గోమాత గొప్పదనము (రాజీవ్ దీక్షిత్ కోర్టు కేసు)
అసలు
విషయమును గూర్చి తెలుపుటకు ముందు అందుకు నడుముకట్టి ప్రజలను చైతన్యవంతులను చేయ
సమకట్టి తన జీవితమునే త్యాగము చేసిన మహానుభావుడు రాజీవ్ దీక్షిత్ (రాజీవ్ గాంధీగా
పొరబాటు పడేరు సుమా!). తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో
దేశభక్తిని నింపి, నూతన శక్తిని ప్రేరణను ఇచ్చి, భారతీయులలో
ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో
కృషి చేసిన రాజీవ్
దీక్షిత్ (నవంబర్ 30, 1967 - నవంబర్ 30, 2010), దేశ భక్తి, వైదికశాస్త్రానురక్తి,
పాశ్చాత్య భావదాస్య విముక్తి, మూర్తీభవించిన
మహోజ్వల శక్తి. ఈయన 1967 నవంబర్ 30న , మిథిలేష్ కుమారి,రాథేశ్యాం దీక్షిత్ దంపతుల కుమారునిగా వారి స్వగ్రామం ఉత్తర్ ప్రదేశ్ లోని నాహ్ గ్రామంలో జన్మించినాడు.
తల్లితండ్రుల సంరక్షణలో మాధ్యమిక విద్యను కొనసాగించిన
తరువాత 1994లో లోని ఐ.ఐ.టి. అలహాబాదు (ప్రయాగ) లో
బి.టెక్ చదివినారు. తరువాత ఐఐటీ కాన్పూర్ లో శాటిలైట్ కమ్యూనికేషన్లో యం.టెక్ చేశారు. తరువాత
ఫ్రాన్స్లో టెలికమ్యూనికేషన్లో పిహెచ్.డి. చేసినారు. అటుపిమ్మట మనగుండెలలో నిలచిపోయిన భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె.అబ్దుల్కలామ్
గారితో కలిసి సి.ఎస్.ఐ.ఆర్.లో శాస్త్రవేత్తగా కలిసి పనిచేసినారు. భారతదేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చినారో, అదే
విధంగా తన ప్రసంగాల ద్వారా కొత్తతరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని
ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేసిన రాజీవ్ దీక్షిత్ ను అభినవ వివేకానందుడనవచ్చు.
స్వదేశీ చికిత్స పేరుతో చరకుడు,'వాగ్భటుడు' మొదలైన మహనీయులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జన బహుళ్యంలో ప్రచారం
చేసి, అల్లోపతిలో లక్షలు పోసినా నయం కాని అనేక వ్యాధులకు
సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు 'రాజీవ్ దీక్షిత్'.
రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా
సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పినారు. అత్యంత విచారకరమయిన విషయము ఏమిటంటే
ఆయన 43 సంవత్సరములకే అనుమానాస్పద పరిస్థితిలో మరణించడము. నేటికీ అది దేవరహస్యమే!
ఇక
అసలు విషయమునకు వస్తాము. 1998 సంవత్సరమునకు ప్రభుత్వముచే గుర్తింపబడిన గోవధ్యశాలలు
3600 ఉండినవి అని ఒక అంచనా. అక్రమశాలలయితే 36,000 పైచిలుకేనని, ఈమొత్తము
వధ్యశాలలలో
2, 50, 00, 000 గోసంతతిని హతమారుస్తారని (గూగుల్ నుండి సేకరణ) తెలియవస్తూ
వుంది.
విషయమిదయితే,
1998 లో ‘అఖిల భారత్ గొ సేవక్ సంఘ్’ రాజీవ్ దీక్షిత్ ఇంకా కొందరితో తన స్వస్థలమైన వార్ధా లో
స్థాపించగా దానికి మరొక సంస్థ ‘అహింస ఆర్మీ ట్రస్ట్’ అన్న పేరుతో జతయై అత్యున్నత న్యాయస్థానములో Case వేసినారు.
తరువాతి కాలములో వీరితో గుజరాత్ ప్రభుత్వము కూడా చేరినది.
వధ్యశాలలు
నడిపేవారు ఆవిధముగా ఎందుచేయకూడదు అని Counter వేసినారు.
ఈ మాంసాహార
విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను
ఈ కేసులో పెట్టుకున్నారు. వారిలో
కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున కేసును
వాదించిన వారిలో శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు ఇరవై లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ ఇరవై రెండు లక్షలు, శ్రీ మహేష్
జేత్మలానీ 32 - 35 లక్షల దాకా తీసుకునే అగ్రగాములున్నారు. వీరంతా మాంసాహారుల తరఫున
కేసును వాదించారు.
