కవన కన్యక - కవిత్వ పటుత్వము
https://cherukurammohan.blogspot.com/2017/03/blog-post_23.html
నన్ను అపార్థము చేసుకోనకుంటే కవిత్వమును గూర్చి
నాలుగు మాటలు చెబుతాను . ఇది కూడా కవితలు వ్రాసే ఉబలాటం యువతలో ఎక్కువగా కనిపించుట
వల్ల.
మహా కవులు క్షణానికి ఒక కవిత వ్రాయగల దిట్టలు.
వారితో నేను పోటీ పడలేను. కానీ నా ఆలోచనా సరళి వేరు అందువల్ల నేను భగవంతుని ఈ
విధంగా కోరుకొన్నాను .
తృటిన కవిత వ్రాసి తృప్తి చెంద సుకవుల్
నిన్ను తలచి తలచి నీలకంఠ
పద్యమొకటి వ్రాయ పదిగంటలయ్యును
నీదు తలపులిచ్చె నిమ్మళమ్ము
పై పద్యములోని భావమేమిటంటే పరమాత్మా నేను ఒక
పద్యము వ్రాయుటకు సమయమైతే ఎక్కువే తీసుకోవచ్చు కానీ రాసేది నిన్ను గూర్చి కాబట్టి
వ్రాసినంతసేపు నిన్ను తలచుకొనే అదృష్టము నాకు కలుగుతుంది కదా! అంటే నేనైతే
పరపరమేశ్వరుని ఉద్దేశించి వ్రాసినాను కానీ యువకులు భావి కవులు వారు ఏ
వస్తువునెన్నుకోన్నారో దాని మీద మనసుపెట్టి 1 లేక 2 రోజులైనా
యోచించి వ్రాస్తే మంచి ఫలితము పొందగలుగుతారు అని నా నమ్మకం. పెద్దలు కవనములో
కొమ్ములు తిరిగిన వారు. వారు ఏమి చేసినా ఎట్లు చేసినా చెల్లుతుంది. కారణం వారు
కారణ జన్ములు కావున. మన పరిధిలో మనమూ అదృష్ట వంతులమే. అంతో యింతో ఎంతో కొంత మన
భావాలను మనదైన రీతిలో వ్యక్తీకరించగలుగు చున్నాము. కానీ మనము వ్రాసేది మనకన్నా
చదువరులకు కదా అర్థము కావలసినది.
పెద్దలు కవితను కన్యక తో పోలుస్తారు. ఏ స్త్రీ
అయినా కన్యాత్వములోనే,తన
పూర్తి జీవితములో, కడు సుందరంగా
కనిపించే సమయము. అంటే మన కవితా కన్యక కూడా తప్పక కడు సుందరమూగా ఉండాలంటే
చక్కదనాన్ని కవితా వస్తువుకు మొదట జోడించవలెను. ఆ పిమ్మట అలంకారాలూ ఆభరణాలు కాళ్ళ
చెప్పులతో కూడా అన్నీ అమరించి ఒక సారి అద్దములో చూపించి ఆ పైన పెళ్ళిచూపులకు
సిద్ధం చేయాలి. |
కవితకు మొదటి సోపానము భావము పిమ్మట అందుకుచితమైన
భాష ఆపై అలంకారాలు (ఉపమానోపమేయాలు) పిదప పాదముల నడక. నడకలో లయ విన్యాసము అంటే
ఇక్కడ అనుప్రాసలు అక్కర మీరకుండా వుండు విధంగా వాడుకొనుట .ఇక ఇందులో ప్రధానమైనవి
శయ్య,ధార. అంటే కవిత సమతలముపై
ప్రవహించే సెలయేటి లాగా సాగవలె. భావములు నేటి యువతలో పుష్కలములు. సమస్య భాష
వద్దనే! సరస భావాలకు శబ్దాలంకారలకు సరళ భాషకు పోతన భాగవతము ముఖ్యంగా ప్రహ్లాద
చరిత్ర,గజేంద్ర మోక్షము, నరకాసుర వధ చదివితే భాష, శయ్య, ధార శబ్ద అర్థ
అలంకారాలన్నీ వస్తాయి. ఇష్టము పెరిగితే మనుచరిత్ర భావ సహితముగా గల పుస్తకాన్ని
చదివేది. ఆధునికులలో నిఘంటువు సహాయముతో శ్రీ శ్రీ గారిని చదివితే చాలు. చక్కని
కవితలు మీ భావానుకూలముగా వ్రాయగలరు . |అలాటి పదాలతో వ్రాసిన పోతన పద్యాన్ని ఈ దిగువ
తెలియబరచుతూ నన్ను అపార్థము చెసుకొనరని మనసారా భావిస్తూ సెలవు తీసుకొంటాను. మహా
మహా కవులెందరో వున్నారు కానీ పైన తెలిపిన వారితో మొదలుపెట్టమని నాకు తోచిన సలహా, మీరు తీసుకొంటారని యిచ్చినాను.
