినా మన ఇంట్లోనివారే 

చెబుతున్నారు కదా! అదే మనకు నమ్మకము కలిగించేది. ఆ మహనీయుని స్థితికి తగ్గ 

కుండా మనము వంశ ప్ర్రతిష్ఠను తగ్గకుండా చూచుకొంటే చాలు. ఒకవేళ ఇంకా పై 

అంతస్తుకు తీసుకుపోతే అందుకు ఆనందించె వారము మనమే! మన దేశము 

విషయములో కూడా అంతే! అందుకే ముందు గతము తెలుసుకొందాము. మనదేశపు 

నాటి వైభవముతో పోల్చినపుడు మనమెంతో వెనకాల ఉన్నాము. ఇంతవరక్కూ అనము 

చేసినది అల్లెత్రాదంతా కూడా కాదు మల్లె త్రాడంతే! చేయవలసినది చేంతాడంత..

ఇది నేను మీ ముందుంచబోవు ‘హిందూకుష్’ అను వ్యాసమునకు ప్రవేశిక మాత్రమే!

మిగిలినది మరొకమారు.........

హిందూకుష్ – 2

నిన్న దేశముపై అధికాంశము మన యువతకుగల అశ్రద్ధను గూర్చి చదివినారు. మన 

ఆంగ్లీకృత ప్రసార మాధ్యమముల దయవల్ల మరియు వలసరాజ్యముల పాలనలో 

అలవరచుకొన్న మన బానిస మనస్తత్వము వల్ల, దేశ స్వాతంత్ర్యము లభించిన 

ప్రారంభదశలోనే స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని మన దేశమును ‘లౌకిక దేశము’ గా 

ప్రకటించినాడు. కలిగినది మాత్రము అంతా ‘అలౌకికతయే! అదే మనతో విడిపోయిన 

 పాకిస్తాను మాత్రము మతప్రతిపాదిత దేశము. గుళ్ళు గూపురాల ఆదాయమును 

ప్రభుత్వమూ తాననుభవించుతూ మసీదులకు చర్చిలకు కూడా అందునుండి ‘అత్త సొత్తు 

అల్లుడు దానము చేయునట్లు’ చేస్తూ ఉంటుంది.

ఈ విషయము గమనించండి. Citizenship Amendment Bill (CAB) మరియు 

National Register of Citizens (NRC) లను అమలుపరచే ప్రక్రియలో ప్రస్తుత 

ప్రభుత్వము ఈ కుహనాలౌకియా వాడులనుండి పొండియా ‘ఘర్షణ’ 

(Friction) అంతాయింత కాదు. కొందరు లౌకికవాడులమని చెప్పుకొనేవారు “నేను 

ముస్లిం అని గర్వపడుతున్నాను లేదా CAB ఆమోదించినట్లయితే నేను ఇస్లాం 

మతము లోనికి మారుతాను” అని బెదరించినవారు ఉన్నారు. ముస్లింలు భయంతో 

జీవిస్తున్నారు అని ప్రకటించినారు. నిజానికి నిస్సహాయులై, జీవచ్ఛవముల బోలె 

బ్రతుకుతూ ఉండేవారు హిందువులు. 

పర మతస్తులు ‘వారి భాషలో జులుం’ మరియు అత్యాచరములను ఎదుర్కొంటున్నట్లు 

తెలిపినారు. ఇది వాస్తవముకాదని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, మన జైప్రకాష్ నారాయణ్ 

వంటి పలువురు దేశభక్తులు ఈవిషయమై చెప్పిన మాటలను బేఖాతరు చేసినారు. 

హిందువులకు భయపడి జీవిస్తున్నట్లు నటించే  ముస్లిం మరియు వారి 

సానుభూతిపరులగు కుహనా లౌకిక హిందువులు ఈ విధంగా టీవీ తెరలపై ఎక్కువగా 

మరియు అపుడపుడు వీధులలో ప్రవర్తించుతూ ఉంటారు.

అసలు మన హిందువులకు, ప్రపంచములోని ఏ ఇతరదేశము నకు కూడా సంప్రాప్తించని 

‘హిందూకుష్’ అను ముస్లీములు చేసిన ‘నామకరణము’ను ఎంతో ప్రేమతో 

గౌరవముతో, ప్రీతితో, ఆదరముతో, అభిమానముతో,ఆత్మీయత, ఆప్యాయత, 

అంతఃకరణలతో, వరించి భరించి తరించుచునేయున్నాము.

