Saturday, 30 May 2015

పుష్కరములు
పుష్కరమును గూర్చి తెలుసుకొనే ప్రయత్నము చేసే ముందు వాయు పురాణములోని ఈ కథ కాస్త చదువుతాము.

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు శంకరుని గురించి తపమాచరించి  ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వామి వరం 

కోరుకోమన్నాడు. తుందిలుడు ' స్వామీ శాశ్వతంగా నీలో ఐక్యంచేసుకొ'మ్మన్నాడు. ఈశ్వరుడు  తన అష్టమూర్తులలో 

ఒకటైన జలమూర్తిలో  శాశ్వతంగా స్థానం కల్పించినాడు.  ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి 

లభించింది. ఎన్నో అర్థాలు గలిగిన పుష్కరమునకు పోషక శక్తి అన్నది కూడా ఒకటి. అలా తుందిలుడు 

పుష్కరుడైనాడు. బ్రహ్మదేవునికి, సృష్టికి జలముతో అవసరం ఏర్పడినప్పుడు ఈశ్వరుని 

ప్రార్థించగా జలాధిపతియైన  పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించుట జరిగింది. బ్రహ్మ కార్యం పూర్తి 

అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన 

జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించగా బ్రహ్మవలె నన్నాడు కానీ పుష్కరునికి బ్రహ్మను వదలుట ఇష్టము లేదు.. 

అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి  చేసుకొన్న నిర్ణయము ఏమిటంటే గ్రహరూపంలో ఉన్న బృహస్పతి 

మేష వృషభాది పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు,మిగత సంవత్సరములోని  మధ్యాహ్న 

సమయంలో రెండు మూహూర్తములు  పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించుకొన్నారు. 

ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా పుష్కరునితో కూడి యున్న నదికి  వస్తారు కనుక  

పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణముల సారాంశము.

అందరూ పండితులై వుండరు గనుక సామాన్య ప్రజకు సరళమైన రీతిలో సారాంశము చెప్పే ఉద్దేశ్యముతో ఎంతో 

ఆదరముతో మనకు ఈ కథలు అందింపబడినాయి. 

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అన్న పంచ భూతాత్మకమైనది దేహము. దేహి ఉన్నంతవరకు ఈ పంచ 

భూతాలతో సంబంధ బాంధవ్యములు ఉండవలసిందే. ఏది లేకున్నా కష్టమే! ఇందులో మొదటిది నీరు.అందుకే 

'జల్ జో న హోతా తో యే జగ్ జాతా జల్ ' అన్నారు జాతీయ భాషలో! మనలను కాపాడేది దేవతలినపుడు ,మనల

కాపాడే జలము దేవతే కదా!

మొదట పుష్కరము 12 సంవత్సరాలకెందుకు అన్నది చూస్తాము.మనకు ప్రభవ, విభవాది 60 సంవత్సరములు 

వున్నాయి. 60 సంవత్సరములెందుకు అంటే భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 

12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే 

బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం 

పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. 

అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం 

మొదలౌతుందన్నమాట. అది  పుష్కరమునకు బృహస్పతికి గల సంబంధం లేక జల సంబంధం. మనకు 12 

రాశులు . కాబట్టి గురువు ఒకరాశినుండి బయలుదేరి అదే రాశికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. 

ఆ విధంగా 12 సంవత్సరాలు 12 రాశులు 12 నదులు మనకు పునః పునః తెస్తూనే వుంటాయి.

గంగ కు మేషరాశి లో,నర్మద (రేవా) కు వృషభ రాశిలో,సరస్వతికి మిథున రాశిలో, యమునకు కర్కాటక రాశిలో, 

గోదావరికి సింహరాశిలో, కృష్ణకు కన్యారాశిలో, కావేరికి తులారాశిలో, భీమాకు వృశ్చిక రాశిలో పుష్కరవాహినికి ధనుః 

రాశిలో , తుంగభద్రకు మకర రాశిలో , సిందుకు కుంభ రాశిలో, ప్రాణహితకు మీనా రాశిలో పుష్కరాలు 

జరుగుతాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా 

ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, 

చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఇవి అత్యంత ప్రాధాన్యమైనవి.