నల్లనివాడు పద్మ నయనమ్ముల వాడు కృపారసమ్ము పై
జల్లెడువాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు
రా
జిల్లేడు మోము వాడొకడు చెల్వల మాన ధనమ్ము దోచెనో
మల్లియలార మీ పొదల మాటున దాగేనటమ్మ చెప్పరే
पुराणमित्येव न साधु सर्वं
न चाऽपि काव्यं नवमित्यवद्यम्।
सन्तः परीक्ष्यान्यतरत् भजन्ते
मूढ्ः परप्रत्ययनेयबुद्धिः ॥
-मालविकाग्निमित्रम् (महाकवि कालिदास)
పురాణ మిత్యేన సాధు సర్వం
నచాऽపి కావ్యంనవమిత్యవధ్యం l
సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ll
(మాళవికాగ్ని మిత్రము-మహాకవి కాళీదాసు)
మహాకవి కాళీదాసు ఈ విధముగా
అంటున్నారు:
కవిత్వము అదునాతనమా
పురాతనమా అన్నది సమస్య కాదు. పురాకవుల కావ్యాలన్నీ గొప్పవీ కావు, అదునాతనుల్లవి అధమమైనవీ
కావు.
పండితులయినవారు ఆ విషయమును, కూలంకషముగా చదివి
నిర్ణయించుతారు. మూర్ఖులు మాత్రము ఎవరేమి చెబితే దానికి తలూపుతారు.
నిన్నటి దినమున ఒక పాఠకుడు
ఈ శ్లోకాన్ని ఉదాహరించుతూ, నేను నిన్న వ్రాసిన విషయమును అపార్థము చేసుకొని పై శ్లోకమును ఉదహరించి
గోప్పంతా పాతలోనే లేదు కొత్తలోకూడా ఉంటుంది అని తమ అభిప్రాయమును తెలియజేసినారు.
ఇందుకు గానూ నేను సమాధానము వ్రాయవలసి వచ్చి వ్రాయుచున్నాను.
కాళీదాసుకు పూర్వము ఎందఱో
కావ్యములను వ్రాసినారు. కాళిదాసు తరువాత కూడా వ్రాసినారు. కానీ పేరెన్నిక గన్నవి
ఆయన కావ్యములే. రాశిలో నేటికి కూడా సంస్కృత కావ్యముల తరువాతనే మిగత ఏ భాషా కావ్యములైనా!
మరి ఆయన తదనంతరము వ్రాయబడిన కావ్యములకు ఆ ప్రశస్తి రాలేదు. అట్లే ఆంధ్రమహాభారత
కవులను కాదని, వారితదనంతరము
భారతము వ్రాయ సమకట్టలేదు. అటులే ఆంద్ర భాగవతము కూడా! తెలుగులో ఎందఱో ఉద్దండులయిన
పండితులు రామాయణమును వ్రాసినా, అధునాతనుడైన విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షము’నకు ఎంతో వాసి వన్నె వచ్చినది. అట్లని
గతములో వ్రాసినవారెవరూ తక్కువైనవారు కారు.
