మా తీర్థయాత్ర
నేను వయసులో ఉన్న రోజులలో నేను చదివిన, ఉద్యోగమూ చేయుచుండిన జమ్మలమడుగునకు సమీపముగా నున్న అత్యంత ప్రభావభరితమగు, కర్నూలు జిల్లాలోని, యాగంటి, అహోబిలములను చూడలేదు. మహానంది కూడా ఎప్పుడో బాల్యమున, నంద్యాల నుండి గుర్రపుబండిలో వెళ్లి చూసిందే! ఇవికాక జమ్మలమడుగుకు దగ్గరగానున్న గండికోట, మైలవరము డ్యాం, బెలూం గుహలు నా పెద్ద కుమార్తె అల్లునకు మరియు చిన్న కుమార్తెకు చూపింపనెంచిపోయియుండినాము. ఇవికాక కార్తీక పౌర్ణమి రోజున కాళహస్తికి, అటుపిమ్మట తిరుమలకు, ఆపైన తిరుచానూరునకు పోయి ఇంటిదారి పట్టినాము. మాయాత్ర ఆవిధముగా సుసంపన్నమైనది. తలచుకొన్న ప్రదేశములను చూచుట అందరూ చేసేదే! కానీ, ముదిమిచే, సహాయ సహకారములు లేకుండా మాడంపతుల వంటివారికి సాధ్యము కాదు కావున, నా విషయములో అందుకు దోహదము చేసినవారిని తలచుకొని పదుగురికి తెలుపకపోతే అది ఆత్మవంచనయేనని నా అభిప్రాయము. అందుచే ముందు వారికి, రోజుకు ఒకరి చొప్పున, కృతజ్ఞతలు చెప్పుకొని ఆయా స్థలములకు సంబంధించిన వివరములను నాకు తెలిసిన మేరకు తెలియజేస్తాను.
అందులోని
భాగముగా మొట్టమొదట ఇంటినుండి అడుగు బయట పెట్దింది మొదలు తిరిగీ అడుగు ఇంటిలో
పెట్టేవరకు, ఆద్యంతమూ తన తల్లిదండ్రులవలె చూసుకొంటూ మమ్ము నడిపించిన అల్లుని
సంస్కారమునకు నమస్కారము చేస్తూ, నా కుమార్తెలను
ఆశీర్వదించుతూ అడుగు మందుకు వేస్తాను.
రేపు ప్రారంభించుతాను.......
మేము మొత్తము 5 మందిమి. పెద్దలు 'పంచ శుభం' అంటారు. అంటారు కాబట్టి మేము ఒకరినొకరు జత కూర్చుకొని 5 మందిమి కాలేదు. అది కాకతాళీయమే! ఈ యాత్రా కార్యమునకు నాంది ఇంచుమించు నవంబరు నెల 8 వతేదీకి ముందు దాదాపు 40 రోజుల క్రితము జరిగినది. మొదట కడప కేంద్రముగా పెట్టుకొని పైన తెల్పిన ప్రదేశములు మరియు తిరుమల పోవు మార్గములో వచ్చే ఒంటిమిట్ట నందలూరుల లోని కొదండరామస్వామినీ, సౌమ్యనాథస్వామిని చూద్దామనుకొన్నాము. ఆమాట చర్మ చక్షువులకు కనిపించే, శంకరుడగు నా పరమ మిత్రునికి, కడప వాస్తవ్యుడైన 'నీలకంఠారెడ్డి' కి చెప్పినాను. ఆయన ఆకస్మికముగా ఆతరువాత ఒక వారము రోజులకు బ్రహ్మపదము చేరుకొన్నాడు. ఆ వారము లోపుననే నా యాత్ర విషయమును, ప్రాణస్నేహితుడు నాగ సుబ్బారెడ్డికి చెప్పినాను. తాను వెంటనే, 'మేము బంగళూరులో ఉన్నాము, మాయింటి బీగముముచెవులు (బీగము=తాళము) మాయింటి వెనుకనున్న మాకూతురి యింట్లో ఇచ్చిఉంచుతాము, మీరు ఎన్నిరోజులయినా వాడుకోవచ్చు' అని చెప్పినాడు. నా పూలు పుటికెలో పడినట్లు భావించినాను. నేను ఇబ్బందవుతుందేమోనని ఎంత వారించినా వినకుండా బలవంతము చేయుటచే, సరేనన్నాను. కొత్త ఇల్లు మరియు ఆ ఇంట్లో ఆయన సంసారము సాగించినది కొన్ని రోజులు మాత్రమే! ఆ విషయము నీలకంఠారెడ్డికి తెలిపితే అక్కడనుండి మేము చూసే అన్నిప్రాంతములూ ఇంకాదగ్గరవుతాయి కాబట్టి అదేమేలన్నాడు. ఆ విధంగా మాకు ఖర్చు లేకుండా బస ఏర్పాటయిపోయింది. అంతటితో నాగసుబ్బారెడ్డి బాధ్యత తీరిపోలేదు. ప్రొద్దుటూరినుండి బయలుదేరి మాయాత్రలన్నీ ముగించుకొని తిరిగీ ప్రొద్దుటూరుచేరి, ఒక 10కి.మీ. దూరములోనున్న ఎర్రగుంట్లలో రైలు ఎక్కేవరకూ డ్రైవరు అవసరములేని కారు కావలెనని అడిగినాను. ఆయన ఎదురింటిలోనే వెంకటరెడ్డి అను సౌమనస్కుని 8 నెలల కొత్త కారును అతి తక్కువ బాడుగతో ఏర్పాటుచేసినాడు. అది మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు. మా అల్లుడే మమ్ము సారథియై మా యాత్రను సంపన్నము చేసినాడు. మధ్య మధ్యలో మాచిన్న కుమార్తె కూడా తేరును (CAR) నడిపి తనవంతు సహాయమును అందించింది. మాతో ఉన్న ముగ్గురూ మాపాలిటి త్రిమూర్తులే! ఎవరేమి చేసినా మేమిరువురము కేవలము ఉత్సవ మూర్తులమే!
మా ప్రయాణ ప్రారంభమును గూర్చి ఇక ముందు తెలుపుతాను......
తిరిగీ కలుద్దాము.......
రైలు టికట్లను వెంటనే ఎర్రగుంట్లకు
online booking చేసినాడు మా అల్లుడు. నాకు మనసులోని ఆలోచన అసంపూర్ణముగానే ఉండినది.
కర్నూలులో సహాయముచేయగల సహృదయులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ నా శ్రీమతిని కూడా
ఆలోచించమన్నాను. ఆలోచించి కాసేపు తరువాత మన మౌళీ ఉన్నాడుఉన్నాడు
కదా అన్నది. నేను mobile మార్చుకొనుటవల్ల data transfer లో తన contact mobile
number miss అయ్యింది. హటాత్తుగా డైరీ లో వ్రాసుకొన్న గుర్తు వచ్చి వెదికితే
ఎట్టకేలకు, తుట్టతుదకు, కట్టకడపటికి, చిట్టచివరికి దొరికింది. ‘శుభస్య శీఘ్రం’ అనుకొని వెంటనే ఆ
నంబరుకు dail చేసినాను. ఇపుడు మౌళిని గూర్చి తెలిపి విషయమును కొనసాగిస్తాను.
మౌళి తండ్రిగారి పేరు కృష్ణమూర్తిగారు.
మాకు దూరపు బంధుత్వము కూడా వుంది. నేను జమ్మలమడుగు SBI లో చేరిన కొద్ది రోజులకు
నెల మొదటి రోజు అనుకొంటాను, Govt. Salary Bills తీసుకొని ఆయన వచ్చినారు. బాల్యములో
చూసియుండుటచేత ఆయన నన్ను గుర్తించలేదు కానీ నేను ఆయనను గుర్తించి నా సీటు నుండి
లేచి నిలబడి ఆయనను ‘నేను ఫలానా’ అనిచెప్పి
పలుకరించినాను. వెంటనే ఆయన నన్ను గుర్తించి ‘ఎంతో ఆప్యాయముగా ‘ఏమి రామూ బాగున్నావా’ అని అడిగినారు. పరిచయాలు ముగిసిన తరువాత వారు ప్రభుత్వ
వైద్యశాలలో Compounder గా ఉన్నట్లు తెలిసింది. ఇంటిలో ఎవరికి చిన్న అస్వస్థత ఉన్నా
ఆసుపత్రికి రమ్మని మొదటి కలయిక లోనే చెప్పిన సహృదయుడు ఆయన. పరిచయము గాఢమైన పిమ్మట,
phones లేని ఆ రోజులలో మాయింటికి మరీ దూరము కాదు కాబట్టి నేను వెళ్లి పిలిచినా
వెంటనే ఆయన వచ్చేవాడు. అది ఆయన సహృదయత. అప్పుడు మౌళి చిన్నవాడు. కానీ నన్ను బాగా
గుర్తు పెట్టుకొన్నాడు. ప్రభుత్వ హోదా కల్గిన ఉన్నతోద్యోగి అయినాడు. చాలా యేండ్ల
తరువాత నేను పదవీ విరమణ చేసిన తరువాత మేము తిరిగీ కలిసినాము. మా అన్న కృష్ణమూర్తి
గారు పరమపదించియుండినారు. క్షాల ప్రశ్నలు అయిన తరువాత phone నంబర్లు
ఇచ్చిపుచ్చుకొన్నాము. మళ్ళీ మామధ్య లంకె ఏర్పడింది. ఎప్పుడన్నా చరవాణి లో
పలకరించుకొనే వాళ్లము. తన తండ్రిలోని నేమ్మదితనము, సహృదయత యథాతథముగా పుణికి
పుచ్చుకొన్నాడు మౌళి.
ఇపుడు తిరిగీ విషయములోనికి వస్తాను. నేను
మౌళికి phone చేసిన వెంటనే మారు మాటాడకుండా మీ programme చెప్పండి, నేను Timetable
ఇస్తానన్నాడు మౌళి. ఆన్న ప్రకారము తక్షణము పంపినాడు. Timetable ప్రకారము మేము 9
వతేదీ ఉదయము 6గం.లకల్లా కర్నూల్ టౌన్ Ralway Station లో దిగాలి. పాత Tickets
Cancel చేసుకొని Yashvantpura వెళ్ళే Train కు Book చేసుకోన్నాము.
మేము బయలుదేరవలసిన నవంబరు 8 రానే
వచ్చింది. కాచిగూడా కు రాత్రి 1.30ని. రావలసిన బండి తెల్లవారు ఝాము 3.30 కి
వచ్చింది. కర్నూలు టౌను 6 కు చేరవలసిన బండి ఉదయం 8కి చేరింది. Driver తో కూడిన Innova
కారు మౌళి పంపిన వ్యక్తి మాకోసం Station వద్ద సిద్ధముగా ఉండినారు. నేరుగా మమ్ము
Guest House కు పిలుచుకుపోయి మా ప్రాతఃకార్యములు నిరంతరాయముగా జరుగునట్లు శ్రద్ధతో
చూచుకొని నేరుగా మౌళి ఇంటికి పిలుచుకుపోయినారు. నాకు వదిన యగు మా కృష్ణమూర్తి అన్న
భార్యను ఇంచుమించు 5 దశాబ్దముల తరువాత మేమిరువురము చూడుట తటస్తించినది. ఆ ఆనందము మాటలకు
అందనిది. ఫలహారము ముగించుకొని Timetable ప్రకారము యాగంటికి బయలుదేరినాము. ఒకే
రోజులో యాగంటి మహానంది అహోబిల యాత్ర ఎంతో ప్రణాళికాబద్ధమైన మా చంద్రమౌళి సహాయ
సహకార సౌజన్యాలతో సాగింది.
యాగంటి అనుభవాలతో మరియొకసారి..........
యాగంటి
నేటి రాయల్కసీమలోని 4 జిల్లాలలో కర్నూలు జిల్లాకు ఒక
ప్రత్యేకత ఉంది. ఇక్కడ మిక్కిలి ప్రసిద్ధిగాంచిన మూడు శైవక్షేత్రాలుంటే అంతే
ప్రఖ్యాతి గాంచిన ఒక వైష్ణవ క్షేత్రము కూడా వుంది. శైవక్షేత్రాలలో శ్రీశైలము పురాణ
ప్రసిద్ధము. ఇక్కడి మల్లికార్జున లింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అమ్మవారు
భ్రమరాంబికాదేవి పీఠము అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి. నవనందులతో అలరారుతూ
ప్రధానముగా మహానంది శైవక్షేత్రము ఒకటి. యాగంటి బసవయ్య పేరుతో ప్రసిద్ధిచెందిన
యాగంటి క్షేత్రము ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇక నవనారసింహులను కలిగిన ‘ఆహోబల’ము ప్రసిద్ధ వైష్ణవ
క్షేత్రము. ఇక్కడ నారసింహుడు స్వయంభూమూర్తి. ప్రస్తుతము నేను ఈ వ్యాసములో యాగంటిని తెలియని వారికి పరిచయము
చేయట దలచినాను. మనసును నాతోబాటూ యాగంటి చేర్చినాను. తానుకూడా తలపులను తాండవ
మూర్తితోనింపి, అచంచలమగు విశ్వాసముతో ఈ క్రింది విధముగా స్వామిని అర్చించింది.
మెల్లటి గాలులున్ మరియు మిక్కిలి శోభల కాననంబునన్
చల్లగ స్వాస్థ్యసంపదను సాంతముగూర్చు తటాకమందునన్
అల్లన జేరి మున్కలిడి ఆపయి లేచి యపార భక్తితోన్
ఉల్లము మీర మ్రొక్కె బహు ఓరిమి పేర్మి యుమామహేశులన్
చుట్టూ అడవి,ఎర్రటి కొండలు, పచ్చటి పరిసరాలు అద్భుతమైన
సహజ గుహలు మరియు కాకిగోలే లేని, ప్రపంచాన్ని మరిపించే ప్రశాంత క్షేత్రం యాగంటి. ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే యాగంటి
క్షేత్రం. అనిర్వచనీయమైన ఆనందమే ఆహ్లాదము అని నా ఉద్దేశ్యము. ఆ అనుభూతే
ఆధ్యాత్మికతను అనుసరింపజేస్తుంది. అప్పుడిక కలిగేది తాదాత్మ్యమే కదా!
కర్నూలు నుండి దాదాపు 100 కిలోమీటర్లు, బనగానపల్లెకు 13 కిలోమీటర్ల
దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్థ్యం ఉంది. ఇది ఈశ్వరుని స్వయభూ
క్షేత్రము. అసలు ఇచ్చటి నందీశ్వరుని విగ్రహమును కూడా స్వయంభువు అని పెద్దలు
చెప్పగా విన్నాను. అనునిత్యమూ పూజింపబడే ఉమామహేశ్వర లింగము, శ్రావణ మాసంలో ప్రత్యేక
పూజలనందుకొనుట విశేషము. ఇచ్చటి లింగముపైనే ఉమామహేశ్వర మూర్తులను చూడవచ్చును.
యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చినట్లు ఒక కథనము
వున్నది. ఆయన అక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్ప తలచినాడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన
శ్రీవిష్ణువు మూలవిరాట్టు పాదము యొక్క బొటనవ్రేలి గోరు చివరి నిమిషంలో భగ్నం కావడం
వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి
గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన
ఈశ్వరుడు ఇది శేవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా
మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న
గుహలయాల్లో ఒక దానిలో శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి
బొటనవేలు భగ్నం అయి ఉండుట భక్తులు దర్శించవచ్చు. అసలు వెంకట అన్న పదము ‘వేంగడం’ అన్న తమిళ పద్ఫము. ఇది 12వ
శతాబ్దమున ‘ఈశ్వర’ శబ్దమునకు జోడింపబడినది. పై పెచ్చు నేను ఒక పేరు పొందిన పండితుని
వద్ద తెలుసుకోన్నదేమిటంటే పురాణములలో అగస్త్యుని దక్షిణాపథ గమనమున ఈ ప్రాంతము ఎదురుపడ
లేదని. నిజానిజాలు ప్రక్కన ఉంచితే ఈ యాగంటి ఉమామహేశ్వరుడు భక్తుల కోర్కెలకు కొంగుబంగారము.
ఇంకొక ప్రచారములో ఉన్న కథ ఏమిటంటే స్థానికుడగు పరమ
శివ భక్తుడైన చిట్టెప్ప అను వ్యక్తి ఈశ్వర సాక్షాత్కారము కొరకు నిరంతర
ధ్యానమగ్నుడై ఉండగా వ్యాఘ్ర రూపమున ఆతనికి పరమేశ్వరుడు దర్శనమిచ్చినాడట. అప్పుడతను
‘ఏగంటి’ ‘ఏగంటి’ అని అరచినాడట.
అంటే సాబశివుని నేను చూచినాను అని అరచినాడు. ఏను +
కంటి = ఏగంటి అయ్యిది. ఏను అన్నా నేను అన్నా ఒకటే!
ఈ క్షేత్రం ఎప్పుడు
ఏర్పడిందనేది ఖచ్చితంగా తెలియకపోయినా 5,6 శతాబ్దములలో పల్లవులు చోళులు కొంత ఈ దేవాలయ
నిర్మాణమునకు దోహదము చేసినట్లు తెలియవస్తూ వున్నా, హరిహరాయిలు, బుక్కరాయల కాలంలో (14వ
శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది.
శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి
నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం
నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది.
(అలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). ఇందులో వుండే విశేషం ఏమిటంటే ఏ
కాలంలోనైనా ఈ పుష్కరిణిలోని నీటిమట్టం ఒకే విధంగా వుంటుందట. ఈ నీటిలో ఔషదగుణాలు
ఎక్కువగా వుంటాయనిఅందువల్ల ఇందులో స్నానంచేస్తే సర్వరోగాలూ పోతాయని భక్తుల
విశ్వాసం. అజ్ఞాత గిరిధారతో నిండే ఈ కోనేరులో స్నాం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని
ఒక నమ్మకం. ఇందులోనికి నీరు గోముఖస్ము నుండి ధారగా పడుతూ ఉండుట ఒక విశేషమైతే అది
ఎక్క్దనుడి వస్తూవున్నదో ఇప్పటికీ తెలుసుకోనలేక పోవడము ఇంకొక విశేషము. మరో అజ్ఞాత
కొండధారతో వచ్చే నీటిని ‘‘అగస్త్య పుష్కరిణి’’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి
అభిషేకానికి వాడతారు. ఈ కోనేరు అత్యంత శుభ్రమైన నీటిని కలిగియుంటుంది. ఈ నీటిని
త్రాగుటకు కూడా ఉపయోగించుతారు.
ఈ క్షేత్రంలో శనీశ్వరుని
వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకానొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ
తపస్సు చేస్తేంటే కాకాసురడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు
ఆటంకం కలిగించిన్నట్లు ప్రతీతి. ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు
సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు
మచ్చుకైనా కానరావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ
క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు.
ఫలితంగా శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది.
యాగంటి క్షేత్రం బసవయ్య
పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే
శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో
కొలువైన్నారు. కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో
ప్రతిష్టించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు.
పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది.
కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పినారు. 90సంల క్రితం
నందీశ్వరుడున్న 4స్తంభాల ప్రకారం ఆయనచుట్టూ ప్రదక్షిణ చేసేటంత స్థలం వుండేదట.ఇప్పుడు
ప్రదక్షిణం చేయటానికి ఏ మాత్రం ఖాళీలేనంతగా నందీశ్వరుడు ఎదిగిపోయినాడు.ఈ వింత ఎలా
జరుగుతుందనేదిఇప్పటికీ ఒక అంతుపట్టని రహస్యముగానే మిగిలిపోయింది. ఈ బసవన్న రంకె
వేసేసమయానికి దాదాపు ఒక పర్వతం ఎత్తు అంత ఎదుగుతాడని కూడా బ్రహ్మంగారు చెప్పినారు.
ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్దికొద్దిగా పెరుగుతున్నాడని భారత
పురావస్తుశాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు.
ఇక్కడ మరియొక అద్భుతమును గూర్చి చెప్పవలసినది ఉంది.