 శ్రమకోర్చి గూగుల్ లోని పలు చోట్లలో (SITES)వెదకి సేకరించిన సమాచారమును మీ 

ముందు ఉంచుచున్నాను. అసలు ‘హిందూకుష్’ ఏమిటి ఎక్కడవున్నది అన్నది 

తెలుసుకొందాము. దానికి ముందు ఒక మాట. ‘ఖుష్’ అన్నమాటకు అర్థము 

సంతోషించుట సంతోష పెట్టుట అన్న అర్థ సమన్వయము కలదు. కానీ ‘కుష్’ 

అన్నమాటకు అర్థమే వేరు. మనము గూగుల్‌లో హిందూకుష్ అని టైప్ చేస్తే చరిత్రలో 

అపూర్వమైన మారణహోమం గురించిన సమాచారము మనకు కనిపిస్తుంది. 

సంస్కృతములో దీని అసలు పేరు పర్యాయ పర్వతము.

హిందూ కుష్ 800 కిలోమీటర్ల పొడవైన (500 మైళ్ళు) పర్వత శ్రేణి. ఇది ఆఫ్ఘనిస్తాన్ 

అంతటా విస్తరించి ఉంది. ఇది దాని కేంద్రం నుండి ఉత్తర పాకిస్తాన్, తజికిస్తాన్ వరకు 

విస్తరించి ఉంది.

భౌగోళికముగా హిందూ కుష్ హిమాలయా ప్రాంతపు పశ్చిమ విభాగము. ఇది పామీరు 

పర్వతాలు, కారకోరం పర్వతశ్రేణితో కూడిన హిమాలయాల పశ్చిమ దిశన ఉన్నది. ఇది 

సింధు నది లోయ నుండి ‘అము దర్యా’ (పురాతన ఆక్సస్) లోయ ఉత్తర ప్రాంతాలను 

విభజిస్తుంది. ఈ శ్రేణిలో మంచుతో కప్పబడిన అనేక శిఖరాలు ఉన్నాయి. పాకిస్తాన్ 

లోని ఖైబరు పఖ్తున్ ఖ్వా’లో 25,289 అడుగులు ఎత్తులో ‘తిరిచు మీరు’ లేదా ‘టెరిచ్మిర్’ 

వంటి హిమశిఖరాలు ఉన్నాయి. ఉత్తరాన, దాని ఈశాన్య సరిహద్దున చైనా, పాకిస్తాన్, 

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కలిసే ప్రదేశానికి సమీపంలో హిందూ కుష్ పామీరు పర్వతాలు 

ఉన్నాయి. తరువాత ఇది పాకిస్తాన్ గుండా నైరుతి దిశగా విస్తరించి పాకిస్తాన్ 

సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళుతుంది. ఉత్తర హిందూ కుష్ 

తూర్పు కారకోరం శ్రేణితో విలీనం అవుతుంది. దాని దక్షిణపు చివరలో, కాబూల్ నదికి 

సమీపంలో ఉన్న స్పిన్ఘరు శ్రేణితో కలుస్తుంది.

మిగిలినది మరొకమారు.....


హిందూకుష్ – 3

ఇబ్న్  బటూటా

మొట్ట మొదట ‘హిందూకుష్’ అన్న పేరును ఈయన తన ‘రిహ్ల’ అన్న యాత్రాగ్రంథమున 

వాడినాడు. ఇది ఆయన అంత్యకాలములో తానూ చెబుతూవుంటే వేరెవరో వ్రాసినది. 

ఇందులో ప్రక్షిపములు ఉన్నవన్నది అనేక ప్రముఖ చరిత్రకారుల ధృడనమ్మకము.

ఈయన 1304 ఫిబ్రవరి 24 న మొరాక్కో లో పుట్టినాడు. 1324 లో మక్కాకు పోయి తన 

హజ్ యాత్ర ముగించుకొని ముఖ్యముగా ప్రపంచములోగల ముస్లిం రాజ్యాలు ఉన్న 

దేశములన్నీ తిరిగినాడు. వెంట మంది మార్బలముతో బయలుదేరకున్నా వర్తక 

బిడారులతో కలసి తన ప్రయాణమును సాగించినాడు. ఈయన 1,17,000 కి.మీ. 

