Tuesday, 29 May 2018

కృష్ణాా యదుభూషణా


సామ్రాట్ విక్రమాదిత్య



సామ్రాట్ విక్రమాదిత్య
https://cherukurammohan.blogspot.com/2018/05/blog-post.html
విక్రమ చరితమునకు ఉపోద్ఘాతము
నేను, నాకు చేతనయినంత మేరకు సామ్రాట్ విక్రమాదిత్యుని గూర్చి కొంత శ్రమపడి ఆయనను గూర్చిన వాస్తవాలను సేకరించి (పరిశోధన అన్నది పెద్దమాట కావున వాడలేదు), మీముందుంచుచున్నాను. ఇది పోద్దుపోనపుడు పుటలను త్రిప్పే విషయము మాత్రము కాదు. మనసారా చదువుతారని నా ఆశ.

సామ్రాట్ విక్రమాదిత్యుడు (101 BCE నుండి 19 AD వరకు) భారతదేశము అనగా నాటి
 ఉజ్జయినీ సామ్రాజ్యానికి రారాజు, ఇతను తెలివితేటలు, శౌర్యం మరియు ఉదారతకు ప్రసిద్ధి చెందాడు. "విక్రమాదిత్యుడు" అనే పేరును తర్వాత భారతీయ చరిత్రలో పలువురు ఇతర రాజులు ఉపయోగించినారు, వీరిలో ముఖ్యంగా ఎంతో మంది తదనంతరపు రాజులు తమ బిరుదుగా వాడుకోనగా, వారిలో ముఖ్యుడు గుప్త రాజు చంద్రగుప్త విక్రమాదిత్యుడు.  విక్రమ అంటే అర్థం "శౌర్యము" మరియు ఆదిత్యుడు అంటే  సూర్యుడు. అంటే ఆయన  "సూర్యునికి సమానంగా శౌర్యం కలిగిన వాడు అని చెప్పవచ్చు. విదేశీయులగు శకులను ఓడించి, దేశమును విస్తరించి,  ప్రజలను కంటికి రెప్పవలె రక్షించి, తమ తమ రంగములలో అత్యంత ప్రసిద్ధులను తన సభలో 'నవరత్నములు' అన్నపేరుతో పొదిగిన మహానుభాసవుడు. అట్టి వ్యక్తిని ఒక ఊహా పురుషునిగా కొట్టివేసి, ఆంగ్లేయ విద్యావిధానములో ఆయనకు స్థానమే లేకుండా చేసినారు.
మన పొరుగుదేశము ఇండోనీసియా ముస్లిం దేశమైనా వారిజాతీయ పకక్షి గరుడ, వారి నాణెములపై, వారి జాతీయ పక్షి గరుడ, వారు ప్రతి వారమూ 3 రాత్రులు రామాయణ నృత్య నాటికను ప్రదర్శించుతారు. తమ జావా ద్వీప సంస్కారములను వాడులుకొనక  హిందూ బౌద్ధ విధానములను పాటించుతారు. మనము మన సాంప్రదాయమును వదలలేక అమెరికా అలవాట్లను ఆకళింపుచేసుకోలేక హంసనడక పోగొట్టుకొని కాకివలె గెంతలేక రెంటికిన్ జెడిన రేవదలమై అంగలార్చుచున్నాము.

అందుకై ముందు మన చరిత్ర, మనపూర్వులు, వారి గొప్పదనము తెలుసుకొందాము. అప్పుడు మనము ఏమి పోగుట్టుకోన్నాము, ఎంత పోగొట్టుకొన్నాము తెలుస్తుంది. దానిని బట్టి మన భవితకు బంగారు బాట వేసుకొందాము.
స్వస్తి.
మరునాటినుండి(రేపటి తరువాత నుండి అంటే ఎల్లుండి నుండి) మొదలు పెడతాను.
Vikramaditya
Emperor Vikramaditya of Ujjain (city originally named as Ambavati) lived during 101 BCE – 19 CE based Jyotirvidabharana of Kalisada, Jyotishaphala Ratnamala of Krishna Misra, and history of Nepal, Kashmir, Stapatha Brahmana, and Bhavishya Purana. This king is considered legend, while he is actually part of history and even referred in Purina. Few Vedic astrology books written during his time prove his existence in 1st century BC. Vikrama Saka named as Vikram Samvat (era) followed in Vedic panchangs since 57 BCE as Vikram Samvat. Famous poet Kalidasa, Astrologer Varaha Mihira were among the 9 gems in his court. The Nepal King’s cortier Kalhana‘s Rajatarangini (river of Kings), Vikramditya’s contemporary Krishna Misra’s astrology book Jyotishaphala-Ratnamala, few mentions in Bhavishya Purana, recorded history of Nepal prove his existence with correct dates and years.


సామ్రాట్ విక్రమాదిత్య
చరిత్ర తెలిస్తే మన పూర్వుల ప్రతిభ గుర్తించుతాము. నాటి ఆచార వ్యవహారాలు ఆకళింపు చేసుకోగలుగుతాము. మన దేశ ఔన్నత్యమును గ్రహించగలుగుతాము. మన భావి దిశా నిర్దేశము చేసుకోగలుగుతాము. తదుపరి తరములకు ఆ గొప్పతనాలను పంచగలుగుతాము. తప్పులెక్కడ కలిగినాయో తెలుసుకోగలుగుతాము. ఆ తప్పులు తిరిగీ చేయకుండా జాగ్రత్త పడుతాము. నీతి నియమావళి తెలుసుకొన గలుగుతాము. మన పూర్వుల ఆవిష్కరణలను తెలుసుకోగలుగుతాము. అపుడు మన మేధస్సునుపయోగించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతాము. చరిత్రను వక్రీకరించి అనేక భారతీయ చక్రవర్తులను, శాస్త్రజ్ఞులను చరిత్ర నుండి చెరిపివేసి, వారు కేవలము ఊహాజనితులని మనల నమ్మించి మనలను తప్పుదారి పట్టించిన బూటకపు చరిత్రకారుల  ఆట కట్టించగలుగుతాము. పై పెచ్చు నిరాఘాటముగా పరిపాలించిన మన రాజ చరిత్రలను తెలుసుకోగలుగుతాము. అన్నిటికీ మించి మనతో వాదమునకు దిగిన వారికి సహేతుకముగా బుద్ధి చెప్పగలుగుతాము. మరి ఇన్ని ప్రయోజనులు కలిగియున్నపుడు చరిత్రను గతము అని కొట్టివేయుట సమంజసమా! మన విద్యాలయములలోని చరిత్ర పుస్తకములలో ముస్లీములు మరియు బ్రిటీషువారిని గూర్చి తెలిపినంత ప్రముఖముగా మన రాజులు, చక్రవర్తులు, శాస్త్రజ్ఞులను గూర్చి తెలిపిన పాపమున పోయినదిలేదు. నీతి శాస్త్రము, అర్థ శాస్త్రము మరియు అఖండ భారతమును గూర్చి ఆలోచించిన మహానుభావుడగు చాణక్యుని గూర్చి ఆ గ్రంథములలోని విషయములగూర్చి మన స్వాతంత్ర్యానంతర పాలకులు మనచే చదివించిన పాపమున పోయినదిలేదు. 70 సంవత్సరముల క్రితముననే ఆ మహానుభావుల గూర్చి మేము చదువలేదు మరి నేటి విద్యావిధానమున అట్టి విషయముల గూర్చి చెబుతారు అనుకొనుట మన భ్రమ ఔతుంది. ఇప్పటికయినా యువత కన్ను తెరుస్తారన్న కాంక్షతో కష్టమునకోర్చి, అట్టి మహనీయులలో ఒకడైన నాటి అసమాన అప్రతిహత అవక్ర పరాక్రముడైన విక్రమార్కుని గూర్చి తెలియజేయ సాహసించుచున్నాను. ఆ మహానుభావుని గూర్చి మనకు తెలిసినది తక్కువ అనుటకంటే మనకు కుహనా చరిత్రకారులు ఆయన ఉనికినే తెలియనీయకుండా చేసినారు. ఇక లంకెతో బాటూ కళ్ళు తెరచి చదవండి.
నాటి వాస్తవమును తెలియజేసే, నేను వ్రాసిన ఈ పద్యముతో నా రచనను మీకు పరిచయం చేస్తాను.
పుట్టుకతోనె గిట్టుటయు పుట్టుక గల్గునటన్న సత్యమున్
దిట్టముగా మనంబునది దివ్య వచస్సుగ పాదుగొల్పుచున్
గట్టిగ భూమిపై యశము కప్పుర వీవెనలీన భారతిన్
పట్టముతోడ రాజులతి పట్టుగ జేసిరి రాజ్య పాలనల్ 
నాటి రాజులు ధనము కన్నా యశోధనమే గొప్పదని నమ్మినవారు. అట్టివారిలో కూడా అగ్రగణ్యులు కొందరు. వారిలో కూడా, సూర్యుడు దినకరుడైనట్లు విక్రమార్కుడు భరతభూమి యశోవిభాకరుడు. నాకు తెలిసినంత, నేను తెలుసుకోగలిగినంత,  తెలియజేయగలిగినంత ఆ మహనీయుని గూర్చితెలిపే ప్రయత్నము చేస్తాను. అసలు ఆయన అంత గొప్పవాడు కావుననే ఆయన తదనంతరము అనేక రాజులు చక్రవర్తులు ఆయన పేరును తమ బిరుదముగా తగిలించుకొన్నారు. తెలిసిన విషయముల పుష్ఠి జేయుటకు ఇటువంటి రచనల విషయములో ఎంతో శ్రమపడవలసి వస్తుంది. ఆదిలోనే దానిని అర్థము చేసుకొన్న పాఠకులు విషయమును అత్యంత శ్రద్ధతో చదువుతారని నా నమ్మకము. నేను తెలిపినది కాక మీకు తెలిసినది తెలియజేసిననూ స్వీకరించుటకు సిద్ధముగా వున్నాను.           
   విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు అంటూనే మనకు ఎన్నో కథలు, కల్పనలు గుర్తుకొస్తాయి. నేను ఆ విషయములను గూర్చి వ్రాయబోవుటలేదు. అసలు ఆ పేరుగల చక్రవర్తి ఈ దేశమును ఏలినాడా? అన్న విషయమును నాకున్న పరిధిలో వ్రాయుటకు సంకల్పించి ఈ కార్యమునకు గడంగినాను.
   తన పేరుతో విక్రమశకమే ఉన్నపుడు ఆయన ఉనికి కల్పితము అని కొట్టిపారవేయుట సమంజసమేనా! ఈ మాటను ప్రాతిపదికగా తీసుకొని కొంత తర్కము, కొంత చారిత్రిక ఆధారముల ఆలంబనతో నేను ఆశక్తుడనని తెలిసినా,  తెలిసిన మేరకయినా తెలియజేయు ఉత్సాహముతో ఈ పనికి పూనుకొన్నాను.
విక్రమార్క శకం
శకం అన్నది ఒక మహాపురుషుని గౌరవసూచకంగా ఆయన ఎప్పుడు రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టినాడో అప్పటినుండి ఆ శకం ఆరంభం అవుతుందని శాస్త్రము తెలియజేస్తూ వున్నది. ఎవరి పేరున ఆ శకం నడుస్తుందో వారిని శకకర్తలని, యుగపురుషులని పిలవడం రివాజు. ఈ కలియుగానికి ఆరుగురు యుగపురుషులు అని చెబుతారు, కానీ నా పరిశోధనలో అందరి పేర్లు తెలిసిరాలేదు. మనము తీసుకొన్న అంశమునకు అది అంత ముఖ్యము కానందున దాన్నిని ఇక్కడనే వదలివేయుచున్నాను. కలియుగ ఆరంభమునకు శ్రీకృష్ణ నిర్యాణము ప్రాతిపాదికయై కలి శకముగా గుర్తించబడినది.  ఆ పిమ్మట పాండవుల  స్వర్గారోహణము మొదలుకొని యుధిష్ఠర శకం అని చెప్పబడుతుంది. తరువాత సైరస్ అన్న పొరుగు శాక్యదేశపు రాజు, మనదేశమును చాలా కాలము పాలించుటయేగాక, తన  పేరుతో  మరొక శకం ఏర్పాటు చేసుకొనుట జరిగినది. యుధిష్ఠర శకం 3044 సంవత్సరాలు గడిచింది. ముఖ్యముగా జైనులు తమ రచనలలో ఈ శకమును వాడినట్లు తెలియవస్తూవున్నది.  శకులను పారద్రోలి ఈ అఖండ భారత దేశాన్ని ఏకీకృతం చేసి పాలించిన రాజు విక్రమాదిత్యుడు, ఆయన పేరున ఏర్పరుపబడిన శకమును  విక్రమసంవత్ అని పిలుస్తున్నాము. విక్రమాదిత్యుని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచిందని, ధర్మాన్ని పునఃప్రతిష్టించి వేదమతాన్ని అవలంబించి సంస్కృతాన్ని రాజ్యభాషగా చేసుకున్న విక్రమాదిత్యుడు నిజంగా యుగపురుషుడని ప్రజలచే నేటికినీ కొనియాడబడుచున్నాడు.
మిగిలినది మరొకమారు...........
భవిష్యపురాణం ప్రకారం ( మనకు ఇదే ప్రామాణికం ) పరమరుల అంటే ప్రమరుల  రాజ్యంలో శివుని ఆదేశంతో, అనుగ్రహంతో పుట్టిన వాడు విక్రమాదిత్యుడు, అతడికి వంటి పై 32 చక్రవర్తి లక్షణాలతో పుట్టినాడని, అమ్మవారిని ఉపాసించి  ఉజ్జయిని రాజధానిగా చేసుకుని మ్లేచ్చులను తరిమి రాజ్యం చేసినాడని భవిష్య పురాణము చెబుతూవుంది. పార్వతిదేవి ఆదేశం మేరకు శివుని భూతగణాలలో ఒకడగు భేతాళుడు వచ్చి విక్రమాదిత్యునికి రక్షగా ఉంటూ అతని సలహా మేరకు అశ్వమేధయాగం చేసి ధర్మాన్ని సుస్థిరం చేసి సింధూనది, బదరి, కపిల రాజ్యం, సేతుబంధన(రామేశ్వరం) హద్దులుగా రాజ్యం చేసినాడని. ఈశ్వర ప్రసాదితమగు 32 కళలున్న (ద్వాత్రిమ్శిక) సింహాసనం మీద ఆసీనుడై జనరంజకంగా రాజ్యం చేసినాడని ఐతీహ్యము. మహర్షుల ప్రేరణ మీద అయోధ్యను కలియుగంలో కనుగొన్నాడని చెబుతారు. ఏ ప్రదేశంలో ఆవు తనంతట తాను పాలు ధారగా కురిపిస్తుందో అదే అయోధ్యగా
గుర్తెరగమని పంపగా విక్రమాదిత్యుడు నేటి అయోధ్యను కనుగొని, రాముని గుడి కట్టించి పూజలు చేసినాడని చెబుతారు. ఈయన ఏలిన 135 సంవత్సరములే కాకుండా  ఆచంద్రార్కము వైదీకులు ఈ శకాన్ని ప్రామాణికంగా పాటిస్తారని భవిష్య పురాణమున వున్నది.(57 BC ).
ఇంకా వివరముగా ఆయన కాలమును గూర్చి చర్చించుటకు ముందు విక్రముని ఆస్థాన నవరత్నముల గూర్చి, మరియు వారేమయినా తమ గ్రంధములలో ఆయన ప్రస్తాపన చేసినారా అన్న విషయమును గురించీ కాస్త పరిశీలించెదము. అసలు ఆయన ఆస్థానములోని నవరత్నములు ఎవరు అన్నమాటకు ఈ శ్లోకమును వ్రాసినదెవరో తెలియకున్నా ఇది తప్ప వేరు ఏశ్లోకము కానీ, ఆధారము కానీ లేనందువలన, మరియు ఈ శ్లోకము పండిత పామర జనుల స్మృతిలో నేటికీ మెదలుచున్నందువలన ఈ శ్లోకమును మనము వాస్తవమని గ్రహించవలసి వస్తుంది. ఆ శ్లోకమును తిలకించండి.
శ్లో. ధన్వంతరి, క్షపణ కామరసింహ,శంకు, బేతాళ భట్ట, ఘటఖర్ప, కాళిదాసాః|,
ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం, రత్నానివై వరరుచిర్నవ విక్రమస్య|| "

ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళభట్టు, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని ప్రసిద్ధి చెంది ఉన్నారు. నా పరిధిలో వీరిని గూర్చి తెలియజేయుటకు ప్రయత్నిస్తాను.
1. ధన్వంతరి: ధన్వంతరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా ఎముకలను, వానివల్ల కలుగు దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వంతరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
ధన్వంతరులు మనకు బ్రహ్మవైవర్త, భాగవతాది పురాణాలలో కాశీ ఖండము వంటి కావ్యములలో కనిపించినా విక్రమార్కుని ఆస్థాన నవరత్నములలో ఒకరు యుండినమాటను ఖండించిన వారు కనిపించలేదు. పైపెచ్చు  ఈయన "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించినాడని కూడా ఒక అభిప్రాయము లోకమున నాడు ప్రచలితము. అసలు ఈయన విక్రమార్కుని సేనకు శస్త్ర మరియు వైద్య చికిత్స చేసేవాడని తెలియవస్తూవున్నది. ఈయన శరీరమునకు కృత్రిమాంగములు అమర్చుటలో సుప్రసిద్ధుడనికూడా తెలియవచ్చుచున్నది. మరి యుద్ధములో సేనకు ఇటువంటి వైద్యుడు అత్యవసరము కదా! మరి విక్రముని ఉనికి నిజమైతే ధన్వంతరి కూడా ఉన్నట్లే!
2. క్షపణకుడు: జైన సాధువులలో ఈ పేరు కలిగినవారు అధికముగా వుంటారు. జైనము లోని దిగంబర జైనులు నగ్న క్షపణకుడు అన్న నామముతో వ్యవహరించుతారు. అంటే విక్రముని కాలములో జైనము ప్రాచుర్యములో వున్నట్లు మనకు తెలియవస్తూవుంది. అంతేకాక ఆయన మత సహనము కూడా అర్థమౌతూ వుంది.
3. అమరసింహుడు: అమరసింహుడు ఒక్క అమరకోశము తోనే అమరుడైనాడు. ఆయన తాను వ్రాసిన 3 కాండల గ్రంధమునకు ‘నామలింగానుశాసనము’ అని ఉంచినా ఆ నిఘంటువునకు ‘అమరమన్న పేరే లోకమున ప్రఖ్యాతి గాంచినది. ‘అమరము చదవని వానికి నేనమరను’ అన్న మాట మా కాలములో పిల్లలకు పెద్దలు చెప్పి తప్పనిసరిగా అమరమును నేర్పించేవారు. కడప రాయలు & కొ వారి సంపూర్ణ ‘అమరకోశమునకు’ పండిత శ్రేష్ఠులగు శ్రీ జనమంచి సుబ్రహ్మణ్యశర్మ గారు ముందుమాట వ్రాయుచు, కొందఱ మతమున క్రీస్తు శకమునకు బూర్వము విక్రమాదిత్యుడుండుటచే తత్సభారత్నముగ అమరసింహుడు కూడా ఉండుటవలన తత్కాలికుడని ఎన్నుదురు. అమర సింహుడు తన పదకొశమును ‘యస్య జ్ఞాన దయాసింధో...’ అని ప్రారంభించుతాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి వస్తుంది. ఇందు ఏమతమును గానీ ఏ దైవమును గానీ పేర్కొనలేదు. తానున్నది ఒక హిందూ రాజు ఆస్థానములో! ఆ కాలమునందు జగద్గురువు శంకరులవారి ప్రభావమువల్ల జైన, బౌద్ధ మతములు కొన్ని మెట్లు దిగవలసి వచ్చింది. ఇది ఒక కారణముగా చెప్పుకొనవచ్చును. అయినా ఆయన ఆ శ్లోకమునందు నిగూఢముగా ‘ ఎవరైతే జ్ఞానమునకు, దయకు సముద్రము వంటివాడో ఎవరైతే జితేంద్రియుడో ఆయనను అంటే గౌతమ బుద్ధుని సేవించమంటున్నాడు. విక్రమార్కుని మహానీయతకు అటు జినుడగు క్షపణకుని, ఇటు బౌద్ధుడగు అమరసింహుని నవరత్నములలో స్థానమోసగి తన ఔన్నత్యమను కిరీటమునకు మరియొక మణిని పొదిగినాడు. ఒక నిఘంటువును ఛందస్సులో ఇముడ్చుటకన్న వేరు ఉత్తమోత్తమ పాండితీ ప్రకర్షను మనమెందునూ చూడలేము.
మిగిలినది వేరోకమారు...........
సామ్రాట్ విక్రమాదిత్య-3

4. శంకుడు: ఈయన నవరత్నములలో ఎంతో ప్రాధాన్యత గలిగినవాడు.ఈయనను గొప్ప విద్వాంసునిగానూ, జ్యోతిశ్శాస్త్రవేత్త గానూ చారిత్రిక గ్రంధములందు చెప్పబడినది. ఈయన ప్రాముఖ్యత విక్రముని ఆస్థానములో ఏమిటి అన్నది తెలిసివచ్చుటలేదు, కానీ కాళీదాసు వ్రాసిన ‘జ్యోతివిదాభారణము’ లో ఈయన కవిగా కూడా ప్రశంశింప బడినాడు.
5. బేతాళ భట్టు: భేతాళకథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు గుణాడ్యుడి సంకలనం ద్వారా మనకు తెలుస్తోంది. ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని పరిపాలించేవాడు. తన పరిపాలనదక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకొంటాడు విక్రమార్కుడు. శాప వశాత్తున శవమైయున్న భేతాళుని తనవద్దకు మోసుక రమ్మంటాడు ఒక మోసపు సన్యాసి, ప్రజాహితముకోరి తనను నమ్మిన విక్రమునితో! ఆ విధముగా భేతాళ కథలు మొదలై, విక్రముడు భేతాళుని మనస్సు జయించుటచే మోసగాడయిన సన్యాసిని చంపించి శాపము తీరుటచే, తాను రాజునకు ఆపదలు వచ్చినపుడు కాపాడుతూ ఆయనతో ఉండిపోతాడు. మహా పండితుడగు బ్రాహ్మణుడగుటచే ‘భేతాళ భట్టు’అయినాడు.
6. ఘటకర్పుడు: ఈయనను గూర్చి కూడా కొంచెమే తెలియవస్తూవున్నా ఈయన మహాకవిగా విక్రముని ఆస్థానములో గుర్తింపబడినాడు. ఈయన కవితానైపుణ్యము కాళిదాసు వలననే సిద్ధించినదని చెబుతారు. యమాకాలంకార కవిత్వములో తనను ఓడించినవాని యింట పగిలిన కుండ పెంకులతో నీరు తెచ్చి నింపుతానన్నాడట. ఎంతటి ఆత్మవిశ్వాసమో చూడండి. అందుకే ఆయన నవరత్నములలో ఒకడై ఉంటాడు.
7. కాళీదాసు: విక్రమార్కుని నవరత్నములలో ఒకడైన ఈయన వేద, వేదాంగ, పురాణ, దర్శన, ధర్మశాస్త్ర, సంగీత, ఆయుర్వేద, జోతిష మొదలగు వివిధ శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. అందుకే ఆయన నవరత్నములలో కూడా తలమానికము. ఒక ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి యొక్క పేరును తాము కలిగియుండుట మనము నేటికినీ ఎందరిలోనో చూస్తాము. కావున ఈయనను ఇతరులు అనుకరించినారేగానీ ఈయన ఇతరులను అనుకరించలేదు. ఈయన అన్నింటా ఆద్యుడే! కావున కాళీదాసులు ఎందఱో వున్నా, విశేష ప్రఙ్ఞ కలిగిన కాళిదాసులు మనకు ముఖ్యముగా చరిత్రలో ఇద్దరే కనిపిస్తారు. ఒకరు విక్రముని ఆస్థాన నవరత్నములలో ఒకరు, ఇంకొకరు భోజుని ఆస్థాన మహా కవి పండితుడు. దండి భవభూతి ఈయన కాలమున, భోజుని ఆస్థానములో ఉన్నవారు. విక్రముని ఆస్థాన రత్నమగు కాళిదాసు రచించిన అనేక  కావ్య నాటకములలో  విక్రమోర్వశీయము, జ్యోతిర్విదాభరణమును కూడా ఉన్నవి. జ్యోతిర్విదాభరణ రచనము కొంత వివాదమునకు హేతువై వున్నది. ఇది ఆయన వ్రాసినదేనని కొందరు పండితుల మాటైతే, అందులో వ్యాకరణ  దోషములున్నాయని, అందువల్ల ఆయన వ్రాసియుండక పోవచ్చునని మరికొందరి మాట. తర్కము అన్నది 1. ప్రత్యక్ష, 2. అనుమాన,3. ఉపమాన మరియు 4. శబ్ద అన్న 4 అంగములపై ఆధారపడి వుంటుంది.  
మరి తర్కము యొక్క రెండవ అంగము ప్రకారము తప్పులున్న తాళపత్రములు ప్రక్షిప్తములు కావచ్చు కదా!
ఆ గ్రంథములో వున్న అనేక విషయములు విక్రమార్కునికి సంబంధించినవి.