 మిగిలిన మధ్యకాలములో , మధ్యాహ్న కాలమందు 2 ఘడియలు పుష్కర పుణ్య కాలమున్తుందని శాస్త్రవచనము.

సాధారణంగా పుష్కర కాల నదీ స్నానములలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను 

తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రదమని శాస్త్ర వచనము.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ 

రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పినారని పురాణాలు 

చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు పితృ వియోగము పిదపనే అర్హులు.

ఈ  12 రోజులూ 12 దానాలను కూడా నిర్దేశించినాయి శాస్త్రాలు.

నేటి మానవ జీవనములో కొన్ని మాత్రమె సుసాధ్యములు, కొన్ని సాధ్యములు మిగతావి అసాధ్యములు. చివరి రోజున 

తిల (నువ్వులు ) దానము మంచిది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల 

ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ 

కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు 

చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి 

చేస్తారు. 

ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు, తీరంలో పూజలు,  తర్పణాలు,  

జపాలు, దానాలు చేసే సాంప్రదాయం ఉంది. నీటిలో మానవుంకి ఉపయోగపడే రెండు శక్తులున్నాయని వేదం 

చెప్తుంది. ఒకటి దాహార్తిని తీర్చడం, రెండు దేహ శుద్ధి అంటే శుభ్రపరచడం . ఈ  రెండు బాహ్య శక్తులైతే 

అంతరంగికంగా మేధ్యం,సంప్రోక్షణం, అనే రెండు శక్తులున్నాయని వేదం వివరిస్తుంది. మేధ్యం అంటే  నదిలో 

స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే సంప్రోక్షణం 

అంటే నీటిని చల్లడం వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల చెబుతున్నాయి.నీరు నారాయణ స్వరూపం.  

పాపాలు స్నానంద్వారా పటాపంచలౌతాయని విశ్వసిస్తారు. సాధారణ స్నానమునకంటే తీర్ధ స్నానం ఉత్తమం, 

దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో 

దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,

పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం 

లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ 

పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే  బుద్ధి 

మాంద్యం,అలసత్వం మొదలైన శారీరక ఋగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.

 పుష్కర ఫలితమస్తు

Thursday, 7 May 2015

మనవాళ్ళు తెలుగు మరచిపోతున్నారు



      • మనవాళ్ళు తెలుగు మరచిపోతున్నారు 
        తెలుగును  పిల్లవాళ్ళు మరచి పోతున్నారు అంటుంటే ఏంటో అనుకొన్నాను. మొన్న మా పక్కింటికి బందువులు వచ్చారు. అక్కడ ఒక యీల పిల్ల ఒక ఆవిడను మీరు నాకు ఏమి అవుతారు అంది ఆమె "నీ మేనత్తకు అక్కని అవుతాను కాబట్టి నీకు అత్తనౌతాను  అంది. అత్త అంటే ఆంటీ మేనత్త అంటే ఎవరూ? అంది అక్కడున్న నాకు తల తిరిగింది అ పిల్ల తెలిసి అందో తెలియక అందో తెలియదు గాని తెలుగు భాష కు పడుతున్న గతి మాత్రం తెలుస్తునది.
        Like ·  · Unfollow Post ·  · 20 hours ago
        • Rajasree Raje అక్కడ ణు యీల అవి మిస్ పడ్డాయి. అవి ను బంధువుల పిల్ల
          20 hours ago · Like · 1
        • Vasudevarao Konduru మొన్నీమధ్య తిరుమల కొండ మీద ఒక చిరుత వాహనం క్రింద పడి చనిపోయింది. ఆ ఘటనని వివరిస్తూ, బహుశః తి.తి.దే అధికారి అనుకుంటా, వారు వర్ణించిన తీరు ఈ విధంగా ఉంది. 

