ఇది VVS శర్మ గారి సేకరణ
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 1
(సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరణ)
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
శ్రీకృష్ణ భగవానుడు సుమారు 5000 సంవత్సరాలక్రితము కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి ప్రత్యేకముగాను, సమిష్టిగా కలియుగ మానవాళికీ గీతోపదేశము చేశారు. "అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం,... మధురాధిపతేరఖిలం మధురం" అని చెప్పబడిన కృష్ణుని ఉపదేశముకనుక గీతకూడా మాధుర్యముతో నిండినదే. కలియుగ మానవులకు వరప్రసాదము.
గీత భౌతిక శాస్త్రము కాదు. ఆధ్యాత్మిక విద్య. నిత్యజీవితములో మనుష్యానుభవమునకు వచ్చే ఆనందము, దుఃఖము మనసుకు సంబంధించినవే. అక్కడినుండే మానవునికి అనేక ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం ఇచ్చేదే ఆధ్యాత్మ విద్య. భగవద్గీత సందేహాలు తీర్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. పండిత పామరులందరికీ కూడా వారి వారి పాండిత్యము, బుద్ధివికాసములతో సంబంధములేకుండా అజ్ఞానము, అవిద్య ఏనాడైనా ఆవరించవచ్చును. ఆ అజ్ఞానాన్ని, దానివలన కలిగిన దుఃఖాన్నీ పోగొట్టే శక్తి గీతకు ఉన్నది. ఇది అన్ని వయసులలోనూ కావలసినది. కాని వార్ధక్యములో దానిని ఆశ్రయిస్తున్నారు.
ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు. గీత ఒక్కటి చదివితే వీటన్నిటినీ, పురాణాలను కూడా తెలుసుకున్న వారవుతారు.సాధనామార్గములో ప్రవేశించేవారికి ఇది తొలి సోపానం. పైన పేర్కొనిన గ్రంధాలన్నిటికంటే చదవడానికి తేలిక అయినది, సులభంగా అర్థమయ్యేదీ గీత. తెలుగు, సాహిత్యం, కించిత్ సంస్కృత జ్ఞానం ఉన్నవారు స్వయంగా చదువతగినది. నెట్ లోనే ప్రతిపదార్థముతోకూడా లభిస్తుంది. ఇది సామాన్యులకు చెప్పబడినది. కాలక్రమేణా వేలాది వ్యాఖ్యానాలు వచ్చినా స్వయముగా ఎవరికివారు మూలాన్నీ, సరళమైన అనువాదాన్నీ చదువుకుంటే చాలు. జగద్గురువైన కృష్ణుని తలచుకుని ఒకొక శ్లోకము అన్వయము చేసుకొని చదివేతే చాలు. గీతను చెప్పినది ఒక కవి, పండితుడు, జ్ఞాని లేక యోగి కాదు. సాక్షాత్తూ పరమాత్మ. ప్రతి శ్లోకాన్ని, వాక్యాన్ని పరమ సత్యంగా, స్వతః ప్రమాణంగా తీసుకోవాలి.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 2
శ్రీకృష్ణుడు భూమిపై మానవరూపములో చరించిన భగవంతుడే ఐనా తనకై ప్రత్యేక గుర్తింపు, గౌరవ మర్యాదలు ఆశించలేదు. సామాన్య జనులమధ్య స్వేచ్చగా జీవించాడు. ధర్మ రక్షణకు, దీన జనరక్షణకు అవతరించి తనబోధలకు అనుగుణంగానే జీవించాడు. మానవ జాతిని ఉద్ధరిస్తాననిగాని, ప్రజలను కష్టములనుండి కాపాడుతానని వాగ్దానాలు చేయలేదు. ఆయన బోధ సారాంశం ఇది. ప్రపంచములో ధర్మబద్ధమైన మార్గము, జీవన విధానము ఉన్నాయి. ఆ మార్గమును అనుసరించిన వారిరక్షణ బాధ్యతను తాను నిశ్చయముగా వహించి, వారి ఆధ్యాత్మికోన్నతికి సహకరిస్తానని మాత్రమే చెప్పాడు. తనకు ఆడంబరమైన పూజలు కోరుకోలేదు. భగవద్గీత ఒకప్రత్యేక మార్గమును, జీవన విధానాన్నీ చెప్పలేదు. పాఠకుల సంస్కారాలకు అనుగుణంగా బహువిధములైన అర్థములు వారికి కనబడ వచ్చును. అందుకే భగవద్గీత, కర్మ ప్రతిపాదకమని కొందరూ, భక్తి ప్రధానమని కొందరూ, యోగ మార్గమని కొందరూ, జ్ఞానప్రధానమని మరికొందరూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మములోని అనేక మార్గాలు,ఎవరికివారు తమ స్థితికి తగినట్లు ఎన్నుకోవచ్చును. శ్రద్ధా భక్తులతో పఠించినవారికి సులభమైన తాత్పర్యగ్రంధమే వారికి తగిన మార్గాన్ని సూచింపగలదు.
భగవద్గీతలోని ఆధ్యాత్మిక సందేశము సనాతన ధర్మము యొక్క సంక్షిప్త స్వరూపము. తాను ఎప్పుడో వైవస్వతమనువుకు చెప్పియున్నానని గీతలోనే చెప్పాడు.
శ్రీ-భగవాన్ ఉవాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే'బ్రవీత్ (భ.గీ 4.1)
నాశరహితమగు ఈయోగమును నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వతమనువుకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ విధముగా ఈ గురు పరంపర వైవస్వత మన్వంతరం ఆరంభానికి వెళుతుంది. ఇది రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ ఆవిర్భావం. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకు మహారాజు.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 3
వ్యాసం వశిష్ఠ నప్తారం, శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
వ్యాసుడు వశిష్ఠుడికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, తపోనిధియైన శుకునికి తండ్రి. భగవద్గీతను గురించి చెప్పుకునేటప్పుడు వ్యాసుని స్మరిస్తారు. ఆయన వంశము ఆర్యసంస్కృతికి మరోపేరు. వారి చరిత్రలు స్మరిస్తే ఆయనను స్తోత్రముచేసినట్లే.
భగవద్గీత ధృతరాష్ట్రుని మాటతో ప్రారంభమౌతుంది. యుద్ధములో ఏమిజరుతుందో అన్న ఆసక్తితో వ్యాసుని అర్థించాడు. వ్యాసుడు "యుద్ధముయొక్క పరిణామము ఎలా ఉంటుందో నాకూ తెలుసు, నీకూ తెలుసు, నీవు ఆదృశ్యాలను కళ్ళారా చూచి భరించలేవు. నీకు ఎప్పటికప్పుడు జరిగిన సంఘటనలను చెప్పడానికి సంజయునికి దివ్యదృష్టి ఇస్తున్నాను." అన్నాడు. ధృతరాష్ట్రునికి తన పిల్లలు అధర్మ మార్గంలో ఉన్నారని తెలుసు, అన్యాయంచేశారని తెలుసు. భగవంతుడు పాండవుల పక్షమున ఉన్నాడని తెలుసు. ఐనా ఏదో ఆశ. ఈషణత్రయము వలన వచ్చే దౌర్బల్యమతనిది. ధనేషణ, దారేషణ, పుత్రేషణ - (ధనము, భార్య, పుత్రులపై వ్యామోహము) ఇదే ఈషణ త్రయం. ఇదే మనుష్యునికి బంధనం.
యుద్ధము చేయడం అర్జునునకు స్వధర్మం. దానికై అతడు ఆయుధములతో రథముపై రణరంగానికి వచ్చాడు. స్వధర్మాచరణములో సందేహాలు వచ్చాయి. తన బంధువులచేతిలో తాను చనిపోవచ్చునని అతడు దుఃఖించలేదు. ఎవరిమృత్యువు వారికి దుఃఖప్రదముకాదు. దుఃఖించుటకు తాను ఉండడు. తనకు వచ్చిన సందేహము వేరు. ఇతరులకు దుఃఖకరమైన కర్మనుచేయుట అజ్ఞానమని తోచినది. దుఃఖము కలిగినది. ఈదుఃఖము మోహముచేత కలిగినదని భగవంతుని బోధ. మోహముచేత ఆవరించిన దుఃఖము పోతేనే మనుష్యుడు ఆనందస్వరూపుడై మోక్షసాధనకు అర్హుడౌతాడు. ముక్తికొఱకు సాధనచేయాలి. సాధన చేసే అర్హతకొఱకు మోహము నశించాలి. గీత చివర్లో “మోహముపోయినదా?” అని కృష్ణుడు అర్జునుని అడుగుతాడు. "నష్టే మోహః" అని సమాధానం ఇస్తాడు అర్జునుడు.
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధోత్సాహముతో రెండుసేనలు సమాయత్తమైనాయి. సంజయా! నావారు, పాండవులు ఏమి
చేస్తున్నారు? (కిం అకుర్వత) [ పాండవులు - ఇక్కడ తమ్ముని పిల్లలు కారు, శత్రువులు. ]
భారతీయుల మొదటి పురుషార్థము ధర్మము. భారతము ధర్మశాస్త్రము. భారత యుద్ధము ధర్మసంస్థాపనకు అవతరించిన
శ్రీకృష్ణుని పర్యవేక్షణలో జరిగినది. భగవద్గీత కృష్ణుని బోధ. క్షేత్రము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. అక్కడ జరిగబోవనున్న కర్మ
యుద్ధము. మూలకారణము ధృతరాష్ట్రునికొలువులో వరుసగా జరిగిన అధర్మకృత్యములు. అర్జునుని విషాదము యుద్దములో
తనవలన స్వధర్మనిర్వహణలో చేయబడు కర్మవిషయకమైన ధర్మసందేహము వలన కలిగినది. ఆ స్థితిలో జగద్గురువైన
పరమాత్మ బోధయే గీత.
సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2||
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3||
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4||
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5||
ధృష్టకేతువు చేదిదేశపు రాజు. పాండవపక్షాన పోరిన యోధుడు. ఇతడు శిశుపాలుని కుమారుడు. శిశుపాలుడు కుంతీ, వసుదేవుల
సోదరి శ్రుతకీర్తి కుమారుడు. శిశుపాలుడు యుధిష్ఠిరుని రాజసూయయాగములో శ్రీకృష్ణుని నిందించి అతని సుదర్శన చక్రానికి బలి
అయ్యాడు. ధృష్టకేతువు ద్రోణుని చేతులో యుద్ధములో నిహతుడైనాడు. చేకితానుడు యాదవులలో వృష్ణివంశపు వీరుడు.
