భారతమందున గుహ్య భాషణము
భారతమునందు
గుహ్యభాషణము
భారతము
అంటే పాండవులు కౌరవులు కృష్ణుడు, శకుని, కర్ణుడు, భీష్ముడు
ద్రోణుడు మొదలగువారు తెలుసు సాధారణ పాఠకుడికి. కానీ అది అశేష అనర్ఒ రత్ఘ సముదాయమును కల్గిన మహార్ణవమని
ఎందరికి తెలుసు. నేటి యువతకు తెలుగు భారతము చదివే శక్తిలేదు. కొందరికి అసలు ఆ
ఉద్దెశ్యమే లేదు. లక్షలు పెట్టి Motivation Lectures కు
పోతారు గానీ అవన్నీ ఒక వ్యాసభారతము కలిగియున్నది అన్నది ముఖ్యముగా యువత తెలియలేకున్నది. ఒక్క భగవద్గీత
తప్పించి ఆంద్ర భారతము కూదా అంతే గొప్పగా వ్రాయబడినది. భగవద్గీత తెనిగింపబడలేదు.
వాడుకభాష పేరుతో మనకు సకల ఆంద్ర గ్రంధములనూ దూరము చేసి, ఆంగ్లేయులచే బిరుదములు
పొంది, ఆధునిక వాదులచే అందలమెక్కి ఊరేగుచున్న మహనీయులకు నమస్కారము.
భారతములోని
కొన్ని ఘట్టములలో ఆయా పాత్రలు తమ మధ్య, మిగతా పాత్రదారులుండగనే, రహస్య సంభాషణలు
జరుపుకొన్న సంనివేషములు ఉన్నాయి. అందు రెండు మీకు అందజేయుచున్నాను. చదివేది.
యో
జానాతి సంప్రజ్ఞాం నీతి శాస్త్రానుసారిణీంl
విజ్ఞాయేవ
తథాకుర్యాదాపదం నిస్తారేద్యథాll
నీతి
శాస్త్రమును అధ్యయనముచేసి అనుసరించేవాడు తదనుగుణముగా వ్యవహరించి ఆపదలను బాపుకొంటాడు అన్నది నీతిశాస్త్ర నిర్వచనము. నీతి జీవితరీతి
అయినదంటే ఆ వ్యక్తి ఆలోచనకు పెద్దపీట వేస్తాడు. అందువల్ల ఆపదలను దరి రానీడు.
తనమాటపై గౌరవమున్నా లేకున్నా తానూ చెప్పదలచినది చెప్పుటకు తటపటాయించడు. తనలోని
చురుకుదనముతో తనకు అయినవారికి పదిమంది మధ్యలో ఉన్తూకూడా తానూ చెప్పదలచినది
గుహ్యమయిన రీతిలో తెలియజేస్తాడు. తనకూ తానూ చెప్పెవ్యక్తికి నడుమ అంతటి ప్రగాఢ
సంబంధము నెలకొనియుంటుంది. దీనిని అనుసరించి మన వ్యాస భారతములో ప్రకాశముగా జరిగిన అంటే
ఒకవ్యక్తి తాను చెప్పదలచినది చెప్పవలసిన వ్యక్తితో చెప్పవలసిన మాట బిగ్గరగా అతని
చురుకుదనమును అంచనావేసి అతనికి అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉంటాడు కానీ చుట్టూ వున్న
ఇతరులకది చేతిలో కోయుటకు కత్తిలేని పనసపండే!
ఇటువంటి
సంభాషణల ద్వారా ఒక విషయము మనకు తెలియవస్తూవుంది. ఈ సంస్కృత భాష ఈ సంస్కృతి ఇప్పటిదికాదు మరి ఎప్పటిదో తెలియదు
అని. ఎందుకంటే ఒక క్రొత్త భాష పుట్టవలెనంటే దానికి ఆలంబనమగు ఒక భాష ఉంది తీరవలసిందే! తరచి
చూసినవారికి గ్రీకు లాటిన్ అరబిక్ ఫార్సీ వంటి అతిపురాతనమైన భాషలని చెప్పుకొనే
భాషలకు కూడా జన్మస్థానము అని తెలుస్తుంది. మరి అత్తిభాశాలకన్నా పురాతనమైన భాష
సంస్కృతము. దీనిని దేవ భాష అన్నారు. కావున ఇది భగవద్దత్తము. అంత పురాతనమైన భాష
కావుననే, ఎన్నేన్నో కల్మషములు కలిసినా
కూడా గంగ తన మౌలిక గుణములు
పోగొట్టకొనకుండా కొనసాగుచున్నట్లు, ఎంతో పాత భాశ్జలుఇగా
చెప్పబడే Latin, Old English, Aramaic, Ancient Greek, Old Norse, Coptic,
Iberian, Etruscan మొదలగు భాషలెన్నో కాలగర్భములో కలసిపోయినవి. కానీ
అన్నివిధములగు ఆటుపోటులకు ఎదురునిలచి సంస్కృతము తన ఉనికిని కాపాడుకొంటూ వున్నది.