సమ్రాట్ విక్రమాదిత్య
 ‘కాదు’ అన్న ఒక్క మాటతో మొత్తము  రచననే బేఖాతరు చేస్తే మరి విషయ సంగ్రహణ ఎక్కడనుండి చేయగలము. ఆసలు ఆయన పుట్టిన ప్రాంతమే వివాద భూయిష్టము, కాశ్మీరు, వంగదేశము, విదర్భ, మిథిల, విదిశ మొదలగు ప్రాంతములుగా వేరువేరు చారిత్రకులు తెలిపిన విషయమును నేను తెలుపుచున్నాను. మరి మహనీయుడగు మహానుభావుని మనవాడే నని తలచుట మానవ సహజము కదా! ఈ శ్లోకము ఆయన గొప్పదనమును అనంతమగు అర్థ రూపములో రెండు పంక్తులలో వివరిస్తుంది.వివరిస్తుంది.
పురా కవీనాం గణన ప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసా l
అద్యాపి తత్తుల్య కవేరభావాదనామికా సార్థవతీ బభూవ ll
ఈ శ్లోకము ఎవరు చెప్పినారో తెలియని చాటువు. కానీ ఇందులోని వాస్తవముపై ఎవరికీ సందేహము లేదు. అలాగే తన రచనలలో ప్రత్యేకముగా తన కర్మ భూమియగు  ఉజ్జయినిని గూర్చిన వర్ణనలు ఆయనకు ఆ పురముపై ఎంత మక్కువ ఎక్కువ అన్న విషయము తెలుపుతుంది. అదే విధముగా విక్రముని గూర్చి ఆయన తెలిపిన అనేకములగు విషయములను అన్య రాజన్యులకు అన్వయించుట సబబా! ఆయన రచనలలో విక్రమార్క బిరుదాంకితుడగు రెండవ చంద్రగుప్తుడు అన్న పేరును గానీ విక్రమార్క బిరుదాంకితుడగు, ఆయన మనుమడు స్కందగుప్తుని పేరును గానీ ఎక్కడా చూడము. ‘కాళిదాస కవయో నీతా విక్రమో శకారాతిన’ అన్న ఈ శ్లోక పాదము ప్రకారము ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన, శకులకు శత్రువగు ‘విక్రము’ని ఆశ్రయమున తానున్నట్లు మనకు విదితమగుచున్నది.
ఇక వరాహమిహిరుని గూర్చి మరొకమారు వివరముగా తెలుసుకొందాము.
ఇంకా ఉన్నది........
సామ్రాట్ విక్రమాదిత్య - 4

8. వరాహమిహిరుడు: వరాహమిహిరుని గూర్చి తెలుపుట సామాన్యము కాదు. కానీ నవరత్నములను గూర్చి తెలుపుతూ ఆయనను గూర్చి తెలుపక పోవుట సాధ్యము కాదు. పై శ్లోకములో కాళీదాసునకు కూడా లేని విశేషణము ‘ఖ్యాతో’ అని వరాహమిహిరునికి వాడుట జరిగినది. ఆ ఒక్క మాటే  ఆయన ఎంత గొప్పవాడన్నది తెలుపుతుంది. చాలా క్లుప్తముగా ఆయనను గూర్చి తెలుపుతాను. దానికి ముందు ఉజ్జయినీ వాస్తవ్యుడు, జ్యోతిషమునందు అనన్య సామాన్య పండితుడు, ప్రభుత్వమూ చే పద్మభూషణ్ బిరుదాంకితుడు నగు పండిత్ సూర్యనారాయణ్ వ్యాస్, వరాహమిహిరుడు ఉజ్జయినిని ఏలిన విక్రమార్కుని ఆస్థాన నవరత్నములలో ఒకడని వక్కాణించినాడు. వ్యాస్ గారి ప్రతిభ ఎంతటిదంటే మన స్వతంత్ర భారత దేశమునకు అంటే 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి ముహూర్తము పెట్టినది ఆయన, వల్లభాయి పటేల్ మరణము 16 డిసెంబరు 1950 న జరుగుతుందని ఎంతో ముందు తెలిపినది ఆయన. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ వెళ్ళుటయే గానీ తిరిగి రాడని చెప్పినదీ ఆయనే. 1990 తరువాత నుండి అభివృద్ధి చెందుతూ 2020 కల్లా భారత దేశ యశోవిభవము ఆకసమునంటుతుందని చెప్పినవాడు ఆయన. స్వాతంత్ర్య యోధుడు, కవి, పండితుడు చరిత్రకారుడు అయినటువంటి ఈయన, వరాహమిహిరుడు ఉజ్జయిని ని రాజధానిగా చేసుకొని ఏలిన విక్రమార్కుని ఆస్థాన నవరత్నములయందొకడని నిర్దారించినాడు. కాలాంతరములో వరాహమిహిర అన్న పేరుతో ఇతర రాజులవద్ద ఎవరయినా వుండినారేమో!