భారతయుద్ధములో పాండవుల పక్షాన పోరాడి దుర్యోధనుని చేతిలో మరణించాడు. కుంతిభోజుడు కుంతీదేవి పెంపుడు తండ్రి. అతని
కుమారులు పురుజిత్, కుంతిభోజుడు (తండ్రిపేరే) . శ్లోకము 1.6 లో చెప్పబడిన యుధామన్యుడు,ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన
అభిమన్యుడు, ఉపపాండవులూ వీరంతా కూడా పాండవపక్షాన ఉన్న మహరథులు. యుధామన్య, ఉత్తమౌజులు పాంచాలరాజు
ద్రుపదుని కుమారులు. శిబిదేశపు రాజు శైబ్యుడు. ఇతడి సోదరి యుధిష్ఠిరుని మరొక భార్య. ఈ శైబ్యుడనే పేరు గలవారు మరి కొందరు
కూడా మహాభారతములో కనుపిస్తారు. గీతలో చెప్పబడిన కాశీరాజుపేరు తెలియదు.
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||1-8||
పాండవ సైన్యములోని మహారథులను పరిచయం చేశాక దుర్యోధనుడు కౌరవ సైన్యములోని వీరులను గుర్తుచేస్తాడు. “తమరు,
భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి (సోమదత్తుని కుమారుడు భూరిశ్రవస్సు సోమదత్తుడు బాహ్లికుని
కుమారుడు. బాహ్లికుడు శంతనుని అన్నగారు..) వంటి మహారథులేగాక ఈ యుద్ధంలో నాకై ప్రాణము ధారపోయడానికి సిద్ధముగా
ఉన్న వీరులు అనేకులున్నారు.” (1.6 - 1.9)
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||
యుద్ధరంభంలో రాజు నోట వెడలిన అశ్లీలపదం “త్యక్తజీవితాః”. ఈ వాక్యం అశుభ సూచకం. ఈ వీరులందరూ భగవంతుడు సంకల్పించిన
మహాయజ్ఞంలో ఆహుతి కానున్న సమిధలవలే పేర్చబడినట్లున్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||
ఇక్కడ మన సేన భీష్మునిచేత రక్షింపబడుతున్నది. అక్కడ పాండవుల సేన భీమునిచేత రక్షింపబడుచున్నది. కౌరవసేనకు అపర్యాప్తం
(అసంఖ్యాకమైన) బలం, శత్రుసేనకు పర్యాప్తం (పరిమిత) అని పదాలు వాడబడ్డాయి. 11:7 ఉన్నసేనలకు ఇది సరియైన వర్ణన
కాదేమో. దుర్యోధనుని అతి విశ్వాసాన్ని సూచిస్తుంది, భీష్ముడు కౌరవ సేనాధిపతి. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనాధిపతి. తరువాత
శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణుని భీష్మాచార్యుల రక్షణకు నియమిస్తాడు "భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి" ఇక్కడ రెండు పనులు
జరుగుతున్నాయి. ఇరుసేనలను నడిపించే వారు సేనాధిపతులు భీష్ముడు, ధృష్టద్యుమ్నుడు. సేనాధిపతుల రక్షణ చూసుకునేవారు
ద్రోణుడు, భీముడు.
తస్య సఞ్జనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||
దుర్యోధనునికి హర్షోత్సాహాలు కలిగించడానికి కురువృద్ధుడు, పితామహుడు, ప్రతాపము గలవాడు అయిన భీష్ముడు సింహనాదముచేసి
తన శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవసేనలోని అందరూ తమ తమ శంఖములు, భేరీలు, తప్పెటలు, గోముఖములు,
మృదంగములు మొదలైన వాయిద్యములు మ్రోగించారు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15||
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్ ||1-19||
మ్రోగించారు. ఒక శ్లోకములో భీష్ముని సింహనాదాన్నీ,శంఖారావాన్నీ చూపించి, మరియొక శ్లోకం మిగిలిన కౌరవ సైన్య రణఘోషకు
వ్యాసుడు వినియోగించాడు. ఎక్కడ శుభసూచనలు లేవు. పాండవ యుద్ధారంభం సూచించే శ్లోకాలు యుద్ధములో పాండవవిజయాన్ని
చెప్పకయే చెబుతున్నాయి. శ్లోకములు 1.14-1.15 లో కృష్ణార్జునులనుఇలా వర్ణించాడు. తెల్లని హయములు కలిగిన దివ్యరథములో
కూర్చున్న శ్రీకృష్ణార్జునులు మొదలుగా పాంచజన్యం, దేవదత్తం తమ దివ్యశంఖాలను పూరించారు. గీత చివరి శ్లోకభావం ఇక్కడనే
సూచింపబడినది.
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానితి మతిర్మమ || 18.78||
యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు, ధనుర్ధరుడైన పార్థుడు ఎక్కడనుండెదరో అక్కడ శ్రీ, విజయము శాశ్వతముగా ఉండునని నా
నమ్మకము.
పాంచజన్యము, దేవదత్తము, పౌండ్రము, అనంతవిజయము, సుఘోష, మణిపుష్పకము అనే నామములుకూడా
విజయసూచకములుగా ప్రత్యేకము చెప్పబడినవి. ఇవి వరుసగా కృష్ణుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకుల, సహదేవులు
పూరించిన శంఖములు. దుర్యోధనాదులు యుద్ధమునకు కారణమైతే పాండవ ప్రతిక్రియ కార్యము. యుద్ధము కారణము. అర్జునునికి
లభించిన జ్ఞానము కార్యము. పాండవసేనలోని మహారథులు కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు,
ఉపపాండవులు, అభిమన్యుడు వేరువేరుగా తమ తమ శంఖములను పూరించారు. పాండవ వీరుల శంఖనాదములు
భూమ్యాకాశములను దద్దరిల్ల చేసి దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను.
శ్రీకృష్ణబోధామృతం - భగవద్గీత
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||
సంజయుడు ఇంకా ఇలా అన్నాడు. "ధృతరాష్ట్ర మహారాజా!ఇక ఆయుధములు ప్రయోగింపబడే ముందుగా, యుద్ధ సన్నద్ధులైయున్న
కౌరవ సైన్యాన్ని చూచి ధనస్సును చేబూని కపిధ్వజముగల రథారూఢుడైన అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు". "అచ్యుతా! ఉభయ
సైన్యముల మధ్య నా రథము నిలుపుము."
యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||
ఎక్కడి నుండి నేను ఈ యుద్ధారంభమందు పోరు సలుపబోయే యుద్ధాభిలాషులను చక్కగా చూడగలనో అక్కడ (రథము నిలుపుము.)
యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||
దుష్టబుద్ధియైన దుర్యోధనునకు ప్రియమొనగూర్చుటకు ఇచటకుచేరిన యోధులను నేను చూచెదను.
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||
సంజయుడు చెబుతున్నాడు "ఓ భారతా! (ధృతరాష్ట్రా!) అర్జునుడిట్లు చెప్పగా కృష్ణుడు ఉత్తమమైన తమ రథమును భీష్మ ద్రోణాది
ప్రముఖులు,ఇతర రాజుల ఎదుట నిలిపి “ఈ వేచియున్న కౌరవులను చూడుము"అని అన్నాడు. [గుడాకేశుడు = అర్జునుడు, శబ్ద
కల్పద్రుమము ప్రకారము - నిద్ర, అలసత్వము, ఇంద్రియములు - వీనిని జయించినవాడు, జటాధరుడు అని మరియొక అర్థము.
హృషీకేశ = ఇంద్రియములకు అధిపతి, విష్ణువు, పరమాత్మ]
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||
అప్పుడు అర్జునుడు రెండు సేనలయందు నిలియున్న తాతతండ్రులను, అన్నదమ్ములను, పుత్రపౌత్రులను,ఆచార్యులను,మామలను,
స్నేహితులను అందరినీ చూచెను. ఇది అర్జునుని కదిలించిన సన్నివేశం. ఎంత వీరుడైనా సన్నిహితులతో యుద్ధము చేసి వారిని
చంపడము, లేక వారిచేతులో చావడమనేది భయంకరమైన ఆపద. తమంతతాము సుఖముగా ఉన్న అనేక రాజులు తమపోరుకై
ఇరుప్రక్కలా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా నిలిచారు.
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||1-30||
అర్జునుడు యుద్దభూమియందున్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచు ఇట్లుచెప్పెను: నా
శరీరమందు వణుకు పుట్టుచున్నది. నోరు ఎండుకొనిపోవుచున్నది. అవయవములు పట్లు తప్పుచున్నవి. గాండీవము చేతినుండి
జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది. నిలబడుటకుకూడా శక్తిలేకున్నది. మనసు గిఱ్ఱున తిరుగుతున్నది.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31||
ఓకృష్ణా! అపశకునములను చూచుచున్నాను.యుద్ధమందు స్వజనులను చంపుట వలన పొందభోయే లాభము నాకు
కనపడుటలేదు.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||
ఓ గోవిందా! నేను విజయమును కాని, రాజ్యమును కాని, సుఖములను కాని కోరను. రాజ్యముతోగాని, భోగములతోగాని,
జీవించుటవలనగాని మనకేమి ప్రయోజనము?
మేనమామలు,బావమఱదులు, సంబంధులు ధనములపై, ప్రాణములపై ఆశలువదలుకొని ఈ రణరంగముమీద
నిలబడియున్నారు. వీరు నన్ను చంపువారలైనను, త్రైలోక్య రాజ్యాధిపత్యమునకైనను నేను చంపను. ఇక భూలోకరాజ్యము
గురించి వేరే చెప్పవలెనా?
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
12
పాపమే వచ్చును. (ఎందుకనగా వారి పక్షమున నిలుచున్నవారిలో నాబంధు మిత్రులు, మాననీయులైన పెద్దలు, ఆచార్యులు
ఉన్నారు.) ఇక్కడ వాడిన పదము "హత్వైతాన్ ఆతతాయినః". అర్థం "ఈ మహాపాపులను చంపుటవలన". ఆరు మహాపాపములు
చేయువారికి ఈ ఆతతాయులు పదము సరిపోతుంది. అవి - ఇంటికి నిప్పు అంటించు వారు, విష ప్రయోగము చేయువారు,
ఆయుధములతో హింసించువారు, ధనమపహరించువారు, భూమిని ఆక్రమించువారు, ఇతరుల భార్యలను హరించువారు. కౌరవులు,
వారిమిత్రులలో కొందరు పాండవుల విషయములో ఈ పాప కర్మలు చేశారు.
సుఖపడగలము. రాజ్యలోభముచేత చిత్తభ్రమకల్గిన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన
కలుగు పాపమును గమనించరు.
అర్థముకాకున్నది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
సేనాసమూహమంతా నాశనమైపోతే అనాదిగా వస్తున్న సమాజధర్మములన్నీ నశిస్తాయి. అధర్మవృద్ధిచేత స్త్రీలు చెడిపోతారు.
వర్ణసంకరమువలన సంఘములో పద్ధతులన్నీ నశిస్తాయి. పితృదేవతలు శ్రాద్ధాదులు లేక అధోగతిని పొందుతారు. ఈ
దోషముచేత మానవులకు శాశ్వత నరక నివాసము కలుగుతుందని మనము వినియున్నాము."