అసలు మన దేశాభాషలలోనే కాదు ప్రపంచ భాషలలో కూడా సంస్కృత పదాలను కలుపుకొని మాట్లాడబడని
భాష లేదు.
అంత
పురాతనమైన మరియు నిర్దుష్టమైన వ్యాకరణము కలిగిన భాష కాబట్టే ఇంకా బట్టకట్టుకొని
భూమిపై నిలబడింది. అందువల్లనే ఆభాషకు ఎందఱో మహానుభావులు ఎన్నేన్నో వన్నెలు
తీర్చిదిద్దినారు.
అందులో
ఒక పంథా ఈ గుహ్య సంభాషణము. ఇందుకూడ మూస పోసినట్లు ఒకే విధమును నాడు అన్సరించలేదు.
ఈవిశాయమును రుజువు పరుచుటకు వ్యాస మహాభారతములోని రెండు ఉదంతములను విడివిడిగా
తీసుకొని వివరింపబూనుకొనుచున్నాను.
మొదటిది
ఆది పర్వములోని లాక్ష్యాగృహ దహనము. రెండవది ఉత్తర గోగ్రహణము.
ఇటువంటి
సంభాషణల ద్వారా ఒక సమూహములో తనమాటలు తాను అనుకొన్న విధముగా అర్థముచేసుకొనగల మరియొక
వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే రీతిలో పదముల విరుపులోగానీ అక్షరమును అధికముగా
చేర్చుట చేతగానీ లేక తీసివేయుట చేత గానీ లేక ఉన్న అక్షరమునకు బదులుగా కొంత భిన్నముగా
శబ్దించే అక్షరము ఉంచుటవల్ల గానీ మనసులోమాట తెలియజేస్తాడు. ఎంత భావుకత, ఎంత భాషపై
పట్టు వుండవలెనో ఈ ఉదంతములు మనకు తెలుపుతాయి. వరుసక్రమములో మొదట లక్క ఇంటి
తగులవేతను తీసుకొందాము. ఇది భారతములోని ఆది పర్వములో వస్తుంది. ముందు నాలుగు మాటలు
ఈ లక్క ఇంటి నిర్మాణమునకు హేతువు తెలుసుకొందాము.
దుర్యోధనుడు
కపటోపాయము కలిగినవాడై కొందరు మంత్రులను
పాండవుల వద్దకు పంపి వారణావతమను పట్టణమును
గూర్చి ఆసక్తి కలిగింప జేస్తాడు. చూడవలెనన్న
కుతూహలము కలిగింన పాండవులు దృతరాష్ట్రుడు కూడా " మీ తల్లితో కొంతకాలం వారణావతములో విశ్రాంతి తీసుకుని రండి. గంగా
తీరాన ఉన్న ఆ నగరం అత్యంత ఆనందదాయకముగా ఉంటుంది అని విన్నాను." అని అనుటచే!
ధర్మరాజు వల్లెయని భీష్మ,
ద్రోణ, కృపాది పెద్దల ఆశీస్సులతో తల్లిని, తమ్ములను వెంట
పెట్టుకుని వారణావతము బయలుదేరుతాడు. అనుకొన్న ప్రకారము జరుగుచున్నందుకు ఆనందము
చెందుతాడు దుర్యోధనుడు. కారణమేమిటంటే పురోచనుడు
అనే గృహ నిర్మాణ నిపుణునిచే ముందుగానే వారణావతములో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో
చేసిన సువిశాల భావన నిర్మాణమును చేయించి అందు పాండవులు ఉందుటకు ఎన్నో సదుపాయములను ఏర్పరచి యుంచుతాడు.
ఏమరుపాటుగా, నిద్రలో ఉన్న సమయములో గృహదహనమునకు ఆదేశించుతాడు.. విదురునికి ముందే ఈ విషయము
చూచాయగా తెలుసును కాబట్టి ఎంతో నర్మగర్భముగా
ధర్మరాజుతో తన సందేశాన్ని ఈ శ్లోక రూపములో చెబుతాడు.