పద్య కావ్యాల మాట అటుంచితే
శ్రీశ్రీ మరియు సినిమా కవులను తప్ప మిగతా ఎందఱో ప్రతిభావతులయిన కవులను ఎందరు
గుర్తు పెట్టుకొనియున్నారు. ఇక తెలుగులో నేటి పాటలు ఎంతగా దిగాజారిపోయినాయో
చెప్పంక్కరేలేదు. వ్రాయగలిగే చేవయుండికూడా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి’ గారి
కలమునుండి ఒక రసమయ గీతము జాలువారి ఒక దశాబ్దము అయిపోయిందేమో.
ఇక నావంటి చిల్లర కవులు
వ్రాసే వ్రాతలకు పాత కావ్యముల స్థాయి రమ్మంటే వస్తుందా! ఇప్పుడు వచన కవిత్వము
వ్రాసే ఎంతమంది నేడు కొంత మాత్రమైనా వ్యాకరణము చదివి వ్రాస్తూవున్నారు. ఈ సంస్కృత
శ్లోకము చదవండి.
యద్యపి బహునాధీషే తథాపి
పఠపుత్రా వ్యాకరణంl
స్వజనః శ్వజనః మాభూత్ శకలం
శకలం సకృత్ శకృత్ll
వేదశాస్త్రాధ్యనము
చేయకున్నా వ్యాకరణము నేర్చుకో!పదాలు సక్రమమైన అక్షరాలతో పలుకుట నేర్చుకో! ‘స్వజనం’
కు బదులు ‘శ్వజనం’ అని
‘సకలం’ (అంతా) కు బదులు
‘శకలం’ (ముక్క) అని ‘సకృత్’(ఒక మారు) ‘శకృత్’ (మలము) అని పలికితే ఎంత అసంబద్ధమయిన
అసహ్యమయిన అర్థాలు వచ్చి
పలికిన
వానికి ఎంత అవమానమును తెచ్చి పెడతాయో చూడండి. తెలుగులో ‘పాలాభిషేకము’లో ‘పాలు’ అన్న తెలుగు పదమునకు ‘అభిషేకము’ అన్న సంస్కృత తత్సమ శబ్దముతో సంధికుదరదు.
‘క్షీరాభిషేకము’ లేక
‘దుగ్ధాభిషేకము’ అని అనవలసి వస్తుంది. తమిళమునకు ఈ వెసలుబాటు అంటే వాళ్ళు
‘పాలాబిశేగం’ అని సరిపుచ్చుకొంటారు. అట్లే ‘నాకు ౘాలు' అనవలసిన చోట
'నాకు చాలు' అని పలుకుట ఎంత అసభ్యముగానూ అసహ్యముగానూ
ఉంటుందో గమనించండి. 'ఋ' అన్న
అక్షరమును 'రు' గా పలుక కూడదు.
చెంపలు, దవడలు, గవదలు9(ఒకే శరీర భాగమునకు వేరువేరు పేర్లు) కదిలించకుండా 'ఋ' అన్న శబ్దము పలుకవలసి
ఉంటుంది. అదేవిధముగా ‘ఌ’ కూడా పలుకవలసి ఉంటుంది. మనము 'కృష్ణ' కుబదులుగా 'క్రుష్ణ' అని పలుకుతున్నాము.