శ్లోకములో వర్ణము అనే పదానికి ఆధునిక సమాజములో రాజకీయ, సామాజిక శాస్త్రవేత్తలు వాడుతున్న caste system
అనేపదానికి చాలా తేడాలు ఉన్నాయి. భారతీయ సమాజంలో caste అనే జాతి సూచక పోర్చుగీస్ పదం పాశ్చాత్యుల కల్పన.
వర్ణం అనే పదం (4.13)లో చూదాము. కులమంటే సమూహం (set), కుటుంబం, బంధువర్గం, వంశము (కుల దీపకుడు), గో-
కులము, కుల పర్వతము, అలి-కులము (తుమ్మెదల గుంపు), అలక-కులము (కేశరాశి). ఈ శ్లోకములలో కులమనే పదానికి
సమాజమనే అర్థం.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
16
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జునుడు అడిగెను " ఓకృష్ణా! పితామహుడు భీష్ముడు, ఆచార్యుడు ద్రోణుడు పూజార్హులు. అట్టివారిపై నేను బాణములను వదలి యుద్ధమెట్లుచేయగలను?" ఇది నిజముగా అర్జునునికి కలిగిన ధర్మ సందేహమే?
గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||
మహానుభావులైన గురువులను చంపకయుండి ఈ లోకమందు భిక్షాన్నమైనను తిని బ్రతుకవచ్చుకదా! వారిని చంపినయెడల వారిరక్తముతో తడసిన రాజ్యభోగములు అనుభవింపవలసి వచ్చును.
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
ఈ యుద్ధమున మనము గెల్తుమో, వారుగెల్తురో తెలియదు. ఆరెంటిలో ఏదిశ్రేయస్కరమో కూడ మనకు తెలియదు. ఎవరిని చంపి మనము జీవింపజాలమో అట్టి ధార్తరాష్ట్రులు మన ఎదుట నిలిచియున్నారు. ఈ స్థితిలో యుద్ధమెలాగున చేయగలనని అర్జునుని బాధ.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
17
కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మేశిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్యము (కృపణత్వము) అనేదోషము నన్ను ఆవహించినది. అందుచేత నాకు ధర్మ విషయమై సందేహము కలిగినది. మిమ్ములను అడుగుతున్నాను. ఏదినిశ్చయముగా శ్రేయస్కరమో నాకు చెప్పుము. నేను నీకు శిష్యుడను. నీశరణుకోరిన నన్ను శాసింపుము.
ఇక్కడ కార్పణ్యదోషము అనే పదము, కార్పణ్యదోషోపహతస్వభావః అనే వాక్యము కొంచెము పరిశీలించాలి. కార్పణ్యమనే పదానికి కృపణత్వము, క్రోధము, లుబ్ధత్వము, దైన్యము, దౌర్బల్యము అనే అర్థాలే కాక జాలి, దయ వంటి అర్థాలు కూడా ఉన్నాయి. శత్రుస్థానములో గురువులు, బంధువులు ఉండటం వలన ధర్మానికి, మోహబంధానికి కలిగిన సంఘర్షణ వలన ఒక మనోదౌర్బల్యం ఆవహించి స్వయంగా నిర్ణయము తీసికొనే శక్తి కోల్పోయాడు. (Arjuna says - I feel dejected or despondent)
కాని ఇక్కడ అతనికి ఈపరిస్థితిలో కర్తవ్యబోధ చేసేవారిని శ్రేయోదాయకమైన మార్గము చూపించగలవారి ఆవశ్యకత కలిగినది. శ్రేయస్సు అంటే ఇహమేకాక పరాన్ని గురించిన ఆలోచన కూడా ఉన్నది.అందుచేత కృపణత్వమంటే ఆత్మజ్ఞాన శూన్యత అనికూడా అర్థంచెప్పుకోవచ్చు. ఇహమంటే యుద్ధములో విజయం. పరమంటే యుద్ధములో మరణిస్తే జీవునకు లభించే ఉత్తమగతి.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||
భూలోకమున శత్రువులులేని సమృద్ధమైన రాజ్యమును, దేవతలపై ఆధిపత్యమును పొందినను ఇంద్రియములను తపింపచేయుచున్న నాశోకమును పోగొట్టగలదానిని కనుగొనలేక యున్నాను.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
18
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||
సంజయుడిట్లు చెప్పెను "ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి చివరకు "నేను యుద్ధము చేయను" అనిచెప్పి మౌనము వహించెను.
(2.7) శ్లోకములో "ఏదినిశ్చయముగా శ్రేయస్కరమో నాకు చెప్పుము (శాధి మాం త్వాం ప్రపన్నమ్)" అని అడిగిన అర్జునుడు, కృష్ణుడు ఇంకా తన ప్రతిస్పందన తెలియజేయకుండానే "నేను యుద్ధము చేయను" అనే నిర్ణయానికి వచ్చేశాడు. మనలో అనేకులము మన నిర్ణయం ఏదో తీసుకొని అప్పుడు ఆప్తుల వద్దకు సలహాకు వెడతాము. వారు మన చర్యను సమర్థింపక పొతే మనకు తోచినట్లే చేసే అవకాశమున్నది. ముహూర్తాలు, జాతకాలు, వాస్తువిషయాలు వీటిలోకూడా మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇక్కడ అర్జునుడు పూర్తిగా తన నిర్ణయాన్ని కృష్ణునికి వదలలేదు. తన దుఃఖానికి కారణం తన ధర్మ నిర్ణయంపై నమ్మకమే. గురువులను, వృద్ధులను, బంధువులను చంపి రాజ్యమును దక్కించుకోవడము అధర్మము, పాపభూయిష్టము అనే భావన కలిగింది. తనుచేస్తున్నది ధర్మచింతన అనుకున్నాడు. శ్రీకృష్ణుడు వారందరినీ చంపడం పాపము కాదు అని చెప్పలేదు. అది భగవంతుడు అనవలసిన మాట కాదు. అందుచేత యుద్ధము చేయడమే నీకర్తవ్యమని బోధించలేదు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, కర్మ, కర్మ త్యాగము వంటివిషయాలు బోధించాడు. అర్జునునికి నేరుగా సమాధానం చెప్పకుండా తనకే సమాధానం లభించేటట్లు తత్త్వ విషయాలు బోధించాడు. ఇదే గీత ఉపదేశ క్రమం.
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః|| 2-10 ||
ఓ ధృతరాష్త్ర మహారాజా! రెండు సేనలమధ్య రథములో కూర్చుని విలపించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు ముఖముతో ఇట్లుపలికెను.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
19
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||
భగవానుడు ఇట్లుచెప్పెను. "అర్జునా! నీవు శోకింపదగని దానినిగురించి శోకిస్తున్నావు. ధర్మసూక్ష్మములు తెలిసిన వాని వలే బుద్ధివాదము చేయుచున్నావు. నిజమైన పండితులు, జ్ఞానులు మరణించిన వారిని గురించిగాని, జీవించియున్న వారినిగురించిగాని ఎన్నడును దుఃఖించరు".
కృష్ణుని దృష్టిలో అర్జునునికి కలిగిన ఈ మోహము రెండు విధములు: భీష్మ ద్రోణులను తానే చంపుతున్నానని భావించుట, తన కర్మకు సంబంధించిన ధర్మాధర్మ విచారణ చేయగలనని అనుకొనుట.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 2-12 ||
నేను, నీవు, ఈ రాజులందరూ లేనికాలము ఇదివరకు లేదు, ఇక ముందు ఉండదు.
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||
జీవునికి శరీరములో బాల్య, యౌవన, వార్ధక్యావస్థలు ఎట్లుకలుగుతున్నవో మరణించినతరువాత మరియొకదేహమట్లే లభించుచున్నది. దీనివిషయమై జ్ఞానులెవరూ మోహముచెంది శోకింపరు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత|| 2-14 ||
మాత్రాస్పర్శ = స్పర్శాది ఇంద్రియములచేత విషయములను తెలుసుకొనుట (sensory perception); ఇది జీవ లక్షణము. ఓఅర్జునా! దీనివలన శీతోష్ణములు, సుఖ దుఃఖములు జీవులు అనుభవిస్తున్నారు. ఇవి అనిత్యములు; రాకపోకలున్నవి. అందుచేత ఓర్పు వహించుము. (తితిక్ష = ఓర్పు)
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||
ఓ పురుష శ్రేష్ఠుడవైన అర్జునా! ఎవరిని ఈ ఇంద్రియజనిత లక్షణములు బాధింపవో, ఎవరు సుఖదుఃఖములయందు సమభావము కలిగియుండునో అట్టిధీరుడే మోక్షమునకు, అమృతత్వమునకు అర్హుడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
20
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్తస్త్వనయోస్తత్త్వదర్శ ిభిః|| 2-16 ||
న అసత్ విద్యతే భావః అసత్యములైన వానికి ఉనికిలేదు). నిన్న లేనివి, ఈ రోజు ఉన్నవి, రేపు లేనివి (దేహాదులు కూడా) అసత్యములే. న అభావ విద్యతే సతః సత్యమైన వాటికి (ఆత్మ) అభావము (లేకపోవుట) లేదు). తత్త్వదర్శులైన వారు (seers of truth) ఈ రెండిటి నిర్ణయమును బాగుగా గ్రహించియున్నారు.
దీనిని అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు. "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు ఇది ప్రమాణం. సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు.
ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి. ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము. ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||
ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు.
ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము. వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము (gravitational field) అనవచ్చును,
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
21
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత|| 2-18 ||
అంతవంత ఇమేదేహా = ఈ దేహము నశించునది. కాని ఈదేహమును ధరించిన దేహి (శారీరకుడు) నిత్యుడు, నాశరహితుడు. అప్రమేయుడు (పరిమాణరహితుడు). తస్మాత్ యుద్ధ్యస్వ భారతః (ఓ భారతా! అందుచేత యుద్ధముచేయుము.)
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే|| 2-19 ||
ఎవరు ఈ ఆత్మను చంపువానిగనో,చంపబడువానిగనో భావింతురో వారు వాస్తవము తెలియనివారు. యదార్థముగా ఈ ఆత్మ దేనినీ చంపుటలేదు, దేనిచేత చంపబడుటలేదు.
22
న జాయతే మ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే|| 2-20 ||
ఈ ఆత్మకు పుట్టుక లేదు, మృత్యువులేదు. ఒకప్పుడు లేక క్రొత్తగా ఉండి మరల లేకుండువాడు కాడు. జననము లేనివాడు, నిత్యుడు,శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను,చావనివాడు. శరీరానికే పుట్టుక, నశించుట - కాని దానిలోనున్న ఆత్మవస్తువుకు నాశనములేదని భగవంతుని మాట.