అలోహం
నిశితం శస్త్రం శరీర పరికర్తనం l
యోవేత్తి
నతుతం ఘ్నంతి ప్రతిఘాత విదం ద్విషఃll
బాహిరమగు
అర్థము ఏమిటంటే లోహము అనగా ఇనుము ఉక్కు తో చేయబడని వాడియగు ఆయుధముతో శరీరమును ముక్కలు చేయగలదు. అది తెలుసుకొని
దానిని నిర్మూలించకుంటే ఎదురుదెబ్బ తినే అవకాశము ఉంటుంది.
కానీ
ఆంతరంగికముగా ఆయన ధర్మజునకు మాత్రమే అర్థమయ్యే విధముగా ఏమి చెప్పినాడంటే
అ‘న’ల+
ఊహం = అనలోహం (‘న’ అధికముగా చేరింది.)= అగ్నిని ఆకర్షించే వస్తువులతో
నిశి+తం+శస్త్రం=
నిశి+తం+సస్త్రం(‘శ’ కు బదులుగా ‘స’ ను ఉంచుకోవాలి. సస్త్రం అంటే ప్రాసాదము లేక
భవనము అన్న అర్థము ఉన్నది. సప్తి అస్మిన్ ఇతి సస్త్రం అన్నది వ్యుత్పత్తి. అంటే
ఇక్కడ ‘స’ కు బదులుగా ‘శ’ వాడి వర్ణవికారము చేయబడినది.) ఎందుకంటే రాత్రివేళ ఆ
భవనములోనే కదా వారంతా నిదురించుతారు. కాబట్టి ఆసమయమున వారికి దాహక పదార్థ సంయోగముచె
కట్టబడిన ఆభవానములో ముఖ్యముగా రాత్రి
సమయమున జాగ్రత్తగా ఉండమని చెప్పినాడు విదురుడు.
ఇక్కడ
రహస్య సంభాషణమునకు తోడుగా నాటి వాస్తు కళ మరియు గృహనిర్మాణ వైశిష్ట్యము మనకు
తెలియవస్తూవున్నది. భారతమును కథ కొరకు గాక అందులోని విశేషములను, విశేషణములను చాలా
జాగ్రత్తగా చదువవలసి ఉంటుంది. మన భాషా నిర్లక్ష్యత మనలను ఆంద్ర భారత , భాగవతము
వంటి ఎన్నో మహాకావ్యములను కనీసము తాకే యోగ్యత కూడా లేవకుండా చేసినది, వ్యావహారిక
భాషా ఉద్యమము. ఆంగ్లేయుల ప్రాపు కోరి తెలుగునకు తెగులు తగిలించిన మహానుభావులకు, ఈ
సందర్భమున నమస్కరించక ఉండలేక పోతున్నాను.
ఇక రెండవ ఉదాహరణము చూద్దాము.
ఉత్తర
గోగ్రహణ కథ నేరుగా భారతము ద్వారా చదివినా చదవకున్నా నర్తనశాల సినిమా చూచుట ద్వారా
ఎక్కువమందికి పరిచయమైయుండవచ్చునన్న ఉద్దేశ్యముతో నేను తిరిగీ ఆ కథను ఇక్కడ తెలుపబోవుట
లేదు, కానీ ఆ సందర్భమును ఇచట ప్రస్తావించుచున్నాను.
అర్జునుడు, బృహన్నల వేషమును వీడి విల్లంబులు ధరించి ఉత్తరకుమారుడు సారధ్యమును
నెరుపగా కౌరవులను ఎదిరింప బయలుదేరినాడు.
దూరక్ము
నుండియే వచ్చేడు వాడు పార్థుడని సందేహించి అతని అజ్ఞాతవాస సమయము ముగిసినదో లేదో
అని డోలాయమనస్కుడై భీష్మునితో మాట్లాడే ఘట్టములో ఆయన తన ప్రక్కనున్న భీష్మునితో చేసిన నర్మ గర్భ సంభాషణము మన ప్రస్తుత రచనా
వస్తువు.
తమ
తమ రథాలలో భీష్మ ద్రోణ దుర్యోధనులు ప్రక్క ప్రక్కనే ఉంటారు. ద్రోణుడు తన సందేహమును
నేరుగా భీష్మునకు ఎరుకపరుపలేదు, దుర్యోధనుడు విని తనను తప్పుగా తలచుతాడు కాబట్టి.
