Friday, 25 December 2020

.విపాశ-బిపాష-బీయాస్

 

విపాశ-బిపాష-బీయాస్

https://cherukurammohan.blogspot.com/2020/12/blog-post_25.html

బిపాషా బసు కాదండోయ్! ఇది ఒక నది. దీనిని ఇప్పుడు ఎంగిలిపీసు వాడు పెట్టిన 

‘బియాస్’ పేరుతో పిలుచుకొంతున్నాము. ఈ నది పంజాబులో ప్రవహించే  నదులలో 

ఒకట. అసలు ఈ 5 నదుల ఇప్పట పేర్లు ఏమిటంటే 1. ఝీలం 2. చీనాబ్ 3. రావి 4. 

బియాస్ 5. సట్లేజ్. మనమిపుడు బియాస్ నదిని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. 

ఇప్పటికీ దీనిని బిపాష అని పిలిచేవారున్నారు. జాన్ అబ్రహం అన్న హిందీ సినిమా 

హీరోతో సంబంధము నెరిపి అటుపిమ్మట కరణ్ సింగ్ గ్రోవర్ అన్న Model ను 

పెళ్ళిచేసుకొంది. ఆ వాస్తవికతను అక్కడ వదిలి అసలు కథకు వద్దాము.

వశిష్ఠుమహర్షి కల్మాష పాదుడు అనే మహారాజుకు యాజకుడు అనగా యజ్ఞములు 

చేయించే పురొహితునిగా ఉంటూవుండినాడు. విశ్వామిత్రునికి కూడా అదే కోరిక 

కలిగింది.

ఒకరోజు కల్మాషపాదుడు వేటకు వెళ్ళి అలసిపోయి సమీపములో ఉన్న వశిష్టుని 

ఆశ్రమానికి వెళుతున్నాడు. దారిలో వశి వశిష్ఠుని కుమారులలో పెద్ద వాడైన శక్తి 

ఎదురుగా వస్తున్నాడు. కల్మాష పాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకి దారి 

ఇవ్వమన్నాడు.

"రాజా, ఎంతటి గొప్ప వారైనా, బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినపుడు తప్పుకొని దారి 

ఇస్తారు. ఇది ధర్మం" అని అన్నాడు. ఆ మాటలకు కోపంచి, కల్మాష పాదుడు తన 

చేతికర్రతో శక్తిని కొట్టినాడు.

శక్తికి కోపం వచ్చి "నన్ను రాక్షస బుధ్ధితో అవమానించావు. నువ్వు రాక్షసుడివై 

నరమాంసం తింటూ జీవించు" అని శాపం ఇచ్చినాడు.అప్పుడు కళ్లు తెరిచాడు 

కల్మష పాదుడు. అతనిని వశిష్టుని పెద్ద కుమారుడిగా గుర్తించి, శాప విమోచన 

కొరకు ప్రార్థించినాడు.

ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు, కల్మష పాదుని మనసులోకి 

కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టినాడు. అప్పటి నుండి కల్మాష పాదుడు 

రాచకార్యములు మానివేసినాడు.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మష పాదుని వద్దకు వచ్చినాడు. తనకు మాంసాహార 

భోజనం కావాలని అడిగినాడు. సరే నని రాజు అనగా ఆ బాపడు వెడలిపోయినాడు. 

కాని రాజు ఆ మాట వంటవానికి చెప్ప మరచినాడు. రాత్రి పొద్దు పోయిన తరువాత 

విషయము గుర్తుకు వచ్చిన రాజు వెంటనే వంట వాడిని పిలిచి "నేను ఒక 

బ్రాహ్మణుడికి మాంసాహార భోజనం పెడతాను అని చెప్పినాను. అతనికి భోజనం 

పెట్టు" అని అన్నాడు.

దానికి వంట వాడు ఇంత చీకటివేళ మాంసము దొరుకదన్నాడు.  కింకరుడు 

అప్పటికే కల్మష పాదుని మనసును ఆవహించియుండుటచే నర మాంసమైనా వండి 

వడ్డించమని ఆదేశించినాడు.

సరేనని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నరమాంసం వండి పెట్టినాడు. ఆ బ్రాహ్మణుడు 

దానిని తిని అది తిన్నది నరమాంసమని గ్రహించినాడు. ఆతను కోపముతో "నర 

మాంస భోజనము నాకు పెట్టినందుకుగానూ  నీవుకూడా  నరమాంస భక్షకుడగు 

 రాక్షసుడివై పొమ్మని శపించినాడు. కల్మాష పాదుడు వెను వెంటనే రాక్షసునిగా 

మారిపోయినాడు.

కల్మాష పాదుడు వెంటనే శక్తి వద్దకు వెళ్లి "దీనికంతా నువ్వే కారణం ముందు నిన్నే 

తింటాను" అని శక్తిని చంపి తిన్నాడు. అంతటితో ఆగకుండా వశిష్ఠుని 

మిగతపుత్రులను చంపి తిన్నాడు.

ఆ ఘోరమమును గాంచి భరించలేక ప్రాయోపవేశమును గావించనెంచినాడు అంటే 

ఆత్మ హత్య చేసుకోదలచినాడు ఆ మహర్షి. పుత్ర శోకముతో తల్లడిల్లు వశిష్ఠుడు 

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి ఆ ప్రాంతమున పారే నదిలో కాళ్ళకు పెద్ద 

బండరాతి కట్టుకొని దూకినాడు. లోకోత్తర పుణ్యాత్ముడగు ఆ మహానుభావుని తనలో 

ఇముడ్చుకొనలేక ఆ నదీదేవత ఆయన బంధములను విడదీసి ఒడ్డు చేర్చింది. దైవ 

సంకల్పమును అర్థము చేసుకొన్నవాడైన ఆయన ఆశ్రమమునకు బయలుదేరినాడు.

వశిష్ఠుని కట్లు విప్పి ఆత్మ హత్యనుండి కాపాడిన ఆసమయము నుండి ఆ నదికి 

‘విపాశ’ అన్నపేరు వచ్చినది. ‘విపాశ’ అంటే ‘పాశ విముక్తుని చేసిన’ అని 

అన్వయము. 

ఆ ‘విపాశ రాను రాను ‘బిపాష’యై ఆంగ్లేయుల నోటబడి ‘బీయాస్’ అయినది.

స్వస్తి.

1 comment:

  1. Very good information given by you sir. It's beyond our reach. Thanks for the post.

    ReplyDelete