(72,000 మైళ్ళు) తిరిగినట్లు ఈయన యాత్రానుభవాలు వ్రాసిన రిహ్లా ద్వారా 

తెలియవస్తూవుంది. ఇతడు, చైనాకు చెందినా ముస్లిం యాత్రికుడు జంగ్ హే, 50 vela 

కిలోమీటర్లు అనగా 30వేల మైళ్ళు, వెన్నీసు వాస్తవ్యుడగు మార్కోపోలో ,  24 వేల కి.మీ. 

అనగా 15 వేల మైళ్ళు, కన్నా చాలా ఎక్కువగా తిరిగినాడు. ఈతను చుట్టినవి అన్నీ 

ముస్లిం రాజ్యములు మాత్రమే! ఆయన విడిది చేసిన ప్రతిచోట పెళ్ళిళ్ళు చేసుకొని ఆ 

ప్రాంతము విడిచేసమయములో వారికి 'తలాక్' ఇచ్చి వేరు రాజ్యము చేరేవాడు.

ఈయన మనదేశమును, ఆ కాలములో అత్యంత ధనికుడు, భారతదేశమును 

కొల్లగొట్టుటచే, మరియు మనదేశమును పాలించుచుండిన మహమ్మద్-బిన్-

తుగ్లక్(క్రీ.శ. 1300–1351)మరియు అతని వారసుడు ఫిరోజ్-షా-తుగ్లక్ (1351 to 

1388)ల కాలములో మనదేశమున ఉండినాడు.

ఈయన తిరిగినది ముస్లిం రాజ్యములు. విడిది చేసినది ముస్లిం రాజులతో లేక 

ప్రముఖులతో, తనకు గల భాషా సమస్య వల్ల ఆయన సమాచార సేకరణ అంతా 

ముస్లిములనుండియే జరిగితీరవలసి యున్నది. కావున ‘హిందూ కుష్’ ను గూర్చి 

ఈయన వ్రాసిన వ్రాతలను ఎంతవరకు నమ్మగాలము ఆలోచించండి. అందుకే మనము 

వేరు మార్గములలో కూడా ఈ విషయమును అన్వేషించవలసియున్నది.

పెర్షియన్-ఇంగ్లీష్ నిఘంటువు 'కో' [kʰoʃ] అనే పదం క్రియ ('కోస్టాన్' کشتن [kʰoʃ

ˈt̪ʰæn]) నుండి ఉద్భవించిందని పండితులు చేబుతారు. అంటే హిందువులను ఊచకోత 

కోసిన ప్రాంతము అని మనము తలచే అవకాశము పుష్కలముగా ఉన్నది. ఇందలి 

నిజానిజాలు నెమ్మదిగా పరిశీలింతము.

వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా "కుష్ అనే మాటకు అర్థము మరణము" అని పేర్కొన్నది. 

ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చూసినామంటే, ‘హిందూ కుష్’ అనే పేరు మొదట క్రీ.శ 1333 

లో మధ్యయుగమున మనదేశామును చూడవచ్చిన బార్బరా దేశస్థుడగు ఇబ్న్ బటుటా 

యొక్క రచనలలో కనిపిస్తుంది, దీని అర్థము మాత్రము ' హిందువుల హంత ' అనియే. 

ఇది, ఇప్పటికీ భారత మైదానవాసుల సాంప్రదాయ శత్రువులైన ఆఫ్ఘన్ పర్వత నివాసులు 

నామకరణము చేసి కాపాడుచున్న నామధేయము.

‘హిందువులు ఊచకోత కోయబడిన ప్రాంతము’ అన్న ఒక హీనమానమగు పేరును 

నాటినుండి నేటి వరకు ఎటువంటి అభ్యంతరము లేకుండా స్వీకరించి ఆప్రాంతమునకు 

అదే పేరునుంచి ఆనందించుచున్నామే సిగ్గు పడవలసిన విషయము కాదా!   మరి 

ఇటువంటి సిగ్గుమాలన పేరును తగిలించుకొని తనివితీరా సంతసించే మరొక జాతిని 

ప్రపంచములో చూపగలమా! ఇంతకన్నా పైశాచిక ప్రవృత్తి వేరెచటనైనా చూడగలమా!