సామ్రాట్ విక్రమాదిత్య - 5

ఇక వరాహ మిహిరుని విషయమునకు వస్తే ఆయన పేరు మిహిరుడేనని వరాహ అన్న పదము విక్రమార్క ధ్వజ చిహ్నమగుట చేత ఆ ధ్వజమునకు వరాహ మిహిరునికీ లంకె ఉండుటచే ఆయన వరాహమిహిరుడైనాడని ఒక సంఘటన మిక్కిలి ప్రాచుర్యములో వుంది.
మిగిలినది మరొకసారి........
వరాహ మిహిరుడు ఉజ్జయినికి దగ్గరగా వున్న కపిత్థ అన్న ప్రాంతములో జన్మించినాడు. తన తండ్రి ఆదిత్యదాసు అని తాను రచించిన బృహజ్జాతకములో  స్వయంగా చెప్పుకొన్నాడు. ఆదిత్యదాసు అన్న పదమునకు సూర్యోపాసకుడు అన్న అన్వయమును కూడా మనము తీసుకోవచ్చు. ఆకాలములో ‘దాసు’ అన్న మాటను పెరుచివర ఉపయోగించేవారా అన్నది కూడా పరిశీలించవలసిన విషయమే! తండ్రివద్దనే విద్య గరిపినట్లు కూడా ఆయన ఆ గ్రంథములో చెప్పుకొన్నాడు. అశేష పాండిత్యముతో విశేష వ్యక్తిగా గుర్తింపబడి విక్రమార్కుని ఆస్థానమున నవరత్నములలో ఒకనిగా స్థానమును సంపాదించగలిగినాడు. ఆయనకు జోతిషీ రత్నముగా ఆస్థానమున ఎంతో పేరు వుండేది. విక్రమార్కునకు పుత్రోదయము జరిగినపుడు జాతకచక్రము వ్రాయించ ఆయన మిహిరునికి ఇచ్చినాడు. ఆయన ఆపని చేయగా, రాజు జాతక ఫలితము తెలుసుకొన గోరినాడు. మిహిరుడు జాతకము పరీక్షించి ఆ బాలునికి క్రీడాసక్తత కలిగిన వయసులోనే వరాహముచే మరణించుతాడని చెప్పినాడు.
మిహిరుని మాటపై సంపూర్ణ విశ్వాసము గల్గిన విక్రముడు తన కుమారునికి ఆ వయసు రాగానే అంతఃపురములోని చివరి అంతస్తులో ఆబాలుని , అతనికి తోడుగా తనయీడు పిల్లలను జతజేసి, అన్నపానాలను అచటికే పంపు ఏర్పాటుచేసి అన్నివిధములా ఆనందముగా వుండజేసినాడు.
ఒకరోజు పిల్లలు అంతా కలిసి దాగుడు మూతలు ఆడుతూ వుండినారు. రాకుమారుడు తనను ఎవరూ కనుగొనగూదదని తలచి మాడీ పైభాగము చేరుకొన్నాడు. అచట రాజ్య దారుకధ్వజము(కొయ్య స్తంభమునకు కట్టిన జెండా) ప్రతిష్ఠింపబడి యుండినది.
ఆ స్తంభమునకు ఎమయినదో ఏమో (బహుశ పుచ్చియుండవచ్చును) విరిగి ఆ బాలునిపై పడింది. అదికూడా రాజ్య చిహ్నమగు వరాహమును కలిగిన జెండా, ఆబాలుని ముఖము కప్పివేసినది. అంతటి స్తంభము పడిన పిదప బాలుడు బ్రతుకుటెట్లు? ఆతడు వరాహ కారణముగానే మరణించినాడు. క్రింద రాజభవనములో విక్రమార్కుడు తాను బాలునికొరకు ఏర్పరచిన రక్షణ వలయమును చూపించి, మీరు చెప్పిన సమయము ముగిసినది, నేను ఏర్పరచిన రక్షణచే నాకుమారుడు వరాహము బారినుండి రక్షింపబడినాడు, అని తెలపగా మిహిరుడు ఎంతో ఆత్మవిశ్వాసముతో తాను చెప్పిన సమయమునకే బాలుడు వరాహ కారణముగా మరణించి ఉంటాడు అని నొక్కి చెప్పుటతో రాజు పై అంతస్తుకు పోయి చూచి బాలుని కానక మాడీ ఉపరితలము చేరగా దుంగ మీదబడి, పతాకముచే కప్పబడిన బాలుని చూసి పరితపించినాడు కానీ మిహిరుని జోతిషీ ప్రతిభను అర్థముచేసుకొని ఆ సంఘటన జ్ఞాపకార్థము నాటినుండి మిహిరుని వరాహ మిహిరునిగా పిలువసాగినారు.
9. వరరుచి: ఈతని నిజనామము కాత్యాయనుడు అని తెలియవస్తూ వున్నది. ఈ విషయమును 11 వ శతాబ్దములో ‘కతాసరిత్సాగారము’ను ఉద్ధరించిన సోమదేవుని రచనలో మనము చూడవచ్చును. పాణిని వ్యాకరణ సూత్రములకు వార్తీకము (Commentary) వ్రాసినది యీయనే! ‘ప్రాకృత ప్రకాశ’ అన్న వ్యాకరణ గ్రంథమును ఈయన ప్రాకృతమునకు వ్రాసినాడు. అదికాక ఆయన ‘పత్ర కౌముది’. ఈ కావ్యారంభాముననే ఆయన, తాను విక్రమార్కుని ఆస్థానమున ఉండినట్లు చెప్పినాడు. పైగా ఈ గ్రంధమునే గాక,’విద్యాసుందర’ మను మరొక గ్రంధమునుగూడా విక్రమార్కుని ఆదేశానుసారముగా వ్రాసినట్లు చెప్పుకొన్నాడు.
ఇంతవరకూ నేను తెలియజేసిన విషయములు విక్రమార్కుడను చక్రవర్తి ఈ భూమిని ‘ఉజ్జయిని’ని రాజధానిగా చేసుకొని పాలించినట్లు మనకు తెలియుట లేదా! ఇక ఆయన పూర్వీకులేవారు, ఆయన ఏ కాలమువాడు అన్నది పరిశీలింతము.
ప్రమర రాజులు
ఈ దిగువన ప్రమర రాజ్య వ్యవస్థాపకుని మొదలు విక్రమార్కుని వరకూ ఆయా రాజుల పరిపాలనా కాలము ఈ దిగువన ఇవ్వబడినది.
Name of King                                     Years
Pramara (Parmar)                      2710 – 2716 Kali Yuga (392 – 386 BC)  
Mahamara                                                    386 – 383 BC 
Devapi                                                       383 – 380 BC
Devdatta                                                380 – 377 BC
Sakas defeated next kings, who left Ujjain          377 – 182 BC
And fled to Srisailam                                                                                                                
Gandharvasena (1st time)                               182 – 132 BC
Sankharaja (son of Gandharvasena) went to forest for meditation and died without a child                                                   132 – 102 BC 
Gandharvasena (2nd time) returned from exile and took over the
102 – 82 BC        Vikramaditya (2nd son of Gandharvasena born in 101 BCE i.e. 3001 kali Yuga)                      82 BCE – 19AD
ఆవిధముగా ప్రమర వంశము క్రీ.శ. 1305 వరకు భారత దేశమును పరిపాలించుట జరిగినది. ఈ వంశపు చివరి రాజు మహాకాల దేవుడు.
మన చరిత్ర పుస్తకములలో ఈ వంశానుక్రమణిక చదువము. ఇంత నిర్దుష్టముగా ఉన్న విషయము అసంబద్ధము, అసంగతము కాలేదు కదా!
విక్రమాదిత్యుని రాజ్యపు ఎల్లలు:
పశ్చిమే సింధునద్యంతే సేతు బంధేని దక్షిణే l
ఉత్తరే బదరీస్థానే పూర్వేచ కపిలాంతికే ll
భవిష్య పురాణములోని ఈ శ్లోకము ఈవిధముగా మనకు తెలియజేయుచున్నది. పడమట సింధూ తీరము వరకు, దక్షిణమున సేతు బంధనము అనగా రామేశ్వరము వరకు తూర్పున బదరికావనము  వరకూ, ఉత్తరమున కపిలవస్తు వరకు ఈయన రాజ్యము వ్యాపించియుండెడిదట. ఇంతియే కాక కాలక్రమమున ఆయన ఎన్నో మధ్య ప్రాచ్య దేశములను కూడా జయించినాడు. అసలాయన సింహాసనమును అధిష్ఠించిన వివరము, శకులను తరిమి వేయుట, మధ్య ప్రాచ్య దేశములను (Middle East Countries) జయించుట వారిచేత పితృసమాన పాలకుడని పేరు పొందుట ఒకసారి ఈ వివరముల ద్వారా తెలుసుకొండి.
ఈ వివరాలతో మరొకసారి కలుసుకొందాం.......
సామ్రాట్ విక్రమాదిత్య - 4
పూర్ణే త్రింశచ్ఛతే వర్షే కలౌ ప్రాప్తే భయంకరే శాకానాంచ వినాశార్థం
ఆర్యధర్మ వివృధ్యే జాతః శివాజ్ఞయా సోపి కైలాసాత్ గుహ్యకాలయత్ -భవిష్య మహాపురాణము (3-1-7-14,15 శ్లోకములు)
‘విక్రమాదిత్య నామానాం పితా కృత్వా ముమోదహాసా బలోపి మహాప్రజానాః పితృ మాత్రు ప్రియంకరః’ (3-1-7-16)
పంచవర్షే వయః ప్రాప్తే తపసార్థే వనం గతః ద్వాదశాబ్దాం ప్రయత్నేన విక్రమేనా కృతం తపః (భవిష్య 3-1-7-17)  
‘పశ్చాత్ అంబావతిం దివ్యం పురీం యతః శ్రేయాన్వితాః దివ్యం సింహాసనం రమ్యం ద్వాత్రింశన్ మూర్తి సంయుతం’ (భవిష్య 3-1-7-18)
పై శ్లోకముల అనువాదము: కలియుగము ప్రారంభమయి 3000 గడచిన పిమ్మట (101 క్రీ.పూ.), కైలాసములోని గుహ్య గణము నుండి ఒక మహాపురుషుడు, మహాదేవుని ఆజ్ఞతో, శక వినాశకుడై ఆర్య ధర్మమును పునః ప్రతిష్ఠింప గంధర్వసేన మహారాజు కుమారునిగా, విక్రమాదిత్యునిగా నామకరణము చేయబడి తలిదండ్రులకు ఎనలేని సంతోషమును సమకూర్చినాడు. జననము మొదలు 5 సంవత్సరముల వరకు తల్లిదండ్రులకు తన ఆట పాటల చేత బుద్ధి కుశలత చేత, ముద్దుముచ్చటలచేత ఎంతయో సంతసమునందజేసి తపోవనములకు వెడలి 12సంవత్సరముల కాలము తపమాచరించి అంబావతిని తిరిగి చేరుకొన్నాడు. అప్పుడు 32 కళలుగల సాలభంజికలతో విరాజిల్లు సింహాసనమును అధిష్ఠించి శకులను తరిమికొట్టి ప్రజారంజకుడై దేశమును పరిపాలించినాడు. ఈ దిగువ కనబరచిన మధ్య ప్రాచ్య ప్రాంతములనన్నింటినీ ఆయన జయించినాడు. బాబిలోన్, పర్షియా టర్కి,  ఆపై అరేబియా ఆయన ఏలుబడిలోనికి వచ్చినవి. ఆ సందర్భముగానే ఆయనను అచట ఎంతగానో ప్రశంసించుట జరిగినది.
ముస్లీముల ‘కాబా’ గా మార్చబడిన ఆ కట్టడము ఒకనాటి మఖేశ్వరాలయము. అందు గోడకు అరబ్బీ  భాషలో ' (షా) శాయర్ - ఉల్ - ఓకుల్' అంటే దాని అర్థము 'చిరఃస్మరణీయము"అని, ఒక బంగారు రేకు పై వ్రాయబడిన కవిత తగిలింపబడి ఉండెడిదట. ఇప్పటికి కూడా అది టర్కీ దేశపు రాజధానియైన  ఇస్తాంబుల్ నగరములోని 'మాక్తాబ్ -ఏ - సుల్తానియా' అన్న జగత్ప్రసిద్ద గ్రంథాలయము నందున్నదని ప్రసిద్ధ చరిత్రకారుడు P.N. ఓక్ గారు Was the Kaaba Originally a Hindu Temple? అన్న  గ్రంధములో తెలిపినారు. మఖేశ్వరాలయమున ఉన్న ఆ కవిత ' అబూ అమీర్ ఆసామి' అన్న 'హారూన్-అల్-రషీద్' ఖలీఫా గారి ఆస్థాన కవీశ్వరుడు, ఇస్లాంకు ముందు వ్రాసిన కవిత్వము ఇది. తరువాత బనీ- ఉమ్- మయ్యా వంశపు అంతము వరకు, అక్కడినుండి హారూన్ గారి కాలము వరకు 3 భాగములుగా సంకలనము చేసి ఆయన తిరిగీ సంపుటీకరించినాడు. అందులోని 315 వ పుటలో ప్రమర వంశజుడైన  విక్రమాదిత్యుని గూర్చిన ప్రశంస వున్నది. ఈ 'శాయర్ - ఉల్ - ఓకుల్' కలిగియున్నది ఆ విక్రమార్కుని ప్రశంసయే! ఈ కవిత లోని భావము ‘లోక కల్యాణమును పరమావధిగానెంచి అరబ్ దేశీయులలో భక్తీ భావమును పెంచిన విక్రమాదిత్యుని శాసన కాలములో నుండిన ప్రజలెంత అదృష్టవంతులు ' అని సాగుతుంది. వేదవీర్ ఆర్య గారు సాధికారికముగా రచించిన 'Chronology of ancient India ~ Victim of concoctions and distortions" చదివితే మనకు ఈ విషయము తెలియగలదు.
"ఉజ్జయిని పాలకుడగు గంధర్వసేనుని కుమారుడగు విక్రమాదిత్యుడు క్రీ.పూ. 1 శతాబ్దమునకు చెందినవాడు. నవరత్నములు ఈయన ఆస్థానము లోనివారే!. ఈనాటికీ 5 లక్షల పైచిలుకు గ్రామాలలో పాటించే విక్రం సంవత పంచాంగము  ఈయన కాలము నుండియే ఆరంభమైనది. ఇది ఆయన పాలనా కాలములో శకులను జయించిన పిదప క్రీ.పూ.57 న మొదలయినది.  
విక్రమార్కుని కాలములో బాబిలోన్ పర్షియా తుర్క్మినిస్తాన్, అరేబియా ఆది దేశాలలో ఎన్నో దేవాలయాలు కట్టుట సంభవించినది. అరేబియాలో మక్కా వద్ద అల్ మనత్, అల్ ఉజా మరియు అల్ లత్ అన్న ముగ్గురు స్త్రీ దేవతల గుళ్ళు ఉండేవి. ఇవి మన లక్ష్మి పార్వతీ సరస్వతుల ప్రతీకలు. కానీ వారు వీరిని అక్క చేల్లెళ్ళుగా తలచి పూజించేవారు. అంటే హిందూధర్మము విక్రముని కాలమంతా మిక్కుటముగా శోభిల్లుచుండినదన్నమాట. అసలు వారు విక్రముని దైవ ప్రతినిధిగా ఆరాధించేవారు. ఇస్లాము ఆ దేశమున అడుగుపెట్టుటతో హైందవము అంతరించుట మొదలైనది.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పుకొనవలసియున్నది.
దిల్లీ లోని మేహ్రోలి ప్రాంతములో కుతుబ్ మీనార్ వున్నది. దానికి అత్యంత సమీపములో ఒక విష్ణ్వాలయము ధ్వజస్థంభము ఉన్నది. ఇక్కడ ఒక్కమాట మీ దృష్టికి తెస్తాను. కుతుబుద్దీన్ ఐబాక్ ఈ కుతుబ్ మీనార్ కట్టించినాడు లేక కట్టించ మొదలుపెట్టినాడు. తరువాతి రాజగు ఇల్టిమష్ దానిని పూర్తి చేసినట్లు చెబుతారు. ఈ రోజుకు కూడా ఆ కట్టడమును విమర్శనా దృక్పథముతో చూస్తే తెలుస్తుంది అది మహమ్మదీయ సుల్తానులు కట్టించినది కాదని.
కారణాలు గమనించండి:
1.    ఆ ప్రాంతము పేరు మేహ్రోలి. ఇది ‘మిహిరావళి’ యొక్క రూపాంతరము. మిహిరుడు అను నిజనామము కలిగిన వరాహమిహిరుని పేరుతో ఏర్పడిన ప్రాంతము. అంటే  ఆ కాలముననే తన మిత్రబంధువులతో ఆయన కోరిక మేరకు విక్రమార్కుడు కట్టించినట్లు మనకు తెలియవస్తుంది. ఆయన ఖగోళశాస్త్రమునందు మేరుసమానుడు కాబట్టి ఆ ప్రాంతములో కుతుబ్ మీనార్ అన్న ఆధునిక నామము కల్గిన కట్టడము కట్టించుట జరిగినది. ఆయన ఖ్యాతితో పోల్చినపుడు ఆ నక్షత్రశాల (నేటి కుతుబ్ మీనార్) తక్కువే కాబట్టి, అది కూదాస మిహిరావలిలో ఒక భాగమే కాబట్టి దానికి ప్రత్యేకముగా పేరు ఉంచలేదు.
2.   ఆ కట్టడమును నేడు గమనించినా కూడా గోడలపై అక్కడక్కడ ఖురాన్ వాక్యాలు చొప్పించినట్లు తెలియవస్తుంది. పైగా ఆ ప్రాంతములో\ప్రాంగణములో  ఎన్నో హైందవ దేవతా విగ్రహములను నేటికి కూడా మనము చూడవచ్చును.
3.   ఈ కట్టడమును ఆనుకొని విష్ణుమందిరము ఉండుటచే, ఆ కట్టడము కుతుబుద్దీన్ కానీ ఇల్టిమష్ గానీ కట్టించినది కాదని మనము సులభముగా గ్రహించవచ్చు. కోరికోరి మహమ్మదీయులు దేవాలయము ప్రక్కన తమ కట్టడములను కట్టించారు గదా!
4.   ఆ కట్టడమును ఒక ఖగోళ శాస్త్రజ్ఞుని సహకారముతో పరిశీలించితే అది తత్సంబంధమైన కట్టడమని మనము సులభముగా గ్రహించవచ్చును.
5.   ఇక ఆ విష్ణ్వాలయము నందలి త్రుప్పు పట్టని ఉక్కు ధ్వజస్తంభమును గమనించితే అది ఏ కాలమునాటిది అని ఈ కాలమునకు కూడా చెప్పలేకున్నారు నేటి Scientists. అది నిస్సందేహముగా క్రీస్తు పూర్వముదని ప్రముఖ Scientists ద్రువపరచినారు కూడా.
6.   ఆ స్థంభముపై ఒక శాసనము మనకు అగుపించుతుంది. అందు బాహ్లిక (ఈ శబ్దాన్ని కొందరు బాల్హిక అని పలుకుట కద్దు, మనము చిహ్నము అని వ్రాసి చిన్హము అని పలుటాము కదా! ఆవిధంగా) రాజును ఓడించి ఆతనితో సంధి కుదుర్చుకొని ఆతని కుమార్తెను విక్రముడు వివాహము చేసుకొన్నట్లు వున్నది. ఆ ‘బాల్హిక్’ వేరేదియో కాదు, నేడు పశ్చిమ ఏషియా లోని ‘బాల్క్’ అన్న ప్రాంతమే అది.
మరి ఇన్ని వాస్తవాలను పక్కకు నెట్టి మనలను అంధకారములో ఉంచి లేక ముంచి తమకు తోచినది చెప్పి  నమ్మించే చరిత్రకారుల పుకారులను నమ్మి మన దేశచరిత్ర ఆకారము అదియేనని నమ్మి  మనమే వికారము చేసుకొనుచున్నాము.  
విక్రముడు చేసిన అత్యంత ఘనమైన కార్యములను మరికొన్ని చూద్దాము. పర్షియా (నేటి ఇరాన్) లో ముఖ్యముగా  విస్తృత రమణీయ రహదారులను నిర్మించుటయే గాక స్పష్టమైన  వార్తా గ్రాహక విధానమును (Postal System) ఏర్పరచినాడు. అసలు ఇరానీయులు మానుండి విడిపడిన సంతతిగా ప్రకటించినాడు. 1,700 మైళ్ళ దూరము గల  రాజమార్గమును నిర్మించి వార్తా సేకరణ సులభతరము చేసిన మహానుభావుడు ఆయన. అసలు ఈ విధానమును నేటికినీ  US Postal Service అనుసరించుతూవున్నాడని తెలివస్తూ వున్నది. క్రీస్తు శకము 102 తరువాతనుండి
భారతీయ పాలకులు దీనిపై పట్టు కోల్పోయినట్లు తెలియవచ్చుచున్నది. (సేకరణ www.booksfact.com/ నుండి)

