Wednesday, 6 January 2021

మహాభక్త కనకదాసు

మహాభక్త కనకదాసు

లంకె: https://cherukurammohan.blogspot.com/.../01/blog-post_6.html

భక్తుల గాథలు దైవ చింతకులకు తొలకరి జల్లు.ఎందఱో పరమాత్మను తాము భగవంతుని బ్రతికియుండగానే సాధించినారు. అట్టివారి శిష్యరికముతో తాముకూడా అంత గొప్పవారయిన ఉదంతములు మనకు వాస్తవాల రూపములో చరిత్ర పుటలలో కనిపిస్తాయి. ఓపిక, జిజ్ఞాస ఉంటే చాలు. తాదాత్మ్యముతో తరించవచ్చు. దీనికి కులముతో పనిలేదు. అందుకే అన్నమయ్య

ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి

ఆకడ నాతడె హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే

పరనిందసేయ దత్పరుడు గాని వాడు

అరుదైన భూతదయానిధి యగువాడే

పరులదానే యని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే

ధర్మతత్పరబుధ్ధి దలిగిన వాడు

కర్మమార్గములు తడవనివాడే

మర్మమై హరిభక్తి మఱవనివాడు

జగతి పై హితముగా జరియించువాడే

పగలేక మతిలోన బ్రదికినవాడు

తెగి సకలము నాత్మ దెలిసినవాడే

తగిలి వెంకటేశు దాసుడయినవాడు

అన్నాడు. ఇదే కోవకు చెందినా కనకదాసు, గోపకులజుడైనా(కురుబ) గోవర్ధనుని చేరినాడు. చదవండి.

మిగిలినది రేపు ...........

మహాభక్త కనకదాసు -2వ భాగము

 కనకదాసు (1509-1609) కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త

సంగీతకారుడు, స్వరకర్త. కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన 

కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యమును పొందినాడు. ఇతర హరిదాసుల్లాగే 

ఇతను కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించినాడు.

కర్ణాటక రాష్ట్రంలో హవేరీ జిల్లా, బాద గ్రామంలో బీరప్ప గౌడ,బాచమ్మ దంపతులకు 

కనకదాసు 1509 సం.లో జన్మించినాడు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. 

ఇతను బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేసినాడు. చిన్న 

వయస్సులోనే ఇతను నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరింగిణి అనే 

కవిత్వాలను రచించినాడు. కనకదాసు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా 

కాలాంతరములో, కన్నడ భాషలో రచనలు చేస్తూ, కీర్తనలు రాస్తూ, వేదాంతాన్ని 

అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడడైనాడు.

యుద్ధవీరుడై, కొంత సైనిక బలగమునకు నాయకుడగుటచే, ఆయన తిమ్మప్ప 

నాయకుడైనాడు. అతని కీర్తనలో ఒకదాని ప్రకారం కనకదాసు కనక నాయకుడు అన్న 

బిరుదముతో అలరారినాడు.  ఒక యుద్ధంలో తీవ్రముగా గాయపడినాడు కానీ తాను 

నమ్ముకొన్న ఆదికేశవ స్వామి దయతో ప్రాణాపాయం తప్పింది. దీనితో కగినెల్లి ఆదికేశవ 

స్వామికి అంకితమై, సైన్యమును విడచి, వ్యాసరాయల శిష్యుడై  'కనకదాసు' అని గురువు 

పెట్టిన పేరుకు సార్ధకత  తెచ్చి  సామాన్యులకు అర్ధమయ్యే కన్నడ భాషలో కీర్తనలు 

రాస్తూ రచనలు చేస్తూ వేదాంతాన్ని అభ్యసించి  మహా కృష్ణ భక్తుడైనాడు. తరువాత తన 

సైనిక వృత్తిని విడిచిపెట్టి, తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత 

సాహిత్యాలతో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసినాడు. ఈయన 

అనేక వేదాంత గీతాల్ని రచిస్తూ పాదిన వాగ్గేయకారుడు. కష్టించి పనిచేసే తక్కువ 

జాతులవారిని హీనంగా చూడనవసరము లేదని, పాటలు, పదాల రూపంలో తన 

ఆవేదనను వెలిబుచ్చుతూ శ్రీకృష్ణ సాయుజ్యమును పొందిన మహాభక్తుడు ఈయన.

ఈ అధిక అధమ తారతమ్యమును గూర్చి తాను రచించి గానము చేసిన  రామాధ్యాన 

చరిత్ర లోనిఈ చక్కటి కథను ఒకసారి చదవండి.

‘ఒక సారి ఒక బియ్యపుగింజకు, రాగిగింజకు వివాదం వచ్చింది. రాగి ప్రజలందరి ఆకలీ 

తీరుస్తుంది, బియ్యం ఒక్క ధనవంతులుకే అందుబాటులో ఉంటుంది. మరి దాని విలువ 

ఎక్కువ. కానీ రాగిలో పోషక విలువలు ఎక్కువ. నేను గొప్పంటే నేను గొప్పని రెండూ 

వాదులాడుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాయి తీర్పు చెప్పమని. ఇద్దరి వాదనలూ విన్న 

రాముడు ఆరు నెలలు రెండు రకాల గింజల్నీ గాలి చొరని, చీకటికొట్లో బందీగా 

ఉండమన్నాడు. ఆరు నెలల అనంతరం బయటికి తీసి పరీక్ష చేయించాడు. బియ్యం 

గింజ పాడయిపోయి, పొడి పొడిగా రాలి పోయింది. రాగి గింజ చెక్కు చెదరకుండా 

నిలిచింది. అప్పుడన్నాడా దేముడు. 'కష్టించి పని చేసే జీవుల్లాగే రాగిగింజ కూడా 

ఎటువంటి స్థితినైనా తట్టుకుని నిలబడుతుంది, ధనవంతుల శరీర మనో బుద్ధుల్లాగే 

బియ్యపుగింజ ఆటుపోట్లొస్తే నిలువలేక పోతుంది అని తీర్పు నిచ్చినాడట రాముడు.

ఎంత భావయుక్తమగు కథయో చూడండి.

 మిగిలినది రేపు .........


No comments:

Post a Comment