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్|| 2-21 ||
అర్జునా! ఈ ఆత్మను ఎవరు నాశనములేనిదిగాను, నిత్యముగాను, ఎరుంగునో, అట్టివాడు ఒకనిని ఎట్లు చంపించగలడు, లేదా చంపగలడు.
యుద్ధరంగంలో అర్జునునికి అనేక ప్రశ్నలు వచ్చాయి. గురువులను, పెద్దలను, అనేక బంధువులను కేవలము రాజ్యకాంక్షతో తాను యుద్ధముచేసి చంపుట అధర్మమనే భావన కలిగినది. ఆస్థితిలో కృష్ణుని అడిగితే వారిని చంపమని ప్రోత్సహిస్తాడేమో అనే భావనకూడా వచ్చింది. అందుకే తనధర్మ సందేహాలను తీర్చమని అడుగుతోనే "నేను యుద్ధము చేయను" అని పలికి రథములో చదికిల పడ్డాడు. కృష్ణుడు తన ధర్మ నిర్ణయం ప్రకటించకుండా అతని ఆలోచనా ధారను గుర్తించి, అతడు ముఖతా అడుగని ప్రశ్నపరంపరను తానే ఊహించి వరుసగా సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుచేత “యుద్ధములో భీష్మద్రోణాదులను నీవు చంపగలనని అనుకోవడము, నేను నీ చేత చంపించగలనని అనుకోవడమూ కూడా అసత్యమే” అని కృష్ణుడు చెబుతున్నాడు.
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి|| 2-26 ||
అర్జునా! ఒకవేళ ఈ ఆత్మ (శరీరముతో సహా) నిత్యము పుట్టుచు, చచ్చుచూ ఉన్నట్లు తలచిననూ అట్టి స్థితియందు కూడా
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||
పుట్టినవారికి మరణం తప్పదు. మరణించినవారికి తిరిగి పుట్టడం తప్పదు. ఇది తప్పనిసరి అయినప్పుడు ఈ విషయమై
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 1
(సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరణ)
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
శ్రీకృష్ణ భగవానుడు సుమారు 5000 సంవత్సరాలక్రితము కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునునికి ప్రత్యేకముగాను, సమిష్టిగా కలియుగ మానవాళికీ గీతోపదేశము చేశారు. "అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం,... మధురాధిపతేరఖిలం మధురం" అని చెప్పబడిన కృష్ణుని ఉపదేశముకనుక గీతకూడా మాధుర్యముతో నిండినదే. కలియుగ మానవులకు వరప్రసాదము.
గీత భౌతిక శాస్త్రము కాదు. ఆధ్యాత్మిక విద్య. నిత్యజీవితములో మనుష్యానుభవమునకు వచ్చే ఆనందము, దుఃఖము మనసుకు సంబంధించినవే. అక్కడినుండే మానవునికి అనేక ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం ఇచ్చేదే ఆధ్యాత్మ విద్య. భగవద్గీత సందేహాలు తీర్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. పండిత పామరులందరికీ కూడా వారి వారి పాండిత్యము, బుద్ధివికాసములతో సంబంధములేకుండా అజ్ఞానము, అవిద్య ఏనాడైనా ఆవరించవచ్చును. ఆ అజ్ఞానాన్ని, దానివలన కలిగిన దుఃఖాన్నీ పోగొట్టే శక్తి గీతకు ఉన్నది. ఇది అన్ని వయసులలోనూ కావలసినది. కాని వార్ధక్యములో దానిని ఆశ్రయిస్తున్నారు.
ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు. గీత ఒక్కటి చదివితే వీటన్నిటినీ, పురాణాలను కూడా తెలుసుకున్న వారవుతారు.సాధనామార్గములో ప్రవేశించేవారికి ఇది తొలి సోపానం. పైన పేర్కొనిన గ్రంధాలన్నిటికంటే చదవడానికి తేలిక అయినది, సులభంగా అర్థమయ్యేదీ గీత. తెలుగు, సాహిత్యం, కించిత్ సంస్కృత జ్ఞానం ఉన్నవారు స్వయంగా చదువతగినది. నెట్ లోనే ప్రతిపదార్థముతోకూడా లభిస్తుంది. ఇది సామాన్యులకు చెప్పబడినది. కాలక్రమేణా వేలాది వ్యాఖ్యానాలు వచ్చినా స్వయముగా ఎవరికివారు మూలాన్నీ, సరళమైన అనువాదాన్నీ చదువుకుంటే చాలు. జగద్గురువైన కృష్ణుని తలచుకుని ఒకొక శ్లోకము అన్వయము చేసుకొని చదివేతే చాలు. గీతను చెప్పినది ఒక కవి, పండితుడు, జ్ఞాని లేక యోగి కాదు. సాక్షాత్తూ పరమాత్మ. ప్రతి శ్లోకాన్ని, వాక్యాన్ని పరమ సత్యంగా, స్వతః ప్రమాణంగా తీసుకోవాలి.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 2
శ్రీకృష్ణుడు భూమిపై మానవరూపములో చరించిన భగవంతుడే ఐనా తనకై ప్రత్యేక గుర్తింపు, గౌరవ మర్యాదలు ఆశించలేదు. సామాన్య జనులమధ్య స్వేచ్చగా జీవించాడు. ధర్మ రక్షణకు, దీన జనరక్షణకు అవతరించి తనబోధలకు అనుగుణంగానే జీవించాడు. మానవ జాతిని ఉద్ధరిస్తాననిగాని, ప్రజలను కష్టములనుండి కాపాడుతానని వాగ్దానాలు చేయలేదు. ఆయన బోధ సారాంశం ఇది. ప్రపంచములో ధర్మబద్ధమైన మార్గము, జీవన విధానము ఉన్నాయి. ఆ మార్గమును అనుసరించిన వారిరక్షణ బాధ్యతను తాను నిశ్చయముగా వహించి, వారి ఆధ్యాత్మికోన్నతికి సహకరిస్తానని మాత్రమే చెప్పాడు. తనకు ఆడంబరమైన పూజలు కోరుకోలేదు. భగవద్గీత ఒకప్రత్యేక మార్గమును, జీవన విధానాన్నీ చెప్పలేదు. పాఠకుల సంస్కారాలకు అనుగుణంగా బహువిధములైన అర్థములు వారికి కనబడ వచ్చును. అందుకే భగవద్గీత, కర్మ ప్రతిపాదకమని కొందరూ, భక్తి ప్రధానమని కొందరూ, యోగ మార్గమని కొందరూ, జ్ఞానప్రధానమని మరికొందరూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మములోని అనేక మార్గాలు,ఎవరికివారు తమ స్థితికి తగినట్లు ఎన్నుకోవచ్చును. శ్రద్ధా భక్తులతో పఠించినవారికి సులభమైన తాత్పర్యగ్రంధమే వారికి తగిన మార్గాన్ని సూచింపగలదు.
భగవద్గీతలోని ఆధ్యాత్మిక సందేశము సనాతన ధర్మము యొక్క సంక్షిప్త స్వరూపము. తాను ఎప్పుడో వైవస్వతమనువుకు చెప్పియున్నానని గీతలోనే చెప్పాడు.
శ్రీ-భగవాన్ ఉవాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే'బ్రవీత్ (భ.గీ 4.1)
నాశరహితమగు ఈయోగమును నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వతమనువుకు ఉపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ విధముగా ఈ గురు పరంపర వైవస్వత మన్వంతరం ఆరంభానికి వెళుతుంది. ఇది రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ ఆవిర్భావం. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకు మహారాజు.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత - 3
వ్యాసం వశిష్ఠ నప్తారం, శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
వ్యాసుడు వశిష్ఠుడికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, తపోనిధియైన శుకునికి తండ్రి. భగవద్గీతను గురించి చెప్పుకునేటప్పుడు వ్యాసుని స్మరిస్తారు. ఆయన వంశము ఆర్యసంస్కృతికి మరోపేరు. వారి చరిత్రలు స్మరిస్తే ఆయనను స్తోత్రముచేసినట్లే.
భగవద్గీత ధృతరాష్ట్రుని మాటతో ప్రారంభమౌతుంది. యుద్ధములో ఏమిజరుతుందో అన్న ఆసక్తితో వ్యాసుని అర్థించాడు. వ్యాసుడు "యుద్ధముయొక్క పరిణామము ఎలా ఉంటుందో నాకూ తెలుసు, నీకూ తెలుసు, నీవు ఆదృశ్యాలను కళ్ళారా చూచి భరించలేవు. నీకు ఎప్పటికప్పుడు జరిగిన సంఘటనలను చెప్పడానికి సంజయునికి దివ్యదృష్టి ఇస్తున్నాను." అన్నాడు. ధృతరాష్ట్రునికి తన పిల్లలు అధర్మ మార్గంలో ఉన్నారని తెలుసు, అన్యాయంచేశారని తెలుసు. భగవంతుడు పాండవుల పక్షమున ఉన్నాడని తెలుసు. ఐనా ఏదో ఆశ. ఈషణత్రయము వలన వచ్చే దౌర్బల్యమతనిది. ధనేషణ, దారేషణ, పుత్రేషణ - (ధనము, భార్య, పుత్రులపై వ్యామోహము) ఇదే ఈషణ త్రయం. ఇదే మనుష్యునికి బంధనం.
యుద్ధము చేయడం అర్జునునకు స్వధర్మం. దానికై అతడు ఆయుధములతో రథముపై రణరంగానికి వచ్చాడు. స్వధర్మాచరణములో సందేహాలు వచ్చాయి. తన బంధువులచేతిలో తాను చనిపోవచ్చునని అతడు దుఃఖించలేదు. ఎవరిమృత్యువు వారికి దుఃఖప్రదముకాదు. దుఃఖించుటకు తాను ఉండడు. తనకు వచ్చిన సందేహము వేరు. ఇతరులకు దుఃఖకరమైన కర్మనుచేయుట అజ్ఞానమని తోచినది. దుఃఖము కలిగినది. ఈదుఃఖము మోహముచేత కలిగినదని భగవంతుని బోధ. మోహముచేత ఆవరించిన దుఃఖము పోతేనే మనుష్యుడు ఆనందస్వరూపుడై మోక్షసాధనకు అర్హుడౌతాడు. ముక్తికొఱకు సాధనచేయాలి. సాధన చేసే అర్హతకొఱకు మోహము నశించాలి. గీత చివర్లో “మోహముపోయినదా?” అని కృష్ణుడు అర్జునుని అడుగుతాడు. "నష్టే మోహః" అని సమాధానం ఇస్తాడు అర్జునుడు.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
4
భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయునితో అన్న మాటలతో ప్రారంభమౌతుంది.
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||
4
భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయునితో అన్న మాటలతో ప్రారంభమౌతుంది.