ఇక్కడ ఉన్న కొండ శిఖరము పైన ప్రతి రోజు ఉదయము 6 గంటలకు ఒక పెద్ద చట్టి లాంటి
ప్రమిదెలో 2 మీటర్ల పొడవు కలిగి తగినంత లావుగా ఉన్న వత్తిని 4 లీటర్ల నూనెలో ఉంచి
వెలిగించితే, కొడెక్కకుండా, ఎంత గాలినైనా ఓర్చుకొంటూ, నిరంతరాయముగా సాయంకాలము 6 గంటలవరకూ వెలుగుతూనే ఉంటుంది. ఇది మహిమ కాకుంటే
మరేమిటి.
ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర
నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం, రెడ్ల, వాసవి ఆర్యవైశ్య, వేదగాయత్రి బ్రాహ్మణ తదితర
వసతి గృహాలు ఉన్నాయని తెలియవస్తూ ఉంది. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది.
ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి
రాత్రి 8గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1గంట
నుంచి 3గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది.
ఇటువంటి మహత్తర, మహోత్తమ పుణ్యక్షేత్ర సందర్శనము సంచిత
ప్రారబ్ధ దుష్కర్మ ఫలముల నివారించుట యే గాక ఆగామి సత్కర్మలకు ఆలంబనమౌతుంది.
ఇక్కడ నా అనుభవమును గూర్చి కాస్త తెలియజేసుకొంటాను.
కారులో మేము బనగానిపల్లె దాటి బేతంచెర్ల దాటబోయే సమయములో రైలు పట్టాలు దాటవలసి
వచ్చినది. కానీ అచట పట్టాలను బాగుపరిచే పని జరుగుచున్నందువల్ల వచ్చేపోయే వాహనాలు
నిలిచిపోయినాయి. మా డ్రైవరు కొంచెము వెనక ఉన్న వాహన చోదకులను బ్రతిమలాడి కారును
వెనుకకు మరల్చి సందుగొందులలో పడి పోదొడగినాడు. మేము రహదారి చేరునప్పటికీ సమయము
మధ్యాహ్నము12.50 అయినది. 1గంటకు ఆలయము మూసివేస్తారు. తిరిగీ ౩గంటలకే దర్శనము. అదే
నిజమైతే ఆరోజు చూడవలసిన మహానంది, అహోబిలము చూడలేము. ఇక్కడ చంద్రమౌళి రూపములో ఉన్న ఆ
చంద్రమౌళి తన అనుచరుని యాగంటి పోలిమేరవద్ద నిలిపి యుండుటచే, అతడు
మాకు దైవదర్శనము ఎటుదిరిగీ జరిపించవలయునను కృత నిశ్చయము కలిగియుండుటచే
గుడివద్దయున్న రక్షక శ్రేణికి చరవాణిలో తెలిపి దర్శనమును 1గంటకు కాక 1-15 వరకు
పొడిగింపజేసినాడు. వారికి చేతనైనది వారు చేసినారుకానీ ఎత్తైన ఆ గుడిమెట్లు
మేమిద్దరమూ ఎక్కవలసినదేకదా! ఆ ఉమామహేశునిపై భారము వేసి నా శ్రీమతిని అమ్మాయిలూ
పట్టుకోగా, నన్ను అల్లుడు పట్టుకొని, ఎట్లయితేనేం గట్టెక్కించినారు.
ఆదరముతో మమ్ము గర్భగుడిలోనికి ఆహ్వానించి స్వామికి లఘువుగా అభిషేకము, అమ్మకు కుంకుమార్చన చేయించి గర్భగుడిలోనే మాతో ప్రదక్షిణలు చేయించి
ఆశీర్వదించి పంపినారు అచటి అర్చకులు. అందుకు కారణము భగవంతుని అనుగ్రహము, మాకు
ఇబ్బంది లేకుండా చూచుకొన్న సిబ్బంది మాత్రమే! వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములను పెఅసాదిన్చుగాక! చూడవలసినవి అక్కడక్కడే ఉన్నాయి
కాబట్టి, చూసి, అయిన వెంటనే బ్రాహ్మణ సత్రములో రుచికరమగు భోజనము చేసి మహానందికి
బయలుదేరినాము.
మన రాష్ట్రములో ఉండే ఈ మహాత్ ప్రభావ పుణ్య
క్షేత్రమును దర్శించి భక్తులు పునీతులగుడురు గాక అని ఆ ఉమామహేశ్వరుని
ప్రార్థించుతూ శెలవు తీసుకొనుచున్నాను.
తరువాత మహానందిని గూర్చి మరొక రోజు........................................
మహానంది
యాగంటి నుండి నంద్యాల మీదుగా మహానంది ఇంచుమించు 65 కి.మీ. ప్రయాణ సమయము ఇంచుమించు 2 గంటలు. కారణం రోడ్డు. సాయంకాలం 3.00 కు యాగంటిలో బయలుదేరి 4.30 కు చేరినాము. నిముసనిముసము మాతో చరవాణి లో మాట్లాడుతూ మమ్ము ఉత్తేజపరచుతూ మహానందికి త్వరగా చేరజేసి దర్శనమునకు పిలుచుకుపోయినాడు మా చంద్రమౌళి ఏర్పాటుచేసిన వ్యక్తి. నిజానికి మేము ఒక్క అరగంట ఆలస్యము చేసివుంటే దర్శనము నిలిపివేసి, దేవుని జూడ వచ్చు ఆప్రాంతపు శాసన సభ్యునికి ఆయన అనుచరులకు మాత్రమే ప్రవేశము కల్పించి యుండేవారు. ఆ కారణమున మేము అహోబిలము చూడలేక పోయేవారము. ఏదయినా దేవుని దయ. ‘జరుగును ఏదియైన నిల జాహ్నవి నాథుని యాజ్ఞ చేతనే’ అని కదా పెద్దలమాట. అంతా ఆయన దయగా భావించి మేమాతని తోడుత బయలుదేరినాము. రుద్రకుండములో పాద, ముఖ ప్రక్షాళనము చేసుకొని ఆతనిని అనుసరించినాము. ముందు ఆయన మాకు స్వామి మహానందీశ్వరుని గర్భగుడి లోనికీ ప్రవేశము ఏర్పాటుచేసి అచట శివునికి లఘువుగా అభిషేకము మాచేత చేయించి హారతినిప్పించి మమ్ము అమ్మ, కామేశ్వరీదేవి గుడికి తోడుకొనిపోయి జగజ్జనని దర్శనము చ్యించి,జగద్గురువు శంకరులవారు ప్రతిష్ఠించిన శ్రీయంత్రమునకు అష్టోత్తర కుంకుమార్చన గావింపజేసి స్వామీ ప్రసాదమును ఇప్పించి మా మహానంది యాత్రను సుసంపన్నము చేసినాడు. ఆయనకు మనః పూర్వక ధన్యవాదములను సమర్పించి ఆహోబిలమునకు బయలుదేరినాము. అప్పుడు సమయము సాయంకాలము 5.30. ఇంచుమించు 70 కి.మీ. ల దూరము. ప్రయాణ సమయము గంటన్నర పడుతుంది, జాగ్రత్తతో కూడిన ఎంత వేగముగా తోలినా! ఆహోబిలములో మా కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎంత తొందర చేసినా రాత్రి 7గం. లకే చేరినాము. ఎగువ నరసింహ స్వామి దేవాలయము మూసివేసినారు. అది ప్రతిరోజూ అక్కడివారి ఆనవాయితీ. ఎత్తు ఎక్కువగా ఉన్న ఆ దేయాలయపు మెట్లు ఎక్కుటకు మాకోరకు ప్రత్యేకముగా ఆ సమయములో డోలీ కూడా ఏర్పాటు చేయించి యుండినాడు చంద్రమౌళి. మా అదృష్టము. దైవదర్శనము చేసుకోలేకపోయినాము. కానీ దిగువ నారసింహస్వామి దర్శనము నేత్రపర్వముగా చేసుకొని స్వామి శాయనసేవ ముగించుకొని వేడివేడి మిరియాల అన్నప్రసాదమును స్వీకరించి మనసారా స్వామికి మ్రొక్కి, మాకు సహకరించిన ఆ మంచి మనసున్న మనిషికి ధన్యవాదములు సమర్పించి, ప్రోద్దుటూరికి బయలుదెరినాము.
యాగంటి నుండి నంద్యాల మీదుగా మహానంది ఇంచుమించు 65 కి.మీ. ప్రయాణ సమయము ఇంచుమించు 2 గంటలు. కారణం రోడ్డు. సాయంకాలం 3.00 కు యాగంటిలో బయలుదేరి 4.30 కు చేరినాము. నిముసనిముసము మాతో చరవాణి లో మాట్లాడుతూ మమ్ము ఉత్తేజపరచుతూ మహానందికి త్వరగా చేరజేసి దర్శనమునకు పిలుచుకుపోయినాడు మా చంద్రమౌళి ఏర్పాటుచేసిన వ్యక్తి. నిజానికి మేము ఒక్క అరగంట ఆలస్యము చేసివుంటే దర్శనము నిలిపివేసి, దేవుని జూడ వచ్చు ఆప్రాంతపు శాసన సభ్యునికి ఆయన అనుచరులకు మాత్రమే ప్రవేశము కల్పించి యుండేవారు. ఆ కారణమున మేము అహోబిలము చూడలేక పోయేవారము. ఏదయినా దేవుని దయ. ‘జరుగును ఏదియైన నిల జాహ్నవి నాథుని యాజ్ఞ చేతనే’ అని కదా పెద్దలమాట. అంతా ఆయన దయగా భావించి మేమాతని తోడుత బయలుదేరినాము. రుద్రకుండములో పాద, ముఖ ప్రక్షాళనము చేసుకొని ఆతనిని అనుసరించినాము. ముందు ఆయన మాకు స్వామి మహానందీశ్వరుని గర్భగుడి లోనికీ ప్రవేశము ఏర్పాటుచేసి అచట శివునికి లఘువుగా అభిషేకము మాచేత చేయించి హారతినిప్పించి మమ్ము అమ్మ, కామేశ్వరీదేవి గుడికి తోడుకొనిపోయి జగజ్జనని దర్శనము చ్యించి,జగద్గురువు శంకరులవారు ప్రతిష్ఠించిన శ్రీయంత్రమునకు అష్టోత్తర కుంకుమార్చన గావింపజేసి స్వామీ ప్రసాదమును ఇప్పించి మా మహానంది యాత్రను సుసంపన్నము చేసినాడు. ఆయనకు మనః పూర్వక ధన్యవాదములను సమర్పించి ఆహోబిలమునకు బయలుదేరినాము. అప్పుడు సమయము సాయంకాలము 5.30. ఇంచుమించు 70 కి.మీ. ల దూరము. ప్రయాణ సమయము గంటన్నర పడుతుంది, జాగ్రత్తతో కూడిన ఎంత వేగముగా తోలినా! ఆహోబిలములో మా కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎంత తొందర చేసినా రాత్రి 7గం. లకే చేరినాము. ఎగువ నరసింహ స్వామి దేవాలయము మూసివేసినారు. అది ప్రతిరోజూ అక్కడివారి ఆనవాయితీ. ఎత్తు ఎక్కువగా ఉన్న ఆ దేయాలయపు మెట్లు ఎక్కుటకు మాకోరకు ప్రత్యేకముగా ఆ సమయములో డోలీ కూడా ఏర్పాటు చేయించి యుండినాడు చంద్రమౌళి. మా అదృష్టము. దైవదర్శనము చేసుకోలేకపోయినాము. కానీ దిగువ నారసింహస్వామి దర్శనము నేత్రపర్వముగా చేసుకొని స్వామి శాయనసేవ ముగించుకొని వేడివేడి మిరియాల అన్నప్రసాదమును స్వీకరించి మనసారా స్వామికి మ్రొక్కి, మాకు సహకరించిన ఆ మంచి మనసున్న మనిషికి ధన్యవాదములు సమర్పించి, ప్రోద్దుటూరికి బయలుదెరినాము.
ఇక ఇప్పుడు మహానంది క్షేత్రవిశేషములను శ్రద్ధగా చదవండి.
నలమల
ఇంచుమించు మహానంది లేక మహనంది నుండి మొదలవుతుంది. శ్రీశైలము కొండలో దట్టమగు అడవిలో
ఉన్నది. అహోబిలము కూడా ఈ పర్వతశ్రేణికి సంబంధించినదే!
మహానందిని
గూర్చి తెలుపుటకు ముందు ఒక ముఖ్యమగు విషయము తెలిపి ముందుకు నడుస్తాను.
పుణ్యక్షేత్రాలు
మూడు విధములుగా వుంటాయి. అవి 1. తీర్థము 2. క్షేత్రము 3. మూర్తి దేవాలయమునకు
దగ్గరిగా ప్రవహించే నదికి ఎన్నో అమోఘమైన గుణాలుంటాయి. ఆ నదిలో వేసే మునకతో మన జాడ్యాలన్నీ
నయమౌతాయి. అంటే పాప ప్రక్షాళన జరిగినట్లే కదా! రెండవది క్షేత్రము దేవాలయము ఏ గడ్డపై వెలసిందో ఆ గడ్డయొక్క
ప్రభావముచే భక్తుల సకల పాపహరణము జరుగుతుంది. 3వది మూర్తి. దేవాలయములో వెలసిన
మూర్తి ఎంతో మహిమాన్వితమై కొంగు బంగారమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వుంటుంది.
తీర్థమునకు ఉదాహరణ ప్రయాగ. గంగాయమునా సరస్వతుల సంగమము. రెండవది గయ. ఆ భూమియే ఎంతో
పుణ్యవంతమైనది. అందుకే పితరులకు అక్కడ శ్రాద్ధకర్మలు చేస్తారు. తమ తమ ఇండ్లలో
తద్దినాలు పెట్టె సమయమున కూడా బ్రాహ్మణుడు ‘గయా శ్రాద ఫలితమస్తూ’ అని చెబుతాడు. ఇక
మూడవది మూర్తి లేక విగ్రహము. విగ్రహము అంటూనే మనకు గుర్తుకు వచ్చేది స్వాయభువు
అయిన వేంకటేశ్వరుని విగ్రహము. ఆ మూర్తిని చూస్తేచాలు మన కోరికలు తీరినట్లే! మరి
కాశీ పేరే ఎత్తలేదే అనుకొంతున్నారేమో! కాశీ క్షేత్రము, శ్రీశైలక్షేత్రము ఆ మూడు
లక్షణాలూ కలిగి వున్నాయి.
మహనంది
క్షేత్ర మరియు మూర్తి మహిమ కలిగినది. ఇచ్చటి లింగము స్వయంభువు. ఈ భూమి ఎంతో
పవిత్రమైనదగుటచేతనే శివుడు స్వయంభువుగా ఇచట వెలసినాడు. ఈయన ఇచట మహానందీశ్వరునిగా
పిలువబడుతాడు. మహానంది కొలను ఒక అద్భుతము. ఇప్పటికీ ఆ కాలానికి నీరు ఎచటనుండి
వస్తున్నాయి అన్నది తెలియదు. కొలనిలోనికి మాత్రము నండి నోటినుండి వెలువడుతాయి.
ఎంతో లోతుగావుందే ఈ కొలని నీటిలో ఒక రూపాయి బిళ్ళ పడినా ఎంతోస్ఫుతముగా
కనిపిస్తుంది. ఈ కొలని నీరు రెండు పాయలుగా శివకుండము, విశ్నుకుండము అన్న రెండు
బయటి ప్రాకారములోపల ఉన్న రెండు కొలనులలోకి చేరుతాయి. భక్తులు ఈ రెండు కొలనులను
స్త్నానానికి ఉపయోగించుతారు. ఈనీరు 3000 ఎకరాలను సస్యస్యామలము చేస్తుంది. ఈ నీరు స్వయంభూమూర్తి పీఠము క్రింద ఉన్న ‘జల’
నుండి వస్తున్నవని స్థానికులు నమ్ముతారు కానీ ఇంతవరకూ నిరూపించినవారు లేరు.
మహానందీశ్వరునికి
గుడి 7వ శతాబ్దములో కట్టబడినట్లు శిలాఫలకముల ద్వారా తెలియవస్తూ వుంది. అంతకు
మునుపు స్వయంభువు అయిన మహనందీశ్వరునికి నీడ
ఏవిధముగా
ఉన్దినదీ తెలియవచ్చుటలేదు. ఈ దేవాలయము 1500 సంవత్సరములనాటిదని
కొన్ని
శాసనాల ద్వారా తెలియవస్తూవుంది. 10వ శతాబ్దములోని శాసనము ప్రకారము ఈ దేవాలయము అనేక
మార్లు పునరుద్ధరింపబడినదని తెలియవస్తూ వున్నది. పదియవ పదిహేనవ శతాబ్దములలో ఈ
ఆలయము ఎన్నో చక్కటి మార్పులతో అలరారుచున్నది. నేటికి కూడా ఈ క్షేత్రముపై స్థానిక
నాయకులు శ్రద్ధ తీసుకొని యాత్రికులకు ఎన్నో వసతులు కల్పించుటయేగాక దేవాలయపు శోభను
ఎంతగానో ఇనుమడింపజేయుచున్నారు.
మహనంది
ఎంతో ప్రభావవంతమగు క్షేత్రముగా, కృష్ణదేవరాయల కాలమునాటి రాగి రేకు పై లిఖించిన
శాసనము ద్వారా తెలియవచ్చుచున్నది. రాయల త్యరువాత అదే వంశమునకు చెందిన నరశింహదేవరాయలు
ఈ గుడికి ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించినట్లు తెలియవస్తూవున్నది.
స్థలపురాణము
ప్రకారము నిస్సంతువగు, శిలాదుడను ఋషి తనభార్యతో ఒక పర్ణశాలను నిర్మించుకొని తపస్సు
చేసుకోనుచుడా, ఒకనాడు ఆయన సతీమణి ఒక పుత్రునికై పరమేశుని గూర్చి
తపమాచారించామన్నది. ఆ రుశీశ్వరుడు కూడా వల్లెయని తపమాచరించి పరమేశ్వరుని
సాక్షాత్కరింపజేసుకొని, తన్మయుడై సతి కోరిక విస్మరించినవాడై, ఈశుని సదా తనకు
పరమేశ్వర తపోదీక్షను అనుగ్రహించుమన్నాడు. దయాళువైన భోళాశంకరుడు శిలాదుని కోర్కె
తీర్చుతూ, తానూ స్వయముగా అక్కడ వెలసి, పుత్రసంతతినిగూడా అనుగ్రహించినాడు. శిలాదుడు
తపమాచరించిన పుట్టలోనే ఒక శిశువు అగుపించగా పరమేశుని వరప్రసాదిగా ఆ శిశువునకు ‘మహానందుడు’
అన్న పెరుపెట్టినట్లుగానూ కాలక్రమములో ఆయన కూడా శివుని గూర్చి ఘోర తపస్సుజేసి
శివుని మెప్పించి ఆయన కలకాలమూ వాహనముగా ఉండిపోవులాగున
వరముపొంది ‘మహానంది’ అయినాడని చెబుతారు.
మౌర్య
చంద్రగుప్తుని మగధసామ్రాజ్యాధిపునిజేసిన చాణక్యుడు మహాపద్మనందుడు మరియు అతని 8
మంది తమ్ములను తరిమివేయగా వారు పశ్చాత్తప్తులై
తొమ్మిది మంది నాడు కీకారణ్యమగు నంద్యాల ప్రాంతమునకు వచ్చి, రాజధానికి
ఉపయుక్తమగు ఆ భూమిని గుర్తించి, అభివృద్ధి పరచి రాజధానిగా ఏర్పరచుకొని నందుల నిలయముగు ఆప్రాంతాన్ని
నంద్యాలయముగా నామకరణము చేసి పెద్దవాడయిన
మహాపద్మనందుడు ఏలియుండవచ్చునని ఊహించుకొనవచ్చును. మహాపద్మనందుడు తనపేరుతో మహానందీశ్వరుని,
ప్రతిష్ఠించుటయేకాక, తన మిగిలిన ఎనిమిది మంది తమ్ములతో కూడా నందీశ్వర లింగాలను ఈ
దిగువ తెలిపిన విధముగా, ప్రస్తుతపు గుర్తులలో తెలియజేయుచున్నాను.
నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున
ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్ దగ్గర ఉన్న
శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్
సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ
సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల
దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే
దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వరుడు, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు,
అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వరుడు కొలువై ఉన్నారు.
వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేసినారని విన్నాను.
మహానందికి
సంబంధించిన ఒక కథ ఈ విధముగా వుంది. ఈ మహానంది క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట
ఉండేది. ఆపుట్టమీద రోజూ ఒక కపిలధేనువు వచ్చి పాలు తనకు తానుగా వర్షిస్తూ ఉండేది.
పశువులకాపరి ఒక రోజు ఈ విడ్డూరాన్ని చూసినాడు. పుట్టలోపలినుండి ఒక బాలుని
నోటిలోనికి ఈ క్షీరదార కురిసేది. ఈదృశ్యం ఆగొల్లవాడు నంద్యాలను రాజధానిగా జేసుకొని
పాలించుచున్న మహాపద్మనందునికి ఈ వార్త తెలియజేసినాడు. నందుడువచ్చి ఆదృశ్యం చూసి అప్రతిభుడైనాడు. గోవు భయపడి
ఆతోందరలో భయముచే పుట్టను త్రొక్కి పరుగు తీసింది.
ఆ పుట్టపై పడిన గిట్ట ఆపుట్టపై ముద్రితమైయుండి పోయినది. నందుడు తను చేసిన అపరాధానికి విచారించినాడు. ఇష్టదైవమైన
శివుని తలచుకొంటూ ఆ నందిని భక్తితో పూజింపదొడగినాడు. శివుడు రాజుకు కలలో కనిపించి
ఆ పుట్టయే శివలింగాకృతిని సంతరించుకొంటుందని, ఆవు
పుట్టను తొక్కిన ముద్ర
లింగముపై శాశ్వతముగా ఉండిపోతుందని శెలవిచ్చినాడు.
గర్భాలయం
ఎదుట పెద్దనంది ఉన్నది. దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటివల్ల ఈ క్షేత్రానికి
మహానంది తీర్ధము అనే పేరు వచ్చింది. దీనిని రుద్ర కుండము అని కూడా అంటారు. దేవాలయం
ప్రాకారం బయట విష్ణుకుండము,
బ్రహ్మకుండము అను రెండు కుండములు ఉన్నాయి. శ్రీయుతులు భైరవజోస్యుల
మహానందయ్య దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి కారకులు అని చెప్పుకొంటారు. ఇక్కడ ఉన్న
కామేశ్వరీదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ఠ అని తెలుపుతారు.
1830లో
ఈ ప్రాంతానికి కాశీయాత్ర లో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య
తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా మహానందికి సంబంధించిన వివరములను వ్రాసినారు. ఆయన తన రచనలో, గుడి చుట్టూ సకలఫల
వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో కనీసము ఒక గుడిసె కూడా
ఉండేది కాదని వస్తువులు ప్రక్కవూరయిన
బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదని వ్రాసినారు. చివరకు నిప్పు దొరకడం కూడా
ప్రయాసగానే ఉండేదని అందులో ఆయన తెలిపినారు. రాత్రిపూట జనసంచారము ఉండదని
తెలిపినారు. అర్చకునిగా నాడు ఒక తమిళ బ్రాహ్మణుడు ఉండేవాడనీ, భక్తులు స్వయముగా శివునికి
అభిషేకము చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపినారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం
తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు
రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి మంత్రసాధన
చేసేవారని తెల;ఇపినారు. మొత్తానికి 1830ల నాటికి ఇది
పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది.
పురాతన
దేవాలయము కాబట్టి ఎందఱో మహానుభావులు ఎన్నెన్నోమార్లు ఈ ఆలయమును పునరుద్ధరినిచియుండవచ్చు.
ఇక,
పైన ఎరుకపరచిన కుండములగూర్చి నాకు తెలిసిన మేరకు తెలుపుతాను. నీరు రుద్రకుండములోగానీ,
బ్రహ్మావిష్ణుకుండములలో గానీ నీరు నిరంతరము 5అడుగుల లోతు కలిగి ఉంటాయి. ఒక
రూపాయిబిళ్ళ ఆ కొలనులలో వేసినా, అడుగున నిలిచిన దానిని మనము నీటిలో చూడవచ్చు. అంత
స్వచ్ఛముగా వుంటాయి అక్కడి నీరు. ఇది ఆ కొలనుల నిర్మాణము చేసిన విశ్వకర్మ స్థపతుల
గొప్పదనము.
ప్రధాన
కుండములోనికి నీరు 5 ధారలు అనగా ఊటల నుండి వస్తాయని తెలియుచున్నది. అవి శ్రీశైల ధార, నరశింహధార,దైవాధీన
ధార, నండి ధార, కైలాస ధార. ఈ కుండములలో
నీరు చలికాలము వెచ్చగానూ, వేసవిలో చల్లగానూ ఉంటాయని స్థానికులు తెలిపినారు. 6 వ శతాబ్దము
నుండి ఈ నీటి హద్దు తగ్గలేదని దేవాలయములోని ఒక శిలాఫలకము ద్వారా
తెలియవచ్చుచున్నది. ఈ ఆలయమున మూల విరాట్టు మహానందీశ్వరుడు కాగా అమ్మవారి పేరు కామేశ్వరీదేవి.
15X27
అడుగుల నంది
విగ్రహమును 35 లక్షల వ్యయముతో ఇక్కడ నంది పార్కు లో కట్టించినారు.
ఇది ప్రపంచములోనే అతిపెద్దది. దీనిబరువు 50 టన్నులు. కొత్తగా యాత్రికుల సౌఖర్యార్థము రెండు మంటపములు కూడా దేవస్థానము వారు కట్టించినారు. 1953 లో సుందర
సీతారామ లక్ష్మణ విగ్రహములతో రామాలయమును, ప్రత్యేకముగా హనుమదాలయమును కూడా ఇచట దేవాలయ ప్రాంగణములో
కట్టించినారు. పంచపాండవులు విడివిడిగా ప్రతిష్ఠించిన శివలింగములను ఈ క్షేత్రములో
చూడవచ్చును.
మాఘ
బహుళ చతుర్దశి నాడు (ఇంచుమించు ఫిబ్రవరి-మార్చ్ నెలలో) వచ్చే మహా శివరాత్రిని మహా వైభవముగా జరుపుతారు. ఆరోజు స్వామిని అమ్మవారిని రథములో క్రిక్కిరిసిన భక్త గణము
వెంటరాగా ఊరేగింపు చేస్తారు.
ఈ
క్షేత్రము నంద్యాలనుండి 21కి.మీ. కర్నూలు నుండి 215కి,మీ. దూరములో ఉన్నది. ఈ క్షేత్రపరిసరములలో పండించే ఒక జాతి అరటిపళ్ళను
మహనంది అరటిపళ్ళుగా పిలుస్తారు. సుగంధాలు అన్నపెరుతో అతిచిన్న అరటిపల్లను కూడా
ఇక్కడ పెంచేవారు. అవి నిజంగానే సుగంధభరితమై ఎంతో మధురముగా ఉండేవి. ఈ పళ్ళు మనిషికి
10 వంతున కూడా తినవచ్చు. ఇప్పుడు పండించుతున్నారో లేదు నాకు తెలియదు. మా బాల్యములో
జమ్మలమడుగులో ఎక్కువగా తినేవారము.
నాకు
తెలిసిన, తెలుసుకొన్న, చదివిన మేరకు మీకు మహానందిని గూర్చి తెలియజేసినాను.
ఆ
మహనంది దేవునికి అంకితమిచ్చుచు మానసంబు, ఏ
కామనలేక
చిత్తమున, కన్నులయందున నిల్పి యాతనిన్
ఓ
మహదేవ బాధలను ఒర్వగలేమయ తప్పులెన్నకన్
నీ
మనసార మమ్ము కరుణించుమటంచును అంజలించెదన్
అహోబిలము
శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత భావాబ్ధిపోత
లక్ష్మీనృశింహ మమదేహి కరావలంబం
అన్న శ్లోకముతో మొదలవుతుంది జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన ‘లక్ష్మీనృశింహ
కరావలంబ’ స్తోత్రము. భావము ఈ దిగువ తెలిపినాను.
శ్రీకరా, శ్రీధరా లక్ష్మి నర్సింహా, క్షీరసాగర నివాసా, చక్రధరా, శ్రేష్ఠమగు పన్నగేశ్వర మణిరంజితుడవయినట్టి పుణ్యమూర్తీ, ఓ యోగీశా, శాశ్వతముగా భవసాగర తారణ చేయించు నావతో సమానమైనవాడా, లక్ష్మీ నరశింహా నీ అభయహస్తము నాకందించు తండ్రీ!
అసలు అద్వైతమే శివకేశావాభేదము తెలిపేది. నారాయణుని పూజించుటకు నామాలే పెట్టుకోనక్కరలేదు. నారసింహ తత్వమును మహర్షులు, ఉపాసకులు, మోక్షగాములు త్రిమూర్తి స్వరూపముగా ఉపాసించినట్లు ఈ క్రింది శ్లోకంను ద్వారా తెలియవస్తూ వున్నది.
అనాఛేర్బ్రహ్మణో రూపం అగళాద్వైష్ణవం వపుఃl
ఆశీర్షాద్రుద్ర మీశానం తదగ్రే సర్వతశ్శివంll
నారసింహ దేహము నాభివరకూ బ్రహ్మతత్వము, కంఠము వరకు విష్ణుతత్వము, ఆపై రుద్ర ఈశాన తత్వములు గలిగి మంగళమయమై శోభిల్లుచున్నది.
నారద పురాణములో కాలానల కాంతితో మెరిసే ఉగ్ర నారసింహ రూపాన్ని వివరిస్తూ హిరణ్యకశిపుని ప్రేవులు మీదన వేసుకొని, నాగ యజ్ఞోపవీతముతో, ఐదు ముఖములతో, ప్రతిముఖమూ మూడుకన్నులతో ప్రకటితమయినట్లు వర్ణింపబడినది.
నృసింహపురాణము ప్రకారము స్వామి హిరణ్యకశిప వధానంతరము శ్రీశైల శిఖరము (అహోబిలము) చేరి అక్కడ కొలువైనట్లు తెలియవస్తూవున్నది. విష్ణు ధర్మోత్తర పురాణములో స్వామి అత్యంత బలిష్ట దేహధారియై సింహముఖ మానవ వపుషముతో ‘ఆలీఢ భంగిమ’ అంటే ఎడమకాలు ముందునకు ఉంచిన భంగిమలో హిరణ్యకశిపుని పోట్టచీలుస్తున్నట్లుగా వర్ణింపబడింది.
నరశింహ స్వామి నామావళిలో ఆయన కొన్ని శివ నామములతో అర్చిమ్పబడుతాడు. అవి ‘అఘోరాయ నమః’ ఘోరవిక్రమాయ నమః’ ఇత్యాది నామాలతో మనకు తెలియవస్తాయి. అందుకే తపస్సంపన్నులు శివకేశవాభేదమును ‘శివాయ విష్ణు రూపాయ’ అన్న శ్లోకములో నొక్కి వక్కాణించినారు. ‘పుట్టపర్తి, వారి ఖండ కావ్య పరిశీలనము’ అన్న సిద్దాంత గ్రంధములో నారశింహుడు శివకేశవ స్వరూపుడు అని దాశరధి రంగాచార్యగారు రూఢి చేస్తారు.
ఆశ్చర్యకరమగు విషయమేమిటంటే నరశింహ మూర్తిని భక్తులు వివిధ రూపాలలో పూజిస్తారు. నరశింహస్వామి భూలోకములో 73 రూపాలలో ఆరాధింపబడుచున్నాడు అని తెలియవస్తూవున్నది. రెండు, మూడు మచ్చుకు తెలియజేస్తాను.
నరసింహస్వామి విగ్రహము కర్నూలుకే చెందిన బనగానిపల్లె నుండి తాడిపత్రికి వెళ్ళే దారిలో 'అవుకు' దాటినతరువాత వచ్చే ఉప్పలపాడు గ్రామములో 'ఉడుము' రూపములో ఉంటుంది. స్థానికులు ఈ విగ్రహమును నరశింహునిగా భావించి పూజించుతారు.
నల్గొండ జిల్లా వజీరాబాద్ (పూర్వ నామము వాడపల్లి) నరసింహస్వామి గుడిలో మూలవిరాట్ నాసిక వద్ద ఒక దీపము నాభివడ్డ ఒక దీపము అనునిత్యమూ వెలిగించియుంచుతారు. నాసిక వద్దయున్నది రెపరెపలాడుతూనే ఉంటుంది. బొడ్ఢు వద్ద ఉన్నది మాత్రము నిశ్చలముగా ఉంటుంది. మహబూబ్ నగర్ లోని శింగోట్టమున (శింగవట్టము) స్వామీ లింగరూపములో దర్శనమిస్తారు. బహుశ ఒకానొక కాలములో ఈ ప్రాంతము ఋషులు మునులకు ఆలవాలమై ఉండనోపును. కడప జిల్లాలో 'శిద్ధవట్టము' అన్న ప్రాంతమున పురాతన శివాలయము కలదు. ఇక్కడ సిద్ధులు తపమాచ్రించేవారట. ఇటువంటి విచిత్రాలు ఎక్కువగా శివుని విషయములోనూ నరశింహుని విషయములోనూ కానవస్తాయి. ఈ వివరాలేవీ ఆహోబిలమునకు సంబంధము లేనివి. అయినా తెలుసుకోనవలెనను జిజ్ఞాస కలిగిన పాఠకుల కొరకు ఈ వివరములు తెలియజేసినాను. అసలు ఈ మాట చాలు దేవుడు ఏరూపముననైనా ఉండవచ్చు. 'యద్భావం తద్భవతి' అనికదా పెద్దలు అన్నారు.
నరశింహావతారము భీకర స్వరూపము. ఇది దుష్టశిక్షణార్థము ప్రభవించినది. కావున ఈ విగ్రహమునకు శాస్త్రానుసరణీయమగు పూజలు జరుపవచ్చునన్నది ఋషిప్రోక్తము. అందువల్లనే నారసింహ మంత్రమునకు సాధకులలో ప్రత్యెక స్థానము ఉంది. ఈ మంత్రోపాసనవల్ల జ్ఞానము, ధైర్యము, గ్రహబాధల ఉపశమనము, భూతపిశాచాది దుష్ట శక్తుల ప్రభావమును నిర్వీర్యము చేయుట మొదలగు సత్ఫలితాలు లభిస్తాయి. లక్ష్మినృశింహ ఉపాసనచే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
ఇక ఆహోబిలమునకు వద్దాము. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రములను మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. అట్టి 108 దివ్య క్షేత్రములలో అహోబిలము అత్యంత ప్రముఖమైనది.
ఇది దట్టమైన అడవి ప్రాంతము కౄరమృగ ఆవాసము. నవ నారసింహ నిలయము. అందునా హిరణ్యకశిపుని వధించి వేంచేసిన స్వామీ. ఆయనా ఆకృతిని ఆసమయమున గాంచిన దేవతలు ‘అహోబల’ అహోబల’ అన్నారట. అందుచే ఆయన ఆహోబలుడైనాడు. కావున ఆప్రాంతము ఆహోబలమైనది. రానురాను ‘బలము’ ‘బిలమై’ పోయినది. అయినా ఎగువ అహోబలము నందు స్వామీ గుహలోనే వెంచేసియున్నాడు. దానిని బిలముగా భావివలసివస్తుంది. అయినా దానికి ముందు ‘అహో’ చేర్చితే అర్థము కనిపించదు. నామనసుకు అందుకే అది ‘ఆహోబల’మని అనిపిస్తుంది.
ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. ఇచ్చట స్వామీ అర్ధాంగి ‘అమృతవల్లిగా వెలసింది.
అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు ఎన్నో సేవలందించినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం నలిగిపోగా, రంగరాయ ప్రభువు వారిపై విజయము సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఎంతో తన్మయతతో నిర్వహిస్తారు అర్చకులు. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.
ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన 'కాశీయాత్రా చరిత్ర' లో వర్ణించినారు. ఆయన వ్రాతల ప్రకారము నాడు ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటితో నిండిన దట్టమైన అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాసినారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది అనికూడా తమ పోత్తమున తెలిపినారు. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు\అపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాసినారు.
అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు పెట్టింది పేరు. దిగువ అహోబలము నవ నారశింహ క్షేత్రాలలో లేకపోయినా స్వామి ఎంతో మహత్తు కలిగినవాడు. స్వయంగా వేంకటేశ్వరుడు ఈ విగ్రహమును ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యము.
నరశింహా నిను జూచు ధ్యేయమొకటే నన్ బోలు వృద్ధుల్ని ఏ
దరి బోనీయక చేయిబట్టి కడు ఔచిత్యార్ద్రతల్ కూడ ఊ
పిరియై నిల్చుచు దారిజూపి మనమున్ పీనంబుతో నింపుచున్
గురిగా జేర్చును నీ పదాంబురుహ సీమన్ కూర్మితో మమ్ములన్ (పీనము=సంతోషము)
శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత భావాబ్ధిపోత
లక్ష్మీనృశింహ మమదేహి కరావలంబం
అన్న శ్లోకముతో మొదలవుతుంది జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన ‘లక్ష్మీనృశింహ
కరావలంబ’ స్తోత్రము. భావము ఈ దిగువ తెలిపినాను.
శ్రీకరా, శ్రీధరా లక్ష్మి నర్సింహా, క్షీరసాగర నివాసా, చక్రధరా, శ్రేష్ఠమగు పన్నగేశ్వర మణిరంజితుడవయినట్టి పుణ్యమూర్తీ, ఓ యోగీశా, శాశ్వతముగా భవసాగర తారణ చేయించు నావతో సమానమైనవాడా, లక్ష్మీ నరశింహా నీ అభయహస్తము నాకందించు తండ్రీ!
అసలు అద్వైతమే శివకేశావాభేదము తెలిపేది. నారాయణుని పూజించుటకు నామాలే పెట్టుకోనక్కరలేదు. నారసింహ తత్వమును మహర్షులు, ఉపాసకులు, మోక్షగాములు త్రిమూర్తి స్వరూపముగా ఉపాసించినట్లు ఈ క్రింది శ్లోకంను ద్వారా తెలియవస్తూ వున్నది.
అనాఛేర్బ్రహ్మణో రూపం అగళాద్వైష్ణవం వపుఃl
ఆశీర్షాద్రుద్ర మీశానం తదగ్రే సర్వతశ్శివంll
నారసింహ దేహము నాభివరకూ బ్రహ్మతత్వము, కంఠము వరకు విష్ణుతత్వము, ఆపై రుద్ర ఈశాన తత్వములు గలిగి మంగళమయమై శోభిల్లుచున్నది.
నారద పురాణములో కాలానల కాంతితో మెరిసే ఉగ్ర నారసింహ రూపాన్ని వివరిస్తూ హిరణ్యకశిపుని ప్రేవులు మీదన వేసుకొని, నాగ యజ్ఞోపవీతముతో, ఐదు ముఖములతో, ప్రతిముఖమూ మూడుకన్నులతో ప్రకటితమయినట్లు వర్ణింపబడినది.
నృసింహపురాణము ప్రకారము స్వామి హిరణ్యకశిప వధానంతరము శ్రీశైల శిఖరము (అహోబిలము) చేరి అక్కడ కొలువైనట్లు తెలియవస్తూవున్నది. విష్ణు ధర్మోత్తర పురాణములో స్వామి అత్యంత బలిష్ట దేహధారియై సింహముఖ మానవ వపుషముతో ‘ఆలీఢ భంగిమ’ అంటే ఎడమకాలు ముందునకు ఉంచిన భంగిమలో హిరణ్యకశిపుని పోట్టచీలుస్తున్నట్లుగా వర్ణింపబడింది.