కావున భీష్ముడు మాత్రమే అర్థము చేసుకొను రీతి, ఈ శ్లోక పాదములో తన సందేహమును
వెలిబుచ్చుతాడు:
నదీజలం కేశవ నారికేతుః నగాహ్వయో నామ నగారి సూనుః
నదీజలం,
కేశవ, నారి, కేతు, నగాహ్వాయ, నగారి అన్న పదాలకు అర్థ అన్వయము కుదరదు. భీష్ముడు
ద్రోణుడు యుద్ధకోవిదులే గాక బుద్ధికోవిడులు కూడా కాబట్టి ఒకరు చెబితే మరియొకరు
అర్థము చేసుకోన వలసిన రీతిలో అర్థము చేసుకొన్నారు. ఇటువంటి సంభాషణ మనకందించిన
వ్యాసులవారికి సాష్టాంగ పాదాభివందనము చేయుచున్నాను. ఈ శ్లోక పాదము 39వ అధ్యాయములోని 10 వ
శ్లోకమని విన్నాను గానీ నా వినికి లో పొరబాటు కూడా దొరలియుండే అవకాశము ఉంది. అయినా
ఈ శ్లోకము మాత్రము నిర్ద్వంద్వముగా ఆ ఘట్టము లోనిదే!
పై
శ్లోక పాదమును అర్థవంతము చేయుటకు ఈ విధముగా విభజించుకొనవలసియుంటుంది.
నగ=న
గచ్చతీతి నగః, అంటే అది చెట్టయినా కావచ్చు కొండ లేక పర్వతమైనా కావచ్చు. ఆహ్వాయము
అంటే పేరు అని అర్థము. కావున నగాహ్వయ అంటే ఒక చెట్టు పేరును తనపెరుగా కలిగినవాడు
అనిఅర్థము. మరి అర్జునము అన్న పేరుగల చెట్టు ఉన్నది కదా! కావున ఆ వ్యక్తి పేరు అర్జునుడు. ఇక నగారి
=పర్వతముల శత్రువు, ఇంద్రుడు, సూనుడు=కుమారుడు. అర్జునుడు
ఇంద్రుని కుమారుడే కదా! ఎంతటి ప్రచ్ఛన్న భావ గర్భితమో చూడండి. ఇటువంటి, ప్రపంచ
భాషలకే మాతృకయైన మన సంస్కృతమును వదులుకొన్నామే, లేశమాత్రమైనా చింతపడనవసరము లేదా,
శిగ్గుపడలేకపోయినా!!
ద్రోణుడు
చెప్పిన మాటను విని అర్థము చేసుకొన్నవాడైన భీష్ముడు, చెంతనున్న రారాజును కాదని
ఆచార్యునితో సంభాషించుట సవ్యము కాదని ఎరింగి సందేశము ద్రోణుని చెవిని పడునట్లు
బిగ్గరగా మాటలాడదొడగినాడు. ఇద్దరు పరిపక్వత గడించిన వృద్ధుల మధ్య గలుగు సంభాషణా
చాతుర్యము, అవగాహనా సాన్నిహిత్యము ఈ సంభాషణ తెలియజేస్తుంది. తిక్కన ఈ విషయమును,
వ్యాసుని తన శైలిలో అనువదించినాడు. అంటే భాషణా చతురత ద్వాపరములో ఎంతటి ఉన్నత
శిఖరమును చేరియుండినదో మనము గమనింపవచ్చును. తిక్కన సంస్కృతాంధ్ర పాండిత్యము మరియు
లోకానుభవము ఈ పద్యము చాటుచున్నది.
తలపగ
రిపులకు నిమ్మగు
కొలది
గడచి వచ్చితిమి: యకుంఠిత బాహా
బలము
నెరప దరియయ్యెను
జలిమ్పవలదింక
మనకు శత్రుల వలనన్
తలపగన్=నెమ్మదిగా
ఆలోచిస్తే: రిపులకున్=శతృవులకు: ఇమ్ము+అగు=అనుకూలమైన: కొలది=హద్దు (కొద్ది, అన్న
అర్థమే కాకుండా ఈ అర్థము కూడా వున్నది. ఇదికాక మరో అర్థము తరువాత తెలుపుతాను):
కడచి వచ్చితిమి=దాటి వచ్చినాము:
అకుంఠిత
బాహాబలము= మొక్కవోని మన భుజబలమును: నెరపన్=చూపుటకు: తరి=సమయము అయ్యేన్=ఆసన్నమైనది:
శత్రులవలనన్=
శత్రువులవలన మనకున్=మనకు, చలింపవలదు=బెడురనవసరము లేదు.
దుర్యోధనుని
వైపు చూసి చెబుతున్నాడు కదా మరి అప్పుడు భీష్ముడు తాను చెప్పేమాట అన్వర్థకముగా
ఉండవలెను కదా! అందుకే పాండవుల ప్రస్తాపనే లేకుండా శత్రు సీమలు దాటినాము ఇక మన
బాహుబలము వారికి నిస్సంశయముగా చవిజూపవచ్చును అని అన్నాడు. మరి ద్రోణునికి ఇవే
మాటలతో సందేశమును ఏవిధముగా చేరవేసినాడో చూద్దాము.