మొదట పూర్తిగా హిందువులచే నిండియుండిన ఈ ప్రాంతము రాను రానూ, బౌద్ధుల 

బలమునకు లొంగుటచే మహాయానమునకు సంబంధిన బౌద్ధమతము అచట పూర్తిగా 

వ్యాపించి, బౌద్ధమునకు  ప్రధాన కేంద్రముగా ఉండేది. వీరిని  బామియను బౌద్ధులని 

పిలిచేవారు. కాబట్టి మాటవరుసకు కూడా ఒక్క ముస్లిము కూడా లేని ఆ ప్రాంతము పై 

క్రీ..శ. 8వ శాతాబ్దమునకల్లా  అక్కడి వారిని సమూలముగా ఊచకోత కోసి ఈ పేరును 

ఉంచి యుండవచ్చును. ఆ మారణ హోమమున తప్పించుకొన్నవారు ప్రాణములను 

అరచేతిలో పెట్టుకొని ప్రపంచములోని కొన్ని సురక్షిత ప్రాంతములకు వలస పోయినారు.

మనదేశము స్వాతంత్రము వచ్చిన పిదప ఈ 75 సంవత్సరములలో, వారిని గురించి 

ఎప్పుడూ బాధపడినదిలేదు. దిల్లీలో  కొంతమంది ఆఫ్ఘన్ హిందువులు ఇప్పటికీ 

నివసిస్తున్నారు. వారు ఇక్కడ ఉండటానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి 

ఒకమారు వారిని పరామర్శించితే తెలుస్తుంది. ఆ పర్వతం మీద నలిగిన ఆ నిస్సహాయ 

హిందువుల విలాపములు జంతర్ మంతర్ ను CAB కు వ్యతిరేకముగా ఉన్మాద 

నినాదాలలో ప్రతిధ్వనింపజేసిన ఎంతమంది హిందూదేశపు ముస్లిములకు 

వినిపించింది.తిరిగీ అసలు విషయము లోతులను పరిశీలించితే మనకు, Encyclopedia 

Americana ఈ విధముగా తెలుపుతూ ఉన్నది:హిందూ కుష్ అనే పేరుకు అక్షరాలా 

'హిందూహంత' అన్న అర్థమే తెలుపుతుంది. ఇది భారత ఉపఖండానికి చెందిన 

భారతీయ బానిసలను మధ్య ఆసియాకు రవాణా చేసేటప్పుడు ఆఫ్ఘన్ పర్వతాల యొక్క 

కఠినమైన వాతావరణంలో మరణించిన రోజులను గుర్తుచేస్తుంది. కానీ అచటి విపరీత 

వాతావరణము హింద్దూ బానిసలను మాత్రమె చంపరు కదా! వారిని తరలించే సైన్యానికి 

కూడా అ ఇబ్బంది ఉంటుంది కదా! ఇంకొక మాట ఏమిటంటే హిందువులను వారు 

బానిసలుగా తీసుకు పోయే సమయాన వారి ప్రాణ రక్షణ చేయవలసిన బాధ్యత కూడా 

ఉంటుందికదా! హిందువులను వాతావరణమునకు బలిజేసి వారి శవాలను తీసుకు 

పోయి పనులు చేయించుకొనలేరు కదా!

ఏది ఏమయినప్పటికీ, 14 వ శతాబ్దపు అన్వేషకుడు ఇబ్న్ బటుటా యొక్క రచనలలో 

కనిపించే చారిత్రక ఆధారాలు మాత్రము ఈ అర్థమును గట్టిగా సవాలు చేయుచున్నది. 

కారణమును ముందే పైన తెలియబరచినాను. "హిందూ కుష్" అనే పదాలు మరణానికి 

కారణమైన కఠినమైన వాతావరణ పరిస్థితులను మరియు మంచును సూచిస్తాయని తన 

రచనలలో తెలియబరచినాడట. ఆ ప్రాంతంలో హిందూ అనే పదము ఒక లౌకిక 

పదముగా ఉండినదని, కాబట్టి స్తానికులందరూ హిందువులే కానవసరములేదు అన్న 

అభిప్రాయమును ప్రతిపాదించుట జరిగినది. ఇది భారత ఉపఖండంలోని 

సకలపౌరులను వారి మతపరమైన అనుబంధముతో. సంబంధము లేకుండా 

వివరించడానికి ఉపయోగించబడింది అని తెలుపుట జరిగినది. ఇందులో వాస్తవము 

ఎంతమాత్రము అగుపించుట లేదు. Shafiqur Rahman Barq అనబడు ఉత్తరప్రదేశ్ 

లోని మొరాదాబాద్ లేక సంభల్ MP గా ఉండినపుడు ‘వందేమాతరం’ ఆలపించనని 

సభాభావనము వీడి పోయినాడు. ఇటువంటి వారు తమ గొప్పతప్ప వాస్తవములను 

గ్రహించుదృష్టితో చూచుట బహు అరుదు.


