చాణక్య - నవ నందులు - ఒక క్లుప్తమైన వివరణ
https://cherukurammohan.blogspot.com/2021/01/blog-post_10.html
P D Prasada Rao
గురువు గారికి నమస్కారములు. కఠోర మనస్కుడై తనకు జరిగిన అన్యాయమునకు
నందవంశము నాశనము చేసినాడు. దయచేసి ఇందు నందవంశము నకు వివరణ
ఇవ్వగలరు.
నాకు తెలిసిన మేరకు వీలయినంత క్లుప్తముగాఈ సంశయము తీర్చే ప్రయత్నము
చేస్తాను.
క్షౌర వృత్తి చేసే మహాపద్మనందుడు శిశునాగ వంశమునకు చేందిన చివరి రాజుకు క్షవరము
చేసే సమయములో రాజు 'క్షురకుడా' అని అవమానించే వాడు ఆ అవమానము భరించలేక
ఒక రోజు మహాపద్మనందుడు క్షవరం చేసే సమయములో ఆ కత్తితోనే ఆ రాజును సంహరిస్తాడు. ఆ తరువాత మహాపద్మనందుడు అఖీల భారతావనిని ఆక్రమించుకోని నంద రాజ్యమును స్థాపించి పాలిస్తాడు. కానీ వేరువేరు చరిత్రకారులు ఈ విషయమును వేరువేరుగా తెలిపినారు. ఏది ఏమయినా ధన నందుడు క్షురక వంశమునకు చెందినవాడన్నది బహుళముగా ప్రచారములో ఉన్నది.
పై విధముగా మహా పద్మనందుడు నందవంశపు మూలపురుషుడైనాడు(క్రీ.పూ.424, కాల
నిర్ణయము తప్పు కూడాకావచ్చు). అసలు మహా పద్మము విలువ లక్ష కోట్లు.అంత
బంగారమును గంగానది నీటిని మరలించి ఆ ఇసుకలో దాచియుంచుట చేత ఆయనకు
ఆపేరు వచ్చినట్లు కూడా చెబుతారు. ఆతను కానీ అతని కుమారులగు నవనందులు కానీ
మంచిపేరు తెచ్చుకోలేక పోయినారు. మహా పద్మనందుని పెద్ద కుమారుడు ధనందుడు రాజై
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేళీవిలాసాలకు బానిసై కాలక్షేపం చేసే సంగతి దక్షిణాదిని
(ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడుకి తెలుస్తుంది. అతడు తెలివైనవాడు.
శక్తిమంతుడు. మగధపై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు. ఈ
విషయం తెలిసిన చాణక్యుని తండ్రియగు చణకుడు మహానందుడిని కలిసి రాబోతున్న
ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ‘ఏం చెయ్యాలో నాకు తెలుసు. నాకు నీతులు చెప్పడానికి
వస్తావా?’ అని ఆగ్రహించి అతనికి మరణ శిక్ష విధించుతాడు. అలక్జాండర్ దండయాత్ర
విషయములో ఇదేవిధముగా చాణక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణుగుప్తుడు (ఈ మూడూ ఒక
వ్యక్తి పేర్లే!) సలహా ఇవ్వ బోతే అతని జుట్టుబట్టి బయటికి లాగించుతాడు ధననందుడు. ఆ
సందర్భములో చాణక్యుడు నందవంశ పాలన నిర్మూలనానంతారమే ఆ జుతూ
ముడివేసుకొంటానని శపథము చేసి వెళ్ళిపోతాడు.
నవ నందులు
పంధుక నంద
పంఘుపతి నంద
భుతపలనంద
రస్త్రపలన నంద
గొవిషనక నంద
దషసిధక నంద
కైవర్త నంద
మహేంద్ర నంద
ధన నంద – (‘నవనంద’ రాజులలో చివరి వాడా మొదటివాడా
అన్నది శేష ప్రశ్నయే!)
మహా పద్మ నందుని భార్యయో లేక వివాహేతర సంబంధమో నిర్దారించలేము కానీ
చంద్రగుప్తుని గుర్తించి అతనికి సకల విద్యలూ నేర్పించి రాజగుటకు తగిన యోగ్యతను
సంతరించి తిరుగుబాటు యుద్ధము లేకుండానే నందులను రాజ్యభ్రష్టులను చేసి
చంద్రగుప్తుని రాజుగావించుతాడు.
ఆ విధముగా రాజ్య బహిష్కృతులైన నవనందులు నలమల అడవులుజేరి కర్నూలు జిల్లా
నంద్యాలకు దగ్గర ఉండే మహానంది సమీపములో నవనదిఆలయములను నెలకొల్పి
గుట్టుగా రాజ్య పాలన చేసినారని చెబుతారు. ఇది కాకా ఎన్నో వేరు వేరు కట్గాలు కూడా ఉన్నాయి.
ధననందుడు తన రాజ్య కాలములో మంత్రి రాక్షసుని మంత్రాంగముతో చాణక్యుని ఎన్నో
ఇడుముల పాలు జేసినా అన్నింటినీ అధిగమించి
చంద్రగుప్త మహారాజును చేస్తాడు.
Dr. చంద్రప్రసాద్ ద్వివేది హిందీలో రచించి, దర్శకత్వము నేరిపి, చాణక్యునిగా నటించిన
‘చాణక్య- దూరదర్శన శృంఖల’ ఆసాంతము చూస్తే అనేక విషయములు తెలియగలవు.
ఆయన పరిశోధన ఫలితము ‘చాణక్య’.
This took me to Nandha period .... chankya
ReplyDelete