తలపగన్=పరిశీలించగా(లెక్కించగా)రిపులకున్=శత్రువులైన
కౌరవులకు: ఇమ్మగు=అనుకూలమైన: కొలది=కాలపరిమితి అనగా గడువు (ఇక్కడ అర్థము మళ్ళీ
మారినది. సందర్భ శుద్ధికి ఉపయోగించు ఇటువంటి అనర్ఘ పదరత్న సంపదను చేజేతులారా
నాశనము చేసుకొంటున్నాము. ఇకనైనా కళ్ళు తెరుస్తాము అన్న ఒక సదాలోచన మనకు కలుగక
పోతుందా అని శ్రమకోర్చి ఇటువంటి మాణిక్యములను రత్నగర్భలైన మన కావ్యములనుండి వెలికి
తీసి మీముందు ఉంచుతున్నాను.): అకుంఠిత బాహాబలమున్ నెరుపన్= మొక్కవోని భాహుబలమును
ప్రదర్శింప ససమయమేతెంచింది: శత్రులవలనన్=శత్రువులగు కౌరవులవలన, మనకున్=మనకు(ఇక్కడ
గమనించవలసినది ఏమిటంటే భీష్మద్రోణులు బాహిరముగా దుర్యోధను పక్షమే అయినా అంతరంగమున
వారు పాండవ పక్షమే! అందుకే ‘మనకు’ అన్న శబ్దము వాడబడింది. ‘మనమిరువురము’ అనికూడా
అన్వయించుకొనచ్చును)చలింపన్ వలదు=బెదర పని లేదు.
గడువు
ముగిసింది కావున మనము భయపడనవసరము లేదు. వచ్చేడువాడు ‘ఫల్గుణుడే! ఎంత గంభీరమైన
విషయాన్ని ఎంత సునాయాసముగా చెప్పినాడో చూడండి.
అప్పుడు
ద్రోణుని మానసిక స్పందన చూడండి.
అనవుడు
నాచార్యుం దయ్యర్థంబు గనిగొని పార్థునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి
మనంబునంప్రియంబంది మొగంబునన్ దోపనీక పుయిలోట(సంకోచము) దక్కి(తక్కి=విడిచిపెట్టి)
యిట్లనియె.
సింగంబాకటితో
గుహాంతరమునం జేద్పాతుమైనుండి మా
తంగస్ఫూర్జిత
యూధదర్శన సముద్యత్ క్రోధమై వచ్చు నో
జిం
గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీడె వ
చెం
గుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్
సింగంబు=సింహం
ఆకటితోన్=ఆకలితో గుహ+అంతరమునన్=గుహ లోపల చేద్పాటుమైన్+వుండి=దిగులుతో వుండి (కష్ట
పరిస్థితిలో ఉండి)మాతంగ=ఎనుగులయొక్క
స్పూర్జిత=ప్రకాశిస్తూవున్న యూథ=సమూహము యొక్క దర్శన=చూడటం చేత
సముద్యత్=పైకి వస్తున్న(విజృంభించుచున్న), క్రోధము+ఐ=కోపము కలిగినట్టిదై,
వచ్చు+ఓజన్=వచ్చురీతిగా, కాంతార=అడవియందు, నివాస=నివాసముండుటచేత, ఖిన్నమతిన్= దుఃఖాన్ని పొందిన మనస్సుతో,
అస్మత్= మనయొక్క
సేనపైన్=
సైన్యము పైకి, వీడె=ఆ వచ్చేవాడే, కుంతీసుత మధ్యముండు=కుంతీ కుమారులలో మధ్యవాడగు
అర్జునుడు, సరస్థేమ=యుద్ధములో స్థిరత్వము మనోహరమగు ఆకారముతో, ఇపుడే వచ్చినాడు.
అర్జునుడు
12 సంవత్సరములు అరణ్యవాసములో యుద్ధము లేక ఉండిపోవుటచే ఆకలిగొన్న సింహమైగుహలో
పదియుండినది గుహబయతటికి వచ్చినది.
ఈ
వ్యాసమునకు ఇక్కడ భారత వాక్యమును పలుకుచున్నాను. చదివి మన పూర్వుల, మన సంస్కృతి
యొక్క, మన సంస్కృతాంధరముల యొక్క గొప్పదనమును గుర్తించి కీర్తించేది.
స్వస్తి.