మిగిలినది మళ్ళీ ఒకసారి........

సమ్రాట్ విక్రమాదిత్య - 6

ప్రమర రాజులు

ఈ దిగువన ప్రమర రాజ్య వ్యవస్థాపకుని మొదలు విక్రమార్కుని వరకూ ఆయా రాజుల పరిపాలనా కాలము ఈ దిగువన ఇవ్వబడినది.

Name of King                                     Years

Pramara (Parmar)                      2710 – 2716 Kali Yuga (392 – 386 BC) 

Mahamara                                                    386 – 383 BC

Devapi                                                             383 – 380 BC

Devdatta                                                          380 – 377 BC

Sakas defeated next kings,

and abandoned them from Ujjain                        377 – 182 BC

and the Pramara kings fled to Srisailam                                                                                                               

Gandharvasena (1st time)                                  182 – 132 BC

Sankharaja (son of Gandharvasena) went to

Forest for meditation and died without a child     132 – 102 BC

Gandharvasena (2nd time) returned from

Exile and took over the throne again                  102 – 82 BC                                             

Vikramaditya (2nd son of Gandharvasena

 Born in 101 BCE i.e. 3001 kali Yuga)                     82 BCE – 19AD

ఆ విధముగా ప్రమర వంశము క్రీ.శ. 1305 వరకు భారత దేశమును పరిపాలించుట 

జరిగినది. ఈ వంశపు చివరి రాజు మహాకాల దేవుడు.

మన చరిత్ర పుస్తకములలో ఈ వంశానుక్రమణిక చదువము. ఇంత నిర్దుష్ఠముగా ఉన్న విషయము అసంబద్ధముఅసంగతము అయ్యే అవకాశము ఉన్నదంటారా!

విక్రమాదిత్యుని రాజ్యపు ఎల్లలు:

పశ్చిమే సింధునద్యంతే సేతు బంధేని దక్షిణే l

ఉత్తరే బదరీస్థానే పూర్వేచ కపిలాంతికే ll

భవిష్య పురాణములోని ఈ శ్లోకము ఈవిధముగా మనకు తెలియజేయుచున్నది. పడమట సింధూ తీరము వరకుదక్షిణమున సేతు బంధనము అనగా రామేశ్వరము వరకు తూర్పున బదరికావనము  వరకూఉత్తరమున కపిలవస్తు వరకు ఈయన రాజ్యము వ్యాపించియుండెడిదట. ఇంతియే కాక కాలక్రమమున ఆయన ఎన్నో మధ్య ప్రాచ్య దేశములను కూడా జయించినాడు. అసలాయన సింహాసనమును అధిష్ఠించిన వివరముశకులను తరిమి వేయుటమధ్య ప్రాచ్య దేశములను (Middle East Countries) జయించుట వారిచేత పితృసమాన పాలకుడని పేరు పొందుట ఒకసారి ఈ వివరముల ద్వారా తెలుసుకొండి.

పూర్ణే త్రింశచ్ఛతే వర్షే కలౌ ప్రాప్తే భయంకరే శాకానాంచ వినాశార్థం

ఆర్యధర్మ వివృధ్యే జాతః శివాజ్ఞయా సోపి కైలాసాత్ గుహ్యకాలయత్ -భవిష్య మహాపురాణము (3-1-7-14,15 శ్లోకములు)

‘విక్రమాదిత్య నామానాం పితా కృత్వా ముమోదహాసా బలోపి మహాప్రజానాః పితృ మాత్రు ప్రియంకరః’ (3-1-7-16)

పంచవర్షే వయః ప్రాప్తే తపసార్థే వనం గతః ద్వాదశాబ్దాం ప్రయత్నేన విక్రమేనా కృతం తపః (భవిష్య 3-1-7-17) 

‘పశ్చాత్ అంబావతిం దివ్యం పురీం యతః శ్రేయాన్వితాః దివ్యం సింహాసనం రమ్యం ద్వాత్రింశన్ మూర్తి సంయుతం’ (భవిష్య 3-1-7-18)

పై శ్లోకముల అనువాదము: కలియుగము ప్రారంభమయి 3000 గడచిన పిమ్మట (101 క్రీ.పూ.)కైలాసములోని గుహ్య గణము నుండి ఒక మహాపురుషుడుమహాదేవుని ఆజ్ఞతోశక వినాశకుడై ఆర్య ధర్మమును పునః ప్రతిష్ఠింప గంధర్వసేన మహారాజు కుమారునిగావిక్రమాదిత్యునిగా నామకరణము చేయబడి తలిదండ్రులకు ఎనలేని సంతోషమును సమకూర్చినాడు. జననము మొదలు 5 సంవత్సరముల వరకు తల్లిదండ్రులకు తన ఆట పాటల చేత బుద్ధి కుశలత చేతముద్దుముచ్చటలచేత ఎంతయో సంతసమునందజేసి తపోవనములకు వెడలి 12సంవత్సరముల కాలము తపమాచరించి అంబావతిని తిరిగి చేరుకొన్నాడు. అప్పుడు 32 కళలుగల సాలభంజికలతో విరాజిల్లు సింహాసనమును అధిష్ఠించి శకులను తరిమికొట్టి ప్రజారంజకుడై దేశమును పరిపాలించినాడు. ఈ దిగువ కనబరచిన మధ్య ప్రాచ్య ప్రాంతములనన్నింటినీ ఆయన జయించినాడు. బాబిలోన్పర్షియా టర్కి,  ఆపై అరేబియా ఆయన ఏలుబడిలోనికి వచ్చినవి. ఆ సందర్భముగానే ఆయనను అచట ఎంతగానో ప్రశంసించుట జరిగినది.

మిగిలినది మరొక మారు......