          ఒక cheeta down నుంచి up కి ఈ road crosss చేస్తుంది, ఇంతలో ఒక vehicle speed గా వచ్చి cheeta ని hit 
          చేసింది. వెంటనే cheeta died అయ్యింది. మేము ఈ accident ని immediate గా wild life department officials కి inform చేసాము. వారి కోసం wait చేస్తున్నాము. 

          ఇందులో ఎంత తెలుగు ఉందో, ఈ తెలుగుకి తెలుగువాడైన ప్రతివాడు గర్వించవలసిందేనా.
          18 hours ago · Like · 2
        • Seshu Bandaru మీరు గమనించ వలసిన విషయం ఒకటుంది. ఒకవేళ ఆ అధికారి పూర్తిగా తెలుగులో విషయాన్ని వివరిస్తే ఎంతమంది దానిని అర్ధం చూసుకోగలరు అని
        • Rajasree Raje seshu bandaru గారు సరిగ్గా చెప్పారు. నేటి పిల్లలకే కాదు పెద్దలకే తెలుగు రాదూ విచ్చిత్రం ఏమిటి అంటే వల్లి తెలుగు మీడియం లోనే చదవరు అంట
          3 hours ago · Like · 1
        • Vasudevarao Konduru రైలు, బస్సు, కార్, లారీ, సైకిల్, రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్. సామాన్య మానవుడు, పామరుడు కూడా వాడే జన బాహుళ్యం పొందిన ఇలాంటి ఆంగ్ల పదాలకు తెలుగులో సమానాంతర పదాల కోసం ప్రయత్నించకపొయినా, క్రింద(down), మీద(up),రోడ్డు దాటుట (road cross), వాహనం (vehicle), వేగం (speed), గుద్దుట (hit), చనిపోవుట (died), ప్రమాదం (accident), వెంటనే (immediate), వన్య ప్రాణుల సంరక్షణ (wild life protection), తెలియచేయుట (inform). ఇవేమీ శుధ్ధ గ్రాంధిక పదాలు కాదే. వీటిని వాడటానికి తెలుగులో Phd చేయవలసిన అవసరం లేదే. మాతృ భాష మీద పట్టు లేనివాడు, పరాయి భాష మీద పట్టు సాధించలేడన్న సత్యాన్ని ఈ అరకొరక ఆంగ్ల పాండిత్యం కోసం వెంపర్లాడేవాళ్ళు గ్రహించాలి.




          • Cheruku Ramamohanrao వాసుదేవ రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్నే నేను 4,5 రోజులక్రితం వెలిబుచ్చాను . 'మెఅల్స్ అయిందా' అంటే 'just now' అనే తెలుగు ఇప్పుడు మాట్లాడుచున్నాము . భోజనమైందా అంటే నోటి ముత్యాలేమీ రాలి పోవు గదా . just now లో ఏమి తెలుగుంది . భవిష్యత్తు యువతది. శ్రద్ధ చూపితే భాష నిలుస్తుంది. భాష సంస్కృతి రెండూ నాశనమే. అమ్మ నాన్నలు మొదట పిల్లలతో mummy , dady అని అనిపించుకొన గూడదని శపథం చేయవలె . dady sounds as deady and meaning of mummy everybody knows. ఇంకొక హీనమైన పదం వుంది . అది MADEM. idi ma- dame అనే రెండు ఫ్రెంచి పదాల కలయిక . ఆంగ్లములో దాని అర్థము 'my lady' ani.
            'యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః 
            యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్థఫలా క్రియః '
            అన్నారు మన పెద్దలు. ఆడవాళ్ళలో అమ్మవారే కనిపించాలని చిన్న పెద్ద తేడా లేకుండా అందుకే మా కాలములో, మేము ఇప్పుడు కూడా, అమ్మా అనే పిలుస్తాము . ఇప్పటికైనా తెలుగువాడు ఒక్క సారి వళ్ళు దులుపుకొని పొరుగు రాష్ట్రాలను చూసి అయినా నేర్చుకొంటే మంచిది.
          • Vasudevarao Konduru ఎంత సేపు ఒకరు చెపుతుంటేనో, మాట్లాడుతుంటేనో వినటం తప్ప చదివి తెలుసుకుందామన్న ఆసక్తి ఈ తరం వాళ్ళలో చచ్చిపోయింది. కేవలం విని నేర్చుకోవటమనేది అలవరచుకుని, పుస్తక పఠనం మరిచి వ్యావహారిక బాషను మాత్రమే భాషగా గుర్తిస్తే అనర్ధమే ఎక్కువ. పాఠశాలల్లో సైన్స్, లెక్కలు కు ఇచ్చినంత ప్రాధాన్యత అది ఆంగ్లమైన, తెలుగైనా మరో భాషైన, భాష కు లేదు, మొక్కుబడికి కేవలం మార్కుల కోసమే నన్నట్టుగా బోధించటమే తప్ప భాషను పెంపొందిద్దామని లేదు. భాష మీద గాని, ఉచ్చారణ మీద కాని పట్టులేని ఉపాధ్యాయులు, టీవీ ఆంకర్లు, విలేఖరులు, సినిమా రచయితలు, వాటి వాటి యాజమాన్యాలు భాష నాశనానికి తమ వంతు కృషి చేస్తున్నారు


