Thursday, 31 October 2019

సంస్కృతము-ఆర్యులు-ద్రావిడులు


సంస్కృతము-ఆర్యులు-ద్రావిడులు

'వేద ప్రసాదం' అన్న సమూహము(Group) 'ద్రావిడ' శబ్దమును గూర్చి ఈ విధముగా ఆస్య గ్రంధి లో తెలియజేసియుండినది.
ఓం.
తరచూ మనము ఆర్యులు వేరే వారు అని. ఇక్కడి వారైన ద్రవిడులపై అధికారము చెలాయిస్తున్నారని అని ఒక సిద్దాంతాన్ని పట్టుకుని ఉగిసలాడే వారి మాటలను,
మనకు కొన్ని అర్దాలు తెలియకపోతే ఇబ్బందిలో పడిపోయి మనము  చెప్పలేకపోతే అది మన చేతగానితనమే గాక మన సంస్కృతికే ఇబ్బంది అవుతుంది.
కాబట్టి అందులో ఒకటయిన ద్రవిడము అను పదానికి అర్ధం ఇక్కడ ఇస్తున్నాం.
చూడగలరు.
_/\_.
ప్రదేశాన్ని బట్టి ఈ ప్రాంతానికి "ద్రవిడం" అని పేరు వచ్చింది.
స్వభావ దృష్ట్యా ఈ భారత ఖండంలో నివసించే వారు అందరు ఆర్యులే!
ప్రత్యేకించి వీరిని(అంటే మనల్ని)మాత్రం ద్రవిడులు అని ఎందుకు అనాలి అంటే మూడు వైపులా నీరు ఉంది కాబట్టి.
ద్రవిడులు ఆర్యులు వేరు వేరు అనీ కొందరు ఆర్యులు కొందరు ద్రవిడులు గా విభజించి గొడవలు పెట్టటం కుట్రలో భాగం అందులో ఇరుక్కుని వేరుగా మాట్లాడకుండా ఉండేందుకు ఈ పోస్ట్.

_/\_

నేను వేద ప్రసాదం వారు ప్రచురించిిన అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను. 'ద్రవ ఇదం ఇది అంతా ద్రవము అంటే నీటి చేత చుట్టి యుండ బడినది అని నా అభిప్రాయము. అదే 'ద్రవిదమై' ఆతరువాత 'ద్రవిడమైనది. 'కృణ్వంతే విశ్వం ఆర్యం అన్నది శాస్త్ర వచనము. ఆర్యం అన్న మాటకు అర్థము పవిత్రమైన అని చంద్రశేఖర సరస్వతులవారు చెప్పగా విన్నాను. అంటే మన పూర్వుల దృక్పథము ఎంత ఉత్కృష్ట మైనదో మనము అర్థము చేసుకో గలుగ వచ్చును.
ద్రావిడ శబ్దాన్ని మొట్విటమొదట కాశ్మీరము వెళ్ళినపుడు అచటి పండితులు అడిగిన ప్రశ్నకు సమాధానముగా తాను ద్రావిడ దేశము నుండి వచ్చినట్లు చెప్పినారు ఆదిశంకరులవారు. తానూ మళయాళ దేశము నుండి వచ్చినట్లు చెప్పుకోనలేదు. అది ఆయన ఔన్నత్యము. ఆ తరువాత ఈ పదమును విరివిగా ఉపయోగించే వారు తమిళులు. వాళ్ళకు ఈ దక్షిణాది భాషలన్నీ తమిళమునుండి లేక మూలద్రావిడము  నుండి వచ్చినాయని వారికి ఒక గ్రుడ్డి నమ్మకము. దీనికి ఊపిరి పోసినది కిరస్తానీ మతప్రచారమునకు వచ్చి, అచట నలుపు రంగు శరీరము ఉన్నవారు ఎక్కువగుటచే వారిలో వర్ణ విచక్షణా బీజములను నూరి పోసి అందుకు తోడుగా వారి భాష సంస్కృత జన్యము కాదు,అది ఒక ప్రత్యెక భాష అని తెలుపుటకు ఈ విధమగు విశ్వప్రయత్నము చేయవలసి వచ్చినది. దీనిని ఆలంబన చేసుకొని మన తెలుగువారిలో కొందరు  తమ తమ Doctorate పట్టాలకొరకు కృషిచేసి మనల నమ్మించుటకు కృషి చేసి కొంతవరకు కృతకృత్యులైనారు. దక్షిణ హిందూదేశ భాషలన్నీ  మూల ద్రావిడ జన్యములను మాటకు  వంత పాడుతూ కొంతమంది తెలుగు భాషా శాస్త్రజ్ఞులు  ఆది ద్రావిడ జన్య భాషలనే ఒక నినాదమును లేవదీసి దానికి అనుకూలముగా ఎన్నో విషయాలను ప్రతిపాదించి అదే ఉండవచ్చును అన్న ఆలోచన మనలో కలిగించినారు. తెలుగులో మొట్టమొదటి doctorate తీసుకొన్న చిలుకూరు నారాయణ రావు గారు తెలుగు సంస్కృత జన్యమని సాధికారకముగా నిరూపించినారు. బహుశా అది చదివినవారట్లుంచి తెలిసిన వారు కూడా తక్కువ. పైగా నేటి ఆంధ్ర భాషజ్ఞులు కొందరు నారాయణరావు గారి ప్రతిపాదన పూర్వపక్షమైపోయింది ఇప్పుడు బూదరాజుగారు, భద్రిరాజు గారు చెప్పినదే వాస్తవము అని అన్నారు. ఈ మాట చెప్పినవారు ఎవరైనా, క్రీడాభిరామము అది వినుగొండ వల్లభారాయలవారే వ్రాసియుండవచ్చు, లేక శ్రీనాథులవారే వ్రాసియుండవచ్చు, వీరికన్నా గొప్పవారు మాత్రము కాదు. వీరి పాండిత్యము అసమానము. తెలుగు ఔన్నత్యమును క్రీడాభిరామములోని ఈ క్రింది పద్యము తెలుపుతుంది గమనించండి.
 జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? 
అటుపిమ్మట ఈ మాటను మహా పండిత కవియగు శ్రీకృష్ణ దేవరాయలవారు కూడా 