ముస్లీముల ‘కాబా’ గా మార్చబడిన ఆ కట్టడము ఒకనాటి మఖేశ్వరాలయము. అందు గోడకు అరబ్బీ  భాషలో ' (షా) శాయర్ - ఉల్ - ఓకుల్' అంటే దాని అర్థము 'చిరఃస్మరణీయము"అని, ఒక బంగారు రేకు పై వ్రాయబడిన కవిత తగిలింపబడి ఉండెడిదట. ఇప్పటికి కూడా అది టర్కీ దేశపు రాజధానియైన  ఇస్తాంబుల్ నగరములోని 'మాక్తాబ్ -ఏ - సుల్తానియా' అన్న జగత్ప్రసిద్ద గ్రంథాలయము నందున్నదని ప్రసిద్ధ చరిత్రకారుడు P.N. ఓక్ గారు Was the Kaaba Originally a Hindu Temple? అన్న  గ్రంధములో తెలిపినారు. మఖేశ్వరాలయమున ఉన్న ఆ కవిత ' అబూ అమీర్ ఆసామి' అన్న 'హారూన్-అల్-రషీద్' ఖలీఫా గారి ఆస్థాన కవీశ్వరుడు, ఇస్లాంకు ముందు వ్రాసిన కవిత్వము ఇది. తరువాత బనీ- ఉమ్- మయ్యా వంశపు అంతము వరకు, అక్కడినుండి హారూన్ గారి కాలము వరకు 3 భాగములుగా సంకలనము చేసి ఆయన తిరిగీ సంపుటీకరించినాడు. అందులోని 315 వ పుటలో ప్రమర వంశజుడైన  విక్రమాదిత్యుని గూర్చిన ప్రశంస వున్నది. ఈ 'శాయర్ - ఉల్ - ఓకుల్' కలిగియున్నది ఆ విక్రమార్కుని ప్రశంసయే! ఈ కవిత లోని భావము ‘లోక కల్యాణమును పరమావధిగానెంచి అరబ్ దేశీయులలో భక్తీ భావమును పెంచిన విక్రమాదిత్యుని శాసన కాలములో నుండిన ప్రజలెంత అదృష్టవంతులు ' అని సాగుతుంది. వేదవీర్ ఆర్య గారు సాధికారికముగా రచించిన 'Chronology of ancient India ~ Victim of concoctions and distortions" చదివితే మనకు ఈ విషయము తెలియగలదు.
"ఉజ్జయిని పాలకుడగు గంధర్వసేనుని కుమారుడగు విక్రమాదిత్యుడు క్రీ.పూ. 1 శతాబ్దమునకు చెందినవాడు. నవరత్నములు ఈయన ఆస్థానము లోనివారే!. ఈనాటికీ 5 లక్షల పైచిలుకు గ్రామాలలో పాటించే విక్రం సంవత పంచాంగము  ఈయన కాలము నుండియే ఆరంభమైనది. ఇది ఆయన పాలనా కాలములో శకులను జయించిన పిదప క్రీ.పూ.57 న మొదలయినది.  
విక్రమార్కుని కాలములో బాబిలోన్ పర్షియా తుర్క్మినిస్తాన్, అరేబియా ఆది దేశాలలో ఎన్నో దేవాలయాలు కట్టుట సంభవించినది. అరేబియాలో మక్కా వద్ద అల్ మనత్, అల్ ఉజా మరియు అల్ లత్ అన్న ముగ్గురు స్త్రీ దేవతల గుళ్ళు ఉండేవి. ఇవి మన లక్ష్మి పార్వతీ సరస్వతుల ప్రతీకలు. కానీ వారు వీరిని అక్క చేల్లెళ్ళుగా తలచి పూజించేవారు. అంటే హిందూధర్మము విక్రముని కాలమంతా మిక్కుటముగా శోభిల్లుచుండినదన్నమాట. అసలు వారు విక్రముని దైవ ప్రతినిధిగా ఆరాధించేవారు. ఇస్లాము ఆ దేశమున అడుగుపెట్టుటతో హైందవము అంతరించుట మొదలైనది.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పుకొనవలసియున్నది.
దిల్లీ లోని మేహ్రోలి ప్రాంతములో కుతుబ్ మీనార్ వున్నది. దానికి అత్యంత సమీపములో ఒక విష్ణ్వాలయము ధ్వజస్థంభము ఉన్నది. ఇక్కడ ఒక్కమాట మీ దృష్టికి తెస్తాను. కుతుబుద్దీన్ ఐబాక్ ఈ కుతుబ్ మీనార్ కట్టించినాడు లేక కట్టించ మొదలుపెట్టినాడు. తరువాతి రాజగు ఇల్టిమష్ దానిని పూర్తి చేసినట్లు చెబుతారు. ఈ రోజుకు కూడా ఆ కట్టడమును విమర్శనా దృక్పథముతో చూస్తే తెలుస్తుంది అది మహమ్మదీయ సుల్తానులు కట్టించినది కాదని.
కారణాలు గమనించండి:
1.    ఆ ప్రాంతము పేరు మేహ్రోలి. ఇది ‘మిహిరావళి’ యొక్క రూపాంతరము. మిహిరుడు అను నిజనామము కలిగిన వరాహమిహిరుని పేరుతో ఏర్పడిన ప్రాంతము. అంటే  ఆ కాలముననే తన మిత్రబంధువులతో ఆయన కోరిక మేరకు విక్రమార్కుడు కట్టించినట్లు మనకు తెలియవస్తుంది. ఆయన ఖగోళశాస్త్రమునందు మేరుసమానుడు కాబట్టి ఆ ప్రాంతములో కుతుబ్ మీనార్ అన్న ఆధునిక నామము కల్గిన కట్టడము కట్టించుట జరిగినది. ఆయన ఖ్యాతితో పోల్చినపుడు ఆ నక్షత్రశాల (నేటి కుతుబ్ మీనార్) తక్కువే కాబట్టి, అది కూదాస మిహిరావలిలో ఒక భాగమే కాబట్టి దానికి ప్రత్యేకముగా పేరు ఉంచలేదు.
2.   ఆ కట్టడమును నేడు గమనించినా కూడా గోడలపై అక్కడక్కడ ఖురాన్ వాక్యాలు చొప్పించినట్లు తెలియవస్తుంది. పైగా ఆ ప్రాంతములో\ప్రాంగణములో  ఎన్నో హైందవ దేవతా విగ్రహములను నేటికి కూడా మనము చూడవచ్చును.
3.   ఈ కట్టడమును ఆనుకొని విష్ణుమందిరము ఉండుటచే, ఆ కట్టడము కుతుబుద్దీన్ కానీ ఇల్టిమష్ గానీ కట్టించినది కాదని మనము సులభముగా గ్రహించవచ్చు. కోరికోరి మహమ్మదీయులు దేవాలయము ప్రక్కన తమ కట్టడములను కట్టించారు గదా!
4.   ఆ కట్టడమును ఒక ఖగోళ శాస్త్రజ్ఞుని సహకారముతో పరిశీలించితే అది తత్సంబంధమైన కట్టడమని మనము సులభముగా గ్రహించవచ్చును.
5.   ఇక ఆ విష్ణ్వాలయము నందలి త్రుప్పు పట్టని ఉక్కు ధ్వజస్తంభమును గమనించితే అది ఏ కాలమునాటిది అని ఈ కాలమునకు కూడా చెప్పలేకున్నారు నేటి Scientists. అది నిస్సందేహముగా క్రీస్తు పూర్వముదని ప్రముఖ Scientists ద్రువపరచినారు కూడా.
6.   ఆ స్థంభముపై ఒక శాసనము మనకు అగుపించుతుంది. అందు బాహ్లిక (ఈ శబ్దాన్ని కొందరు బాల్హిక అని పలుకుట కద్దు, మనము చిహ్నము అని వ్రాసి చిన్హము అని పలుటాము కదా! ఆవిధంగా) రాజును ఓడించి ఆతనితో సంధి కుదుర్చుకొని ఆతని కుమార్తెను విక్రముడు వివాహము చేసుకొన్నట్లు వున్నది. ఆ ‘బాల్హిక్’ వేరేదియో కాదు, నేడు పశ్చిమ ఏషియా లోని ‘బాల్క్’ అన్న ప్రాంతమే అది.
మరి ఇన్ని వాస్తవాలను పక్కకు నెట్టి మనలను అంధకారములో ఉంచి లేక ముంచి తమకు తోచినది చెప్పి  నమ్మించే చరిత్రకారుల పుకారులను నమ్మి మన దేశచరిత్ర ఆకారము అదియేనని నమ్మి  మనమే వికారము చేసుకొనుచున్నాము.  
విక్రముడు చేసిన అత్యంత ఘనమైన కార్యములను మరికొన్ని చూద్దాము. పర్షియా (నేటి ఇరాన్) లో ముఖ్యముగా  విస్తృత రమణీయ రహదారులను నిర్మించుటయే గాక స్పష్టమైన  వార్తా గ్రాహక విధానమును (Postal System) ఏర్పరచినాడు. అసలు ఇరానీయులు మానుండి విడిపడిన సంతతిగా ప్రకటించినాడు. 1,700 మైళ్ళ దూరము గల  రాజమార్గమును నిర్మించి వార్తా సేకరణ సులభతరము చేసిన మహానుభావుడు ఆయన. అసలు ఈ విధానమును నేటికినీ  US Postal Service అనుసరించుతూవున్నదని తెలివస్తూ వున్నది. క్రీస్తు శకము 102 తరువాతనుండి
భారతీయ పాలకులు దీనిపై పట్టు కోల్పోయినట్లు తెలియవచ్చుచున్నది. (సేకరణ www.booksfact.com/ నుండి)

మిగిలినది మళ్ళీ ఒకసారి........
సామ్రాట్ విక్రమాదిత్య – 6

మహాత్ముడు కాళిదాసు తన జ్యోతిర్విదాభరణములో తాను భావి తరాలకు విక్రముని ఔన్నత్యమును తెలియజేయుటకే ఈ విషయముల తెలియజేయుచున్నట్లు 4 వ సర్గ లోని 89 వ శ్లోకములో తెలియజేస్తాడు. పైగా ఆయన విక్రముని, ‘శక మారకుడగుటచే ‘శక కారకు’డైనాడు అని వర్ణించినాడు. 22 భాగములుగా విభజింపబడిన జోతిర్విదాభరణమును ప్రమరవంశజుల ప్రజారంజక పరిపాలనమును, విక్రముని ఔన్నత్యమును చాటుటకే వ్రాసినట్లు 4వ సర్గ లోని 89వ శ్లోకములో తెలియజేస్తాడు. ఆయన ఈ కావ్యమును కలి 3068 వైశాఖములో(ఇంచుమించు ‘మె’ లో) మొదలు పెట్టి ( 33 క్రీ.పూ.) అదే సంవత్సరము కార్తీకములో (ఇంచుమించు నవంబరులో) పూర్తి చేసినట్లు తెలియజేసినాడు. ఈ కావ్యములు 22 విభాగములు 1474 శ్లోకములు ఉన్నట్లు చెప్పుకొన్నాడు. ఆ కావ్యము ద్వారా ఇంకా ఈ క్రింది విషయములు మనకు తెలియవస్తాయి.
1.    ఆయన రాజ్యము 180 జ్యోతిష యోజనముల (అనగా 1800 మైళ్ళ) విస్తీర్ణము కలిగినట్లు తెలియవస్తూవున్నది.
2.   ఆయన కాలములో భారత వర్షము వైదిక ధర్మముతో అలరారు చుండినది.
3.   ఆయన ఆస్థానములో నవరత్నములు కాక ఇంకా మణి, అంగుదత్త, జిష్ణు, త్రిలోచన, హరిస్వామి (ఈయన శుక్ల యజుర్వేదమునకు భాష్యము వ్రాయుటయే కాక విక్రమార్కుని కాలములో దాన ధర్మాధ్యక్షునిగా కూడా ఉండినాడు, శతపథ బ్రాహ్మణమునకు ఈయన భాష్యము కూడా వ్రాసినాడు), సత్యాచార్య, శృతసేన, బాదరాయణ, మణిత్థ, కాక ఇంకా ఎందఱో జ్యోతిష్యులు ఉండేవారని తెలియవచ్చుచున్నది.
4.   ఆయన ఏలుబడి క్రింద 800ల మంది సామంతులు, ఒక కోటి మంది సైన్యము, 16 మంది మహా పండితులు, 16 మంది జ్యోతిష్యులు, 16 మంది వైద్యులు, 16 మంది భట్రాజులు(భట్టువులు),  16 మంది వేద పండితులు ఉండేవారని పై గ్రంధము ద్వారా తెలియవచ్చుచున్నది. (22-11)
5.   22-12 శ్లోకము ద్వారా ఆయన సైన్య బలగములో 4 లక్షల నౌకలు కూడా ఉండేవని తెలియవచ్చుచున్నది. ఈ వాస్తవములను గమనించినపుడు ఈ భారత భూమిని కలియుగములో పాలించిన చక్రవర్తులలో ఇంతకన్నా మిన్నయైన వారు లేరని తెలియవచ్చుచున్నది.
6.   పైన తెలిపిన పండితులలో శ్రీకృష్ణ మిశ్ర తన ‘జ్యోతిష ఫల రత్నమాల’ లో తాను రాజ పోషణలో 70 సంవత్సరములున్నట్లు చెప్పుకొన్నాడు. (10 వ శ్లోకము జ్యోతిష ఫల రత్న మాల) అంటే క్రీస్తు శకమునకు అన్వయించుకొంటే క్రీ.పూ. 57 నుండి క్రీ.శ. 13 వరకు ఆయన వున్నట్లు తెలియవచ్చుచున్నది. దీనిని బట్టి విక్రమార్కుడు కూడా కనీసము అంత కాలము రాజ్యము చేసినట్లేకదా!
7.   తన సామ్రాజ్యమును సుస్థిరము చేసుకొన్న తరువాత నేపాళమునకు వెళ్లి అక్కడ అంశువర్మ అను అత్యంత యోగ్యునికి పట్టముకట్టగా, విక్రముని పేరుతో శకమును, నేపాళమున క్రీ.పూ. 57న ఏర్పాటు చేసినాడు. (This information is published in the Indian Antiquary Vol. XIII. Pages 411 onwards.)

8.   ఆయన ప్రాంతములను పాళెములగా విభజించి పాళెగాళ్ళను ఏర్పరచి గ్రామ వ్యవస్థను క్రమబద్ధము చేసినాడు.