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధోత్సాహముతో రెండుసేనలు సమాయత్తమైనాయి. సంజయా! నావారు, పాండవులు ఏమి
చేస్తున్నారు? (కిం అకుర్వత) [ పాండవులు - ఇక్కడ తమ్ముని పిల్లలు కారు, శత్రువులు. ]
భారతీయుల మొదటి పురుషార్థము ధర్మము. భారతము ధర్మశాస్త్రము. భారత యుద్ధము ధర్మసంస్థాపనకు అవతరించిన
శ్రీకృష్ణుని పర్యవేక్షణలో జరిగినది. భగవద్గీత కృష్ణుని బోధ. క్షేత్రము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. అక్కడ జరిగబోవనున్న కర్మ
యుద్ధము. మూలకారణము ధృతరాష్ట్రునికొలువులో వరుసగా జరిగిన అధర్మకృత్యములు. అర్జునుని విషాదము యుద్దములో
తనవలన స్వధర్మనిర్వహణలో చేయబడు కర్మవిషయకమైన ధర్మసందేహము వలన కలిగినది. ఆ స్థితిలో జగద్గురువైన
పరమాత్మ బోధయే గీత.
సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2||
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3||
నీకొడుకైన రాజరాజు పాండవసేనను కలియజూచి గురువైన ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. “నీశిష్యుడైన
ద్రుపదపుత్రుడు (ధృష్టద్యుమ్నుడు) (ఇది ద్రోణుని కోపంపెంచడానికి అన్నది) పాండవుల సేనకు పన్నిన వ్యూహము చూడండి"
ద్రుపదపుత్రుడు (ధృష్టద్యుమ్నుడు) (ఇది ద్రోణుని కోపంపెంచడానికి అన్నది) పాండవుల సేనకు పన్నిన వ్యూహము చూడండి"
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4||
దుర్యోధనుడు పాండవ వీరులను చూపించడములోకూడా ఒక క్రమంలో ఎవరి పేరు తరువాత ఎవరిది చెప్పాలో తెలుసుకొని
ద్రోణునికి చూపిస్తాడు. ఇది ఒక విశేషము. దుర్యోధనుడు, భీముడు బలరాముని శిష్యులు, దుర్యోధనుడు ప్రియ శిష్యుడు.
ఎదుటివారి బలాబలాలు తెలుసుకునే విద్య బలరాముని నుండే దుర్యోధనునికి వచ్చినది. తనకు సమానమైన భీమునితో
ప్రారంభించి భీమార్జునులతో సమానమైన ఇతరవీరులు యుయుధాన, విరాట, ద్రుపదులను చూపిస్తాడు. ఎవరీ
యుయుధానుడు? యాదవవీరుడైన సాత్యకినే యుయుధానుడనీ, ఇంకా అనేక ఇతరనామాలతో పిలుస్తారు. అతడు
మహాభారత యుద్ధములో మరణించని అతికొద్దిమంది వీరులలో ఒకడు. పాండవులసేనలో ఒక అక్షౌహిణికి సేనాధిపతి.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
5
ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5||
ధృష్టకేతువు చేదిదేశపు రాజు. పాండవపక్షాన పోరిన యోధుడు. ఇతడు శిశుపాలుని కుమారుడు. శిశుపాలుడు కుంతీ, వసుదేవుల
సోదరి శ్రుతకీర్తి కుమారుడు. శిశుపాలుడు యుధిష్ఠిరుని రాజసూయయాగములో శ్రీకృష్ణుని నిందించి అతని సుదర్శన చక్రానికి బలి
అయ్యాడు. ధృష్టకేతువు ద్రోణుని చేతులో యుద్ధములో నిహతుడైనాడు. చేకితానుడు యాదవులలో వృష్ణివంశపు వీరుడు.
భారతయుద్ధములో పాండవుల పక్షాన పోరాడి దుర్యోధనుని చేతిలో మరణించాడు. కుంతిభోజుడు కుంతీదేవి పెంపుడు తండ్రి. అతని
కుమారులు పురుజిత్, కుంతిభోజుడు (తండ్రిపేరే) . శ్లోకము 1.6 లో చెప్పబడిన యుధామన్యుడు,ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన
అభిమన్యుడు, ఉపపాండవులూ వీరంతా కూడా పాండవపక్షాన ఉన్న మహరథులు. యుధామన్య, ఉత్తమౌజులు పాంచాలరాజు
ద్రుపదుని కుమారులు. శిబిదేశపు రాజు శైబ్యుడు. ఇతడి సోదరి యుధిష్ఠిరుని మరొక భార్య. ఈ శైబ్యుడనే పేరు గలవారు మరి కొందరు
కూడా మహాభారతములో కనుపిస్తారు. గీతలో చెప్పబడిన కాశీరాజుపేరు తెలియదు.
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||1-8||
పాండవ సైన్యములోని మహారథులను పరిచయం చేశాక దుర్యోధనుడు కౌరవ సైన్యములోని వీరులను గుర్తుచేస్తాడు. “తమరు,
భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి (సోమదత్తుని కుమారుడు భూరిశ్రవస్సు సోమదత్తుడు బాహ్లికుని
కుమారుడు. బాహ్లికుడు శంతనుని అన్నగారు..) వంటి మహారథులేగాక ఈ యుద్ధంలో నాకై ప్రాణము ధారపోయడానికి సిద్ధముగా
ఉన్న వీరులు అనేకులున్నారు.” (1.6 - 1.9)
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
6
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||
యుద్ధరంభంలో రాజు నోట వెడలిన అశ్లీలపదం “త్యక్తజీవితాః”. ఈ వాక్యం అశుభ సూచకం. ఈ వీరులందరూ భగవంతుడు సంకల్పించిన
మహాయజ్ఞంలో ఆహుతి కానున్న సమిధలవలే పేర్చబడినట్లున్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||
ఇక్కడ మన సేన భీష్మునిచేత రక్షింపబడుతున్నది. అక్కడ పాండవుల సేన భీమునిచేత రక్షింపబడుచున్నది. కౌరవసేనకు అపర్యాప్తం
(అసంఖ్యాకమైన) బలం, శత్రుసేనకు పర్యాప్తం (పరిమిత) అని పదాలు వాడబడ్డాయి. 11:7 ఉన్నసేనలకు ఇది సరియైన వర్ణన
కాదేమో. దుర్యోధనుని అతి విశ్వాసాన్ని సూచిస్తుంది, భీష్ముడు కౌరవ సేనాధిపతి. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనాధిపతి. తరువాత
శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణుని భీష్మాచార్యుల రక్షణకు నియమిస్తాడు "భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి" ఇక్కడ రెండు పనులు
జరుగుతున్నాయి. ఇరుసేనలను నడిపించే వారు సేనాధిపతులు భీష్ముడు, ధృష్టద్యుమ్నుడు. సేనాధిపతుల రక్షణ చూసుకునేవారు
ద్రోణుడు, భీముడు.
తస్య సఞ్జనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||
దుర్యోధనునికి హర్షోత్సాహాలు కలిగించడానికి కురువృద్ధుడు, పితామహుడు, ప్రతాపము గలవాడు అయిన భీష్ముడు సింహనాదముచేసి
తన శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవసేనలోని అందరూ తమ తమ శంఖములు, భేరీలు, తప్పెటలు, గోముఖములు,
మృదంగములు మొదలైన వాయిద్యములు మ్రోగించారు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
7
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15||
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్ ||1-19||
యుద్ధమునకు దుర్యోధనాదులైన కౌరవులే మూలకారణం. వారు అందుకే యుద్ధసన్నద్ధులై తమ శంఖములను పూరించి, రణభేరులు
మ్రోగించారు. ఒక శ్లోకములో భీష్ముని సింహనాదాన్నీ,శంఖారావాన్నీ చూపించి, మరియొక శ్లోకం మిగిలిన కౌరవ సైన్య రణఘోషకు
వ్యాసుడు వినియోగించాడు. ఎక్కడ శుభసూచనలు లేవు. పాండవ యుద్ధారంభం సూచించే శ్లోకాలు యుద్ధములో పాండవవిజయాన్ని
చెప్పకయే చెబుతున్నాయి. శ్లోకములు 1.14-1.15 లో కృష్ణార్జునులనుఇలా వర్ణించాడు. తెల్లని హయములు కలిగిన దివ్యరథములో
కూర్చున్న శ్రీకృష్ణార్జునులు మొదలుగా పాంచజన్యం, దేవదత్తం తమ దివ్యశంఖాలను పూరించారు. గీత చివరి శ్లోకభావం ఇక్కడనే
సూచింపబడినది.
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానితి మతిర్మమ || 18.78||
యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు, ధనుర్ధరుడైన పార్థుడు ఎక్కడనుండెదరో అక్కడ శ్రీ, విజయము శాశ్వతముగా ఉండునని నా
నమ్మకము.
పాంచజన్యము, దేవదత్తము, పౌండ్రము, అనంతవిజయము, సుఘోష, మణిపుష్పకము అనే నామములుకూడా
విజయసూచకములుగా ప్రత్యేకము చెప్పబడినవి. ఇవి వరుసగా కృష్ణుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకుల, సహదేవులు
పూరించిన శంఖములు. దుర్యోధనాదులు యుద్ధమునకు కారణమైతే పాండవ ప్రతిక్రియ కార్యము. యుద్ధము కారణము. అర్జునునికి
లభించిన జ్ఞానము కార్యము. పాండవసేనలోని మహారథులు కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు,
ఉపపాండవులు, అభిమన్యుడు వేరువేరుగా తమ తమ శంఖములను పూరించారు. పాండవ వీరుల శంఖనాదములు
భూమ్యాకాశములను దద్దరిల్ల చేసి దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను.
శ్రీకృష్ణబోధామృతం - భగవద్గీత
8
అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||
సంజయుడు ఇంకా ఇలా అన్నాడు. "ధృతరాష్ట్ర మహారాజా!ఇక ఆయుధములు ప్రయోగింపబడే ముందుగా, యుద్ధ సన్నద్ధులైయున్న
కౌరవ సైన్యాన్ని చూచి ధనస్సును చేబూని కపిధ్వజముగల రథారూఢుడైన అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు". "అచ్యుతా! ఉభయ
సైన్యముల మధ్య నా రథము నిలుపుము."
యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||
ఎక్కడి నుండి నేను ఈ యుద్ధారంభమందు పోరు సలుపబోయే యుద్ధాభిలాషులను చక్కగా చూడగలనో అక్కడ (రథము నిలుపుము.)
యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||
దుష్టబుద్ధియైన దుర్యోధనునకు ప్రియమొనగూర్చుటకు ఇచటకుచేరిన యోధులను నేను చూచెదను.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
9
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||
సంజయుడు చెబుతున్నాడు "ఓ భారతా! (ధృతరాష్ట్రా!) అర్జునుడిట్లు చెప్పగా కృష్ణుడు ఉత్తమమైన తమ రథమును భీష్మ ద్రోణాది
ప్రముఖులు,ఇతర రాజుల ఎదుట నిలిపి “ఈ వేచియున్న కౌరవులను చూడుము"అని అన్నాడు. [గుడాకేశుడు = అర్జునుడు, శబ్ద
కల్పద్రుమము ప్రకారము - నిద్ర, అలసత్వము, ఇంద్రియములు - వీనిని జయించినవాడు, జటాధరుడు అని మరియొక అర్థము.
