Friday, 24 November 2017

శృంగేరి పూర్వ పీఠాధిపతి ద్రశేఖర భారతి వారి మహనీయత

శృంగేరి పూర్వ పీఠాదిపతి చంద్రశేఖర భారతి వారి మహనీయత

https://cherukurammohan.blogspot.com/2017/11/blog-post_24.html

నడచే దైవముగా కొనియాడబడే చంద్రశేఖర సరస్వతీ యతీంద్రులను గూర్చి అందరికీ 

తెలిసినదే కానీ వారు వయసులో వున్నకాలములో సమాంతరముగా చంద్రశేఖర భారతీ 

స్వామీ వారిని గూర్చి తక్కువగా తెలిసి వుంటుంది. నేను ఇపుడు వారి మహానీయతను 

గూర్చిన ఒక సంఘటన మీకు తెలియజేయ సంకల్పించినాను.

ఒకసారి ఒక వ్యక్తి స్వామి వారి దర్శనము చేసుకొనుటకు వచ్చు సమయానికి, అది 

సాయంకాలము అగుట మూలమున స్వామి తన శిష్య గణముతో శృంగేరియందలి 

నరసింహ వనము నందుగల కాలభైరవ ఆలయమునకు కొందరు శిష్యులతోనూ వారి 

ఉపాధ్యాయునితోనూ బయలుదేరి వెళుతూ వుండినారు. ఆగంతకుడు స్వామికి 

నమస్కరించగా వారు ఆయనను అనుసరించమని చెప్పినారు. అట్టి సమయమునందు 

స్వాములవారు ఊరుకొనక ఎదో ఒక విషయమును ప్రస్తావనకు తెచ్చి దానిని 

విశ్లేషించమనేవారు తన వెంట వచ్చు వారితో!

ఆరోజు స్వామీ వారికి ఒక శ్లోకమును చెప్పి దాని అర్థమును విశదీకరించమన్నారు. ఆ 

శ్లోకములో 'మే మే మే' అన్న మేక అరుపులు ఎక్కువగా వస్తాయి. సంస్కృతములో 'మే

అంటే 'నాది' అన్న ఒక అర్థము వుంది. దానిని మేక అరుపునకు సంధించిన ఆ 

శ్లోకమును చదవండి. అందులోని గూఢార్థమును గ్రహించండి.

స్వామివారు ఇంతకూ ఆ శ్లోకమునే ఎందుకు ఎంచుకొన్నారు అంటే, ఆ వచ్చిన వ్యక్తి 

అత్యంత అనారోగ్యముతో బాధపడుచున్న తన భార్యను గురించి, మాటవినని తన 

కుమారుని గురించి తెలిపి స్వామి ఆశీర్వాదముచే ఒక పరిష్కారము పొందుటకు 

వచ్చినాడు.

స్వాములవారికి కర్మఫల పీడితులై ఫలితముననుభవించు వారికి లోక విముక్తే 

పరిష్కారమని తెలియుటచే ఆ శ్లోకమును చెప్పి విశ్లేషించమన్నారు. సందర్భోచితమగు 

వారి మనసును గ్రహించినట్టి యా వచ్చిన వ్యక్తి ఆయన కాళ్ళపై బడి తానెందుకు 

వచ్చినదీ చెప్పి, తానడగాకుండానే స్వాములవారు తనను అనుగ్రహించినారని తెలిపి 

కాలభైరవ దర్శనము స్వామివారితో కూడా చేసుకొని, వారివద్ద శెలవు తీసుకొని తన 

నెలవుకు బయలుదేరినాడు. కొంతకాలమునకు సంసారి బంధ విముక్తుడై సన్యసించి 

జీవిత శేషమును ఉత్తరభారత పుణ్యతీర్థములందు వెళ్ళబుచ్చి పరమపదించినారు. 

మహనీయుల మాటలు అంత నర్మగర్భంగా వుంటాయి. ఇంతకూ ఆ శ్లోకమునకు 

అర్థము చెప్పిన వారు తదనంతర పీఠాధిపతియైన అభినవ విద్యాతీర్థ స్వాములవారు

సన్యసించక ముందు గురువు గారివద్ద శిష్యునిగా వున్న కాలములో! శ్లోకము శ్లోక 

భావము క్రింద/పైన చదవండి.

దారా ఇమేమే తనయా ఇమేమే గృహా ఇమేమే పశవశ్చమే మే l

ఇత్థం నరో మేష సమాన ధర్మ ‘మే మే’ కరః కాల వ్రుకేన నైతాః ll

నా భార్య, నా పిల్లలు, నాయిల్లు, నా పశుసంపద, అంటూ మేకవలె ‘మే మే’ అని అరుస్తూ 

ఉన్నాడు కానీ కాలమనే తోడేలు కబలించబోతూ  ఉందని తెలియలేకున్నాడు.

Essence of Life

dārā ime me, tanayā ime me, ghā ime me, paśavaśca me me.

Ittha naro measamāna-dharmā me-me-kara kāla-vkea nīta

(This wife is mine (the Sanskrit word ‘me’, meaning ‘mine’, sounds, when pronounced, a little like the bleating of a sheep).These children are mine (‘me’). These houses are mine (‘me’) and these cattle are mine (‘me’). The man who, in this manner, keeps saying ‘me-me’ is on par with a sheep (which bleats ‘me-me’). He is killed by the wolf named as 'time').”

No comments:

Post a Comment