Friday, 23 June 2017

అనులోమ విలోమ శ్లోకము

అనులోమ విలోమ శ్లోకము

దైవజ్ఞ సూర్య పండితుడనే మహానుభావుడు “రామకృష్ణ విలోమ కావ్యం” అన్న కావ్యాన్ని వ్రాసినాడని ఆరుద్ర గారు తమ సమగ్రాంధ్ర సాహిత్యములో తెలియజేసినారు. ఇందులో, ప్రతి శ్లోకం రామకృష్ణు లిద్దరి గురించి చెప్పటమే అన్నది పేరును బట్టి మనకు అర్థమౌతూనే వుంది. కానీ ఇందులో మొదటి పాదము రాముని గూర్చి అయితే రెండవది కృష్ణుని గూర్చి. అంతకు మించిన ఆశ్చత్ర్య కరమగు విషయమేమిటంటే మొదటి పాదమును త్రిప్పి వ్రాస్తే రెండవ పాదమోస్తుంది. అంటే శ్లోకాన్ని క్రింది చివరి నుండి పై పాదము ప్రారంభము వరకు పై పాదము ప్రారంభము నుండి క్రింది పాదము చివరి వరకు ఎటు చదివినా నుండి క్రిందికి ఎటు చదివినా  చదివినా ఒకే విధంగా ఉంటుంది. ఈ శ్లోకమును చూడండి.
“తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతోలవ్య భవం దయాశ్రీః
శ్రీయాదవం భవ్య లతోవదేవం సంహారదాముక్తి ముతాసుభూతం”

ఇందులో మొదటి పాదాన్ని తిరగేస్తే, రెండవ పాదం వస్తుందని తేలిగ్గా గ్రహించవచ్చు. ఇటువంటి శ్లోకాలతో ఒక కావ్యం రాయటం గొప్ప విషయమనే చెప్పాలి.

ఈ రీతిలో మనము తెలుగులో కూడా పద్యాలను చూడవచ్చు. ఇందులో రస ప్రాధాన్యత తక్కువగా వున్నా కవి చమత్కృతి పాండితీ ప్రతిభ మనకు తెలియ వస్తాయి.

No comments:

Post a Comment