ఇక మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకొనడానికి
తగినంత డబ్బు లేదు. హేమాహేమీలు మాంసాహారుల తరఫున వాదిస్తున్నారు. తన తరఫున
వాదించటానికి అంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు
న్యాయ సహాయంఇస్తే ?" అని అడిగినప్పుడు " అది ఆనందమే
కానీ, మా కేసు మేము వాదించుకొనడానికి అనుమతించాలని"
శ్రీ రాజీవ్ భాయి కోరారు. అలా అనుమతిస్తునే, కోర్టు శ్రీ M
E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం
నియమించింది. ఇక కేసు కొనసాగింది.
వాట్సప్ లో జాజిశర్మగారికి వచ్చిన ఆంగ్ల పాఠానికి వారు చేసిన
స్వేచ్ఛానువాదం చదవండి.
వారి వ్యర్ధవాదనలేమిటో చూద్దాం.
మొదటి వ్యర్ధవాదన:
గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక
వ్యవస్ఠ బలపడుతుంది.
రెండవ వ్యర్ధవాదన:
గోవులకు, ఇతర జంతువులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేదు. అవి ఆకలితో
చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.
మూడవ వ్యర్ధవాదన:
మనదేశంలో మనుష్యులకే చోటు లేదు. పశువులను ఎలా పోషిస్తాం.
నాలుగవ వ్యర్ధవాదన:
మనకు అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతుల వలన వస్తుంది.
ఐదవ వ్యర్ధవాదన:
మాంసాహారం తినడం మతపరమైన హక్కు .
ఈ వ్యర్ధవాదనలు చేసిన వారిలో ముస్లీం మతము లోని
"ఖురేషీ" అనే వర్గము వారు ఎక్కువ హింసకు పాల్పడేవారే. వారే ఈ వ్యర్ధ
వాదనలు చేసిన ప్రప్రధములు.
ఈ వ్యర్ధ
వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనముతో , నిగ్రహముతో అన్ని
వివరాలతో గణాంకములతో సహా కోర్టు వారి ముందుంచారు.
ఆ
వ్యర్ధవాదనలకు శ్రీ రాజీవ భాయి సమాధానాలు ఏమిటో ఒకటి తరువాత ఒకటి చూద్దాం (
చదువుదాం ) పదండి.
గోవును
రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.
ఈ వ్యర్ధవాదనను శ్రీ రాజీవ్ భాయి గణాంకాలతో
కోర్టువారికి ఇలా వివరించారు.
ఒక గోవును చంపితే ఎంత మాంసం వస్తుంది, ఎంత
రక్తం, ఎన్ని ఎముకలు అనే గణాంకాలతో ఈ వివరణ సాగింది.
ఒక ఆరోగ్యం గా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల
బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల
చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం
రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇక 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి
1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి
స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-
ఈ వ్యర్ధ
వాదనను శ్రీ రాజీవ్ భాయి తన గణాంకాలతో శక్తివంతంగా ఎలా తిప్పికొట్టారో చదవండి. ఆ గణాంకాలు ఇలా
ఉన్నాయి.
ఒక
ఆరోగ్యమైన గోమాత రోజుకి పదికిలోల గోమయం, ( ఆవుపేడ ), మూడు లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో
గోమయం తో 33 కిలోల ఎరువు తయారు అవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ
రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు.
ఆయన తన వాదనను నిరూపించటానికి కొంత సమయం కావాలన్నారు.
దానికి
ధర్మాసనం ఒప్పుకున్న తరువాత శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ
ఎరువును తయారు చేసి కోర్టువారికి చూపించి, I R C
శాస్త్రవేత్తలను పిలిపించి తను గోమయంతో తయారుచేసిన సేంద్రీయ
ఎరువును పరీక్షింపచేశాడు. కోర్టువారి ఆధ్వర్యంలో ఆ శాస్త్రవేత్తలు సేంద్రీయ
ఎరువును పరీక్షచేసి ఈ సేంద్రీయ ఎరువు అత్యుత్తమ ఎరువుగా నిర్ధారించారు. ఈ సేంద్రీయ
ఎరువు భూమికి కావలసిన 18 సూక్ష్మపోషకాలు అన్నీ చ్ ఆ శాస్త్రవేత్తలు
తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన , మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం,
కాల్షియం, ఐరన్, కొబాల్ట్,
సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని
నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం మూడు ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి
గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా
పదిరెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను ఒప్పుకున్నది.