సిగ్గుపడవలసిన విషయమేమిటంటే ఆంగ్లేయులు కూడా వాళ్లకు వట్రసుడి లేకున్నా'ఋ' కు 'ఇ' తో
యతి చెల్లుతుంది కాబట్టి Krishna అని వ్రాస్తారు. దేవనాగరి
అంటే సంస్కృత హిందీ లిపులలో వాళ్ళు ఈ శబ్దమును क्रु అనికాకుండా कृ అని వ్రాస్తారు. క్ఌ (నిజానికి ‘ఌ’ క క్రింద
రావాలి కానీ మనము వదిలి వేసినాము కాబట్టి ఆ సువిధ Google లో లేదు. ఇప్పుడు ‘క్లుప్తము’ అని
వ్రాస్తున్నాము. ఇంతకన్నా దారుణమైన విషయము ఏమిటంటే ‘ఙ,ఞ’ లు వాడకములో లేవు. ఇవి ఏ
రుద్ర నమక చమకముల వంటి వైదిక పుస్తకములలో మాత్రమే కానవస్తాయి. అసలు గంగ అని
వ్రాయకూడదు, ‘గఙ్గ’ అని వ్రాయాలి. కొదణ్డము అని వ్రాయాలి.
కిఞ్కిణి,కాఞ్చి అని వ్రాయాలి కింకిణి, కాంచి అని వ్రాయ కూడదు. ఈ విధముగా మనము అక్షరములను వదిలివేసుకొంటూ పోతే
‘గొరగంగా మిగిలేది జుట్టే’. అసలీ భాషా వినాశనమునకు నాంది పలికినవారు వాడుక భాషను
అమలు చేయు ఉద్యమమును ఆంగ్లేయుల కోరికకు అనుగుణముగాప్రారంభించి వారిచే సత్కారములను
పొందిన మహనీయులు. ఈ రోజు మనకు వ్యాకరణము రాదు. పద్యకావ్యములు చదువలేము. సంస్కృతి
పై ఆసక్తి లేదు. మన భాశాభినివేశము ‘నానాటికి తీసికట్టు నాగంభొట్టు’.
కళ్ళు తెరిచి ఇకనైనా ముందు
భాష నేర్చుకొందాము. మన అక్షరములను పునరుద్ధరించుకొందాము. మలయాళీలు చలన చిత్రములలో
సంస్కృత గీతములను కూడా చొప్పించి ఎంతో భావగర్భితముగా, మనోరంజకముగా 90 దశకము వరకు
వ్రాసి పాడేవారు. మనమో! సంస్కృతము అన్న శబ్దమును కూడా పలుకలేని వారిని
కలిగియున్నాము. మాతృభాష తెనుగులో చక్కగా మాట్లాడలేక అవమానించే తెలుగు నాయకులను,
చిత్ర నాయకులను చూచే దుర్గతి నేడు మనకు పట్టింది. ఈ విధముగా మన భాషా
పాండిత్యమునుంచుకొని చక్కటి భావమునకు అక్షర రూపము ఇవ్వగలమా! మనము క్షరములు అంటే
నశించేవి కాదు వ్రాయవలసినది, అక్షరములు అంటే శాశ్వతముగా
నిలచిపోయేవి.
ఈ మాట వినండి.
నన్ను
అపార్థము చేసుకోనకుంటే కవిత్వమును గూర్చి నాలుగు మాటలు చెబుతాను . ఇది కూడా కవితలు
వ్రాసే ఉబలాటం యువతలో ఎక్కువగా కనిపించుట వల్ల.
మహా
కవులు క్షణానికి ఒక కవిత వ్రాయగల దిట్టలు. వారితో నేను పోటీ పడలేను. కానీ నా
ఆలోచనా సరళి వేరు అందువల్ల నేను భగవంతుని ఈ విధంగా కోరుకొన్నాను .