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,

తెలుగు నాయకుండ తెలుగొకండ,

యెల్ల నృపులు గొలువ యెఱుగనే బాసాడి,

దేశ భాషలందు తెలుగు లెస్స

అన్నది జగద్విఖ్యాతము.

 నేను భాషా శాస్త్రవేత్తను కాను. ప్రత్యేకముగా సంస్కృతము చదువుకోలేదు. కానీ నేను విన్న కన్న కొన్ని విషయాలు మీ దృష్టి లోనికి తెస్తాను. చంద్రశేఖర యతీంద్రులు ధర్మ పరిరక్షకులే గాక మహా పండితులు. వారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణను ఇక్కడ ఉటంకించుతాను. ఒక పండిత సమూహము వేద భాష్యము వ్రాయ సంకల్పించి ఒకచోట కూర్చిని వుంటే ఆంజనేయ స్వామి ఒక చిన్న మర్కట రూపములో చెట్టుపై కూర్చొని వేరొక మర్కటమును 'వారేమి చేస్తున్నారుఅని అడిగినారట. అందుకు ఆ మర్కటము వారు వేద భాష్యము వ్రాయబోవు చున్నారని తెలిపిందట. 'వారికి నవ వ్యాకరణములుతెలుసునా అని అడిగినాడట. అది 'శకున శాస్త్రముతెలిసిన ఆ పండిత సమూహము లోని ఒక పండితుడు విన్నాడు. ఆయన తన అనుయాయులతో చెప్పి ఆ పని నుండి విరమింపచేసినాడట. 'శకున శాస్త్రముఅంటే 'జంతు భాష.'

శకునము అంటే పక్షి అని అర్థము. విస్తృతముగా 'శకున శాస్త్రముఅన్న ఈ మాటను 'జంతు భాషకు వాడినారు. సంస్కృతము లో తొమ్మిది వ్యాకరణములు ఉన్నవి. వేద సంస్కృత వ్యాకరణమునకు వాల్మీకి వ్యాస కాళీదాసాది మహాకవులు వాడిన సంస్కృత వ్యాకరణమునకు వ్యత్యాసమున్నదని పెద్దలు చెబితే విన్నాను.కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేదేమంటే సంస్కృతము లోనే తొమ్మిది వ్యాకరణాలున్నయని. అంటే మన భాషలన్నీ వీనిలోని ఏదో ఒక వ్యాకరణ జన్యమే.