హృషీకేశ = ఇంద్రియములకు అధిపతి, విష్ణువు, పరమాత్మ]
****
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
10
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||
అప్పుడు అర్జునుడు రెండు సేనలయందు నిలియున్న తాతతండ్రులను, అన్నదమ్ములను, పుత్రపౌత్రులను,ఆచార్యులను,మామలను,
స్నేహితులను అందరినీ చూచెను. ఇది అర్జునుని కదిలించిన సన్నివేశం. ఎంత వీరుడైనా సన్నిహితులతో యుద్ధము చేసి వారిని
చంపడము, లేక వారిచేతులో చావడమనేది భయంకరమైన ఆపద. తమంతతాము సుఖముగా ఉన్న అనేక రాజులు తమపోరుకై
ఇరుప్రక్కలా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా నిలిచారు.
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||1-30||
అర్జునుడు యుద్దభూమియందున్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్ద్ర హృదయుడై దుఃఖించుచు ఇట్లుచెప్పెను: నా
శరీరమందు వణుకు పుట్టుచున్నది. నోరు ఎండుకొనిపోవుచున్నది. అవయవములు పట్లు తప్పుచున్నవి. గాండీవము చేతినుండి
జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది. నిలబడుటకుకూడా శక్తిలేకున్నది. మనసు గిఱ్ఱున తిరుగుతున్నది.
శ్రీకృష్ణ బోధామృతం - భగవద్గీత
11
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31||
ఓకృష్ణా! అపశకునములను చూచుచున్నాను.యుద్ధమందు స్వజనులను చంపుట వలన పొందభోయే లాభము నాకు
కనపడుటలేదు.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||
ఓ గోవిందా! నేను విజయమును కాని, రాజ్యమును కాని, సుఖములను కాని కోరను. రాజ్యముతోగాని, భోగములతోగాని,
జీవించుటవలనగాని మనకేమి ప్రయోజనము?
యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||1-33||
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా ||1-34||
ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||1-35||
ఎవరినిమిత్తము మనమీ రాజ్యమును,భోగములను, సుఖములను కోరుదుమో, అట్టి గురువులు, పితరులు,
మేనమామలు,బావమఱదులు, సంబంధులు ధనములపై, ప్రాణములపై ఆశలువదలుకొని ఈ రణరంగముమీద
నిలబడియున్నారు. వీరు నన్ను చంపువారలైనను, త్రైలోక్య రాజ్యాధిపత్యమునకైనను నేను చంపను. ఇక భూలోకరాజ్యము
గురించి వేరే చెప్పవలెనా?
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
12
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతా నాతతాయినః ||1-36||
జనార్దనా! ధృతరాష్ట్రుని కుమారులను చంపుటవలన మనకేమి సంతోషము లభించును? మహాపాపులైనా, వీరిని చంపుటవలన మనకు
పాపమే వచ్చును. (ఎందుకనగా వారి పక్షమున నిలుచున్నవారిలో నాబంధు మిత్రులు, మాననీయులైన పెద్దలు, ఆచార్యులు
ఉన్నారు.) ఇక్కడ వాడిన పదము "హత్వైతాన్ ఆతతాయినః". అర్థం "ఈ మహాపాపులను చంపుటవలన". ఆరు మహాపాపములు
చేయువారికి ఈ ఆతతాయులు పదము సరిపోతుంది. అవి - ఇంటికి నిప్పు అంటించు వారు, విష ప్రయోగము చేయువారు,
ఆయుధములతో హింసించువారు, ధనమపహరించువారు, భూమిని ఆక్రమించువారు, ఇతరుల భార్యలను హరించువారు. కౌరవులు,
వారిమిత్రులలో కొందరు పాండవుల విషయములో ఈ పాప కర్మలు చేశారు.
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||1-37||
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||1-38||
ఓ మాధవా! మన బంధువులైన దుర్యోధనాదులను చంపుటకు మనము తగినవారము కాము. మనవారిని చంపి మనమెట్లు
సుఖపడగలము. రాజ్యలోభముచేత చిత్తభ్రమకల్గిన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన
కలుగు పాపమును గమనించరు.
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39||
కులక్షయముచేయుటవలన సంక్రమించేపాపాన్నిఎఱిగియుండికూడా మనమేల ఈ పాపకృత్యమునుండి విరమింపరాదో
అర్థముకాకున్నది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
13
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత ||1-40||
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||
సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ||1-42||
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43||
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||1-44||
1.40-1.44 శ్లోకాలలో అర్జునుడు ఈయుద్ధమువలన జరగబోయే అనర్థాన్నీ, ధర్మగ్లానినీ వర్ణిస్తాడు. "ఈ అపార
సేనాసమూహమంతా నాశనమైపోతే అనాదిగా వస్తున్న సమాజధర్మములన్నీ నశిస్తాయి. అధర్మవృద్ధిచేత స్త్రీలు చెడిపోతారు.
వర్ణసంకరమువలన సంఘములో పద్ధతులన్నీ నశిస్తాయి. పితృదేవతలు శ్రాద్ధాదులు లేక అధోగతిని పొందుతారు. ఈ
దోషముచేత మానవులకు శాశ్వత నరక నివాసము కలుగుతుందని మనము వినియున్నాము."
భగవద్గీతలో ఇక్కడ కులము అన్న పదానికి, నాలుగవ అధ్యాయంలో (4.13) శ్లోకములోని "చాతుర్వర్ణం మయాసృష్టం" అనే
శ్లోకములో వర్ణము అనే పదానికి ఆధునిక సమాజములో రాజకీయ, సామాజిక శాస్త్రవేత్తలు వాడుతున్న caste system
అనేపదానికి చాలా తేడాలు ఉన్నాయి. భారతీయ సమాజంలో caste అనే జాతి సూచక పోర్చుగీస్ పదం పాశ్చాత్యుల కల్పన.
వర్ణం అనే పదం (4.13)లో చూదాము. కులమంటే సమూహం (set), కుటుంబం, బంధువర్గం, వంశము (కుల దీపకుడు), గో-
కులము, కుల పర్వతము, అలి-కులము (తుమ్మెదల గుంపు), అలక-కులము (కేశరాశి). ఈ శ్లోకములలో కులమనే పదానికి
సమాజమనే అర్థం.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
14
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||1-45||
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||1-46||
(అహో) కటకటా! రాజ్యసుఖములయందలిలోభత్వముతో, స్వజనులనుచంపి మహాపాపమును చేయుటకు ఉద్యమించినాము కదా! ఈ యుద్ధములో ఆయుధములు ధరింపక, ఎదిరించకయున్న నన్ను కౌరవులు చంపినను అదినాకు మఱింత క్షేమమనే భావించుచున్నాను.
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||1-47||
సంజయుడిట్లుపలికెను "యుద్ధభూమియందు అర్జునుడు ఈ ప్రకారము చెప్పి శోకముతో కలతచెందిన మనసుకలవాడై ధనుర్బాణములను పారవైచి రథములో చదికిలబడెను."
అర్జునునికి విషాదము ఎందుకు కలిగినది? పిరికితనం వలనకాదు. యుద్ధానికి సన్నద్ధుడై యథోచితవేషంతో, శస్త్రాస్త్రాలతో, దృఢసంకల్పంతో, వచ్చాడు. తరువాత కృష్ణుడు హృదయ దౌర్బల్యం అనే పదాన్ని వాడినా అక్కడ అతడు యుద్ధానికి భయపడి దుఃఖపడలేదు. వైరాగ్యము, అహింసపై ఆసక్తి, రక్తపాతముపై విరక్తి కూడాలేవు. తన మృత్యువంటే భయములేదు. కేవలము శత్రుసేనలో తన ఎదుటిపక్షంలో నిలిచిన గురువులను, కురువృద్ధులను, బంధుకోటిని చూచి నశ్వరమైన రాజ్య సాధనకై వారిని చంపటం అధర్మంగా, అజ్ఞానంగా భావించాడు. ఈ మోహాన్ని తొలగించి స్వధర్మము పాటింపచేయడం కృష్ణుని ఉద్దేశ్యం.
అర్జునునిచేత యుద్ధముచేయించడం మాత్రమే కృష్ణుని లక్ష్యంకాదు.యుద్ధము చేయడమనే ప్రస్తుత కర్తవ్యమే కాక జీవనావిధానములో కర్మ ఏవిధముగా ఆచరించాలో చెప్పి, చిట్టచివరిదైన ఆత్మజ్ఞాన ప్రాప్తిని గురించిచెప్పి సందేహములను నివృత్తిచేసి సాధనావిధానాలను బోధించాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః ||1||
వేదములలో జ్ఞానకాండగాచెప్పబడిన సర్వోపనిషత్తుల సారమే భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు పార్థునికి బోధించాడు. అందుకే గీతను గీతోపనిషద్ అన్నారు. బ్రహ్మవిద్య లేక ఆత్మవిద్యను బోధించుటచేత గీత ను గీతాశాస్త్రమంటారు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనాః |
పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||
ఉపనిషత్తులను గోవులతో పోల్చితే ఆ గోపాలనందనుడు క్షీరరూపమైన ఉపనిషత్సారాన్ని మనకు అందింఛాడు.పార్థుడు లేగదూడ. తత్త్వజ్ఞులైన శ్రోతలు గీతామృతమనే ఆ క్షీరాన్ని అనుభవించేవారు.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||1-45||
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||1-46||
(అహో) కటకటా! రాజ్యసుఖములయందలిలోభత్వముతో, స్వజనులనుచంపి మహాపాపమును చేయుటకు ఉద్యమించినాము కదా! ఈ యుద్ధములో ఆయుధములు ధరింపక, ఎదిరించకయున్న నన్ను కౌరవులు చంపినను అదినాకు మఱింత క్షేమమనే భావించుచున్నాను.
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||1-47||
సంజయుడిట్లుపలికెను "యుద్ధభూమియందు అర్జునుడు ఈ ప్రకారము చెప్పి శోకముతో కలతచెందిన మనసుకలవాడై ధనుర్బాణములను పారవైచి రథములో చదికిలబడెను."
