కనక దుర్గమ్మ
https://cherukurammohan.blogspot.com/2020/04/blog-post.html
ధాన్య కటకమును రాజధానిగా చేసుకొని ఇంచుమించు క్రీ.శ. 540 ప్రాంతములో విష్ణుకుండిన వంశజుడగు మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ఆయన కుమారుడు మాధవ వర్మ. ఒకనాడు మాధవ వర్మ వనవిహారార్థమై, యువకుడగుటచే అవసరమునకు మించిన వేగముతో తన రథముపై, నాటి అత్యంత సుందరమగు వనమునకు, బయలుదేరినాడు.
ధాన్య కటకమును రాజధానిగా చేసుకొని ఇంచుమించు క్రీ.శ. 540 ప్రాంతములో విష్ణుకుండిన వంశజుడగు మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ఆయన కుమారుడు మాధవ వర్మ. ఒకనాడు మాధవ వర్మ వనవిహారార్థమై, యువకుడగుటచే అవసరమునకు మించిన వేగముతో తన రథముపై, నాటి అత్యంత సుందరమగు వనమునకు, బయలుదేరినాడు.
అనుకోని విధముగా ఆ రథ
మార్గమునకు అడ్డముగా ఒక పశుపాలకుడగు బాలుడు ఆ త్రోవన నడిచే ఆవులను తప్పించి, తానూ
తప్పుకోలేక రాతచాక్రములకు ఆహుతియైపోయినాడు. యువరాజు తన రథమును ఆపక ప్రయాణమును
కొనసాగించినాడు. లేక లేక కలిగిన ఆ బాలుని తల్లికి విషయము తెలిసి తన కుమారుని శవము
వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించి రాజునకు ఫిరియాదు చేయ నిశ్చయించుకొని
రాజధానికి బయలుదేరి పోయి తన బాధను రాజుకు మొరపెట్టుకొనింది. ధర్మ పథమును దాటని
రాజు నేరస్థుని కనుగొని, ఆ బాలుడు మరణించిన రీతిగానే మరణ శిక్ష విధించుతానని నిండు
సభలో ప్రతిన బూనినాడు.
తక్షణము తన గూఢచర్యవర్గమునకు
తగిన ఆదేశములిచ్చి నేరస్థుని పట్టి తెమ్మన్నాడు.
రాజాజ్నకు కట్టుబడిన ఆ
గూఢచారులు వాస్తవమును రాజు చెవిన వేసినారు.
పుత్రహీన యైన ఆ తల్లికి
ఇచ్చిన మాట నిలబెట్టి ధర్మమునకు స్వపర భేదము లేదని చాతదలచిన వాడై, యువరాజును
బంధించి ఆ గోపబాలుడు మరణించిన స్థలమునకు తెమ్మని ఆజ్ఞానొసగినాడు. తానూ రథముపై బయలుదేరి నిర్ణీత ప్రదేశమును
జేరినాడు.
ఆబాలుడు మరణించిన
తీరుగనే యువరాజు కూడా రథము తొక్కిడితోనే మరణించవలెనని దండన విధించినాడు.
ఆయన తన భటులకు ఆజన
యొసంగినా ఎవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు రాజే దండన అమలుపరచినాడు, జరిగిన ఈ వృత్తాంతమునంతా
అక్కడే కొండపైనున్న ఒకదేవతామూర్తి రాజు
ధర్మనిరతికి హర్షించి బంగారు కాసులు వర్షిన్చుతయే గాక బాలకులిరువురినీ తన కరుణాకటాక్ష
వీక్షణతో బ్రతికించినది.
ఆతల్లినే వారంతా కనక
దుర్గ అను పేరుతో ఆలయము నిర్మించి పూజించినారని కథనము.
ఆ ప్రాంతమే నేటి విజయవాడ.
స్వస్తి.
No comments:
Post a Comment