నరశింహ స్వామి నామావళిలో ఆయన కొన్ని శివ నామములతో అర్చిమ్పబడుతాడు. అవి ‘అఘోరాయ నమః’ ఘోరవిక్రమాయ నమః’ ఇత్యాది నామాలతో మనకు తెలియవస్తాయి. అందుకే తపస్సంపన్నులు శివకేశవాభేదమును ‘శివాయ విష్ణు రూపాయ’ అన్న శ్లోకములో నొక్కి వక్కాణించినారు. ‘పుట్టపర్తి, వారి ఖండ కావ్య పరిశీలనము’ అన్న సిద్దాంత గ్రంధములో నారశింహుడు శివకేశవ స్వరూపుడు అని దాశరధి రంగాచార్యగారు రూఢి చేస్తారు.
ఆశ్చర్యకరమగు విషయమేమిటంటే నరశింహ మూర్తిని భక్తులు వివిధ రూపాలలో పూజిస్తారు. నరశింహస్వామి భూలోకములో 73 రూపాలలో ఆరాధింపబడుచున్నాడు అని తెలియవస్తూవున్నది. రెండు, మూడు మచ్చుకు తెలియజేస్తాను.
నరసింహస్వామి విగ్రహము కర్నూలుకే చెందిన బనగానిపల్లె నుండి తాడిపత్రికి వెళ్ళే దారిలో 'అవుకు' దాటినతరువాత వచ్చే ఉప్పలపాడు గ్రామములో 'ఉడుము' రూపములో ఉంటుంది. స్థానికులు ఈ విగ్రహమును నరశింహునిగా భావించి పూజించుతారు.
నల్గొండ జిల్లా వజీరాబాద్ (పూర్వ నామము వాడపల్లి) నరసింహస్వామి గుడిలో మూలవిరాట్ నాసిక వద్ద ఒక దీపము నాభివడ్డ ఒక దీపము అనునిత్యమూ వెలిగించియుంచుతారు. నాసిక వద్దయున్నది రెపరెపలాడుతూనే ఉంటుంది. బొడ్ఢు వద్ద ఉన్నది మాత్రము నిశ్చలముగా ఉంటుంది. మహబూబ్ నగర్ లోని శింగోట్టమున (శింగవట్టము) స్వామీ లింగరూపములో దర్శనమిస్తారు. బహుశ ఒకానొక కాలములో ఈ ప్రాంతము ఋషులు మునులకు ఆలవాలమై ఉండనోపును. కడప జిల్లాలో 'శిద్ధవట్టము' అన్న ప్రాంతమున పురాతన శివాలయము కలదు. ఇక్కడ సిద్ధులు తపమాచ్రించేవారట. ఇటువంటి విచిత్రాలు ఎక్కువగా శివుని విషయములోనూ నరశింహుని విషయములోనూ కానవస్తాయి. ఈ వివరాలేవీ ఆహోబిలమునకు సంబంధము లేనివి. అయినా తెలుసుకోనవలెనను జిజ్ఞాస కలిగిన పాఠకుల కొరకు ఈ వివరములు తెలియజేసినాను. అసలు ఈ మాట చాలు దేవుడు ఏరూపముననైనా ఉండవచ్చు. 'యద్భావం తద్భవతి' అనికదా పెద్దలు అన్నారు.
నరశింహావతారము భీకర స్వరూపము. ఇది దుష్టశిక్షణార్థము ప్రభవించినది. కావున ఈ విగ్రహమునకు శాస్త్రానుసరణీయమగు పూజలు జరుపవచ్చునన్నది ఋషిప్రోక్తము. అందువల్లనే నారసింహ మంత్రమునకు సాధకులలో ప్రత్యెక స్థానము ఉంది. ఈ మంత్రోపాసనవల్ల జ్ఞానము, ధైర్యము, గ్రహబాధల ఉపశమనము, భూతపిశాచాది దుష్ట శక్తుల ప్రభావమును నిర్వీర్యము చేయుట మొదలగు సత్ఫలితాలు లభిస్తాయి. లక్ష్మినృశింహ ఉపాసనచే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
ఇక ఆహోబిలమునకు వద్దాము. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రములను మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. అట్టి 108 దివ్య క్షేత్రములలో అహోబిలము అత్యంత ప్రముఖమైనది.
ఇది దట్టమైన అడవి ప్రాంతము కౄరమృగ ఆవాసము. నవ నారసింహ నిలయము. అందునా హిరణ్యకశిపుని వధించి వేంచేసిన స్వామీ. ఆయనా ఆకృతిని ఆసమయమున గాంచిన దేవతలు ‘అహోబల’ అహోబల’ అన్నారట. అందుచే ఆయన ఆహోబలుడైనాడు. కావున ఆప్రాంతము ఆహోబలమైనది. రానురాను ‘బలము’ ‘బిలమై’ పోయినది. అయినా ఎగువ అహోబలము నందు స్వామీ గుహలోనే వెంచేసియున్నాడు. దానిని బిలముగా భావివలసివస్తుంది. అయినా దానికి ముందు ‘అహో’ చేర్చితే అర్థము కనిపించదు. నామనసుకు అందుకే అది ‘ఆహోబల’మని అనిపిస్తుంది.
ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. ఇచ్చట స్వామీ అర్ధాంగి ‘అమృతవల్లిగా వెలసింది.
అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు ఎన్నో సేవలందించినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం నలిగిపోగా, రంగరాయ ప్రభువు వారిపై విజయము సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఎంతో తన్మయతతో నిర్వహిస్తారు అర్చకులు. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.
ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన 'కాశీయాత్రా చరిత్ర' లో వర్ణించినారు. ఆయన వ్రాతల ప్రకారము నాడు ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటితో నిండిన దట్టమైన అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాసినారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది అనికూడా తమ పోత్తమున తెలిపినారు. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు\అపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాసినారు.
అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు పెట్టింది పేరు. దిగువ అహోబలము నవ నారశింహ క్షేత్రాలలో లేకపోయినా స్వామి ఎంతో మహత్తు కలిగినవాడు. స్వయంగా వేంకటేశ్వరుడు ఈ విగ్రహమును ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యము.
నరశింహా నిను జూచు ధ్యేయమొకటే నన్ బోలు వృద్ధుల్ని ఏ
దరి బోనీయక చేయిబట్టి కడు ఔచిత్యార్ద్రతల్ కూడ ఊ
పిరియై నిల్చుచు దారిజూపి మనమున్ పీనంబుతో నింపుచున్
గురిగా జేర్చును నీ పదాంబురుహ సీమన్ కూర్మితో మమ్ములన్ (పీనము=సంతోషము)
ప్రొద్దుటూరు ప్రయాణము
అహోబలము
నుండి నారశింహుని దర్శనానంతరము ఇంచుమించు
రాత్రి 8.30కి ప్రోద్దుటూరికి బయలుదేరినాము. చాలా ఏండ్ల తరువాత నా స్వంత
ప్రాంతానికి పోవుట కాబట్టి వద్దన్నా ఎదో ఉత్సాహము, ఎదో ఉద్వేగము. మా నాగసుబ్బా రెడ్డి
ఇల్లు మేము ఆక్రమించే సమయానికి ఇంచుమించు, రాత్రి 11గం.
అయినది. అసలు మేము అహోబలము వదలిన ఒక 1 గంట తరువాతనుండి, నాగాసుబ్బా
రెడ్డి మేము ప్రోద్దుటూరికి ఎంత దూరములో ఉన్నాము, ఇంకా
ఎంతసేపు పడుతుంది అన్న విషయము తానూ చెబుతూ తన ఇల్లు మేము ఎట్లు చేరాలి అన్నది
విసుగు పడకుండా చెబుతూనే వున్నాడు. ఆయన చెప్పిన ప్రకారమూ Main Road మీద వెళ్ళగలిగినాము, కానీ వీధి దీపాల మసక వెలుతురులో
ఇంకా ముందుకు పోయినాము. నా తెలివితేటలు రెడ్డికి తెలుసు కాబట్టి తన అల్లుడు
రాఘవరెడ్డి గారిని తాళంచెవులతో Main Road మీదికి రమ్మన్నాడు.
ఆయన కూడా విసుగు చెందకుండా వచ్చి మమ్ము చరవాణిలో పలుకరించి తగినవిధముగా వెనుకకు
తానూ నిలచిన చోటికి రమ్మని చెప్పినాడు. మేము ఆయనవద్దకు చేరిన తరువాత మరయిగ్గాను (Motor
Cycle) లో తానూ ముందు వెళుతూ దారిజూపి ఇల్లు చేర్చినాడు. ఆయన
ఆదరమును మేము మరువనే లేము. ఇట్లయితేనేమి ఇల్లుచేరినాము.
పండుకొనుటకు
పరిచే ఇస్త్రీ బట్టలను కూడా మంచాలపై యుంచి యుండినారు. వాళ్ళ A\C, Geyser మొదలగు
అన్ని వస్తువులను దారాళముగా వాడుకొమ్మని పదే పదే చెప్పిన వితరణ ఆ దంపతులది.
రాత్రికి బడలిక తీర నిదురించినాము.
పాఠకులు
కాస్త మనసారా రాయలసీమలోని ఒక ప్రాంతమైన ప్రోద్దటూరును గూర్చి చదివి ఆ ప్రాంతమును
గూర్చిన ఒక సదవగాహన ఏర్పరచుకొంటారని నిజంగానే కొంత శ్రమకోర్చి వ్రాసినాను.
ఎందుకంటే రాయల సీమ అంటూనే కక్షలు, హత్యలు ఇవేకదా మన పత్రికలూ సినిమాలు బయటివారికి
తెలియజేసినది. పులిఎందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు
లలో రెడ్ల జనాభా ఎక్కువే. నిజానికి వారు కాపులు. ఒకవిధముగా వారు రేనాటి సీమను
పరిపాలించుటచే, రేనాటి రాజులు, రట్టళ్ళు
రెడ్లు అయినారు. ఒక విధముగా రెడ్డి అన్నది వారి బిరుదు. హద్దు మీరిన అభిమానానికి
వారు ఆనవాలు. పౌరుషము ఎక్కువే! కానీ అది వారిలో వారికి వైషమ్యములు ఏర్పడినపుడే! వైషమ్యమే
లేకుంటే వారు సహనానికీ, సహాయానికీ మారుపేరు.
తెల్లవారి
ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని, ‘ఏనాటిదొ
ఈ బంధం మా ఇరువురి అనుబంధం అంతా రుణానుబంధం’ అని నాలోనేనే గొణుగుకొంటూ గండికోటకు బయలుదేరినాము.
గండికోట
'బాలనాగమ్మ' సినిమా గుర్తున్న వారికి మాయల మరాఠీ, లేక మాయల ఫకీరు
గుర్తుంటాడు. అతను గండికోట ప్రాంతములో ఉండేవాడని కథలో వినిపిస్తుంది. ఆటను వుండినాడో లేదో గానీ గండికోట మాత్రం
వుంది. అక్కడ కోట కూడా వుంది.
ధ్వంసమైన రాజభవనాలు దేవాలయాలు కలిగివుంది.
మొక్కవోని
మసీదులను నిలుపుకొని వుంది . రంగనాథ,మాధవరాయ దేవాలయములు ఎంతో పేరుపొందినవి, తప్పక చూడదగినవి. భోగపుసాని భవనము పావురాల
గోపురము, ధాన్యాగారము, రక్తపు మడుగు, జుమ్మా మసీదు నేను
బాల్యమున చూసినవి. ఇప్పుడది టూరిస్ట్ స్పాట్ అయినదని విన్నాను. శత్రువులను చంపిన కత్తులు కడుగుటవల్ల అమడుగులో
నీరు ఎప్పుడూ ఎర్రగా
ఉండేవి. దేవాలయాలు ధ్వంసమైనా శిల్పకళ చూసి తీరవలసినదే!
ఇక జుమ్మా మసీదు గోడలు పాలరాతి గోడల లాగా చాలా నునుపుగాను
తెల్లగాను వుంటాయి. మెట్లపై, పై అంతస్తు చేరుటకు
ఎక్కుతూ,
దృష్టి పైవైపుకు సారించితే ఇంకొక అంతస్తుకు మెట్ల బాట ఉందన్న భ్రమ కలిగించుతుంది. నిజానికి అటువంటిది లేదని నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి వుంటుంది. గండి కోట లోయ
చూడవలసిన
దృశ్యము. ఆ అందము నా మాటల కందదు. మైలవరం Dam ఇక్కడికి 3 కిలోమీటర్లే. గండికోట ప్రాజెక్ట్ ఎందఱో రాయలసీమ వాస్తవ్యులు కన్న కల. కలను కల్లగా జేసిన ఘనత నాటి పాలకులదే. ప్రాజెక్ట్ 'ఢాం' అనింది గానీ ప్రక్కన Dam మిగిలింది. నాకు తెలిసిన మేరకు గండి కోటను గూర్చి నాలుగు మాటలు చెబుతాను.
గండికోట కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో
పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్
శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో
ప్రవహించే పెన్నా నదితో, శతృదుర్భేద్యంగా వుంటుంది.
యన్.టి.ఆర్ నటించిన పాత చిత్రం " గండికోట రహస్యం " సినిమా గుర్తుకొస్తూ వుందా..!
నిజమే చాలా మందికి ఈ " గండికోట " పేరు చెప్పగానే అదేదో యన్.టి.ఆర్
సినిమా ఉంది కదా అని అనిపిస్తుంది...! నిజముగా " గండికోట ఉన్నది కానీ
గండికోటకు 'గండికోట రహస్యానికి ఉండేది "తాతా చారికి పీర్ల
పండగకు" మరియు "అబ్దుల్ ఖాదరు కు అమావాస్యకు” వుండే సంబంధమే! ఒక్క కడప వాసులలో
కొందరికి తప్ప మిగతా తెలుగునాడు లోని తెలుగు ప్రజలెవ్వరికీ తెలియదు.., మన ప్రభుత్వ ఘనకార్యం అది, నిజంగా
దౌర్భాగ్యమే...! ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఒక ప్రాంతం గురించి తగిన
ప్రచారము లేకుండా ఎన్నో దశాబ్దాలు ఉండిపోయింది. ఇప్పుడు పాలకులు కొంత కన్ను తెరచి
దీనికి విహారయాత్రా స్థల స్థాయిని కల్పించినారు.
గుడ్డికన్నా మెల్ల మేలుకదా! హైందవ రాజుల గురించి తెలిపే
ఒక ప్రక్రియ నేటికి కూడా మన విద్యావ్యవస్థ చేపట్టలేదు. మనల్ని పరిపాలించిన,
పరిపాలించే ప్రభుత్వాలు, నాటి వీరుల గూర్చిగానీ
వారి త్యాగాన్ని గూర్చి గానీ పొరబాటున కూడా తలచిన పాపాన పోయినది లేదు. ఒక
చారిత్రాత్మక కట్టడం అలా తన చరిత్రతో సహా మరుగున ఉన్నది... ! ఈ ఘనత వహించిన పాలకులు
కేవలం ఏడెనిమిది సంవత్సరాల క్రితం నిద్రనుండి మేల్కొని ఇప్పుడు అక్కడ టూరిజం వారిచే కొన్ని వసతులు, అభివృద్ది
కార్యక్రమాలు చేపట్టినారట. ఇలాంటి విషయాలలో పక్కనున్న కర్నాటక రాష్ట్రం ఎంత
ముందంజలో వుందో చూసి మనం చాలా నేర్చుకోవాలి.
ఒక్కసారి
క్లుప్తముగా గండికోట చరిత్రను గూర్చి తెలుసుకొందాము. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించినాడు. ఆతని తరువాత ఎందఱో రాజులు ఆ కోటనేలినారు
కానీ చివరి పాలకుడైన చినతిమ్మానాయుని కాలములో అది ముస్లిముల
వశమయ్యింది.
మీర్ జుంలా పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు.
మీర్ జుంలా పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు.
గోలకొండ రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి రత్న గర్భయైన భారతదేశము చేరినాడు.
స్వయముగా వజ్రాల
వ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడైనాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము
సంపాదించి దర్బారులో వజీరు
స్థానానికి ఎదిగినాడు . విజయనగర సామ్రాజ్యములో
వజ్రాల గనులున్న రాయలసీమపై, ముఖ్యముగా కడప ప్రాంతముపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా
నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తటం
జరిగింది. అతనికి సహాయముగా ఆధునిక
యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల
నిపుణుడుతోదయినాడు. ఎన్నోరోజులు భీకరయుద్ధము జరిగినది కానీ కోట వశము కాలేదు. ఎట్టకేలకు ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట
గోడలు బీటలువారినాయి . క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చి కోటగోడలు బద్దలు చేయుటలో కృతకృత్యుడైనాడు . యుద్ధము మలుపు తిరిగింది. యుద్దము ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర
వ్యాపారి టావెర్నియర్ గండికోటలో నున్న మీర్ జుంలాను కలిసినాడు. ఆ
సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన
పుస్తకములో ఎంతో గొప్పగా పొగిడినాడు. తిమ్మనాయుని బావమరిది
శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ
గావిస్తూ అసువులు బాసినాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క,
ఫ్రెంచ్
సైనికులతో తలపడింది. భర్త మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను
వానిని వెదికి వేటాడి సంహరించింది. అదే సమయములో నబీ వేసిన కత్తి
వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు
అగ్నిప్రవేశము చేసినారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకి చనిపోయినారని చెబుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషమునిప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి
అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది.
మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి
బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తిస్తుంది
. మీర్ జుంలా గండికోటలోని
మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మిస్తాడు .
దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించుతాడు. కోటను ఫిరంగుల
తయారీకి స్థావరము చేస్తాడు. గండికోటపై సాధించిన విజయముతో మీర్
జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి
అవుతాడు. బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ
నాయుడు తమిళదేశానికి తరలించబడతాడు. గండికోట లోని అరువదియారు
ఇంటిపేర్లు గల కమ్మ వంశములవారు చెల్లాచెదరై పోయి పలు
ప్రాంతాలలో
స్థిరపడతారు.
వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని
అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు
ప్రాంతాలకు పోతారు. వీరికే 'గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అను పేరులు
వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు
నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ
దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెడతాడు. వీరి వారసులు మధుర
సమీపములోని కురివికులం, నాయకర్పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులైనారు. మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ
రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు
అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
ఇప్పటికీ
గండికోటలో ఒక చిన్న గ్రామం ఉన్నది, మూడు వందల
ప్రజలు నివాసము ఉంటున్నారు.
ఇక్కడ చూడదగ్గ శిల్పకళాసంపద చాలానే ఉన్నది, మాధవస్వామి
దేవాలయం ఎత్తైన గోపురముతో నలువైపులా ద్వారాలతో
తూర్పుముఖమై ఉంటుంది, లోపల నైఋతిమూల ఎత్తైన
శిలాస్తంభములతో మధ్య ఉన్నతమైన వేదికతో నున్న కళ్యాణ మండపము, ఆగ్నేయ మూల పాకశాల, అలంకారశాల, ఉత్తరమున ఆళ్వారుల ఆలయము,
దాని ప్రక్కన
మరొక కళ్యాణమండపము ప్రాకారము వెంబడే లోపలవైపుగా 55 స్తంభముల వసారా కలదు
ఆలయము గర్భగృహము, మూసిన అర్థమండపము, నాట్యమండపము ఉన్నాయి. ఈ మండపాలలో శిల్పకళ కళ్ళు చెదిరేలా ఉంటుంది, అందుకే ఆ ఫ్రెంచ్ ట్రావెలర్ ఈ గండికోటను రెండవ
హంపిగా కొనియాడటం జరిగింది. మాధవస్వామి ఆలయగోపురము
నాలుగు అంతస్తుల కలిగి ఉన్నది. ఈ ఆలయాన్ని హరిహర బుక్క
రాయులు నిర్మించినారు. రఘునాధా అలయము ధాన్యాగారమునకు ఉత్తరముననున్న ఎత్తైన గుట్టపై ఉన్నది. ఈ ఆలయ ప్రాకారము లోపల కళ్యాణ మంటపము ఉన్నది ఈ మండపానికి నాలుగు వైపుల నున్న స్తంభాలమీద రతి భంగిమల శిల్పాలు చెక్కి ఉన్నారు, ఇక గర్భగుడి చుట్టూ ఉన్న
మండపంలో చూడదగ్గ శిల్పకళా సౌందర్యము ఎంతగానో ఉన్నది.