ఈ
వ్యాసంలో గోవధ అనే పదం అనేకమార్లు
తప్పనిసరిగా వాడాల్సినందుకు బాధపడుతున్నాను. గోమాత నన్ను, చదివిన
మిమ్ములను క్షమించుగాక ! --జాజిశర్మ
శ్రీ
రాజీవ్ భాయి తన వాదనను కొనసాగిస్తూ, కోర్టుకి అభ్యంతరం లేకపోతే,
తను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోమయము నుండి,
33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, తన
ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా చేస్తున్న తమ కృషిని చూడమని
అహ్వానించారు.
తన వాదనలో
శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో ఆరు రూపాయలు (ఇది అతి
తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత
రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయము తెచ్చి పెడుతుంది. ( ౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా !
330 X Rs.6/- ).
పైగా ఈ గోమయం వేసే మాతలకు ఆదివారాలు కానీ, శెలవులు
కానీ లేవు కదా ! ఈ లెక్కన గోమాత వలన ఒక
సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.
రమారమి 20
సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయాన్ని, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన
గణాంకాలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక గోమాత తన జీవిత కాలంలో వచ్చే ఆదాయము దాదాపు Rs.1,31,40,000/- ( అక్షరాల ఒక కోటి ముప్పై ఒక్క లక్షల నలభై వేలు ) దాటిపోవడం
చూచి ఆశ్చర్యచకితులయ్యారు.
వేల
సంవత్సరాల పూర్వం మన పురాణాలలో గోమయంలో "లక్ష్మి" నివసిస్తుంది అని
పూర్వీకులు ఎందుకు ప్రవచించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల
ద్వారా నిరూపించారు.
ఇది మన
పురాణగంధ్రాలను హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు
వంటబట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన పురాణాలు "గోమయం లో
"లక్ష్మి" నివాసముంటుంది అంటే , వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు
చెబుతారు అని నవ్విన వారి మొహాలు "తెల్లబోయి" నొళ్ళు వెళ్ళబెట్టారు.
ఇఖ
"గోమూత్రము" మీద శ్రీ రాజీవ్ భాయి తన వాదన అద్భుతమైన రీతిలో
కొనసాగించారు.
" ఒక గోవు రోజుకి 2 లేక 2.25 లీటర్ల దాకా మూత్రము విసర్జిస్తుంది. ఈ
గోమూత్రం అనేక రకాల వ్యాధులకు , మధుమేహము, క్షయ, కీళ్ళ వాతము,
కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల
మూలుగుకు సంబంధించిన వ్యాధులు మొదలైన 48
రకాలైన రోగాలన్నీ సమూలంగా నిర్ములించ
గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపుతున్నాయి.
( చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పాడు. )
గణాంకలు
సమర్పిస్తూ, శ్రీ రాజీవ్ భాయి ఇలా చెప్పారు. ఒక లీటరు గోమూత్రం
భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ
ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి
మూడు పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి
చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి
మందులు తయారు చేసుకుంటున్నది.
అమెరికాకు
ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం ( వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/-
నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన
గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం
రూ.3000/-
X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20
సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 ( అక్షరాల రెండు కోట్ల పంతొమ్మది లక్షల రూపాయలు )
.గోమూత్రము వలన కోట్ల ఆదాయం.
ఇదే గోమయం " మిథైన్ " అనే వాయువు ఉత్పత్తి
చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో పచానానికి వాడుకోవచ్చును.మన ద్విచక్ర వాహానాలను నడుపుకోవచ్చును. మన కార్లు కూడా ఈ
వాయువును ఉపయోగించి నడుపుకోవచ్చును.
ఈ
వాదన ధర్మాసనం లోని ఒక న్యాయధీశుడు
నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి " మీరు అనుమతిస్తే, మీ కారుకు మిథైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీరే
పరీక్షించండి. మీ కారు మీరే డ్రైవ్ చెయ్యండి. " అని తన వాదన పటిమ చూపించారు.
ఆ న్యాయాధీశుడు అనుమతించి, తన కారును మూడు నెలలు మిథైన్ వాయువు తో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు
యాబై, నుండి అరవై పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు
ఆయన కిలోమీటరు డీజల్ కు నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు.
శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.
ఆ
న్యాయధీశుడు సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని
ఒప్పుకున్నాడు.