అందుకే ఇచట ఒక వాస్తవమును మీ ముందుంచుతాను.

మిగిలినది మరొకమారు.......

హిందూకుష్ – 4

 దక్షిణాసియాలో ‘ఇస్లాం’ యొక్క ప్రారంభమున ముహమ్మద్ ప్రవక్త మరణము తరువాత 

మొదటి శతాబ్దంలో ఆటే 6వ శాతాబ్దములోనే వచ్చినది. డమాస్కస్‌లోని ఉమయ్యద్ 

ఖలీఫ్ 711 లో ముహమ్మద్ బిన్ ఖాసిమ్ నేతృత్వంలో బలూచిస్తాన్ మరియు సింధ్‌లపై 

దండయాత్రకు పంపినాడు. ఆవిధముగా ఖాశీం సింధ్ మరియు ముల్తాన్లను స్వాధీనం 

చేసుకున్నాడు. అతడు మరణించిన మూడు వందల సంవత్సరాల తరువాత, ఘాజ్నీకి 

చెందిన క్రూరుడగు సుల్తాన్ మహముద్ కుట్ర, కుళ్ళు, కుతంత్రమును ఉపయోగించి, 

ప్రాణభిక్షను పొందికూడా మళ్ళీమళ్ళీ దండయాత్రలుచేసి, రాజపుత్ర రాజ్యాలను మరియు 

గొప్ప హిందూ దేవాలయాలను వరుస దాడులకు పాల్పడి భవిష్యత్తులో  చొరబాట్ల 

కోసం పంజాబ్‌లో ఒక స్థావరాన్ని స్థాపించినాడు. 1024 లో, ఈ క్రూరుడు అరేబియా 

సముద్రం వెంట కతియవార్ దక్షిణ తీరానికి చేరి సోమనాథ్ నగరాన్ని మరియు అచటి 

ప్రఖ్యాత మొదటి జ్యోతిర్లింగమును కల్గిన దేవాలయాన్ని కొల్లగొట్టి అసంఖ్యాకమగు 

ధనరాశులను తనతో గోనిపోయినాడు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చినానంటే ఇబ్న్ 

బటూటా గారి ప్రతిపాదనలో వాస్తవము లేదు, అని తెలుపుటకే! ఎందుంటే ముస్లీములు, 

బటూటా వచ్చిన 14వ శతాబ్దము కన్నా ఎన్న్తో ముందువచ్చి ఎక్కడ తమ రాజ్యాలను 

స్థాపించుకొన్నారు. ముస్లిం లు ఎన్నడూ ‘హిందువులు’ గా పిలువ ఇచ్చగించనే 

ఇచ్చగించరు కదా! మరి ఆయన ప్రతిపాదన వీగిపోతుంది కదా!ఈ వాస్తవము చూడండి. 

18 వ శతాబ్దం చివరలో యూరోపియన్ వ్యాపారులు మరియు వలసవాదులు సమిష్టిగా 

కొన్ని భారతీయ మతాల అనుచరులను హిందువులు అని పేర్కొన్నారు కానీ అందులో 

ఇస్లాం మతస్థులు మాత్రము లేరు అని తెలియజేసినారు.

హిందూ కుష్ అనే పేరు చారిత్రక కోణము నుండి చూచుట దాదాపు 18వ శతాబ్దము 

మధ్యకాలనుండి మొదలయి ఉండవచ్చు. దీనిని గూర్చి  అరబ్ భూగోళ శాస్త్రవేత్తలు ఇబ్న్ 

బటూటా కు మునుపు ప్రస్తావించిన దాఖలాలు లేవు. మొదటిసారి ఎబ్న్ బటూటాఅరబిక్ 

లో వ్రాసిన ‘రిహ్లా’ అనగా ‘ యాత్రా విశేషములు’ అన్న అర్థమును మనము 

తీసుకొనవచ్చును (ca. 1330; tr., P. 53; Le Strange, Lands, p. 350). ర్క్కువగా ఈ 

యాత్రలు ముస్లీము పాలనా దేశములను ఎక్కువగా పరిగణనలోనికి తీసుకొనుట 

జరిగినది. కొంత ముస్లిం పక్షపాతము కూడా ఇందు కానవస్తుంది.