          • Cheruku Ramamohanrao కొందరు పూర్వీకులైన మహానుభావులు తాము మునిగిందే గంగ తాము వలచిందే రంభ యని పుర్రెకు తోచిన ఆలోచనలను అంటగట్టి భాషను ఎట్టకేలకు కట్టకడపటికి చిట్టచివరకు భాషను కాష్టం పైన పడుకోబెట్టడం లో కృతకృత్యులైనారు. 
            అసలు వ్యావహారిక భాష అంటే ఏది. విజయనగరం విశాఖ శ్రీకాకుళం ద
            ా, తూర్పు పశ్చిమ గొదావరిదా విజయవాడ గుంటూరిదా, రాయలసీమదా, ఏది? అందులోకూడా ఏ మాండలీకం. వారు శిష్ట వ్యవహారమనే మాట ఉపయోగించినారు. మరి దుష్ట వ్యవహారాన్ని నిర్వచిన్చినారా .

            తిరిగి కొనసాగిస్తాను
          • Rajavaram Usha నిజమే!ఇంట్లో కొన్నాళ్ళు పూర్తి గ తెలుగు భాషలోనే అందరు మాట్లాడుకుంటే కొంచెం పిల్లలకు కూడా పట్టు దొరుకుతుంది అదేంటో ఆంగ్లము మాట్లాడితే గొప్ప అనుకోవటం ఎక్కువయ్యింది ఈ మధ్య.. ఎవరైనా రహదారి పై మాట మాట అనుకున్నప్పుడు ఒకడు ఆంగ్ల పద ప్రయోగం చేయగానే అవతలి వాడు కొద్దిగా వెనక్కి తగ్గుతాడు అదె.... తెలుగు లోనే మాట్లాడాడు అనుకోండి గొడవ సద్దు మణ గదు ఇలా ప్రత్యక్షం గ చూసాకనే వ్రాస్తున్నాను
          • Rajavaram Usha కనీసం ప్రసార మాధ్యమాల ద్వార నైన తెలుగు భాష పై మక్కువ కలిగించేలా రక్తి కట్టించే తెలుగు కార్యక్రమాలు ప్రసారం అయితే చూసిన కాస్త నేర్చుకుంటారేమో ఈ కాలం కుర్ర కారు
          • Rajavaram Usha ఇలాంటి చర్చ లు అంతర్జాలం లో ఇంకా చాల పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చర్చ ను ప్రారంభించిన రాజశ్రీ గారికి, పాల్గొన్న వారికి నా అభినందనలు



          'face book'