తృటిన
కవిత వ్రాసి తృప్తి చెంద సుకవుల్
నిన్ను
దలచి తలచి నీలకంఠ
పద్యమొకటి
వ్రాయ పదిగంటలయ్యును
నీదు
తలపులిచ్చె నిమ్మళమ్ము
పై
పద్యములోని భావమేమిటంటే పరమాత్మా నేను ఒక పద్యము వ్రాయుటకు సమయమైతే ఎక్కువే
తీసుకోవచ్చు కానీ రాసేది నిన్ను గూర్చి కాబట్టి వ్రాసినంతసేపు నిన్ను తలచుకొనే
అదృష్టము నాకు కలుగుతుంది కదా! అంటే నేనైతే పరపరమేశ్వరుని ఉద్దేశించి వ్రాసినాను
కానీ యువకులు భావి కవులు వారు ఏ వస్తువునెన్నుకోన్నారో దాని మీద మనసుపెట్టి 1 లేక
2 రోజులైనా యోచించి వ్రాస్తే మంచి ఫలితము పొందగలుగుతారు అని నా నమ్మకం. పెద్దలు
కవనములో కొమ్ములు తిరిగిన వారు. వారు ఏమి చేసినా ఎట్లు చేసినా చెల్లుతుంది. కారణం
వారు కారణ జన్ములు కావున. మన పరిధిలో మనమూ అదృష్ట వంతులమే. అంతో యింతో ఎంతో కొంత
మన భావాలను మనదైన రీతిలో వ్యక్తీకరించగలుగు చున్నాము. కానీ మనము వ్రాసేది మనకన్నా
చదువరులకు కదా అర్థము కావలసినది.
పెద్దలు
కవితను కన్యక తో పోలుస్తారు. ఏ స్త్రీ అయినా కన్యాత్వములోనే,తన పూర్తి జీవితములో, కడు
సుందరంగా కనిపించే సమయము. అంటే మన కవితా కన్యక కూడా తప్పక కడు సుందరమూగా ఉండాలంటే
చక్కదనాన్ని కవితా వస్తువుకు మొదట జోడించవలెను. ఆ పిమ్మట అలంకారాలూ ఆభరణాలు కాళ్ళ
చెప్పులతో కూడా అన్నీ అమరించి ఒక సారి అద్దములో చూపించి ఆ పైన పెళ్ళిచూపులకు
సిద్ధం చేయాలి. |
కవితకు
మొదటి సోపానము భావము పిమ్మట అందుకుచితమైన భాష ఆపై అలంకారాలు (ఉపమానోపమేయాలు) పిదప
పాదముల నడక. నడకలో లయ విన్యాసము అంటే ఇక్కడ అనుప్రాసలు అక్కర మీరకుండా వుండు
విధంగా వాడుకొనుట .ఇక ఇందులో ప్రధానమైనవి శయ్య,ధార. అంటే కవిత సమతలముపై ప్రవహించే సెలయేటి
లాగా సాగవలె. భావములు నేటి యువతలో పుష్కలములు. సమస్య భాష వద్దనే! సరస భావాలకు
శబ్దాలంకారలకు సరళ భాషకు పోతన భాగవతము ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర
మోక్షము, నరకాసుర
వధ చదివితే భాష, శయ్య, ధార శబ్ద అర్థ అలంకారాలన్నీ
వస్తాయి. ఇష్టము పెరిగితే మనుచరిత్ర భావ సహితముగా గల పుస్తకాన్ని చదివేది.
ఆధునికులలో నిఘంటువు సహాయముతో శ్రీ శ్రీ గారిని చదివితే చాలు. చక్కని కవితలు మీ
భావానుకూలముగా వ్రాయగలరు . అలతి పదాలతో వ్రాసిన పోతన పద్యాన్ని ఈ దిగువ
తెలియబరచుతూ నన్ను అపార్థము చెసుకొనరని మనసారా భావిస్తూ సెలవు తీసుకొంటాను. మహా
మహా కవులెందరో వున్నారు కానీ పైన తెలిపిన వారితో మొదలుపెట్టమని నాకు తోచిన సలహా, మీరు తీసుకొంటారని
యిచ్చినాను.
నల్లనివాడు
పద్మ నయనమ్ముల వాడు కృపారసమ్ము పై
జల్లెడువాడు
మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు
మోము వాడొకడు చెల్వల మాన ధనమ్ము దోచెనో
మల్లియలార
మీ పొదల మాటున దాగేనటమ్మ చెప్పరే
Gowrishankar
Mamillapalli
నవ
కవులకు యువ కవులకు చక్కటి సాహితీ సందేశము.మీరుతలపండిన కవితాపండితులు.మీ కవనము
"బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్య."ధన్యోస్మి.