షాహిర్-అల్-దిన్ బాబర్ యొక్క హిందూ కుష్ కనుమల జాబితా కాబూల్ కు ఉత్తరాన 

ఉన్న ఎత్తైన పర్వత శ్రేణికి పరిమితం చేయబడిందని తెలియవస్తుంది, అంటే 

ముఖ్యముగా పశ్చిమ హిందూ కుష్, దీనిపై ముఖ్యమైన వాణిజ్య మార్గాలు భారతదేశం \

లేదా కాబూల్ నుండి ఖానాకాన్ లేదా టురాన్ (బాబోర్- nāma, foll. 130a-31a, 

272b. tr. బెవిరిడ్జ్, పేజీలు 204-5, 485). భారతదేశం నుండి తుర్క్ మెనిస్తాన్ వెళ్లే 

కనుమల గుండా  ఎత్తైన పర్వత శ్రేణి దాటుతున్నప్పుడు ప్రమాదాలకు అనేకమంది 

హిందూ బానిసలు బలైపోయారని అందువల్ల ఆ ప్రాంతానికి  హిందూ కుష్ (హిందూ-

కిల్లర్) అనే పేరు వచ్చినట్లు ఇబ్న్ బటూటా వ్రాతల వలన తెలియవస్తూ వున్నది కానే 

వాస్తవము ఎండమావి మాత్రమే!

కొంతమంది రచయితలు "హిందూ కుష్" కోసం హిందువులను చంపినారాను అర్థాన్ని 

ప్రతిపాదించినారు, ఇది ఎన్సైక్లోపీడియా అమెరికానాలో కూడా వ్యక్తపరుపబడినది.

హిందువులు చారిత్రకమగు మతపరమైన హింసను అనుభవించినారు. బలవంతపు 

మతమార్పిడి, హిందువుల ఊచకోత, దేవాలయాల కూల్చివేత మరియు అలవికి మీరిన 

అపవిత్రత అలాగే విద్యా కేంద్రాల వినాశ రూపములో మనలను ఈ హింసకు గురి 

చేసినారు.

చారిత్రాత్మకంగా, హిందూ కుష్ మీదుగా ఉన్న రహదారులు గొప్ప సైనిక ప్రాముఖ్యత 

కలిగివున్నాయి, భారతదేశము యొక్క ఉత్తర మైదానాలకు. విదేశీ ఆక్రమణదారులగు, 

క్రీ.పూ 327 లో అలెగ్జాండర్ మొదలుకొని, క్రీ.శ 1398 లో తైముర్లేన్ వరకు మరియు 

1001 లో ఘజ్ని యొక్క మహముద్ నుండి క్రీ.శ 1739 లో నాదర్ షా వరకు 

విడదీయలేని సంబంధము ఉన్నది. అందరూ ఈ కనుమల ద్వారా ప్రవేశించుతూ 

హిందూ బౌద్ధజైనులను తమ కౄరతకు బలిచేసినవారే!

19 వ శతాబ్దం ప్రారంభంలో వాయువ్యంలో రంజితు సింగు ఆధ్వర్యంలో సిక్కు 

సామ్రాజ్యం హిందూ కుష్ శ్రేణి వరకు విస్తరించింది. 1896 వరకు చివరి 

బహుదేవతారాధకుల కోట "కాఫిరిస్తాన్” అని పిలువబడింది. అమీరు అబ్దురు రెహ్మాను 

ఖాను ఆధ్వర్యంలో ఆఫ్ఘన్ల దండయాత్ర జరిగే వరకు ఇక్కడి ప్రజలు హిందూ మతాన్ని 

మాత్రమే అవలంబించి యుండినారు.

మరొకమారు  చివరిభాగము.........

హిందూకుష్ – 5 (చివరి భాగము )