శ్రీ
రాజీవ్ భాయి గణాంకాలు అక్కడితో ఆగలేదు. రోజు వచ్చే పది కిలోల గోమయం తో ఎంత మిథైన్ వాయువు తయారు
అవుతుందో , అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొడుపు చేస్తుందో
చెప్పి ధర్మాసనమునకు తన గణాంకాలు సమర్పించాడు. దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు ఒక లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు
అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమవుతే, అరబ్ దేశాల
నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనఖర్లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనఖర్లేదు. మన
రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది తల్లి గోమాత వలన సాధ్యం. ఆ మాత
"శ్రీలక్ష్మి "యే !!
ఈ వాదన విని సుప్రీంకోర్టు ధర్మాసనం
నిర్ఘాంతపోయి, ఉప్పెనలా శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనను "సత్యము" అని
అంగీకరించి, " గోమాతను సంరక్షించడమే " దేశానికి
ఆర్ధికంగా మంచిదని, గోమాత వలననే భారత దేశానికి ఆర్ధికపుష్టి
లభించగలదని అంగీకరించారు.
సుప్రీంకోర్టు
శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, మాంసాహారుల తల బొప్పికట్టి,
దిక్కు తోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోంది అని గ్రహించారు.
ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు
చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్లాది
రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.
అప్పుడు
మాంసాహారులు తమ తురుపు ముక్క వేశారు. అది " గో మాసం తినడం వారి ఇస్లాం మతపరమైన హక్కు " అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి "అయితే, ఎంత
మంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు? ఈ
మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు
పరిశీలించాలి అని కోరారు.
అప్పుడు
సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ
అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు. " ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసము తినడం మీద ఏమి చెప్పాయో ? ఆ హక్కు అనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని " ఈ కమిటీ ని ఆదేశించారు.
ఈ కమిటీ
చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.
" ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను
సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు.
వారిలో ప్రధముడు "బాబర్ " ఆయన తన
"బాబర్ నామా" లో గోవధ నేరమని, ఆలాంటి నేరం తను
చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను
చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్
అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్
కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని
కొనసాగించాడు.
ఇక్కడ
దక్షిణాపధం లో టిప్పు సుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసే
వాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలా మంది ఈ శిక్ష లో బలయ్యారు.
టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి ,
గోవధ కు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".
.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ
రాజీవ్ భాయి, వాదన
కు మరింత పుష్టి వచ్చింది.
" గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం
శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.
తరువాత
శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీంకోర్టు అనుమతితో
పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర
గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా
గోవధ ను సమర్ధించలేదు. సరికదా , హదీద్ లు , " గోవును రక్షించ మని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి
" అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దాని పట్ల దయ గలిగి ఉండాలి అని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త
ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకం లో కూడా స్థానం లేదు " అని
చెప్పారు.
తన వాదనను
ముగిస్తూ,
శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు , గోవధ
ను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాంమత హక్కు ఎలా
అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనా లలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని
ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు
తెలియదు." అని ముగించారు.
మాంసాహారులు
మాన్పడిపోయారు. సుప్రీంకోర్టు
మాంసాహారులను , పదే పదే
అడిగింది. వారు ఇస్లాం లో గోవధ
చెయ్యమని చూపెట్టలేక పోయారు.
సుప్రీంకోర్టు
రాజ్యంగ ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన
కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును
ప్రకటించింది,
ఈ
తీర్పును మీరు సుప్రీంకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.
.తన 66
పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.
"
గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు,
ప్రభుత్వము, గోవును రక్షించడం రాజ్యాంగ
ధర్మముగా భావించాలి. మనం మన రాజ్యాంగములో , " రాజ్యాంగ
ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని,
మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన
సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ,
ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగము వ్రాసుకున్నాము.
ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది. "
సుప్రీంకోర్టు
తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి
ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య
కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.
చివరగా
శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా
మిగిలిపోతాం. శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోమాసం పోతతో తయారు చేసిన
తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు
ఆఫీసర్ ను కాల్చి చంపాడు. అదే మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసిన ఘటన,
గో సంరక్షణతో మొదలయ్యింది.
గో
సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం . అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు
జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరము కాదు.
వందే
గోమాతరం. శ్రీ రాజీవ్ భాయి ! తమకు భారత జాతి యావత్తూ ఋణపడింది.
ఇది
ఓపికగా చదివిన మీకు ధన్యవాదములు.
స్వస్తి
No comments:
Post a Comment