గండికోట లోపల వెలుపల మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి, ఇక కోటలోపల " రాయల చెరువు " ఉన్నది ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ క్షేత్రములకు నీరు, అలాగే ప్రజలందరికీ త్రాగునీరు అందించేవారు. ఇవి కాక గండికోట 5 కిలోమీటర్ల పొడవునా పెన్నానది ప్రవాహము లోతుగా ఉంటుంది. గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. నిజంగా అది అందరు చూడవలసిన ప్రకృతి తయారు చేసిన సహజ కందకం, దాదాపుగా 1000 అడుగుల వెడల్పుతో 500 అడుగుల లోతుతో ఏర్పడిన ప్రవాహమది. సంక్షిప్తంగా ఇది గండికోట చరిత్ర..
గండికోట లోపల వెలుపల మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి, ఇక కోటలోపల " రాయల చెరువు " ఉన్నది ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ క్షేత్రములకు నీరు, అలాగే ప్రజలందరికీ త్రాగునీరు అందించేవారు. ఇవి కాక గండికోట 5 కిలోమీటర్ల పొడవునా పెన్నానది ప్రవాహము లోతుగా ఉంటుంది. గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. నిజంగా అది అందరు చూడవలసిన ప్రకృతి తయారు చేసిన సహజ కందకం, దాదాపుగా 1000 అడుగుల వెడల్పుతో 500 అడుగుల లోతుతో ఏర్పడిన ప్రవాహమది. సంక్షిప్తంగా ఇది గండికోట చరిత్ర..
జమ్మలమడుగు నుండి బస్సు సౌకర్యం కలదు .
మైలవరం
ఇది
సమీప పట్టణమైన జమ్మలమడుగు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. నాటి ముఖ్య మంత్రి కాసు
బ్రహ్మానందరెడ్డి గారు 1971 లో దీనికి సంఖుస్థాపన జేసినారు. ఇది 1981 నాటికి
పూర్తియ్యింది. 75 వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది. ఆనకట్ట ఒక అద్భుతమైన
దృశ్యము. ఇక్కడ ఆనకట్ట పూర్తయిన తరువాత ఒక వస్తు ప్రదర్శన శాలను చూడవచ్చు. ఇందులో
గండికోట మైలవరం చుట్టుప్రక్కల ముంపునకు గురికాబడబోవు వూర్లనుండి లభ్యమైన పురాతన
శిల్పములు, 12 వ శతాబ్దపు నాణెములు, 16వ శతాబ్దపు యుద్ధసామాగ్రి
పదిల పరచినారు. ఇక్కడి వస్తు సముదాయము పరిమితమైనది. చూడతగినది ఈ ప్రదర్శనశాల.
ఇక్కడ సాయంసంయపు సూర్యాస్తమయ దృశ్యము చూడ ముచ్చటగా ఉంటుంది. ఇచ్చట పడవ షికారు కూడా
ఏర్పాటు చేసినారు కానీ మేము వెళ్ళినపుడు ఆ వసతి అందుబాటులో లేదు.. మైలవరము మండల
కేంద్రము.
ఈ మండల
కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో, సుందరమైన కోనలు, వాగులు,
వంకలు, పచ్చిక బయళ్ళు, ప్రకృతిసిద్ధమైన
కొండల మధ్యన అగస్తేశ్వర క్షేత్రం ఉంది. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి దేశసంచారం
చేయుచూ వింధ్య పర్వతాల మదమణచి, దక్షిణదిశగా ప్రయాణం చేయుచూ,
మార్గమధ్యంలో అనేకచోట్ల శివలింగాలను ప్రతిష్ఠించినారు. అలా ఆయన
ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్లోని దండకారణ్య ప్రాంతంలోనికి ప్రవేశించి ఆగస్త్య కోనలో
అడుగుపెట్టినారు. ఇక్కడ మనో సిద్ధికోసం, ధర్మపత్ని
లోపాముద్రతో కలిసి, పరమేశ్వర అనుగ్రహానికై దుర్గా
సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించి, ఘోర తపస్సు చేసినట్లు
చారిత్రిక ఆధారల ద్వారా తెలియుచున్నది. ఈ క్షేత్రంలో స్వయంసిద్ధంగా పుట్టిన పిల్ల
కాలువలలో స్నానమాచరించి, జపం చేసేవారని స్థలపురాణాల ద్వారా
తెలియుచున్నది. ఎందరో అనారోగ్య పీడితులు ఈ కొలనులో స్నానమాచరించి స్వస్థత
పొందినట్లు స్థానికులు కథలు కథలుగా చెప్పుకొనడం విశేషం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహించూతారు.
మహాశివరాత్రినాడు ఇక్కడకు భక్తులు అసంఖ్యాకంగా విచ్చేసి అగస్తేశ్వరస్వామివారిని
దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ కూడానిర్వహించుతారు. ఈ ఉత్సవాలకు
ఈ జిల్లా నుండియేగాక, చుట్టు ప్రక్కల జిల్లాలనుండి గూడా తరలి
వచ్చు భక్తుల సౌకర్యం కోసం, ఆర్.టి.సి. వారు ప్రత్యేక
బస్సులను నడిపుతారు.
అక్కడి
నుండి బెలూం గుహలకు బయలుదేరినాము
బెలూం గుహలు
కర్నూలు
జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
జమ్మలమడుగు నుండి కొలిమిగుండ్ల45 కి.మీ. ల దూరము. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల
తరువాత ఇవే అతిపెద్ద గుహలుగా
భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం.
పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే
అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత . బెలూం గుహలు పది లక్షల
సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల
ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా
తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల
ఉనికి గురుంచి ప్రస్తావించినాడు. తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరూ
పట్టించుకోలేదు. 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్
నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం
ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి
రామస్వామిరెడ్డి, చలపతిరెడ్డి, మద్దులేటి
అనే ముగ్గురు స్థానికులు సహకరించినారు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు
విస్తరించి ఉన్నాయని వారు తెలియజేసినారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను
సందర్శించడానికి ప్రజలను అనుమతించుట జరిగినది.
అప్పటినుంచి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి
పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5
కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి
అనుకూలంగా దారి నిర్మించినారు.
తప్పక
సందర్శించవలసిన స్థలము. అసాంతమూ అనుభూతి ఆనందము కలిగించే పర్యాటక స్థలము.
మిత్రుడు మునయ్య పుత్రుడు రమేష్
బెలూం
గుహలను చూసుకొని తిన్నగా ప్రొద్దుటూరికి, జమ్మలమడుగును అంటనవసరము లేకుండా నేరుగా
ప్రొద్దుటూరు చేరే దారి పట్టినాము. ప్రొద్దుటూరు శివార్లకు చేరుతూనే చరవాణిలో పిలచినాడు
నన్ను రమేష్. ‘ప్రొద్దుటూరు పొలిమేరలు చేరినాము’ అని చెప్పినాను. నేను YMR Colony
మొదట్లో మీకొరకు వేచియుంటాను’ అని అన్నాడు. ఇంతకూ రమేష్ ఎవరో చెప్పలేదు కదూ!
రమేష్
నాసహాధ్యాయి సన్నిహిత మిత్రుడు ‘జానపద బ్రహ్మ’ బిరుదాంకితుడూ అగు కలిమిశెట్టి
మునయ్య కుమారుడు. బాల్యమునుండి అతను మధుర గాయకుడు. ఆయన తన సంగీతమునకు సానపట్టిన
తరువాత, వీరపనాయని పల్లెలో ఉపాధ్యాయవృత్తి చేపట్టిన తరువాత జానపద గీతాలపై మనసు
మళ్ళింది. అకుంఠిత దీక్షాదక్షుడై, అపర భాగీరథుడై, అవిశ్రాంత కృషీవలుడై, అధ్యయన
తత్పరుడై, అవిరళ కృషికుడై, రాయల సీమలోని పల్లెపల్లె తిరిగి వేలాది జానపద గీతములను,
కొన్ని బాణీలతో కొన్ని బాణీలు లేకుండా సేకరించి తానూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినాడు. ఆయన
ప్రదర్శన ఇచ్చివస్తూ ఎమ్మిగనూరు దాటిన తరువాత ఆయన, ఆయన సహచరులు ఉన్న, వాహనము ప్రమాదమునకు గురియై, దేశస్థాయిలో కీర్తి
పొందవలసినవాడు, కీర్తిశేషుడైనాడు. ఆయన పాట ఎంత రసప్లావితమై ఉంటుందో ఒకసారి వినండి.
అదికూడా రేనాటి సూర్యునిగా ప్రఖ్యాతి గాంచిన ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని’ గూర్చి
పాడిన పాట. ఆయనతో నేను తిరుపతి ‘భారతీయ స్టేట్ బేంక్ ప్రాంతీయ కార్యాలయము’లో పనిచేసే
రోజులలో మా DGM గారితో చేప్పి మునయ్య జానపద సంగీత విభావరిని ఏర్పాటుచేస్తే, జనముతో
కిటకిటలాడి పోయింది. RTC Bus Stand దగ్గరయినందువల్ల, బస్సుకై ఎదురు చూసే
ప్రయాణీకులంతా వచ్చి ఆసాంతమూ కార్యక్రమమును చూసిపోయినారు. వారిలో బస్సు మిస్సయిన
వారెంతమందో! ఆ కార్యక్రమములో రమేష్ కూడా ‘వదినెకు ఒక సారి’ పాట పాడి సభికులను
అలరించినాడు.
విషయానికి
వస్తే రమేష్ ను చేరిన వెంటనే తాను ముందుండి ఇంటికి పిలుచుకొని పోయి మమ్ము ఆదరించి
మా దంపతులకు చి. రమేష్ మరియు చి.కుం.సౌ. రజని మరియు పుత్రుడు శశాంక్
వస్త్రములిచ్చి సన్మానించినారు. వారి అభిమానమును జీవితములో మరువము. వారికి
మనఃపూర్వక ఆశీస్సులను తెలియజేస్తున్నాము.
మా ‘అమ్మవారిశాల’ దర్శనము
రమేష్
వద్ద శెలవు తీసుకొని ఆరోజుకు అమ్మవారిశాల చూసి విశ్రమించుదామని తలచి తేరును
అటువైపు మరల్చినాము. ప్రొద్దుటూరు అంటే అమ్మవారిశాల, అమ్మవారిశాల అంటే
ప్రొద్దుటూరు. జీవకళ ఉట్టిపడే అమ్మవారి విగ్రహము చూస్తేనిగ్రహము కోల్పోయి
నాలాన్తివసల్లు మానసికముగానైనా ఆతల్లి పాదాలపై పదితీరవలసిందే! అక్కడి వైశ్యులు తమ
అభివృద్ధికి ఆ తల్లే కారణమని త్రికరణ శుద్ధిగా నమ్ముతారు. అచట శ్రీ వాసవి
కన్యకాపరమేశ్వరి విగ్రహమేకాక శివ, అయ్యప్ప, శ్రీరామ, నవగ్రహ విగ్రహాలు కూడా
ఉన్నాయి. ప్రతి విగ్రహమునకు విడివిడిగా బ్రాహ్మణ అర్చకులు ఉన్నారు. అమ్మవారికి బంగారు
తేరుపై ఊరేగింపు జరుపుతారు. అనుకోకుండా అక్కడ నాకు తెలిసిన వ్యక్తి ఉన్డుతతో నన్ను
కంద్సువాతోనూ, అమ్మవారి Laminated Photo తోనూ సత్కరించినారు. అంతా ఆ
కన్యకాపరమేశ్వరి దయ. సంతృప్తిగా అమ్మ సందర్శనము ముగించుకొని నెలవు చేరుకొన్నాము.
తెల్లవారి నామిత్రుడు ఉమామహేశ్వరం యొక్క త్రైమాసిక తిథి. మేమిరువురమూ వారి గృహమునకు
చేవ్రుకోగా పిల్లవాళ్ళను, రామేశ్వరము, అగస్తీశ్వర దేవాలయము చూడ పనిచినాము. ఈ దిగువ
ప్రొద్దుటూరు ను గూర్చి నాకు తెలిసిన విషయములను మీకు అందజేయుచున్నాను. కడప
జిల్లాలోని అతి పురాతనమైన 4 ఉన్నత పాఠశాలలలో ఇది ఒకటి. మిగతావి కడప, నందలూరు,
పులివెందులలో ఉండేవి. నేను ఈ పురపాలక సంఘ పాఠశాలలో నా 1st form (అనగా 6th Class) చదువుకొన్నాను. మిగతా
చదువు జమ్మలమడుగు P R Board High School లో జరిగిపోయినది. (P R అంటే పతంగే రామన్న
గారు. పాఠశాలకు కొన్ని ఎకరాల భూమినిచ్చిన దాత. ఈ రోజు పాఠశాలలో ఆయన ఆనవాలు కానము.) మేము నెలవు చేరిన వెంటనే మా నాగాసుబ్బారెడ్డి కుమార్తె చి.కుం.సౌ. శిరీష వచ్చి పలుకరించి పడుకొనుటకు వలసినవి సమకూర్చి ఇంకా ఏమయినాకావాలా అని మరీమరీ అడిగి వెళ్ళింది. పరమేశ్వరుడు కలకాలము ఆమెను దీర్ఘసుమంగళిగా ఉంచుగాక!
ప్రొద్దుటూరు:
నా స్వస్థలము కడప జిల్లా. నా బాల్యమంతా ప్రొద్దుటూరు
జమ్మలమడుగులలో గడిచిపోయింది .
నాకు తెలిసిన నాలుగు మాటలు ఈ సందర్భముగా
ప్రోద్దుటూరును గూర్చి వ్రాయవలెననిపించినది. ప్రాంతీయాభిమాన మనుకోకుండా నాకు
తెలిసిన ఒక ప్రాంతాన్ని గూర్చి వ్రాస్తున్నానని భావించ ప్రార్థన .
శ్రీరామచంద్రుడు, రావణవధానంతరము, సీతా లక్ష్మణ హనుమంతులతో అయోధ్యకు పోతూ సూర్యోదయకాలానికి ఒక ప్రాంతములో
దిగవలసి వచ్చింది. సూర్యోదయ సమయములో దిగుట వలన ఆ
ప్రాంతానికి 'బ్రధ్న
పురి ' అన్న నామకరణము చేసినాడు. అచట శివుని ధనుస్సగు పినాకము బోలె వంపుసొంపుల సోయగాలతో ప్రవహిచే నది ఆయనకు
గోచరించుటవల్ల అక్కడ దిగవలసి
వచ్చింది. ఎందుకంటే స్నాన
సంధ్యానుష్ఠానములకు నదీ తీరము శ్రేష్ఠము . ఆ నదిని పినాకిని అంటారని ఆయన తెలుసు
కొన్నాడు. అసలు పినాకి అంటే శివుడు. శివుని భార్య శివాని అయినట్లు పినాకి భార్య
పినాకిని అవుతుంది. అంటే ఆ
తీర్థము గంగాదేవియొక్క ఒక పాయ అనేకదా. ఇక అంతకంటే ప్రశస్థమైన స్థలము వేరొకటుందని
తలచి రాములవారు అక్కడ దిగటము జరిగినది. నదీ స్నానానంతరము సంధ్యా వందనము ముగించి, బ్రాహ్మణుడైన రావణుని జంపుట వలన కలిగిన బ్రహ్మ
హత్యా పాతకమును తొలంగజేసుకొననెంచి శివార్చనకు
ప్రయత్నించగా అక్కడ శివలింగము ఆయనకు ఆ ప్రాంతములో కనిపించ లేదు. అందుకు ఆయన
సుముహుర్తము దాటక ముందే కాశీ నుండి ఒక శివలింగమును హనుమ తో తెమ్మని పురమాయించి, ఆయన ముహుర్త సమయము లోపల రాలేక పోయినందున తానే
ఇసుకతో లింగమును చేసి దానిని ప్రతిష్ఠించి శివార్చనము చేసి తన బ్రహ్మ హత్యా పాతకమును తొలగింప
జేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ లింగముపై వ్రేలిముద్రలు అగుపించుతాయి. దీనిని ముక్తి
రామేశ్వరమని దక్షిణ కాశి అని రామలింగేశ్వరమని కూడా అంటారు కానీ ఇప్పుడు మాత్రము
రామేశ్వరముగానే స్థిరపడిపొయినది. ఇది అక్కడి
స్థల పురాణము.
'బ్రధ్నము' ప్రకృతి 'ప్రొద్దు' వికృతి. అందువల్ల రానురానూ బ్రధ్నపురి
ప్రొద్దుటూరు అయినది. ఇది నదికి ఉత్తరముగా వున్నది. అందుకేనేమో ఆ పరమేశ్వర
కృపాకటాక్ష వీక్షణములకు గురియై ఐశ్వర్య వంతముగా, కరువు ప్రాంతమైన రాయలసీమలో, అలరారుచున్నది. ఆ పినాకినీ నదినే నేడు పెన్న
అంటారు. అసలు ఈ పెన్న 'పినాకినీ'
'పాపఘ్ని' నదుల సంగమము.
ఆ పినాకి గంగాతోనే వుండి ఆమెను
పినాకినిని చేస్తే మరి పరమేశ్వరినైన నా పరిస్థితి ఏమిటని అనుకొన్నదో ఏమో గోదావరి వద్ద గల పెనుగొండలో కన్యకగా
పుట్టిన పరమేశ్వరి ఈ వూరిలో 102 గోత్రముల ఆర్యవైశ్యులకు అష్టైశ్వర్యముల
గూర్చుచూ అమ్మవారిశాలలో అమరింది. అమ్మవారిశాల లో లభించే ప్రాచీన దస్తావేజుల
ప్రకారము అమ్మవారిశాల యొక్క చరిత్ర ఈ ప్రకారంగా వుంది.
పర్లపాడు వాస్తవ్యుడు, పడిగసాల గోత్రజుడు ఐన కామిశెట్టి చిన్నకొండయ్య
కు కలలో కన్యకా పరమేశ్వరి కనిపించి తనకు ఆలయము నిర్మించమని కోరుటతో మనమీరోజు ఈ
అమ్మవారిశాలను చూడగలుగుచున్నాము. ఆయన మద్రాసుకు పోయి వ్యాపారము అపారముగా చేసి
ఆర్జించిన ధనముతో ఆ పని చేయగలిగినాడు. ఆ తల్లి ఈ ఆర్యవైశ్యులకు అండయై ,కైదండయై, వసివాడని పూదండయై నేటికినీ ఈ పట్టణమున
విలసిల్లుతూవుంది.ఈ పట్టణములోని వైశ్యులు ఎంత బ్రాహ్మణ విశ్వాసపరులో అంతటి మానవతా
వాదులు. ఎందరో వేద శాస్త్రపండితులకే కాక సంస్కృతాంధ్ర భాషా పడితులనాదరించి వారికి నిలువనీడ ఏర్పరచి
తమ ఔన్నత్యము చాటుకొన్నారు. మహనీయులు లబ్ధ ప్రతిష్ఠులు అయిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ఎల్లమరాజు
శ్రీనివాసరావు గారు వీరి సత్కారములు ఆదరణ పొందిన వారే. వీరు ఎన్నో దశాబ్దములు కుల విచక్షణ లేకుండా విద్యార్థులకు భోజన వసతి
సౌఖర్యములు ఏర్పరచిన వదాన్యులు.