Hindu.org అంతర్జాల క్షేత్రము (Website) లో శ్రీనందన్ వ్యాస్ గారు ఈ విధముగా 

తెలియజేసినారు.: 'పెర్షియన్ భాషలో, "కుష్" అనే పదం కుష్తార్ అనే క్రియ నుండి 

వచ్చింది - వధ లేదా మారణహోమం, ఎందుకంటే అక్కడ నివసిస్తున్న 

హిందువులందరూ వధించబడ్డారు. ఎన్సైక్లోపీడియా అమెరికానా హిందూ కుష్ గురించి 

చెప్పింది: ఈ పేరుకు "హిందువులను చంపిన ప్రదేశము" అని అర్ధము. భారత 

ఉపఖండానికి చెందిన హిందూ బానిసలను, మధ్య ఆఫ్రికాలోని వివిధ ప్రాంతముల 

నుండి వారి ఉత్పత్తులను హిందూదేశ ముస్లిం పాలకులు రవాణా చేసుకొనుచున్నపుడు, 

బదులుగా మార్పిడి చేయు కాలమున  కఠినమైన ఆఫ్ఘన్ పర్వతాలలో అనేక హిందూ 

బానిసలను అనేకానేక హింసలకు గురిచేసి చంపిన రోజులను గుర్తుచేస్తుంది. 

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా క్రీస్తుశకం 1333 లో మొదట హిందూ కుష్ అనే పేరు ఇబ్న్ 

బటుటా యొక్క రచనలలో కనిపించింది, మధ్యయుగ బర్బర యాత్రికుడు, ఈ పేరుకు 

"హిందూ హంత" అని అర్ధము చెప్పినాడు. కానీ ఆ మాటను శీతోష్ణస్థితికి ఇముడలేక 

హిందూబానిసలు చచ్చినారని, వాస్తవాలను కప్పిపుచ్చినాడు.హిందువుల సాంప్రదాయ 

శత్రువులైన ఆఫ్ఘన్ పర్వత ( ఈపేర్లన్నీ ముస్లీములు పెట్టుకోన్నవి) నివాసులు ఇప్పటికీ ఈ 

పర్వత శ్రేణికి ఆపాదించిన పేరు ఇదే!

యూదుల మారణహోమము వలె, ‘హిందూ కుష్’ పేరున జరిగిన హిందూ 

మారణహోమము యొక్క ఖచ్చితమైన సంఖ్య అందుబాటులో లేదు. అయితే ఈ సంఖ్య 

సులభముగా లక్షల్లో ఉండవచ్చును. ‘ఈ అంచనాను సమర్థించడానికి కొన్ని తెలిసిన 

చారిత్రక వ్యక్తుల చరిత్రలనుండి గ్రహించవచ్చును. క్రీస్తుశకం 1398 లో, తైముర్లేన్ 

50,000 డిల్లీ యుద్ధానికి ముందు కనీసం 50,000 మంది బందీలను ఉరితీయాలని 

ఆదేశించినట్లు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గుర్తుచేసుకుంది; అదేవిధంగా, తైముర్లేన్ 

సైన్యం చేత చంపబడిన బందీల సంఖ్య సుమారు 1.00,000.

ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో మొఘల్ చక్రవర్తి అక్బర్ 'క్రీస్తుశకం 1568 ఫిబ్రవరి 24 న 

పట్టుబడిన 30,000 మంది రాజ్‌పుత్ హిందువులను ఊచకోతకు ఆదేశించాడని, 

చిత్తౌడ్ కొరకు చేసిన యుద్ధము తరువాత, అక్బర్ ఆస్థానచరిత్రకారుడు అబుల్ ఫజల్ 

ధృవీకరించిన సంఖ్య' గా పేర్కొనబడినది. హిందూ రాజ్యాలలో భాగమైన పశ్చిమ 

ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ నగరంపై పలుసార్లు జరిగిన దండయాత్రలలో '15,00,000 

మంది నివాసితులు మరణించినారు' అని ఆఫ్ఘన్ చరిత్రకారుడు ఖొండమిర్ నమోదు 

చేసినాడు. ఇంతటి అవమానమును ఈనాతికే ఎంతో నిర్లిప్తముగా, నిమ్మకు 

నీరెత్తినట్లుండుట మనకే సాధ్యము. ప్రపంచములోని అత్యంత అవమానకర 

నామధేయము కలిగిన ఏకైక దేశముగా మనము ఎంతో వన్నె వాసి చేకూర్చుతూనే 

ఉన్నాము.

హిందూకుష్షను నామ మెంత ఘనమో హేమంపు సాదృశ్యమో

సందేహమ్మిసుమంత లేక మదిలో సంతోషమున్ గూర్చగా

నిందాపూర్వము హీనమానము మరిన్ నీచంపు భావార్థ మే

ఉందా మాటనటంచు నాకు తెలియన్ ఔర్వంబుతో మ్రగ్గితిన్

ఔర్వము = బడబానలము, సముద్రములోని విపరీతాగ్ని.

స్వస్తి.