అర్జునునికి విషాదము ఎందుకు కలిగినది? పిరికితనం వలనకాదు. యుద్ధానికి సన్నద్ధుడై యథోచితవేషంతో, శస్త్రాస్త్రాలతో, దృఢసంకల్పంతో, వచ్చాడు. తరువాత కృష్ణుడు హృదయ దౌర్బల్యం అనే పదాన్ని వాడినా అక్కడ అతడు యుద్ధానికి భయపడి దుఃఖపడలేదు. వైరాగ్యము, అహింసపై ఆసక్తి, రక్తపాతముపై విరక్తి కూడాలేవు. తన మృత్యువంటే భయములేదు. కేవలము శత్రుసేనలో తన ఎదుటిపక్షంలో నిలిచిన గురువులను, కురువృద్ధులను, బంధుకోటిని చూచి నశ్వరమైన రాజ్య సాధనకై వారిని చంపటం అధర్మంగా, అజ్ఞానంగా భావించాడు. ఈ మోహాన్ని తొలగించి స్వధర్మము పాటింపచేయడం కృష్ణుని ఉద్దేశ్యం.
అర్జునునిచేత యుద్ధముచేయించడం మాత్రమే కృష్ణుని లక్ష్యంకాదు.యుద్ధము చేయడమనే ప్రస్తుత కర్తవ్యమే కాక జీవనావిధానములో కర్మ ఏవిధముగా ఆచరించాలో చెప్పి, చిట్టచివరిదైన ఆత్మజ్ఞాన ప్రాప్తిని గురించిచెప్పి సందేహములను నివృత్తిచేసి సాధనావిధానాలను బోధించాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః ||1||
వేదములలో జ్ఞానకాండగాచెప్పబడిన సర్వోపనిషత్తుల సారమే భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు పార్థునికి బోధించాడు. అందుకే గీతను గీతోపనిషద్ అన్నారు. బ్రహ్మవిద్య లేక ఆత్మవిద్యను బోధించుటచేత గీత ను గీతాశాస్త్రమంటారు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనాః |
పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||
ఉపనిషత్తులను గోవులతో పోల్చితే ఆ గోపాలనందనుడు క్షీరరూపమైన ఉపనిషత్సారాన్ని మనకు అందింఛాడు.పార్థుడు లేగదూడ. తత్త్వజ్ఞులైన శ్రోతలు గీతామృతమనే ఆ క్షీరాన్ని అనుభవించేవారు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
15
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః
సఞ్జయ ఉవాచ|
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః|| 2-1 ||
సంజయుడిట్లనెను. "ఆ విధముగా కరగినమనస్సుతో, కనులలో నీరునిండగా, తత్తరపాటుతో దుఃఖించుతూ కూర్చొనిన అర్జునుని చూచి కృష్ణుడిట్లు పలికెను."
శ్రీభగవానువాచ|
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్|
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమ ర్జున|| 2-2 ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప|| 2-3 ||
ఓ అర్జునా! అనార్యులైన పామరజనము అవలంబించునది,దోషభూయిష్టమైనది, స్వర్గమునకు ప్రతిబంధకమైనది, అపకీర్తిని కలిగించునది అయిన ఈ మోహపూరితమైన విషమస్థితి ఈ సమయమున నీకెట్లు దాపురించినది? నీచమైన ఈ మనోదౌర్బల్యమును విడిచిపెట్టి యుద్ధమునకులెమ్ము. క్లైబ్య అంటే నపుంసకత్వం, బలహీనత,impotence, అటువంటి ఈదుఃఖం నీకు తగదు.
అర్జునుడు తాను ధర్మ సంకటములో పడి స్వార్థపరుడై రాజ్యమోహముచేత మాననీయులైన గురువులు, బంధువులు, కురువృద్ధులతో చేయబూనిన యుద్ధము నిరర్థకమనుకొన్నాడు. కాని అది మోహజనిత అజ్ఞానమని, యుద్ధవిరమణ స్వధర్మ విరుద్ధమని, క్షుద్రమైన మనోదౌర్బల్యమని కృష్ణునిబోధ.
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమ
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప|| 2-3 ||
ఓ అర్జునా! అనార్యులైన పామరజనము అవలంబించునది,దోషభూయిష్టమైనది, స్వర్గమునకు ప్రతిబంధకమైనది, అపకీర్తిని కలిగించునది అయిన ఈ మోహపూరితమైన విషమస్థితి ఈ సమయమున నీకెట్లు దాపురించినది? నీచమైన ఈ మనోదౌర్బల్యమును విడిచిపెట్టి యుద్ధమునకులెమ్ము. క్లైబ్య అంటే నపుంసకత్వం, బలహీనత,impotence, అటువంటి ఈదుఃఖం నీకు తగదు.
అర్జునుడు తాను ధర్మ సంకటములో పడి స్వార్థపరుడై రాజ్యమోహముచేత మాననీయులైన గురువులు, బంధువులు, కురువృద్ధులతో చేయబూనిన యుద్ధము నిరర్థకమనుకొన్నాడు. కాని అది మోహజనిత అజ్ఞానమని, యుద్ధవిరమణ స్వధర్మ విరుద్ధమని, క్షుద్రమైన మనోదౌర్బల్యమని కృష్ణునిబోధ.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
16
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జునుడు అడిగెను " ఓకృష్ణా! పితామహుడు భీష్ముడు, ఆచార్యుడు ద్రోణుడు పూజార్హులు. అట్టివారిపై నేను బాణములను వదలి యుద్ధమెట్లుచేయగలను?" ఇది నిజముగా అర్జునునికి కలిగిన ధర్మ సందేహమే?
గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||
మహానుభావులైన గురువులను చంపకయుండి ఈ లోకమందు భిక్షాన్నమైనను తిని బ్రతుకవచ్చుకదా! వారిని చంపినయెడల వారిరక్తముతో తడసిన రాజ్యభోగములు అనుభవింపవలసి వచ్చును.
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
ఈ యుద్ధమున మనము గెల్తుమో, వారుగెల్తురో తెలియదు. ఆరెంటిలో ఏదిశ్రేయస్కరమో కూడ మనకు తెలియదు. ఎవరిని చంపి మనము జీవింపజాలమో అట్టి ధార్తరాష్ట్రులు మన ఎదుట నిలిచియున్నారు. ఈ స్థితిలో యుద్ధమెలాగున చేయగలనని అర్జునుని బాధ.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
17
కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మేశిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్యము (కృపణత్వము) అనేదోషము నన్ను ఆవహించినది. అందుచేత నాకు ధర్మ విషయమై సందేహము కలిగినది. మిమ్ములను అడుగుతున్నాను. ఏదినిశ్చయముగా శ్రేయస్కరమో నాకు చెప్పుము. నేను నీకు శిష్యుడను. నీశరణుకోరిన నన్ను శాసింపుము.
ఇక్కడ కార్పణ్యదోషము అనే పదము, కార్పణ్యదోషోపహతస్వభావః అనే వాక్యము కొంచెము పరిశీలించాలి. కార్పణ్యమనే పదానికి కృపణత్వము, క్రోధము, లుబ్ధత్వము, దైన్యము, దౌర్బల్యము అనే అర్థాలే కాక జాలి, దయ వంటి అర్థాలు కూడా ఉన్నాయి. శత్రుస్థానములో గురువులు, బంధువులు ఉండటం వలన ధర్మానికి, మోహబంధానికి కలిగిన సంఘర్షణ వలన ఒక మనోదౌర్బల్యం ఆవహించి స్వయంగా నిర్ణయము తీసికొనే శక్తి కోల్పోయాడు. (Arjuna says - I feel dejected or despondent)
కాని ఇక్కడ అతనికి ఈపరిస్థితిలో కర్తవ్యబోధ చేసేవారిని శ్రేయోదాయకమైన మార్గము చూపించగలవారి ఆవశ్యకత కలిగినది. శ్రేయస్సు అంటే ఇహమేకాక పరాన్ని గురించిన ఆలోచన కూడా ఉన్నది.అందుచేత కృపణత్వమంటే ఆత్మజ్ఞాన శూన్యత అనికూడా అర్థంచెప్పుకోవచ్చు. ఇహమంటే యుద్ధములో విజయం. పరమంటే యుద్ధములో మరణిస్తే జీవునకు లభించే ఉత్తమగతి.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||
భూలోకమున శత్రువులులేని సమృద్ధమైన రాజ్యమును, దేవతలపై ఆధిపత్యమును పొందినను ఇంద్రియములను తపింపచేయుచున్న నాశోకమును పోగొట్టగలదానిని కనుగొనలేక యున్నాను.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
18
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||
సంజయుడిట్లు చెప్పెను "ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి చివరకు "నేను యుద్ధము చేయను" అనిచెప్పి మౌనము వహించెను.
(2.7) శ్లోకములో "ఏదినిశ్చయముగా శ్రేయస్కరమో నాకు చెప్పుము (శాధి మాం త్వాం ప్రపన్నమ్)" అని అడిగిన అర్జునుడు, కృష్ణుడు ఇంకా తన ప్రతిస్పందన తెలియజేయకుండానే "నేను యుద్ధము చేయను" అనే నిర్ణయానికి వచ్చేశాడు. మనలో అనేకులము మన నిర్ణయం ఏదో తీసుకొని అప్పుడు ఆప్తుల వద్దకు సలహాకు వెడతాము. వారు మన చర్యను సమర్థింపక పొతే మనకు తోచినట్లే చేసే అవకాశమున్నది. ముహూర్తాలు, జాతకాలు, వాస్తువిషయాలు వీటిలోకూడా మన ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇక్కడ అర్జునుడు పూర్తిగా తన నిర్ణయాన్ని కృష్ణునికి వదలలేదు. తన దుఃఖానికి కారణం తన ధర్మ నిర్ణయంపై నమ్మకమే. గురువులను, వృద్ధులను, బంధువులను చంపి రాజ్యమును దక్కించుకోవడము అధర్మము, పాపభూయిష్టము అనే భావన కలిగింది. తనుచేస్తున్నది ధర్మచింతన అనుకున్నాడు. శ్రీకృష్ణుడు వారందరినీ చంపడం పాపము కాదు అని చెప్పలేదు. అది భగవంతుడు అనవలసిన మాట కాదు. అందుచేత యుద్ధము చేయడమే నీకర్తవ్యమని బోధించలేదు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, కర్మ, కర్మ త్యాగము వంటివిషయాలు బోధించాడు. అర్జునునికి నేరుగా సమాధానం చెప్పకుండా తనకే సమాధానం లభించేటట్లు తత్త్వ విషయాలు బోధించాడు. ఇదే గీత ఉపదేశ క్రమం.
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః|| 2-10 ||
ఓ ధృతరాష్త్ర మహారాజా! రెండు సేనలమధ్య రథములో కూర్చుని విలపించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు ముఖముతో ఇట్లుపలికెను.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
19
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||
భగవానుడు ఇట్లుచెప్పెను. "అర్జునా! నీవు శోకింపదగని దానినిగురించి శోకిస్తున్నావు. ధర్మసూక్ష్మములు తెలిసిన వాని వలే బుద్ధివాదము చేయుచున్నావు. నిజమైన పండితులు, జ్ఞానులు మరణించిన వారిని గురించిగాని, జీవించియున్న వారినిగురించిగాని ఎన్నడును దుఃఖించరు".