మే 19,1929 మహాత్మా గాంధి
ప్రొద్దుటూరుకు వచ్చి అమ్మవారిశాల వేంచేసి వైశ్య వర్గముచేత సన్మానించబడి, గౌరవముతో వారిచ్చిన 116 బంగారు
కాసులను (ఇప్పటి తూకములో 230 గ్రాములు ) గ్రహించి ప్రొద్దుటూరుకు 'బంగారు ప్రొద్దుటూరు' అన్న గౌరవ నామము నొసంగినారు. ఇక్కడ అమ్మవారు
కళామయి మరియు వాత్సల్యమయి. ఆ తల్లి కి ఆభరణాలు తొడుగులే కాక బంగారు రథము కూడా
వున్నది. ఈ ఊరిలో వైశ్యకుల పతాకమునెగురవేసిన వారిలో కొప్పరపు సుబ్బారావు గారు అగ్రగణ్యులు. వీరు ఈ ఊరి MLA గా కూడా ఎన్నుకోనబడియుండినారు.
ఇక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన 'అగస్తీశ్వర ఆలయము' ప్రసిద్ధ దేవాలయము. సరస్వతీపుత్ర శ్రీమాన్
పుట్టపర్తి నారాయణాచార్యులు వైష్ణవులై యుండి (వైష్ణవులు శివుని దర్శించనుగూడా
దర్శించరు) కూడా ప్రతిదినము శుచిగా అగస్తీశ్వరునికి ప్రదక్షిణములు గావించి స్వామి
ఎదురుగా వుండే చెట్టు క్రింద కూర్చొని అసమాన ప్రఖ్యాతి గాంచిన 'శివతాండవము'ను రచించినారు.
వీరినిగూర్చి ఒక సందర్భమున విశ్వనాధ'వారే "మిక్కుటముగా
మేము ఇరువురమూ సమానులమే
అయినా కొన్ని విషయాలలో వారు నాకన్నా మిన్న" అన్నారు. వేరు యేకవి పండితునికైనా
శిలావిగ్రహ మున్నదో లేదో నాకు తెలియదు గానీ వీరికి
మాత్రము ప్రొద్దుటూరు నడి బొడ్డున, ఏ రాజకీయ
నాయకుడు నోచుకోనంత, నిలువెత్తు విగ్రహమును ఏర్పాటు
చేసినారు.
ఇచట పెన్నా నది ఒడ్డున కొన్ని దశాబ్దముల
క్రితము కేరళ అయ్యప్పస్వామి దేవాలయ పోలికతో ఘనముగా కట్టించుటయే గాక , నిత్య పూజలు చేయుటకు
అచ్చటి అర్చకులను రప్పించి అకుంఠితముగా నిత్య పూజలు చేయ ఏర్పాటు చేసినారు. ఇచట
పెద్ద ఆంజనేయ దేవాలయము రామాలయము ఏర్పాతుచేసినారు. నదీతీరము కాబట్టి ఎంతో
శోభాయమానముగా ఉంటుంది. మహేశ్వర్ల సుబ్రహ్మణ్యం అన్న ఉభయ శాఖా ప్రయోక్త ఋక్ యజుర్
వేదములు), నాకు బాల్య మిత్రుడు, కీర్తి శేషుడు ఇక్కడ గాయత్రి దేవికి ఆలయము కట్టించినాడు.
అందరిచేత గౌరవింపబడే ఆ వేద పండితుడు నాలో ఏమి చూసినాడో మా దంపతులకు షడ్రసోపేత భోజనము
పెట్టి వస్త్రములనిచ్చి సన్మానించి యుండినాడు. ఆ మహానుభావునికి శిరసు వంచి
నమస్కరించుచున్నాను. ప్రొద్దుటూరు నందలి చెన్నచెన్నకేశవ స్వామి దేవాలయము ఎంతో పురాతనమయినది.
ఇక ఇక్కడ దోసె 50 రూపాయలు మొదలు 500 రూపాయల ధరల వరకూ దొరుకుతుంది. తినేవాళ్ళున్నారు.
ఇవన్నీ కాక అతి ముఖ్యమగు విషయము
ఒకటున్నది.
ఈ వూరు కవిపండిత నిలయము. శివభారత కర్త
అద్వితీయ జ్యోతిశ్శాస్త్ర మరియు సంస్కృత పండితుడు, అవధాని, మొదటి తెలుగు
ప్రపంచ సభకు వెళ్ళిన అవధాని పితామహ బిరుదాంకితుడు శ్రీ C.V. సుబ్బన్న గారి
గురువు 'బ్ర.శ్రీ.వే.గడియారం
వెంకట శేష శాస్త్రి గారు', రాణాప్రతాపచరిత్ర
వ్రాసిన దుర్భాక రాజశేఖర శతావధానిగారు, C.V. సుబ్బన్న
శతావధానిగారు , రాజన్న కవి గారు, నరాల రామిరెడ్డి గారు, గంటి కృష్ణవేణమ్మ గారు, అవధానం చంద్రశేఖర శర్మ గారు (ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మరియు అవధాని), బహు గ్రంథ కర్త శ్రీయుతులు Dr. ప్రభాకర
రెడ్డి గారు (children specialist) మొదలుగాగల విద్వచ్ఛిరోమణులను కన్నదీ గడ్డ. వేద
విద్వాంసులకు ఒక కాలములో కాణాచి. వేదమూర్తులు శతవర్ష జీవితులు కీ. శే. తిప్పాభట్ల వెంకటసుబ్బయ్య గారు వారు బ్రతికినంత
కాలమూ కొన్ని వందల వేదవిద్య చదువ వచ్చిన
పేద విద్యార్థులకు అందరికీ తనయింట భోజనము
పెట్టించి చదువు చెప్పి పంపినారు. వేదవిద్య వారివద్ద సాకల్యముగా నేర్చుకొన్న
శాకల్య సుబ్రహ్మణ్యంగారు, వెల్లాల వెంకట శేషయ్య గారు మిక్కిలి ప్రసిద్ధులు. నేడు
అట్టివారెవరూ లేక ఆ వూరు వెలవెల బోవుచున్నది.
ఇక్కడ ముఖ్యంగా ఒక్క మాట చెప్పుకోనవలె మాన్యులు A.K. ముని గారి
గురించి. పేరు అవధానం
కృష్ణముని. వారు చదివినది 8వ
తరగతి వరకు. గణితము,ఆంధ్రము, సంస్కృతము, ముఖ్యంగా ఆంగ్లములో అపారపాండితీ ప్రకాండుడు.
గాంధీ గారు కస్తూరిబాయి తో కలిసి, పైన తెల్పిన
సమయములో, ప్రొద్దుటూరు
వచ్చినపుడు బస చేసింది వీరి ఇంటిలోనే. వారి పాండిత్యమునకు గాంధీజీ అబ్బురపడినారట.
మదరాసు లోనే వారిని గూర్చి వినుతవల్ల వారి యింటిలో దిగినాడట. వీరికి 1. నవనవోన్మేష ప్రజ్ఞా ధురీణ 2కవి పండిత విమర్శకాగ్రేసర 3. ఆనంద కుమార
అనే బిరుదులుండేవి. నెహ్రు బ్రతికియున్న కాలములో ఆయన పుట్టిన రోజున అత్యంత
క్లుప్తముగా ఆయనను గూర్చి వ్రాసిన వారికి రూ.5,116 లు 'మద్రాసు
ప్రెస్ గిల్డ్ ( ఎవరు అన్నది నాకు ఇదమిధ్ధముగా తెలియదు.)వారు ప్రకటించితే ఆయన 'Nation's Exalted Hero Rules Us' అని వ్రాసి ఆ బహుమతిని పొందినారు. 1950 దశకములో ఆ
మొత్తము ఎంత పెద్దదో చదువరుల ఊహకు విడిచిపెట్టుచున్నాను. ఆయన కుమారుడు శ్రీయుతులు
పద్మశ్రీ A.S.రామన్(అవధానం
సీతా రామశాస్త్రి. )గారు ILLUSTRATED WEEKLY OF INDIA కు మొట్టమొదటి
సంపాదకుడు.
(ఈ పేరాలో కనబరచిన విషయాన్ని
నాకు అగ్రజతుల్యులైన నంద్యాల సుబ్బరామ శర్మ, ప్రొద్దటూరు,గారి
నుండి గ్రహించినాను.)
ఇంకొక విషయం. సాధారణంగా వైశ్యులలో
రాజకీయాలు యూనియన్లు మొదలగు వానికి ఆదరణ తక్కువ. అందుకు విరుద్ధముగా వల్లంకొండు సదానందీశ్వరయ్య గారు విద్యార్థి దశలోనే వామపక్ష
భావములకు ఆకర్షితుడగుటయే కాక SBI లో చేరి క్రొత్త యూనియన్ ఏర్పరచుటకు శ్రమించిన
వారి లో ముఖ్యుడై పిదప officer's association లో ప్రముఖ బాధ్యతలు నిర్వహించి ఆపై pensioner's association కు vice president గా తన
సేవలందించిన,ఇంకా,వయసు మీద పడుటవల్ల, సామాన్య సభ్యునిగా సేవలందించు చున్న ఈయన 1989 లో USSR ఆహ్వానము పై May Day Celebrations కు వెళ్ళి
వచ్చిన ఘనుడు.
స్థానం నరసింహారావు గారు ' మీరజాల గలడా' అన్న పాటను ఈ వూరిలో కృష్ణ తులాభారము నాటకము
వేయవచ్చి సాయంసమయములో మిత్రులతో వ్యాహ్యాళికి
వెళ్ళినపుడు పెన్నా నది ఒడ్డున వ్రాసినారని ఇక్కడివారు చెబుతారు. మొదటి సారిగా
ఆవూరి వేదిక పైననే పాడినారట.
చివరిగా ఇంకొక్క విశేషము చెప్పి చాలించుతాను. ఈ వూరికి ఇంకొక ముఖ్యమైన
ప్రత్యేకత వుంది. ఇక్కడ బంగారు వెండి ప్రత్తి నునెల వ్యాపారము అమితము. ఈ ఊరిని
గూర్చి తెలిసిన వారు దీనిని రెండవ బొంబాయిగా చెప్పుకొంటారు. ఇక్కడి వైశ్యులు ఒక
మానవ శృంఖలముగా నేర్పడి వ్యాపారములో ప్రపంచ ప్రసిద్ధులైన మార్వాడీలను ఈ వూరిలో
అడుగు పెట్టనివ్వలేదని అంటారు. ఇది నేటికినీ గమనించవచ్చు.
చలన చిత్రములలో చూపించు నటుల రీతిగా ఈ సీమలో కక్షలు కార్పణ్యాలు కుళ్ళు కుట్ర
ద్వేషము పగ లేవు. రెండు వర్గాల
మధ్య ఒక వేళ పగ వున్నా అది ఆయా వర్గ సభ్యుల మధ్యనే పరిమితము. నాకు స్వయానా
పిల్లనిచ్చిన మామ గారైనా శ్రీయుత నంగనూరిపల్లె క్రిష్టిపాటి వెంకట రామయ్య గారు
మంది మార్బలముతో వర్గము కలిగి యుండుటయే కాక తన విరోధుల చేత కూడా మన్నన పొందిన
వారు. ఆయన 45 సం. క్రితము సాధారణ మరణమే తప్ప వేరు విధముగా
పరమపదమునందలేదు.
సభ్యులు చాలా మందికి అక్కడి దేశకాల
పరిస్థితులు తెలియవని తలచి నాకు
చేతనైన రీతి లో విశధముగా వ్రాసినాను. తప్పక, తప్పని తలవరని
తలుస్తాను.
ప్రొద్దుటూరు గురించి నా మాటలలో ...
బంగరు వెండి వస్తువుల, బట్టల
గుట్టల, పత్తి, నూనెలన్
రంగుల నేత వస్త్రముల రంజగు దోశెల నాణ్యమందునన్
ఏగతి పోటి చేయనగు నేపురమైనను గాని పేటతో
చాగురె ప్రొద్దుటూరు గన చారు తరంబు
పురంబు లన్నిటన్
గంటి కృష్ణవేణి గరితను ఎరిగించె
కొరటమద్ది వారి గొప్ప తెలిపె
సుబ్బరావు గారి సౌజన్యమును పంచె
ప్రొద్దుటూరు గాదు ముద్దుటూరు
దుర్భాక జవ్వాది ధూప మాఘ్రాణింప
పృధివి నింపిన
యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృధివి నింపిన
యట్టి ప్రొద్దుటూరు
పుటపర్తి పేరుతో పునుగు తావులనెల్ల
పృధివి నింపిన
యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ వీచికల్
పృధివి నింపిన
యట్టి ప్రొద్దుటూరు
చంద్రశేఖర చందన చర్చితమ్ము
రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము
బరగ పేటగ జగతిన పరిచితమ్ము
మా ప్రొద్దుటూరు Tour ముగించుకొని తిరుపతికి బయలుదెరినాము. ఆ అనుభవము మరొకరోజు .......
కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట
ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరముగా ప్రసిద్ధి చెందినది.
ఈ పురము లో భూమిని ఎక్కడ త్రవ్వినా కూడా గడ్డ పారకు రాయి తగులుతుందంటారు. అందుకే
ఏక శిలానగరమన్న పేరు వచ్చిందేమో. లేక ఒకే శిలలో రామ లక్ష్మణ సీతా విగ్రహాలు
ఉన్నందువల్ల ఈ పేరు వచ్చియుండవచ్చు. ఒంటడు మిట్టడు అన్న
దొంగలు రామ భక్తులైనందువల్ల వచ్చినది
అని కూడా అంటారు. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ
రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం
ఒకటి" అని కీర్తించినాడు. ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీ యాత్ర అన్న గ్రంథములో
కాశీయాత్రలో భాగంగా మజిలీలైన హత్యరాల నుండి భాకరాపేట వెళ్ళే మార్గ మధ్యమున
ఒంటిమిట్ట వున్నదని తెలిపినారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు
తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గు ప్రక్కల కొండలు కలిగిన భారీ
చెరువున్నదని ఆ చెరువు యొక్క ఒకవైపు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగేది అని
తెలిపినారు. ఆ అనుభవము నా వయసు వారందరికీ కూడా వుంటుంది. ఒంటిమిట్టలో చూడచక్కనైన
గుళ్ళు ఉన్నాయన్నారు
ఇక్కడి గుడిలోని ఏకశిలా విగ్రహము
జాంబవంతుని ప్రతిష్ఠ అని చెబుతారు. ఇక్కడ . ఒకే శిల లో శ్రీరామ సీతా
లక్ష్మణ విగ్రహాలున్నాయని మనము ముందుగానే చెప్పుకున్నాము.. ఈ విగ్రహాలతో ఆంజనేయుడు
వుండడు. ఆంజనేయుడు లేని రామాలయము దేశములో ఇది ఒక్కటే యని చెబుతారు.ఈ దేవాలయంలో
శ్రీరామ తీర్ధము ఉన్నది . సీత కోరికపై శ్రీ రాముడు బాణంతో పాతాళ గంగను పైకి
తెచ్చినట్లు స్థల పురాణం. ఇది మిక్కిలి అపురూపమైన
విషయము. పోతన ఇక్కడి వాడనుటకు అనేకమైన చారిత్రక ఆధారములు ఉన్నవి.
ఆయన పూర్వీకులు మాత్రము బమ్మెర
నుండి వచ్చిన వారే! కానీ నేను ఆ విషయముల జోలికి పోవుట లేదు. ఎందువలన అంటే ఆయన
ఆంధ్రులందరికీ ప్రాతః స్మరణీయుడు. నాటి ముస్లిం పాలకుల అరాచకములను ముఖ్యముగా
ఆడువారిని విచాక్షణా రహితముగా చెరచుటను అడ్డగించలేక తమకు అనుకూలమైన ప్రాంతములకు వలస
వెళ్ళినారు నాటి తెలఘాణ్యులు. ఆ కాలములో వారికి కడప మొదలయిన ప్రాంతములతో ఎన్నో
విధములుగా అనుబంధములుండేవి. అందుకే బమ్మెర, సనగరము, ఓరుగల్లు
ఇత్యాది ప్రాంతముల నుండి ముఖ్యముగా కడప మండలములోని ఒంటిమిట్ట ప్రాంతమునకు
వచ్చినారు . వారి వంశజులు నేటికినీ ఆ ఊర్ల పేర్లనే తమ ఇంటి పేర్లను చేసుకొని
అక్కడున్నారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజములలో ఒకడైన అయ్యలరాజు రామభద్రకవి
స్వస్థలము ఒంటిమిట్టయే! ఆయన రచించిన రామాభ్యుదయము సాహిత్య పరిజ్ఞాని ఎవరయినా
చదివితీరవలసిన పుస్తకము. వారి తాతగారు కూడా ఒంటిమిట్ట కోదండరామ శతకమును బ్రరచించినారు.
ఆ శతకములోని ‘ధగ ధగ మెరయు కిరీటము’ అన్న పద్యమును మా తండ్రిగారు ఎపుడూ చేబుతూవుండేవారు.
ఆ పద్యము పూర్తి పాఠము దిగువన చదువగలరు.
నిగ
నిగ మెరయు కిరీటము
ధగ
ధగ మను పట్టుదట్టి దగిన కటారున్
భుగ
భుగ వాసన నీకే
తగు
తగు రా! ఒంటిమిట్ట దశరథ రామా!
వేరొక విషయము ఏమిటంటే ఉర్దూ భాష తెలఘాణ్యమును ప్రవేశించక ముందు అక్కడి భాషకు కడప ప్రాంతపు
భాషకు ఎంతో సారూప్యముండేది. జాగ్రత్తగా పరిశీలించితే యాస లోనూ భాష లోనూ పోలికలు
గుర్తిచ వచ్చును. సోమన పెంచికలదిన్నె లేక బుక్కపట్నమన్న నామాంతరము గలిగి
బుక్కరాయలచేత బహూకరింపబడిన ప్రాంతము వాడు. ప్రౌఢ దేవరాయలు కూడా ఆయనకు తరిమేల్ల
దిన్నె అగ్రహారమును బహూకరించినాడు. పోతన ప్రౌఢ వయస్కునిగా ఉన్న కాలములో సోమన
పండుముసలియై వుండియుంటాడు. ఒకే ప్రాంతము వారు కాబట్టి, మరియు నాచన సోమన యొక్క
ఉత్తర హరివంశము మిగుల ప్రశస్తత నందియుండుట చేతనూ, పోతన సోమన దర్శనము చేసుకొని ఆయన
కవిత్వమును సమీక్షించి యుండుటకు మిక్కిలి అవకాశములు కనబడుచున్నవి.
ఒంటిమిట్టను గూర్చి
మాట్లాడుతూ వావిలికొలను సుబ్బారావు గారిని గూర్చి తలంచక పోవుట మహా పాపము. అందుకే
విధిగా వారిని గూర్చి నాలుగు మాటలు మనవి చేస్తాను. విస్తారముగా వారిగూర్చి నేను
వ్రాసిన ‘సరసరస’ అన్న పుస్తకములోని మా
కడపజిల్లా లేక రాయలసీమలో కడప జిల్లా అన్న వ్యాసములో విస్తారముగా వ్రాసినాను.
వావిలికొలను సుబ్బారావు
గారు:
ఇక్కడ ఒంటిమిట్ట
కోదండరామునికి జీవితమును అంకితము చేసి, వాసుదాసు అనబడు అన్వర్థ నామధేయుడైన శ్రీయుతులు వావిలి కొలను
సుబ్బారావు గారిని గూర్చి నేను
తెలుపకపోతే నేను తెలిపినది అసమగ్రము అసంపూర్ణము అవుతుంది. అంతకు మించి అన్యాయము
చేసిన వాడినై శ్రీమద్ ఒంటిమిట్ట కోదండ రాముని ముందు దోషిగా నిలువ వలసి వస్తుంది.