      కల్హణుని ‘రాజతరంగిణి’ ద్వారా కాశ్మీరు రాజ్యపు 82వ రాజగు హిరణ్యకుని మరణానంతరము వారసులు లేని కారణముగా అమాత్య సంఘము విక్రమ చక్రవర్తిని ఆహ్వానించి సమర్థుడైన వ్యక్తికి పట్టము కట్టమన, ఆయన తన సామంత రాజ్యమైన కాశ్మీరము అరుదెంచి మాతృగుప్తునికి రాజ పట్టాభిషేకము చేసి అక్కడి పరిస్థితులను చక్కబరచినాడు. (రాజతరంగిణి 3 – 125)
పైన ఉదహరించిన గ్రంధములే కాక ఈ దిగువ కనబరచిన జైన గ్రంధములలో కూడా మనము విక్రముని ప్రస్థాపన చూడవచ్చును.  
1.    ప్రభాచంద్రుని ‘ప్రాభావక చరిత్ర (క్రీ.శ.1127)
2.   సోమప్రభుని కుమారపసల ప్రతిబోధ (క్రీ.శ.1184)
3.   కాలకాచార్య-కథ(క్రీ.శ. 1279 కు మునుపు)  
4.   మేరుతుంగ ప్రబంధ చింతామణి (క్రీ.శ.1304)  
5.   జినప్రభ సూరి విరచిత వివిధ తీర్థ కల్ప (క్రీ.శ.1315)  
6.   రాజ శేఖరుని ప్రబంధ కోశ(క్రీ.శ.1348)  
7.   దేవా మూర్తి విరచిత విక్రమ చరిత్ర (క్రీ.శ.1418)  
8.   రామచంద్ర సూరి విరచిత పంచదండ ఛాత్ర ప్రబంధ(క్రీ.శ.1433)
9.   సుభాషిలుని విక్రమ చరిత్ర(క్రీ.శ.1442)
10.అనేకానేక ‘పట్టావళులు’ (పట్టావలులు అంటే ప్రసిద్ధ జైన సన్యాసుల చరిత్రలు)
ఇంకొక ముఖ్యమైన విషయమును తెలియజేస్తాను. ఉనికిని కోల్పోయిన అయోధ్యను గుర్తించినవాడు. మహాభారత యుద్ధములో శ్రీరాముని సూర్య వంశ జాతుడగు ‘బృహద్బలుడు’ భీషణ మహాభారత సంగ్రామములో కౌరవులకు మద్దతుగా యుద్దముచేసి అసువులు బాసినాడు. ఆవిధముగా ఆతడు అయోధ్యను రాజదానుగా చేసుకొని పాలించిన చివరిరాజు అయినాడాతడు. ఆయన తదనంతరము అయోధ్యను తాకి తలచిన వారు లేరు విక్రముడు పరిపాలించే సమయము వరకు. శివ కేశవా భేదము లేని విక్రముడు ప్రపంచమునకే ఆదర్శమూర్తియైన ధర్మ మూర్తి రామచంద్ర మూర్తి అయోధ్యను కనుగొని పునః ప్రతిష్ఠింప దలచి అందు రాముని జ్ఞాపకార్థము ఆలయములను నిర్మింపదలచి ఆ పనికి చిత్తశుద్ధితో గడంగినాడు. నాటి శకులచేత మరుభూమిగా మార్చబడి ఉనికి కోల్పోయిన ప్రయాగను కనుగొని తద్వారా సరయూ నస్దిని అయోధ్యను గుర్తించగలిగినాడు. ఆనవాలే లేని ఆప్రాంతమునకు ఒక గుర్తును కూడా ఏర్పరచుకోన్నాడట. కానీ ఆయన ఉజ్జయిని చేరిన తరువాత అతిముఖ్య రాజకీయ కార్యకకార్య కలపములలో మునిగి ఆ విషయము మరచిపోయినాడు. ఆవిధముగా ఆయన ఉంచుకొన్న గురుతు కూడా కనుమరుగై పోగా, పట్టువదలని విక్రమార్కుడు తన ఆస్థానమునకు వచ్చిన ఒక మహాయోగిని ఆశ్రయించినాడు. ఆయన మహానీయుదగుటచే ఒక ఆవును గుర్తించి దానిని తన దూడతో వదిలివేసి దానిని అనుసరించమన్నాడు. అట్లు చేయబడిన ఆ ఆవు పితికే ప్రమేయము లేకుండానే తన పొదుగునుండి పాలను స్రవింపజేస్తుందో దానిని  అయోధ్యగా గుర్తించమని చెప్పినాడు. అదేవిధముగా జేసి విక్రముడు అయోధ్యను గుర్తించి అక్కడ కొన్ని ద్ఫెవాలయములను కట్టించినాడు. ఆయన తదనంతరము అంత ప్రతిభావంతుడగు రాజు లేకపోవుట చేతనూ, బౌద్ధ ప్రభావము అధికమగుట చేతను ఆదేవాలయములు నామ రూపములు లేకుండా బౌద్ధ చైత్యములు వెలసినాయి.
ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు. ప్రసిద్ధ చరిత్రకారుడగు ‘Cunningham’ గారు చెప్పిన మాటలు. శంఖున పడితేనే తీర్థమన్నట్లు మనకు ‘విస్సన్న చెప్పినదే వేదము, జేమ్సు చెప్పినదే చరిత్ర’ కదా! 7వ శతాబ్దములో యువాన్త్సువాంగ్ అయోధ్యను దర్శించు సమయానికి విక్రముడు కట్టించిన దేవాలయాలు నిర్మూలనము కాగా బౌద్ధ ఆరామములు అక్కడ వెలసినట్లు చెప్పినాడు.
ఈ విధముగా క్రీ.పూ. 101 లో పుట్టి క్రీ.పూ. 82 నుండి క్రీ.శ. 19 వరకు పాలించిన సామ్రాట్ విక్రమాదిత్యుడు దైవానుగ్రహముతో, అనన్య సామాన్యమైన పరిపాలనతో, పాలితుల ప్రేమతో, దేశమును పరిపాలించిన మహనీయుడు. ప్రపంచ చరిత్రలోనే కలియుగమున ఇంత గొప్ప చక్రవర్తిని చూడము. అవక్ర పరాక్రముడైన విక్రముని చరిత్రనువక్రీకరించి తమ కుత్సితము కుళ్ళు కుతంత్రముతో చరిత్రలో విక్రమునికి స్థానమే లేకుండాచేయుటయేగాక భారతభూమికి అనేక కళంకములను ఆపాదించినారు పాశ్చాత్య చరిత్రకారులు, వారి భారతీయ అనుయాయులు, వామపక్ష చరిత్రకారులు మరియు మహమ్మదీయు చరిత్రకారులు.
ఇప్పటికైనా యువత కళ్ళుతెరచి వాస్తవములను గమనించి మన పూర్వుల ఔన్నత్యమును జగతికి చాటి పుణ్యము కట్టుకొంతారని ఆశిస్తున్నాను.
ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
Awake ! Arise! Stop not till the goal is reached. Path is as sharp as razor’s edge and hard to go by.
లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైనదే అయినా సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏమున్నది.
ఈ వ్యాసము వ్రాయుటకు వాస్తవ విషయములను సేకరించుటకు నాకు 3 సంవత్సరముల కాలము పట్టినది. అంటే 3 సంవత్సరములూ ఈ పని పైన మాత్రమే ఉన్నానని కాదు. తగిన సమాచారము దొరుకుటకు ఎంతో శ్రమ పడినాను అని తెలియజేస్తున్నాను. చదవండి. దేశానికి గల ఔన్నత్యమును లోకానికి చాటి చెప్పండి.
మనము ఎవరికన్నా తక్కువకాదు. ఈ వాస్తవాన్ని గుర్తించండి.
భారత భూమిపై శకుల పాలననంతము జేయనెంచి, భా
గీరతి భర్త యానతిన గ్రీష్మ ప్రచండ ప్రతాప పూషగా
వైరి సమూహమున్ దునిమి వైదిక ధర్మము ధాత్రి నింపుచున్
పారము లేని ప్రేమ నెడబాయక ఏలితివయ్య విక్రమా!

స్వస్తి.




Thursday, 24 May 2018

ఆచారాలు - ఆదరాలు - ఆడపడచులు


ఆచారాలు - ఆదరాలు - ఆడపడచులు
ఆడపడచులను గూర్చి మనువు ఈ విధముగా చెబుతాడు.
శోచంతి జామయో యత్ర వినశ్వత్యాశు తత్కులంI
న శోచంతితు యత్రైతా వర్ధితే తద్ది సర్వదాII
అనగా ఆడపదచులు ఎక్కడయితే అన్నదమ్ములచేత ఆడరించబడరో  
ఆ వంశము నశిస్తుంది. అదే ఆ ఆడబిడ్డలను ఆడరించితే ఆ వంశము
అత్యున్నతముగా వర్ధిల్లుతుంది.
తస్మాన్నేతాన్ సదా పూజ్యాః భూషణాచ్చాద నాశనైI
భూతికామైర్నరేన్నిత్యం సత్కారేషూత్సవేషుచII
తమతింత పండుగలు పబ్బాలు మొదలగు శుభకార్యములు జరుపుకొనునప్పుడు ఆడపదచులను పిలిచి మంచి భోజనము పెట్టి, వస్త్ర భూషణాదులనిచ్చి సంతృప్తి పరచి పంపవలెనని మనువు చెబుతాడు. ఆమె ఇంట ఏదయినా శుభకార్యము జరిగితే పుట్టినిన్తివారు తప్పక వెళ్లి ఆమెను తమ తమ అభిమానముతో సంతృప్తి పరుచవలెను. అసలు బావమరదులు బ్రతుక గోరితే దాయాదులు చావు కోరుతారన్న సామెత ఉండనే వున్నది కదా! ఆడబిడ్డ కంటతడి ఏ పరిస్థితిలోనూ ఆమె పుట్టినింటికి మంచిదికాదు. కనుకనే
అన్నివిధములగు శుభకార్యములలో తమ ఆడపదచులను మరియు వారి భర్తలను అంటే అల్లుళ్ళను మరియు వారి సంతానమును సగౌరవముగా ఆహ్వానించి,తమ తల్లిదండ్రులు గతించినా,  ఆదరించ వలసిన బాధ్యత అన్నదమ్ములకున్నది. ఇది శాస్త్రవచానము.
పరమత గ్రంధాలలో పెళ్ళి అయినా పిదప ఆడపదచులను గౌరవించే సాంప్రదాయము వుండాలేదా అన్న తర్కమును వదిలివేస్తే మన వేద శాస్త్రపురాణేతిహాస గ్రంధాలలో మాత్రము ఎన్నో ఉదాహరణలు పుష్కలముగా లభించుతాయి.
స్వస్తి.

Wednesday, 16 May 2018

బ్రతుకు చీకటిలోన చిరుదివ్వె వెలిగింది

బ్రతుకు చీకటిలోన చిరుదివ్వె వెలిగింది
https://cherukurammohan.blogspot.com/2018/05/blog-post_16.html

చదవకుండానే like కొట్టవద్దండి. ఇది ఒక నిస్సంతు (బిడ్డలు లేనివాడు) 

హృదయనివేదన. మనసు పెట్టి చదవండి. మీ హృదయాన్ని ఈ ఉదంతము కదిలించితే

నాలుగు మాటలు మీరు వ్రాస్తే, అవి ఇంకా కొన్ని జంటలను ఉద్దీపించ గలుగుతాయేమో!

 నాకు దాదాపు 40 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు కలుగలేదు.కొలువని స్వామీ 

లేడు,కలువని స్వామీ లేడు. నేను ఏ జన్మలో చేసినదో కీడు

తీరిపోయిందొకనాడు,గురువు కరుణించినాడు, దైవములు ఇరువురూ 

అనుగ్రహించినారు.

ఆ గురువు రాఘవేంద్రుడు,ఒక దైవము పెంచల నరసింహుడు. వేరొక దైవము రామేశ్వర 

రామలింగేశ్వరుడు.

 

మృత్యు ముఖము నుండి నా శ్రీమతిని రాఘవేంద్రుడు ఏవిధముగా కాపాడినాడో ఒకపరి 

వ్రాసియుండినాను. ఇప్పుడు పెంచల(పెనుశిల) నరసింహుడు , మంత్రాలయ 

రాఘవేంద్రుడు,రామేశ్వర రామలింగేశ్వరుడు పిల్లల కోసం తల్లడిల్లే మా దంపతులపై 

ఎట్లు కరుణించినారో ఎరుక పరచుతాను.

 అది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. పూర్తిగా అటవీ ప్రాంతం. అయినా సరే ఎటు 

చూసిన భక్త జనం కిటికిటలాడుతుంటారు. మొక్కు తీర్చుకోవడానికి బారులు తీరి 

వస్తుంటారు. కోరిన భక్తులకు అక్కడి స్వామి నిజంగా కొంగుబంగారమే. ఆయనే లక్ష్మి 

నరసింహస్వామి. ఆయన ఉన్న స్థలమే పెంచలకోన . ప్రశాంతత కోసం నరసింహస్వామి 

ఈ ప్రాంతాన్ని చేరుకుని స్థిరపడ్డట్లు పురాణాలు చెపుతున్నాయి. కణ్వ మహర్షి ఇక్కడ 

తపస్సు చేసినారని రని అంటూవుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా 

రాపూరు నియోజకవర్గంలోని పెంచలకోన, జిల్లా కేంద్రమైన నెల్లూరుకు దాదాపు 40 

కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుంచి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ 

బస్సు సౌకర్యం ఉంది. అదే స్థాయిలో కడప జిల్లా రాజంపేట నుంచి బస్సులున్నాయి.