Reply5yEdited
Shyam
CB T
Dhanyavaadamulu...
Reply5y
Apaji
Peri
ॐ।शुभ मध्याह्नम्।।। "కవి'కవనకన్యాదాఁత'యే
గదా...!!!"
Reply5y
Abburi
Nagabose
'కవిత్వం గురించి చక్కని వివరణ. ధన్యవాదాలు
Reply5y
భాగవత
గణనాధ్యాయి
అద్భుతంగా
చెప్పారు .... మహానుభావా!. . . కవిత్వం కావాలన్నా, భాషకావాలన్నా, పరిపక్వత కావాలన్నా "కొందఱకు. . ." అని సవినయంగా
సాధికారంగా చెప్పుకున్న మన పుణ్యకోటి పోతనామాత్యుల వారి వద్దకు పోవడమే పరమోత్తతము
అండి. .
Reply5y
Parameswara
Nitturu
గురువుగారూ,
ఈ
ఆధునిక యుగంలో పద్యం తన ఉనికిని కోల్పోతోంది.
ఇలాంటి
సంధి దశలో పద్యాన్ని బ్రతికిస్తూ పద్యం గురించి
చాలా
చక్కగా వివరించారు.
పద్యానికి
ఉండవలసిన లక్షణాలు,తీసుకొన్న ఉదాహరణలు చాలా బాగున్నాయి. పద్యాన్ని నడిపించే తీరును సూచిస్తూ
మీరిచ్చే
సూచనలు ,
నవ
కవులకు శిరోధార్యాలు.
Reply5y
Nsms
Swaroop
Mee
kaviki, kabyaniki kavalasina laksjyanni, lakshanaalanu bagavibarinchimaru
Anduku
dhanyavadamulu.
Reply5y
Ramalingaswamyp
Panamgipalli
Chakkaga
vivarinchinaaru padyamulo Thalachi Thalachi anekanna Dalachi thalachi ante
Inkachalaabaagundedelmo!
Reply5y
Cheruku
Ramamohanrao
Nijame
Reply5y
Sivaram
G Krishna
Chala
Bagundi.
Reply5y
Sadanandeeswaraiah Vallamkondu
కవులందు
సుకవులు వేరయ్య అంటారు .
Reply5y
Kadambari
Sarma
నవ్వురాజిల్లెడుమోమువాడు.......
మీరూచాలాసున్నితముగా
చెప్పారు.
Reply4y
Vijaya
Rao Atmakur
వస్త్రాపహరణసమయంలో
పరమాత్ముడు దోచుకున్నది దేహాభిమానధనమును అని పెద్దల వివరణ.
Reply4y
Rama
Krishna Jupudy
Chala
baga chepperu
Reply4y
Sastry
Vemuri
Your
explanation is wonderful and Spurtidayakamu (inspiration) to youth to write
beautiful poetry and there are subjects and degrees in western countries to
write good poetry and perhaps they give same suggestions like
Yours
and even read as explanatory experience , Also you have with same Spurti
loosely translated inspiration keeping full concentration in your inspirational
object in your case lord Siva as explained by you decorating in full splendor
you wrote a piece which brought out all Bhava in a beautiful piece of poem and
must be thanked that you have quoted Mahanubahvudu unrivaled in simple and
heart melting poem on lord Krishna and my belief is firmed up that an artist
unless completely immersed and drowned in Bhakti (devoted or devotion ) devoted
in his object of art piece or devotion in his love for the object such
beautiful artistic excellence would not flower . Thank you.
Reply4y
Cheruku
Ramamohanrao
Mee
abhimaanamunaku krutajnunni
Reply4y edited
Murali
Thotapalle Venkata
Mee
Kavita drukpathamu Chala bagundi.
Reply4y
Talisetti
Venkata Subba Rao
2y
Talisetti
Venkata Subba Rao
Kavitha
kanyaka v.Good explanation sir
2y