అందుకే వారిని గూర్చి కొంత వివరముగా తెలుపుకొనుచున్నాను. నేటి తరము వారయిన యువతకు, కడప లోనే, అధిక
శాతమునకు తెలియదు. ఇక వేరు ప్రాంతముల వారికి ఏమి తెలిసియుంటుంది. పరమభక్తుడగు
రామదాసు వలె కూడా ఈయన ప్రభుత్వపు సొమ్ము దేవాలయ, విగ్రహాభూషణ
విషయములకు ఉపయోగించక టెంకాయ చిప్ప పట్టుకొని ధన యాచనకు గడంగిన మహనీయుడు. యాచన
ముగిసిన పిదప ఆ డబ్బును అణా పైసలతో స్వామివారి కైంకర్యమునకే వినియోగించి ఆ టెంకాయ
చిప్పను స్వామికే అర్పించిన మహాత్ముడు ఆయన. పోతన ఒంటిమిట్టవాడు అని
తెలుపుటకు అహరహము శ్రమించిన మహానుభావుడు. అసలు బమ్మెర అన్న పేరు తెలంగాణాకు
చెందుతుందో ‘వావిలికొలను’ అన్న వూరు కూడా
తెలంగాణాకు సంబంధించినదే! ఆయన కొంచెము కూడా క్రొత్త పుంతలు త్రొక్కక ‘వాల్మీకి రామాయణము’ను నిర్వచన రూపములో
ప్రతి వెయ్యి పద్యముల తరువాత వాల్మీకి వలె, 24 బీజాక్షరములను ప్రక్షిప్తము చేసిన
భక్తి వారిధి. ఒంటిమిట్టలో చిన్న గుట్టపై ఆయన కుటీరము. కేవలము కౌపీనముతో కాలసము
గడిపిన మహానుభావుడు ఆయన.
ఈ సందర్భములో వారు పద్య రూపములో టెంకాయ చిప్పకు తమ కృతజ్ఞత
తెలుపుకొన్న వైనము మీకు తప్పక తెలిపి తీర వలసినది.
ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి
రూప్యములు వేన వేలుగ ప్రోగు చేసి
దమ్మిడైనను
వాని లోదాచుకొనక
ధరణిజాపతి
కర్పించి ధన్యవైతి
కర్మ గుణపణముల
కుప్ప ! టెంకాయ చిప్ప! "
ఆయన ధాతునామసంవత్సరము, శ్రవణ
శుద్ధ చతుర్ధశి, శని వారము 1-1-1936 సంవత్సరము తమ 73 ఏట పరమపదమలంకరించినారు.
నా మనసులో కళుక్కుమన్న ఒక విషయమును మీతో
పంచుకొంటున్నాను. ఆంజనేయుని విగ్రహము లేదని కొంతకాలము క్రితము రామాలయమునకు ఎదురుగా
ఆలయాదికారులు గుడికట్టి విగ్రహమును ప్రతిష్ఠించినారు. కారణము ఆయన కోరిన వరాలిచ్చే
కొంగుబంగారమై యుండవచ్చు. కానీ ప్రపంచములో జాంబవంతునిచే ప్రతిష్ఠింపబడిన ఏకైక రామలక్ష్మణ
సీతా విగ్రహమని చెప్పబడుచున్న దేవాలయము కలిగిన ఒంటిమిట్టలో ప్రత్యేకముగా
జాంబవంతునికి గుడి కట్టించే ఆలోచన ఆయనకు ఆంజనేయునికున్న ప్రాచుర్యము లేదనుకొన్నారేమో! ఏది ఏమయినా తిరుపతి తిరుమల దేవస్థానమువారు ఈ పురాతన
క్షేత్రమును దత్తత తీసుకొన్న తరువాత అది ఎంతో అభివృద్ధికి నోచుకొనింది. ఈ పట్టుదల
కొనసాగితే ఒంటిమిట్ట ఎనలేని ప్రాచుర్యమును సంతరించుకొనగలదు.
తిరిగీ విషయానికి వస్తే ఆ దశరథ రాముని
దర్శనము చేసుకొని తిన్నగా తేరును (Car) తిరుపతికి వెళ్ళే దారిలోనే 20కి.మీ.
దూరములోనున్న నందలూరి వైపు మరలించినాము.
మేము నందలూరు
చేరుసమయానికి రాత్రి 8 గంటలు అయినది. త్వరత్వరగా నడిచి దేవాలయ ప్రాంగణములో నున్న
కొళాయి వద్ద ముఖ, పాద ప్రక్షాళనము చేసుకొని, ప్రతిగుడిలో మెట్లు ఎక్కినట్లే
మెట్లెక్కి స్వామి దర్శనము సంతృప్తిగా చేసుకొని తిరుపతి చేరుటకు కారు వద్దకు
నడచినాము.
నందలూరు:
ఎంతో ప్రాభవము
కలిగి యుండి ఇప్పుడు నామావశిష్టమైన ఈ వూరికి పెద్ద చరిత్రే వున్నది. ఈ గ్రామానికి
పూర్వం తొండమండలం, నిరంతపురం, చొక్కనాథపురం అనే
పేర్లు ఉండేవి అని తెలియ వస్తూ వున్నది.
మొదట నిరంతపురము అన్న పేరుతో వున్న ఊరు, ఊరిని ఆనుకొనియున్న బాహుదా నది వెల్లువలో
కొట్టుకుపోగా దానిని ‘నళ మహారాజు’ అన్న రాజ పుంగవుడు
కట్టించుటచే ఈ ఊరికి నళందలూరు అన్న పేరు
వచ్చిందని మాతండ్రిగారగు చెరుకు వెంకప్పగారు చెప్పేవారు. ఇది మా తండ్రివరకు, మా
పూర్వీకుల సొంత ఊరు. నాకు ప్రొద్దుటూరు జమ్మలమడుగులే సొంత ఊర్లు.
నలంద మహారాజు నలందలూరు అనే పేరుతో తిరిగి
గ్రామాన్ని నిర్మించినట్టు మెకంజీ కైఫీయత్లో పేర్కొనబడినట్లు కూడా
చెప్పబడుచున్నది. ఈప్రాంతములో మరియొక ఐతిహ్యము కూడా వినవచ్చుచున్నది. పూర్వము ఈ
ప్రాంతమును పాలించిన ఒక తెలుగు చోడ
ప్రభువు గోహత్య పాప నివారణార్థము, బాహుదానదీ తీరము వెంబడి 108
శివాలయములను నంది విగ్రహములను చక్కగా చెక్కించి శివలింగముల ముందు ఉంచుటచే ఈ వూరికి
'నందుల ఊరు' అన్న నామము ఏర్పదినదనీ
కాలాంతరములో అదే నందలూరయినదనీ అంటారు.
నందలూరులో
సౌమ్యనాథ స్వామి ఆలయము ప్రధానమైనది మరియుపురాతనమైనది మరియు పురాణ ప్రసిద్ధమైనది.
సౌమ్యనాథుని నారదముని ప్రతిష్ఠించినాడని ప్రతీతి.
11వ శతాబ్దంలో చోళవంశరాజులచే
స్వామికి ఆలయమునిర్మించబడినట్లుతెలియవస్తూ వున్నది. స్వామికి, సంతాన సౌమ్యనాథుడని, చొక్కనాతుదనీ పేర్లు ఉన్నట్లు
తెలియవస్తూ వున్నది. ఈ దేవాలయము ఎనిమిది
ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి
ప్రతీకగా నిలచినది. 11వ శతాబ్దపు పూర్వార్థంలో, ఈ ఆలయమును చోళరాజులు నిర్మించి స్వామివారికి 120
ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి
చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు
దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి శ్రీవారి
ఆలయ ప్రాభావమును ఇనుమడింపజేసినారు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు,
ఆడపూరు, మందరం, మన్నూరు,
హస్త వరం అన్న అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు
ఉన్నాయి. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోందని వినికిడి. అన్నమయ్య
జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ
ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించినారు. ఆలయ కుడ్యాలపై, ఈ
ఆలయము వివిధ వంశపు రాజుల పాలనలో ఆయా రాజుల సమాశ్రితముగా ఉన్నట్లు సంకేతాలుగా మత్య్స, సింహ,
అర్థచంద్రాకారపు చిహ్నాలున్నాయి. తమిళ శాసనాలు అధికంగా ఉండగా,
తెలుగు శాసనాలు కొన్నిమాత్రమే ఉన్నాయి. దేవాలయాల కట్టడమునకు,
వాణి అభివ్రోద్ధికి తమిళ రాజులు పెట్టినది పేరు కదా! దేవస్థానంలో
గోడలపైన కాకుండా నిలువు బండలపై 11వ శతాబ్దం నుండి విజయనగర పాలన
వరకు ముఖ్యమైన అనేక వివరాలతో 54 శాసనాలు ఉన్నాయి.
మనసులోని
కోర్కెతో స్వామికి మ్రొక్కుకొని ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు,
శక్తి యున్నవారు 108 ప్రదక్షిణలుచేస్తే,
మ్రొక్కునెరవేరుతుందని భక్తుల నమ్మకము. ఆలయానికి జిల్లా నలుమూలల
నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి
గూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు. ఇచట ప్రతి సంవత్సరము ఆషాఢమాసములో
బ్రహ్మోత్సవములను ఘనముగా జరుపుతారు. ఆద్నిక కాలములో దేశాన్తరవాసాభిలాషులకు వీసాలను
అనుగ్రహించే స్వామిగా పెరుబొంది, వీసాల సౌమ్యనాథునిగా
ప్రసిద్ధిచెందినాడు.
కామాక్షీ దేవి
సమేత ఉల్లంఘేశ్వర ఆలయము సౌమ్యనాథ
ఆలయమునకు అతి దగ్గరగా ఉన్నది. కూడా
పురాతనమైనది. ఇది శివాలయము. ఇది 10 శతాబ్దములో నిర్మించబడిన ఆలయము. ఇప్పుడు ఆ
ఆలయముయోక్క పునర్నిర్మాణము జరుగుచున్నది. భక్తులకు
ప్రవేశము లేదు.
మా తండ్రిగారు తమ బాల్యమున అంటే 8 సంవత్సరముల వయసులో, ఈ గుడిలో అర్చకులుగా
వుండినారు.
నందలూరిని గురించి యాత్రాచరిత్రకారుడగు ఏనుగుల
వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేసినారు. వారి రచన ద్వారా
ఈ ప్రదేశము, 1830నాటికి పుణ్యక్షేత్రముగా పేరొందియుండినది. వారు ఈగ్రామాన్ని
గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యేరనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. అంటే
సాధారణ నడువరికి ఈనదిని దాటుటకు ఒక ఘడియ
అనగా ఇంచుమించు 24 నిముసముల కాలము పట్టెది అని అర్థము. ఈ నదికి ఇరుపక్కల
గుళ్ళున్నవని, పరశురాముని మాతృనివర్తనా(హత్య చేసిన) స్థలముగా
ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఈ నదిలో తన చేతులు ముంచుటచే పరశురామునికి తిరిగీ
బాహువులు వచ్చినవని స్థానికులూ స్థల పురాణాలు చెబుతూ వున్నాయి.
ఈ గ్రామం
ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది.
ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట కింద సొరంగ మార్గముంది.
నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. సిద్ధవటం కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య
మార్గముందంటారు. ఈ విషయములో నా అనుభవమును గూర్చి నేను వ్రాసిన ‘సరసరస’ వ్యాస సంపుటిలో
తెలియజేసినాను. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ
విహారం, కొన్ని కట్టడాలు, 1600 పైగా
సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికినాయి. ప్రసిద్ధ
శైవ క్షేత్రమైన హత్యరాల నందలూరికి 14 కిలోమీటర్ల దూరము. ఇచ్చట శంకరుడు స్వయంభూ
మూర్తి. కామాక్షీ సమేతుడై వెలసినాడు. కార్తీకమాసము లోనూ శివరాత్రినాడూ ఇసుక వేసినా
రాలనంత భక్తజ సమ్మర్ధము కలిగియుంటుంది.
నందలూరిని
గూర్చి మా తండ్రిగారివద్దనుండి విన్న కొన్ని ప్రత్యేకతలు తెలియజేస్తాను. ఒకానొక
కాలములో ఇది అగ్రహారము. స్మార్త వైష్ణవులు ఇరువురూ ఎంతో వద్దికగా ఉండేవారు. ఈ ఊరు
అధికముగా ICS అధికారులను అందించింది. ఆ ఊరికి తాలూకాయైన రాజంపేటనుండి ఆరోజులలో
లేరు. కడప జిల్లాకు చెందిన పులివెందులకు చెందిన ఎద్దలయ్య గారి కొత్తపల్లి నుండి
కూడా ఎక్కువ మంది ICS అధికారులైనారు. నందలూరులో మునిసిఫ్ కోర్టు వుండేది. ఆ వూరికి
తాలూకాయైన రాజంపేటలో ఉండేది కాదు. నందలూరులో ఉన్నత పాఠశాల వుండేది, రాజంపేటలో
ఉండేదికాదు. ఆకాలములో ముంబాయి నుండి చెన్నపట్టనమునకు నడచే ప్రతి రైలూ నందలూరిలో
ఆగేది. రాజంపేటలో ఆగేది కాదు. నందలూరు రైల్వే స్టేషను బొగ్గు నీరు రైలు బండ్లకు సమకూర్చేది.
ఆ వసతి రాజంపేటలో ఉండేది కాదు. అసలు రైల్వే ఉద్యోగులలో ఎక్కువమంది తమిళులు ఇక్కడ
ఉద్యోగులై ఉండుట మూలమున తమకొక నెలవునేర్పాటు చేసుకొని ‘అరవ పల్లె’ అన్న పేరుతో రైల్వే
స్టేషనుకు దగ్గరగా ఉండిపొయినారు.
ముస్లీముల తాకిడితో అక్కడి వైష్ణవులు
ఎక్కువగా తిరుపతి వలస పోగా స్మార్తులు కడప జేరినారు. అన్యకులస్తులు వ్యవసాయమును
నమ్మినవారై ఎక్కడికీ కదలకుండా ఉండిపోగలిగినారు. స్థానికులు ఎవరూ తగిన శ్రద్ధ
తీసుకొనక ఆ ప్రసిద్ధ ప్రాంతము, క్షేత్రము ‘నానాటికి తీసికట్టు
నాగంభాట్టూ’ అన్నట్లు
అశ్రద్ధకు ప్రతీకగా నిలచింది.
ఇది నాకు
తెలిసిన నందలూరు చరిత్ర.
నా తీర్థ యాత్ర సర్వ విధములా సంపన్నము చేయుటకు దోహదపడిన ఇరువురు వ్యక్తులను గూచి చెప్పక పోతే నేను పాపము చెసినవాడనౌతాను. వారిని గూర్చి దయతో ఒకసారి చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగము నకు చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును దక్షిణ కాశీగా వర్ణించిన చారిత్రక ప్రస్తావన కానవస్తుంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించినట్లు చరిత్ర ద్వారా మనకు తెలియవస్తూవున్నది.
కారును తిరుపతిలో
‘భీమాస్ పారడైస్’ అన్న హోటలులో
పిల్లవాళ్ళు ఫలహారము చేయగా మేము అరటి పళ్ళతో కడుపు నింపుకొని విడిది చేరినాము. ఇక్కడ కొంత నేను కృతజ్ఞత
తెలుపుకోవలసిన వ్యక్తులగూర్చి చెప్పవలసిన బాధ్యత నాకున్నది. తప్పక చదువుట
విడువకండి.
1971 నవంబరు
2వ తేదీ నేను జీవితములో మరువలేని రోజు. ఉద్యోగము రాకుండానే పెళ్ళిచేసుకొన్న నాకు ఆ
తరువాత 2సంవత్సరములకు ఉద్యోగమొచ్చింది. అదీ ‘భరత రాష్ట్ర వార్దుషి’ (STATE BANK OF INDIA) లో. అదీ నేను S.S.L.C. దాకా చదువుకొన్న జమ్మలమడుగులో. ఆ
వార్దుషీ భవనములోనికి నాతోబాటు అడుగు లోనికి వేసిన వ్యక్తి రామకృష్ణా రెడ్డి. ఆ
ముహూర్త బలమేమో కానీ మాయిరువురిదీ విడదీయరాని బంధమే! సుఖాలు పంచుకోన్నామో లేదో
కానీ కష్టాలనైతే కలసి పంచుకొన్నాము. అంతటి ప్రగాఢ స్నేహితము మాది. ఆయన కూదా
నామాదిరే పెళ్లి అయిన తరువాత ఉద్యోగములో చేరినాడు. ఆయన శ్రీమతి చి.కుం.సౌ.
నాగేశ్వరమ్మ నన్ను ఇప్పటికీ ఒక స్వంత తోబుట్టువుగానే చూసుకొంటుంది. కాలాంతరములో వారికి
మహేశ్ మరియు వేణు అను ఇద్దరు మొగపిల్లవాళ్ళు కలిగినారు. చిన్నవాడు హైదరాబాదులో
పెద్ద డాక్టరు. పెద్దవాడు గణితములో స్నాతకోత్తర పట్టా పుచ్చుకొని, Shipping Corporation
Of India ఉద్యోగము వదులుకొని,
సతీసమేతముగా అంటే ఇరువురూ B.Ed.
ఉపాధ్యాయులై స్థిరపడినారు. ఇద్దరు కుమారులూ నిరహంకారానికి, నిబద్ధతకు మారుపేర్లు.
మహేశ్ దంపతులు తమ కుమారుని తిరుపతి కాలేజి హాస్టల్ లో ఉంచి చదివిస్తూన్నా
వారాంతములో కుమారునితో గడుపుటకు వీలుగా ఇల్లు తీసుకొన్నారు. నా యాత్రలో భాగమైన
తిరుమల శ్రీనివాస
దర్శనము నాకు ముఖ్యము. కానీ దిగే వసతి నేనెంత ప్రయత్నించినా దొరకలేదు. చరవాణి లో
మాట్లాడుతూ మహేశ్ కు ప్రాణస్నేహితుడు, నా మిత్రుడు మునయ్య కుమారుడూ అయిన రమేశ్ మన
మహేశ్ ఇల్లు ఉన్నదికదా గురువుగారూ అని గుర్తు చేసినాడు. వెంటనే మహేశ్ కు నేను ఫోనే
చేయడమూ తాను నిస్సంకోచముగా దిగవచ్చునని చెప్పడమూ జరిగిపోయింది. నా శ్రీమతి క్రింద
పడుకోలేదు. చిక్కు అక్కడ వచ్చింది. ఆరోజుకు ఎక్కడా ఒకవేళ మంచము దొరకకుంటే కొని
అయినా సిద్ధము చేస్తాను మీరు వేరెక్కడా దిగనవసరము లేదని మాకు కచ్చితముగా చెప్పి ఆ
ప్రకారమే చేయుట చేత నాపైనున్న పెద్ద సమస్య తీరింది. పరమాత్ముడు కలకాలము మా
రామకృష్ణా రెడ్డి కుటుంబమును చల్లగా కాపాడుగాక అని తలచి శ్రీనివాసునికి
నమస్కరించుచున్నాను.
మేము మహేశ్ నివాసము
చేరినాము. అంతవరకూ నేనూ నాశ్రీమతి మేము దర్శించిన ప్రతి దేవాలయము మెట్లు మా
ముగ్గురు పిల్లల సహకారముతో ఎక్కి దిగి అలసి సొలసి పులిసి నెలవు చేరితే అది రెండవ
అంతస్తులో ఉంది. తిరుమల కొండ ఎక్కుతున్నట్లుగా భావించి ఆ వేంకటేశుని తలచుకొంటూ
ఎక్కినాము. ఎంతగా నిదురపోయినామంటే బాగా తెల్లవారే వరకూ అసలు మెలకువే లేదు.
తరువాత మా శ్రీకాళహస్తి
యాత్ర......
ఆరోజు కార్తీక పౌర్ణమి.
మేము పోవలసినది శ్రీకాళహస్తి క్షేత్రమునకు. స్వామీ అమ్మవార్ల దర్శనము మావంటి
వృద్ధులకు సాధ్యపడుతుందా అన్నవిషయము మీకు విస్మయము కలిగించక మానదు. కానీ మాకు ఆ
జ్ఞాన ప్రసూనాంబిక శ్రీకాళహస్తీశ్వరుని దర్శనము ఏమాత్రము కష్టము లేకుండా ఎంతో
దివ్యముగా చేయించిన నా ప్రియమిత్రుడు శ్రీనాథ్ బాబు ఆయన తమ్ముడు మనోహర్ గోపాల్ గార్లను
తలచుకోకుండా నేను ఈ రచనలో అడుగు ముందుకు వేస్తే ఆత్మవంచనే ఔతుంది. కావున వారి
మంచితనాన్ని మీముందుంచి ముందుకు కదులుతాను.