 

లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మీదేవిని పెనవేసుకుని శిలగా స్థిరపడినట్లు చరిత్ర చెబుతుండడంతో ఈ క్షేత్రం పెనుశిలగా పేరుగాంచింది. స్వా మివారిని భక్తులు పెంచలస్వామిగా పిలుస్తారు. నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లోని నదీపరీవాహక ప్రాం తమైన పెనుశిల క్రమేణా పెంచలకోనగా మారింది.

 1809లో 200 ఎకరాల అటవీ ప్రాంతాన్ని పెంచలకోన క్షేత్రానికి హంటన్‌దొర 

ధారాదత్తం చేసినట్లు ఆధారాలున్నాయి. హిరణ్యకశిపుని వధించిన అనంతరం 

ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన అడవుల్లోని చెంచు వనితను 

మోహించి, మనువాడినారని పెద్దలు చెబుతారు. ఎత్తైన కొండ లు, దట్టమైన అడవుల 

మధ్య కండలేరు, ఒడ్డున స్వామి వారు స్వయంభువుగా వెలిసినారని పురాణాల్లో 

పేర్కొన్నారు. విష్ణుమూర్తి యొక్క నాలుగవ అవతారంగా పెంచలకోన క్షేత్రంలో స్వామి వారు కొలువైఉన్నారని అంటారు. వైష్ణవ క్షేత్రాల్లో పెద్దదిగా పెంచలకోనకు పేరుంది. ఇక్కడి గర్భగుడిని సుమారు 800 ఏళ్ల కిందట నిర్మించి ఉంటారని అంచనా వేసినారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం వుంది.సంతానం లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

 ఈ క్షేత్రం లో సప్తతీర్థాలు ఉన్నాయి. కొండమీద నుంచి కోనకు చేరుకునే వరకు ఏడు 

నీటి గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు హరించి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ పిల్లల కొరకు స్వామికి వరపడటం ప్రత్యేకత.

 

ఈ క్షేత్రానికి నేను, మా తండ్రి, అమ్మమ్మ గార్లతో నాకు 8 సంవత్సరాల వయసు 

వున్నపుడు పోయి వుండినాను. అప్పుడు మా తండ్రి ఒక పిల్లలు లేని జంటను తన వెంట పిలుచుకుపోయి స్వామీ ముందు వరపడ జేసినారు.వారు స్వామీ కృపా కటాక్షము వల్ల కాలాంతరమున సంతానవంతులైనారు.

 ఆడవారు కట్టుబట్టతో కోనేటిలో శిరస్త్నానమాచరించి ఏమాత్రము బట్ట పిండుకోకుండా 

వళ్ళు తుడుచుకోకుండా స్వామి గర్భ గుడిముందు బోర్లా సాగిలబడి చేతులు సాచి 

స్వామికి దండం పెడుతూ కళ్ళు మూసుకొని ఉండిపోతారు. వారికి తెలియకుండానే 

సుషుప్తిలోకి జారుకొంటారు. వారి వారి కర్మ ఫలాన్ని బట్టి స్వామీవారు ఫలితాన్ని తప్పక 

స్వప్నములో ఎదో ఒక రూపములో అంద జేస్తారు. అదే జరిగి తీరుతుంది. దానిని 

వరపడుట అంటారు. 30 సంవత్సరాల తరువాత మా తండ్రిగారు మా దంపతుల 

విషయములో కూడా అదే చేసినారు. అప్పటికే 10 ఆపరేషనులు జరిగి, ఒక డాక్టరు 

అసమర్థత వలన కడుపు బాగా పెరిగి పోయిన, అప్పటికి 31 సంవత్సరములు కలిగిన నా 

శ్రీమతి అసలు బోర్లా 3,4 గంటలు ఎట్లు వరపడినదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆమె 

వరపడియున్నంతసేపు నేను స్వామికి గర్భగుడి చుట్టూ ప్రక్షిణలు చెయుచునే 

వుండిపోయినాను. స్వామి నా శ్రీమతికి పూవులు పళ్ళు స్వప్నములో ఇచ్చినట్లనిపించింది. 

పూజారిగారు ఆడపిల్ల కలుగుతుందని చెప్పినారు. కళ్ళు మూసుకుకొని నిద్రలోకి 

జారిపోయిన తనకు తాను వరపడినంతసేపూ నేను ప్రదక్షిణాలు చేస్తూవున్నట్లే 

ఉండినదట.తాను వరపడినంతవరకూ నాకు ప్రదక్షిణలు చేస్తూ ఉండవలెనన్న వూహ 

కూడా లేదు. అంతా ఆయన లీల.

 అక్కడనుండి వచ్చినతరువాత నేను ఉద్యోగరీత్యా తిరుపతిలో వున్నప్పుడు మా జోనల్ 

ఆఫీసుకు (అప్పుడు నా ఉద్యోగము అక్కడ) 9 గంటలకల్లా పోయేవాడిని, అంటే ఆఫీసు 

టైమునకంటే గంట ముందే. అందువల్ల మధ్యాహ్నము బోజనమునకు ఇంటికి వచ్చి 

అన్నము తిన్న వెంటనే ఆఫీసుకు పోయే వాడిని . ఆరోజూ అదేవిధముగా నేను 

వచ్చేసమయానికి , వంటింటిలోనున్న దేవుని మందహాసమునకు ఎదురుగా బోర్ల 

సాగిలబడి, రెండుచేతులు సాచి జోడించి మ్రొక్కే భంగిమలో, స్మారకమే లేని స్థితిలో 

వుండినది. నేను వచ్చిన అలికిడి విన్నంతనే లేచే వ్యక్తి, పిలిచినా పలుకలేదు. నేను ఆపై 

పిలువక అటులనే వుండిపోయినాను. కాసేపైన తరువాత తాను లేచి 

రాఘవేంద్రులవారు స్వప్నములో ఫల తాంబూలము నిచ్చినట్లు చెప్పినది. ఆ తరువాత బహిష్టు కాలేదు.

 అంత మాత్రము చేత అది గర్భధారణ అని నిర్దారించుకోలేని స్థితి మా అందరిదీ. 

అందరిదీ అంటే నాది,నా శ్రీమతిది మా తండ్రిది నన్ను పెంచిన మా అమ్మమ్మది. కొన్ని 

దినముల తరువాత పరిస్థితులు కలిసి రావడము వల్ల దక్షిణ దేశ యాత్రకు 

బయలుదెరినాము. మొదలు చెన్నపట్టణము చేరి, అప్పటికి ఒక సంవత్సరమునుండి 

చికిత్స చేయించు కోనుచుండిన, ప్రపంచములో ఏర్పరచిన 'అపోలో హాస్పిటల్స్' మొదటి 

శాఖ లోని గర్భ చికిత్సా నిపుణురాలయిన (gynecologist) డా. వాసంతి వద్దకు 

వెళ్ళ్లినాము. ఆమె 'అల్ట్రా సౌండ్' పరీక్ష చేయించి ఫలితములు (results) చూసి గర్భ 

ధారణ జరుగలేదు అని తెల్పినది.అప్పటికి నా శ్రీమతికి రెండు నెలలు దాటి పది రోజులు 

దాదాపుగా అయి వుండినది. నేను మాత్రము ఆ మాటను నమ్మలేక అమ్మా నాకు అది 

pregnancy గానే తోచుచున్నది. Hormonal టాబ్లెట్స్ ఇవ్వవద్దని చెప్పినాను.ఆమె 

నామాటను గౌరవించుతూ మీరు తీర్థయాత్రలకు పోయివచ్చునపుడు వచ్చే దారి ఇదే 

కదా కాబట్టి అప్పుడు తిరిగీ checking కు వచ్చేది అని చెప్పింది.నేను సరే అని చెప్పి 

తీర్థయాత్రలకు బయలుదేరినాను.

 

తీర్థ క్షేత్ర విగ్రహ దర్శనాదులు చేసుకొంటూ రామేశ్వరము చేరినాము. అక్కడ శారీరిక 

మానసిక ఆర్ధిక వంచనలేకుండా నాగప్రతిష్ఠ చేయించి కన్యాకుమారి మీదుగా కేరళ 

పుణ్యక్షేత్రములు చూసుకొంటూ చెన్నపట్టణము చేరినాము. డాక్టర్ వాసంతి గారి వద్దకు 

వెళ్ళితే తిరిగి scanning చేయించి గర్భము కాదు అని తెల్చినారు. అట్లు తేల్చి 'Dufastan' 

అన్న tablets వ్రాసియిచ్చినారు (పేరు వ్రాసినానని doctor ను సంప్రదించనిదే మీరు 

వాడవద్దు.) ఆ చీటీ చేతికి తీసుకొంటూ అమ్మా నాకు ఇంకా తాను కడుపుతో ఉన్నదన్న 

నమ్మకమే వున్నది. ఈ మాత్రలు చెడుపు చేయవు కదా అని అడిగినాను. ఆమె ఎంతో 

అభిమానముతో మీరు ఆచింత పెట్టుకోనక్కరలేదు. ఇవి pregnancy టెస్ట్ గా కూడా 

పని చేస్తాయి. రెండుమాత్రలు వేసుకొన్న తరువాత ఒక వారము లోపల బైట చేరకుంటే 

అది pregnancy గా మీరు నిశ్చయించుకోవచ్చు అని చెప్పినది. నా శ్రీమతికి అవి వాడిన 

పదిహేను రోజులవరకు వేచియుండి, ఆ తరువాత తిరిగి చెన్నపట్నం అపోలో 

డా.వాసంతి గారి వద్దకు చేరినాము. తిరిగి వారు scanning చేయించి అప్పుడు అది 

గర్భమని నిర్ధారించినారు.

 మాపై ఆ పెనుశిల నరసింహుడు ఆ రాఘవేంద్రుడు,ఆ రామలింగేశ్వరుడు దయ 

చూపుట చేత ఆ కాన్పులో ఒక అమ్మాయి ఆపై సంవత్సరము పై ముడునేలలకింకొక 

అమ్మాయి కలిగినారు. అబ్బాయి కొరకు ఇంకొక సంవత్సరము sterilize 

చేయించుకోకుండా ఆగుతారా అని ఆపరేషన్ థియేటరు నుండి తన అసిస్టెంట్ 

డాక్టర్ను పంపి అడిగించింది డాక్టరమ్మ. ఇదే చాలు, ఇంతే చాలు అని అన్నాను.

నమ్మకమెప్పుడూ నడిపిస్తుంది. అపనమ్మకమో ఆపేస్తుంది.

నా శ్రీమతి తో సమానముగా నేనూ ఆ ముహుర్తానికే ఈ గేయము ప్రసవించినాను.

ఇంటి కేతెంచిన అతిధి అభ్యాగతులు పాప లెక్కడ మాకు కనిపించరే మనిన

 కడుపులో కన్నీటికడవలను దాచుకొని కరుడుకట్టిన కంటిపాప జూపుచునుంటి

 బోసి నవ్వులు మాకు కనిపించవే మనిన పటము లో గాంధీని పరికించ మంటి

 తప్పటడుగులు ఇంట కనరావు మాకనిన వయసుమీరిన యవ్వవంక గాంచమనంటి

 పసిపాప ఏడుపులు పసిగట్టకుంటిమన మనసార ఇల్లాలి మోముజూడమనంటి

 కటిక చీకటి యాయె కరదీపి కేదియన *కరముల కొరకు నే కాచుకొన్నానంటి (కరములు=కిరణములు, చేతులు)

 చిలుకపలుకులు వినగ మనసాయెననియన్న చిద్విలాసునికరుణ చిలుకవలె నంటి

 ప్రశ్న ప్రశ్నకు నాకు బడులిచ్చు ఓపిక రాను రానూ సన్నగిలి పోవు చుండగా

 అన్ని ప్రశ్నల కొక్కటే జవాబును కూర్ప పసిపాప నందించె పరమేశ్వరుడు నాకు

 బ్రతుకు చీకటిలోన చిరుదివ్వె వెలిగింది నా గమనమునకిపుడు గమ్యమగుపించింది

 స్వస్తి.