ఇక తమిళము ను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము. (Southworth suggests that the name comes from tam-mi > tam-i 'self-speak', or 'one's own speech'.)(The Tamil Lexicon of University of Madras defines the word 'Tamil' as 'sweetness'. S.V Subramanian suggests the meaning 'sweet sound' from 'tam'- sweet and 'il'- 'sound'.) ఒకరు (సౌత్ వర్త్) 'సెల్ఫ్ స్పీక్అని ఒకరు 'స్వీట్ సౌండ్అని విశధ పరచినారు. ఇది మూల తమిళము నకు ఆయా పండితులు తెలియబరచిన అర్థము. ఆ పదమునకు ఈ అర్థాలెట్లు అతుకుతాయో! Classified as being part of a Tamil language family, which alongside Tamil proper, also includes the languages of about 35 ethno-linguistic groups such as the Irula and Yerukula languages (see SIL Ethnologue)}.
అసలు శివుడు, స్కందుడు అగస్త్యునికి అందజేసిన భాషగా కూడా దీనిని చెప్పుకొంటారు.  'తోల్కాప్యం'తమ మొదటి గ్రంధముగా చెప్పుకొంటారు. తోల్ అంటే తొలి అని. కాప్యం అంటే కావ్యమని. మరి తొలి కావ్యమకుటమునకే అంటే తొలి పదము లోనే 'కావ్య'మన్న సంస్కృత శబ్దమును వాడితే మరి తొమ్మిది వ్యాకరణముల లోని వ్యాకరణమును ఆధారము చేసుకొనియుండదా. పై పెచ్చు దీనిని రచించిన వారు వింధ్యను దాటి వచ్చిన అగస్త్యులవారు అని వారే చెప్పుకొంటారు.ఆయన రామునికి శస్త్రాస్త్రముల నిచ్చి రావణ వధకు తోడుపడినాడు కానీ రావణునికి సాయం చేయలేదు కదా. అంటే ఆయన ద్రవిడుడుకాడు అని చెప్పుటకు ఈ మాట చెప్పుచున్నాను. చంద్రశేఖర యతీంద్రులే తమిళ వ్యాకరణము ఆ తొమ్మిది లో మొదటిది అని తెలియబరచినారు.

మొన్న వచ్చిన అన్నియన్(అపరిచితుడు) యందిరన్(రోబో) సినిమాలకు వాడిన పేర్లు సంస్కృత నామములే యని వారి తెలిసి ఉండక పోవచ్చు. అన్నియన్"అన్యశబ్ద జన్యముయందిరన్ అంటే యాంత్రికుడు(రోబో) అని. వాళ్ళకు అక్షరాలు తక్కువ కావున వున్న అక్షరాలతో పర భాషా పదాలను విరిచి వారివిగా చేసుకొని విరివిగా తమవే అనుకొని వాడతారు.

ఏది ఎట్లైనా సంస్కృతము లేనిదే ఏ భాష లేదు. అది గ్రీకు లాటినే కానీ కాక. ఈ విషయం 'India In Greece' (By Pococke) చదివితే అర్థమౌతుంది. పై పెచ్చు ఆర్యులు ఎరుపు ద్రవిడులు నలుపు అన్న భావమును కొందరు మహానుభావులు బహిర్గతము చేసినారు. బహుశా వారు రాముడు కృష్ణుడు నలుపేనని మరచి వుంటారు. వేద వ్యాసుని వర్ణించుతూ 'ప్రాంశు పయోదనీల తను భాసితఅని ఆయన నల్లని వాడే అని చెప్పినారు. ద్రౌపది పేరు 'కృష్ణ'. అంటే ఆమె నలుపే. నారాయణుడు నలుపు. మరి ఆర్యులెవరు ద్రావిడులెవారు.
ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే మనము భారతీయులము మనమంతా ఆర్యులము.
హిమాలయము నుండి వింధ్య వరకు ఆర్యావర్తము అని అన్నారు. అది నిజము. వింధ్య హిందూమహా సముద్రపు లోతుల వరకు విస్తరించియున్నది. అంటే ఆసేతు సీతానగ పర్యంతమూ ఆర్యావర్తమే! అదియునుగాక ఈ దేశపు ఆద్యన్తములలోని ప్రతి మానవుని (ఆడ మగ తేడా లేకుండా) DNA ఒకటే నని శాస్త్ర నిరూపణ జరిగినది. కావున అందరమూ ఆర్యులమే! 
స్వస్తి.

1 comment:

  1. చాలా బాగుంది. ఉపయోగకరమైనది.

    ReplyDelete