నేను జమ్మలమడుగు SBI
శాఖలో గుమస్తాగా పనిచేసే కాలములో బాబు అచటికి కోశాధికారిగా(Head Cashier) రావటము జరిగింది. మైత్రి అన్న మాటకు నా మనసులోని అర్థము వేరు. అందుకే
అందరినీ స్నేహితులని చెప్పుకోను. కానీ శ్రీనాథ్ బాబు వంటి ఒక సరళ సహృదయునితో
సహవాసమును సమకూర్చుట దేవుని దయగా భావించుతూ ఉన్నాను. ఆయన అప్పటికే ఆఫీసరు కాబట్టి
2 సంవత్సరములౌతూనే బదిలీ అయినాడు. కలిసి మెలిసి పనిచేసినది కొద్దికాలమే అయినా ఇరువురమూ
ఒకరినొకరు మరువనే లేదు. మేము తిరిగీ కొంతకాలము మా ప్రాంతీయ కార్యాలయము తిరుపతిలో
కలిసి పని చేసినాము. తిరిగీ 25 సంవత్సరముల తరువాత, మా పునస్సమాగమము పదవీ విరమణ
చేసిన తరువాత ఆస్యగ్రంధి మూలముగా జరిగినది. అప్పటినుండి చరవాని మూలముగా
మాట్లాడుకొంటూనే ఉంటాము. బాబు స్వస్థలము కాళహస్తి అన్నది నాకు తెలుసు. అందువల్ల, స్వామి
దర్శనమునకు సహకరించగలడన్న ఆశ చిగురించి అడిగినాను. మాటలలో ఆరోజు కార్తీక పౌర్ణమి
అని చెప్పినాను. బంతిని గోడకు కొడితే వెంటనే వెనుకకు వచ్చినట్లు నాకు తాను
అభయహస్తమిచ్చినాడు. మేము ఎంతమందిమీ వస్తూవున్నామని అడిగినాడు. 5మందిమి అని
చెప్పినాను. అక్కడ మనోహర్ గోపాల్ అని నాతమ్ముడు ఉన్నాడు. మీకు అన్నివిధాలా
సహకరించి చక్కగా దర్శనము చేయించుతాడు అని మేము యాత్రలకు బుయలుదేరే ముందే మాట ఇచ్చి
మనసు తేలిక జేసినాడు. మేము బయలు దేరేదానికి ముందురోజు మా కార్యక్రమమును గూర్చి వివరముగా
విస్తారముగా అడిగితెలుసుకొని, మా తమ్ముడు ఇప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడుతాడు అని
చెప్పి చరవాణిని ఆపినాడు. అన్నట్లుగా వెంటనే ఆయన తమ్ముడు నాకు ఫోన్ చేసినాడు. ఆయన,
నేను ఆరోజు అరుణాచలము లో ఉంటాను కానీ మీకు కాళహస్తిలో బస, కారు ఉంచుకొనే దానికి
స్థలము, tiffen అన్నీ ఏర్పాటుచేస్తాను అని ఆశ్వాసనమిచ్చినాడు. ఆ అన్నదమ్ముల
అనుబంధము అటువంటిది. ఇంతా అన్నాడేకానీ ఆయన అరుణాచలము గిరిప్రదక్షినము ముగించుకొని
తెల్లవారు ఝాముకే కాళహస్తి చేరుకొన్నాడు. తెల్లవార్లూ మెలుకొనికూడా ‘బయలుదేరినారా’ అని మొదట ఆయనే ఫోన్
చేసినాడు. ఆయన అసలు నాకన్నా ఒకసంవత్సరము పెద్దవాడు. నేను ఇంకా ఒక గంట ఆలస్యమౌతుంది
అన్నాను. మీరు ఎప్పుడు వచ్చినా No Problem అన్నది ఆయన జవాబు.
ఎట్లయితేనేమి మేము కాళహస్తి చేరి ఆయన చెప్పిన Lodge వద్దకు చేరుటకు, అత్యధిక జనసమ్మర్దము
ఉండుటచే బాగా ఆలస్యమైనది. మొదట మాకు కాఫీ ఏర్పాటు చేయించి తరువాత ఇద్దరు మనుషులను
మాకు తోడుగా పంపుతూ అంతా వారు చూసుకొంటారు అని చెప్పినాడు. అన్నట్లే అంత
కిటకిటలాడే భక్త సందోహములో మాకు ఏవిధమగు కష్టము లేకుండా అమ్మవారిని, స్వామిని అత్యంత సంతృప్తికరమైన దర్శనము చేయించినారు.
అదికాక మా ఇరువురికీ వేదపండితులచే ఆశీర్వదింపజేసి, మాకు సెల్లా, రవికె బట్టలు
ఇప్పించి మనసుకు ఎనలేని ఆనందమును సమకూర్చినారు. మాతో వచ్చిన ఇద్దరిపెర్లు
గుర్తులేకున్నా వారిని జీవితాంతమూ మరువము, ఇక వారిని పంపిన మనోహర్ గారిని, మరియు తమ్మునికి
ఈ పనిని ఒప్పజేప్పిన శ్రీనాథ్ బాబును నేను బ్రతికినంతకాలమూ మరువను.
శ్రీకాళహస్తి
సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు
ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ
లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ
క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ
కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.
ఇక్కడ ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు
ఉన్నాయి. ఈ లింగమును ప్రాణము గల శివలింగముగా భక్తులు విశ్వసించుతారు. కారణము
ఏమిటంటే గర్భగుడిలోని ఇతర దీపములు నిశ్చలముగా ఉన్నా శివలింగము ఎదుటనుండు
అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగముగా కొలువైన స్వామి
వారి ఉఛ్వాశ నిశ్వాసములు ఇందుకు కారణముగా చెప్పుకొంటారు.
ఈ శివలింగమునకు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి శివలింగమును అర్చకులతో సహా ఎవరూ తాకరు.
వాయులింగముగా ప్రఖ్యాతి గాంచిన ఈ లింగము తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ
కనిపిస్తుంది. అందుచేత ఈ లింగమును కర్పూర లింగమని కూడా అంటారు. నవగ్రహ కవచముతో
ఉండే ఈ శివలింగమును ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకము
చేస్తారు. స్వామి నవగ్రహ కవచము ధరించి ఉంటాడు. రాహుకేతు క్షేత్రము కూడా అగుటచే
గ్రహణ సమయమున గుడి తలుపులు మూయరు.
శ్రీకాళహస్తి విశేషాలు:
శ్రీ అంటే సాలెపురుగు, కాళము
అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత
పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ
కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల
ఆత్మలను తనలో విలీనం చేసుకున్న స్వామిగా ఈ స్వయంభువు గుర్తింపు పొందినాడు. ఈ
క్షేత్రానికి దక్షిణ కైలాసమని, సద్యోముక్తిక్షేత్రమని,
శివానందైక నిలయమని, సత్య మహా భాస్కర
క్షేత్రమని వివిధ నామములు కలవు. ఇక్కడ
అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖముగా వుంటే , స్వామి
వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖుడై దర్శనమిస్తాడు. గణపతి ఉత్తర దిక్కుగా,
దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.
ఈ ఆలయంలోనికి
తూర్పు ద్వారము గుండా ప్రవేశించి పాతాళ
వినాయకుని దర్శనానంతరము
శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ
క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర
లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో
ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర
విషయాలు దాగి ఉన్నాయి.
భక్తుడు సాధారణముగా భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీ
కాళహస్తిలో పరమేశ్వరుని పరమ భక్తుడైన
కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరునికి ఆ కొండ క్రీంద ఆలయము
ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న
కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం.
పరమేశ్వరుడికి మహా భక్తులైన రోమస మహర్షి, ధూర్జటిల
దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాజద్వారం దాటే గడప కింద సమాదిచేసినట్లు
చెబుతారు. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులచేత మరియు దేవతలచేత ప్రతిష్ఠింపబడినవిగా
చెబుతూవుంటారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు
- నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము;
ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర
లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు,
చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే
లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ
విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి
మూర్తులు,
సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు
ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది.
శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
రాహుకేతు శాంతి పూజలు:
శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్ట మొదటి
గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరునికి
ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో
ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ
క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను
ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.
సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా
ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ
కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ
శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
చెంగల్వ రాయుని ఆలయం:
శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఓ
ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీదేవసేన సమేత చెంగల్వ
రాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు
ఉండదు.
అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్ర
నామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో
ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామి వారి శిఖరం, అమ్మవారి
శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ
మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్ర
గుప్తుడులు ప్రతిష్టించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి.
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగము నకు చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును దక్షిణ కాశీగా వర్ణించిన చారిత్రక ప్రస్తావన కానవస్తుంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించినట్లు చరిత్ర ద్వారా మనకు తెలియవస్తూవున్నది.
ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల
శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో
పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ
చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించినాడు. మూడవ
కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించినాడు. క్రీస్తుశకం 12వ
శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవ రాయలను రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు
నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించినాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల
ఆధారంగా వంద స్తంభాల మంటపము మరియు
అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురము 1516 వ సంవత్సరంలో
గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. తిరిగీ పునర్నిర్మాణము జరిగినది.
క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని
ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు
విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చినట్లు తెలియవచ్చుచున్నది.
శ్రీకాళహస్తిని గూర్చి చెప్పి స్వర్ణముఖీ నదిని
గూర్చి చెప్పకుంటే అది తప్పే అవుతుంది. నేను ఆ విషయము నిజామునకు మరచినాను,
మిత్రుడు శ్రీనాథ బాబు గుర్తుచేయుటచే ఆ నదిని గూర్చి క్లుప్తముగా వ్రాస్తూ
వున్నాను. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి
మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని
మొగలేరు అని ప్రస్తావించినాడు. మరి అప్పుడు ఈ నదిని ఆనుకొని మొగిలి పొదలు అధికముగా
ఉండేవేమో! ఈనది ఉత్తరవాహినియై బంగాళాఖాతము లో కలుస్తుంది. పూర్వము అగస్త్య మహర్షి
బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు
స్థలపురాణం తెలుపుచున్నది.
శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ
సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి
తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారుటచే
ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది అని స్థలపురాణము..
ఈ క్షేత్రపు మరియొక విశేషమేమిటంటే ఇచట ప్రతి
సంవత్సరమూ ఏడు గంగమ్మల జాతర జరుగుతుంది. ఇష్ట కామ్యములను తీర్చే ఈ జాతరను స్థానికులు
ఎంతో చిత్తశుద్ధితో జరుపుకొంటారు. ఇటీవలి కాలములో అరుణాచలము బోలె ఇచ్చటకూడా చక్కని బాట వేయించి గిరిప్రదక్షిణకు దేవాలయ యాజమాన్యము ప్రభుత్వ సహకారముతో ఏర్పాటు చేస్తూ వున్నది.
ఇలా ఎన్నో
ప్రత్యేకతలు,
విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్క సారి సందర్శించిన వారి
మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి
క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు
శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు
రవాణా ఉంటుంది.
పుట్టుకతో అంధుడై, బడికి కూడా పోవ నోచుకోని
1907 నవంబర్ 22 న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలము లోని కల్లూరు లో జన్మించిన
శ్రీయుతులు లక్కోజు సంజీవరాయశర్మ గారు మానవ కలనయంత్రమని పేరుగాంచిన శకుంతలాదేవి
కన్నా ఎంతో పూర్వీకుడు మరియు ఆమెవలె చదువుకొన్నవాడు కాకుండాయుండికూడా మానవ
కలనయంత్రమై యోప్పారినాడు. ఆయన గోప్పదనమునకు తగిన గుర్తింపు లేక వార్ధక్యమును
కాళహస్తీశ్వరుని సన్నిధిలో గడిపి శివైక్యమైనాడు.
శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజకవిషేఖరులలో ఒకడైన ధూర్జటి
వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోని శ్రీ
కాళహస్తి స్థలపురాణాన్ని స్పృశిస్తూ వ్రాసిన ఒక అనర్ఘ రత్నమును మీ ముందుంచుతూ ఈ
వ్యాసమును ఇక్కడ ముగించుచున్నాను.
ఏవేదంబు
పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె
కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ
విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా
శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
పైన తెలిపిన
ప్రదేశములు, దృశ్యములలో కొన్నిమాత్రమే నేను చూచినవి కొన్ని విన్నవి మరికొన్ని చదివి
తెలుసుకొన్నవి.
మనసంతా శివమయమై
నిండగా కారును తిరుపతికి వైపు
త్రిప్పినాము. మేము చేరే సమయానికి సాయంకాలము అయ్యింది. నేరుగా నెలవు చేరుకొని
విశ్రమించి 14వ తేదీ తెల్లవారుఝాముననే తిరుమల కొండకు బయలుదెరినాము. ఆరోజు బుధవారమగుటచే
వృద్ధులకు, సాయుంకాలము మాత్రమే అనుమతించుతారట. Token మాత్య్రము ఉదయమే ఇస్తారు.
Token తీసుకొనుటకు que లో కూర్చునుటకు అవకాశమున్నా ఆ రద్దీకి మేము Token
తెచ్చుకోగాలమన్న ధైర్యము దొరుకలేదు. కానీ నేను ప్రారంభములోనే తెలియజేసిన మా
చంద్రమౌళి తిరుమలకు phone చేసి శ్రీనివాస్ అన్న వ్యక్తిని మాకోరకు
వినియోగించినాడు. అతను మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా Token తెచ్చించి రూము కూడా
ఏర్పాటుచేసి దర్శనమునకు నేరుగా పిలుచుకుపోతానన్నాడు. మేము అవన్నీ సున్నితముగా
తిరస్కరించి శక్తిని కూడకట్టుకొని దర్శనము మేమే చేసుకొంటాం,అని చెప్పి అతనికి
ధన్యవాదములు తెలియజేసి వెనుకకు పంపినాము. మేమిద్దరమూ దర్శనము చక్కగా
ముగించుకోన్నాము. మా పిల్లలు ముగ్గురూ 300ళ రూపాయల Ticketతో చక్కగా దర్శనము
ముగించుకొన్నారు. యాత్రికుల స్వార్థము పలుప్రాంతములనుండి వచ్చే మహిలాసహృదయులు
మరియు భక్త గానములో ఒక వ్యక్తి మాకు సహకరించగా లడ్డులు వలసినవి కొని, కారుచేరుకొని
తిరుపతి నేలవుకు వెళ్లి విశ్రమించినాము. తెల్లవారి అలమేలు మంగాపురము చేరి అక్కడి
దేవస్థానపు ఉద్యోగులు ఎంతో అభిమానముతో సహకరించగా అమ్మ దర్శస్నాము చేసుకోన్నాము. అక్కడ జరిగిన విశేషము లేక విచిత్రేఅము ఏమిటంటే
అమ్మవారి వద్దనున్న అర్చకుడు, సిబ్బంది త్రోయకుండా, ప్రత్యేకముగా నన్ను నిలిపి,
అమ్మవారి దర్శనము చేయించినాడు. అంతా తల్లి కరుణ అ ఆర్చకుని దయ. దర్శనమయిన వెంటనే
ప్రోద్దుటూరికి నేరుగా ప్రయాణము సాగించినాము.
మాకోరకు బెంగుళూరు
నుండి ప్రొద్దుటూరు వచ్చిన నాగాసుబ్బరెడ్డి దంపతుల అభిమానమును తెలుపుకొని నా
యాత్రా విశేషములకు భరత వాక్యము పలుకుతాను.
మాకొరకు
బెంగుళూరు నుండి ప్రొద్దుటూరు వచ్చిన నాగాసుబ్బరెడ్డి దంపతుల అభిమానమును తెలుపుకొని
నా యాత్రా విశేషములకు భరత వాక్యము పలుకుతాను.
సాయంకాలానికి
ప్రొద్దుటూరు లోని మాకు మనసారా ఆతిథ్యమిచ్చిన నాగాసుబ్బారెడ్డి గారి ఇల్లు
చేరినాము. ఆ దంపతుల ఆదరణ మేము బ్రతికినంతకాలమూ మరువలేము. మేము ముఖ పాద
ప్రక్షాలనములు కానిచ్చిన వెంటనే ఆ తల్లి మాకు తేనీరు తన అమృత హస్తాలతో చేసి తెచ్చి
ఇచ్చింది. ఆరోజు రాత్రికి మేము అంటే నేను నా శ్రీమతి మాత్రము మరియొక మిత్రుని
ఇంటికి భోజనమునకు వెళ్ళినాము. మిగతా ముగ్గురికీ ఆతిథ్యము నాగాసుబ్బారెడ్డి దంపతులే
ఇచ్చినారు. మేము భోంచేసి వచ్చి రెడ్డిగారి ఇంట్లో కబుర్లతో కాలము గడిపి రాత్రికి
ఆలస్యముగా పడుకోన్నాము. బలవంతము చేసి ఆ దంపతులు వారి పాన్పు మాకు, ఇస్త్రీ బట్టలు
పరచి ఇచ్చి తాము హాలులో సర్దుకొని పడుకొన్నారు. నేను పడుకొని కళ్ళు మూసుకొంటే
కన్నీరు చెంపలమీదినుండి నిదురించే వరకూ జారుతూనే ఉండినది. తెల్లవారి కాలకృత్య,
సంధ్యావందనాది కార్యక్రమములు ముగిసిన వెంటనే ఉదయము 8, 8.30 కే నన్ను బట్టలకోట్టుకు
తొడుకొనిపోయినాడు. ప్రొద్దుటూరిలో
అంత త్వరగా
అంగళ్లు తెరుస్తారా అనుకోవద్దు. ఆయన ఫోన్ చేసి తెరిపించినాడు. వద్దంటే వినేవాడు కాదు. నాకోసం ఖరీదయిన
పంచాలచాపు కొన్నాడు. ఇంకా లాల్చీ కొంతానంటే
ఎట్లో తప్పించి, ఇల్లు ఆయనతో చేరినాను. ఖరీదయిన చీర నా శ్రీమతికి ముందే
తీసియుంచియుండినారు. మేము ఫలములను ఆహారముగా తీసుకొనగా మా పిల్లలకు షడ్రసోపేత భోజనము ఆ తల్లి వండి వడ్డించినది.
మాటలతో చీకటి పడిపోయింది. తేనీరు సేవించి, ఆదర పూర్వకముగా వారిచ్చిన వస్త్రములను
స్వీకరించు వారిని ఆశీర్వదించి బయలు
దేరుతకు సిద్ధమయినాము. బాడుగకు తీసుకొన్న కారు తిరిగి ఇచ్చివేసినాము కాబట్టి తన
కూతురు అల్లుడు వాళ్ళ కారు నడుపుటకు తన మిత్రుని తీసుకొని మమ్ము సాగనంపుటకు తానూ ఎర్రగుంట్ల రైలు
స్టేషనుకు బయలుదేరి, మాకే కష్టమూ కలిగించకుండా రైలుబండి ఎక్కించి పంపినాడు.
ఈ యాత్రలో,
గమనించితే సర్వశ్రీ నాగసుబ్బారెడ్డి, చంద్ర,మౌళి, రమేష్, మహేష్, శ్రీనాథ బాబు, మనోహర్ గోపాల్, మొదలగు సహృదయుల సహకారము,
పరమేశుని అనుగ్రహము లభించుటచేతనే మాయాత్రను సంపన్నము చేసుకోన గలిగినాము. జగద్రక్షకుడు
వారికి నిరంతర ఆయురారోగ్యైశ్వర్యములను
ప్రసాదించవలయునని మనసార మనవి చేసుకొంటూ ఓపికతో చదివినందుకు పాఠకశ్రేష్ఠులకు
కృతజ్ఞత తెలుపుకొంటూ శెలవు తీసుకొనుచున్నాను.
స్వస్తిప్రజాభ్యాం
పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహింమహీశాంl
గోబ్రాహ్మణేభ్యః
శుభమస్తు నిత్యం; లోకాః సమస్తాస్సుఖినోభవంతుll
స్వస్తి.