కృష్ణుని దృష్టిలో అర్జునునికి కలిగిన ఈ మోహము రెండు విధములు: భీష్మ ద్రోణులను తానే చంపుతున్నానని భావించుట, తన కర్మకు సంబంధించిన ధర్మాధర్మ విచారణ చేయగలనని అనుకొనుట.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 2-12 ||
నేను, నీవు, ఈ రాజులందరూ లేనికాలము ఇదివరకు లేదు, ఇక ముందు ఉండదు.
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||
జీవునికి శరీరములో బాల్య, యౌవన, వార్ధక్యావస్థలు ఎట్లుకలుగుతున్నవో మరణించినతరువాత మరియొకదేహమట్లే లభించుచున్నది. దీనివిషయమై జ్ఞానులెవరూ మోహముచెంది శోకింపరు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత|| 2-14 ||
మాత్రాస్పర్శ = స్పర్శాది ఇంద్రియములచేత విషయములను తెలుసుకొనుట (sensory perception); ఇది జీవ లక్షణము. ఓఅర్జునా! దీనివలన శీతోష్ణములు, సుఖ దుఃఖములు జీవులు అనుభవిస్తున్నారు. ఇవి అనిత్యములు; రాకపోకలున్నవి. అందుచేత ఓర్పు వహించుము. (తితిక్ష = ఓర్పు)
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||
ఓ పురుష శ్రేష్ఠుడవైన అర్జునా! ఎవరిని ఈ ఇంద్రియజనిత లక్షణములు బాధింపవో, ఎవరు సుఖదుఃఖములయందు సమభావము కలిగియుండునో అట్టిధీరుడే మోక్షమునకు, అమృతత్వమునకు అర్హుడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
20
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్తస్త్వనయోస్తత్త్వదర్శ
న అసత్ విద్యతే భావః అసత్యములైన వానికి ఉనికిలేదు). నిన్న లేనివి, ఈ రోజు ఉన్నవి, రేపు లేనివి (దేహాదులు కూడా) అసత్యములే. న అభావ విద్యతే సతః సత్యమైన వాటికి (ఆత్మ) అభావము (లేకపోవుట) లేదు). తత్త్వదర్శులైన వారు (seers of truth) ఈ రెండిటి నిర్ణయమును బాగుగా గ్రహించియున్నారు.
దీనిని అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు. "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు ఇది ప్రమాణం. సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు.
ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి. ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము. ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||
ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు.
ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము. వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము (gravitational field) అనవచ్చును,
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
21
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత|| 2-18 ||
అంతవంత ఇమేదేహా = ఈ దేహము నశించునది. కాని ఈదేహమును ధరించిన దేహి (శారీరకుడు) నిత్యుడు, నాశరహితుడు. అప్రమేయుడు (పరిమాణరహితుడు). తస్మాత్ యుద్ధ్యస్వ భారతః (ఓ భారతా! అందుచేత యుద్ధముచేయుము.)
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే|| 2-19 ||
ఎవరు ఈ ఆత్మను చంపువానిగనో,చంపబడువానిగనో భావింతురో వారు వాస్తవము తెలియనివారు. యదార్థముగా ఈ ఆత్మ దేనినీ చంపుటలేదు, దేనిచేత చంపబడుటలేదు.
22
న జాయతే మ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో, న హన్యతే హన్యమానే శరీరే|| 2-20 ||
ఈ ఆత్మకు పుట్టుక లేదు, మృత్యువులేదు. ఒకప్పుడు లేక క్రొత్తగా ఉండి మరల లేకుండువాడు కాడు. జననము లేనివాడు, నిత్యుడు,శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను,చావనివాడు. శరీరానికే పుట్టుక, నశించుట - కాని దానిలోనున్న ఆత్మవస్తువుకు నాశనములేదని భగవంతుని మాట.
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్|| 2-21 ||
అర్జునా! ఈ ఆత్మను ఎవరు నాశనములేనిదిగాను, నిత్యముగాను, ఎరుంగునో, అట్టివాడు ఒకనిని ఎట్లు చంపించగలడు, లేదా చంపగలడు.
యుద్ధరంగంలో అర్జునునికి అనేక ప్రశ్నలు వచ్చాయి. గురువులను, పెద్దలను, అనేక బంధువులను కేవలము రాజ్యకాంక్షతో తాను యుద్ధముచేసి చంపుట అధర్మమనే భావన కలిగినది. ఆస్థితిలో కృష్ణుని అడిగితే వారిని చంపమని ప్రోత్సహిస్తాడేమో అనే భావనకూడా వచ్చింది. అందుకే తనధర్మ సందేహాలను తీర్చమని అడుగుతోనే "నేను యుద్ధము చేయను" అని పలికి రథములో చదికిల పడ్డాడు. కృష్ణుడు తన ధర్మ నిర్ణయం ప్రకటించకుండా అతని ఆలోచనా ధారను గుర్తించి, అతడు ముఖతా అడుగని ప్రశ్నపరంపరను తానే ఊహించి వరుసగా సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుచేత “యుద్ధములో భీష్మద్రోణాదులను నీవు చంపగలనని అనుకోవడము, నేను నీ చేత చంపించగలనని అనుకోవడమూ కూడా అసత్యమే” అని కృష్ణుడు చెబుతున్నాడు.
Vvs Sarma శ్రీకృష్ణ తత్వమే శాంతికి మార్గమని సద్గురు శివానందమూర్తి తమ సందేశంలో తెలిపారు. ఆదివారం సికిందరాబాద్ కంటోనె్మంట్లో జరిగిన
కార్యక్రమంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయిన ఆయన భక్తుల కోసం సందేశాన్ని పంపించారు. శ్రీకృష్ణ తత్వమే సమాజానికి శిరోధార్యమని,
శాంతికి, సామరస్యానికి నిదర్శనమని వివరించారు. భారతీయ తత్వమే ప్రపంచానికి మార్గదర్శకమని, ‘శ్రీకృష్ణం వందే జగద్గురుమ్’’ అని ఆయన
బోధించారని, భారతంలో యుద్ధ సమయంలో అర్జునుడు వెనుకంజ వేసినప్పుడు తన విశ్వరూపం ద్వారా గీతను బోధించి అర్జునుడిని యుద్ధానికి
ప్రేరేపించారని, ఆయన బోధన వల్లనే శాంతి జరిగిందని, దాని ద్వారానే ధర్మరాజు పట్ట్భాషిక్తుడయ్యాడని, శ్రీకృష్ణుడు చేసిన ప్రతిపనీ సమాజ హితం కోసం
చేశాడని అన్నారు. భక్తి శ్రద్ధలతో ఆయన బోధించిన భగవద్గీతను చదివి దానిలోని సారాంశాన్ని గ్రహించి సమాజ శ్రేయస్సుకోసం ప్రతి ఒక్కరూ
పాటుపడాలని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
23
వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||
చినిగిపోయిన పాత వస్త్రములను విడిచి మనుజుడు నూతనవస్త్రములను ఎటుల ధరించుచున్నాడో, ఈ దేహములోని ఆత్మ శిధిలమైన పాత శరీరమును వదలి నూతన శరీరమును ధరించుచున్నది.
(వాసము అనే పదానికి అనేక అర్థములున్నాయి. వస్త్రము, గృహము (ఆవాసము, నివాసము), వాసన (సువాసన), ప్రయాణము (ప్రవాసము); ఉపవాసము కూడా అదే ధాతువునుండి వచ్చినది)
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23 ||
ఈ ఆత్మను శస్త్రములు ఖండింపలేవు, అగ్ని దహింపలేదు. జలము తడపలేదు. వాయువు ఆర్పలేదు.
అర్జునుని ప్రశ్న ఇదై ఉండవచ్చు. మనకంటికి శరీరములపై పంచభూతముల ప్రభావము కనబడుతుంది. ఆయుధాలు ఖండిస్తాయి.అగ్ని దహిస్తుంది. నీరు తడుపుతుంది. వాయువు ఆరబెట్టుతుంది. ఇదంతా అసత్యమనీ, కంటికి కనపడని ఆత్మ శాశ్వతమనీ, పంచభూతములు ఏమీ చేయలేవనీ చెప్పినదానికి ఏమిప్రమాణము? ఇది ఎలా సమన్వయమౌతుంది? ఈవిధమైన ప్రశ్నల నేపధ్యంలో కృష్ణుడు పరమాత్మ (ఆత్మ) వస్తువును గురించి, చెబుతూనే ఉన్నాడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
24
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోऽయం సనాతనః|| 2-24 ||
ఈ ఆత్మఛేదింపబడజాలదు. దహింపబడజాలదు. తడప బడజాలదు. ఆరబెట్టబడజాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి,
స్థాణువు, నిశ్చలుడు, పురాతనుడు.
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోऽయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||
ఈ ఆత్మ అవ్యక్తము (ఇంద్రియ గోచరము కానిది), అచింత్యము (ఆలోచింపజాలనిది), వికారములు పొందనిది – అని
చెప్పబడుతున్నది. ఇది తెలిసినప్పుడు నీకు దు!ఖింపవలసిన అవసరమేమున్నది?
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
23
వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||
చినిగిపోయిన పాత వస్త్రములను విడిచి మనుజుడు నూతనవస్త్రములను ఎటుల ధరించుచున్నాడో, ఈ దేహములోని ఆత్మ శిధిలమైన పాత శరీరమును వదలి నూతన శరీరమును ధరించుచున్నది.
(వాసము అనే పదానికి అనేక అర్థములున్నాయి. వస్త్రము, గృహము (ఆవాసము, నివాసము), వాసన (సువాసన), ప్రయాణము (ప్రవాసము); ఉపవాసము కూడా అదే ధాతువునుండి వచ్చినది)
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23 ||
ఈ ఆత్మను శస్త్రములు ఖండింపలేవు, అగ్ని దహింపలేదు. జలము తడపలేదు. వాయువు ఆర్పలేదు.
అర్జునుని ప్రశ్న ఇదై ఉండవచ్చు. మనకంటికి శరీరములపై పంచభూతముల ప్రభావము కనబడుతుంది. ఆయుధాలు ఖండిస్తాయి.అగ్ని దహిస్తుంది. నీరు తడుపుతుంది. వాయువు ఆరబెట్టుతుంది. ఇదంతా అసత్యమనీ, కంటికి కనపడని ఆత్మ శాశ్వతమనీ, పంచభూతములు ఏమీ చేయలేవనీ చెప్పినదానికి ఏమిప్రమాణము? ఇది ఎలా సమన్వయమౌతుంది? ఈవిధమైన ప్రశ్నల నేపధ్యంలో కృష్ణుడు పరమాత్మ (ఆత్మ) వస్తువును గురించి, చెబుతూనే ఉన్నాడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
24
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోऽయం సనాతనః|| 2-24 ||
ఈ ఆత్మఛేదింపబడజాలదు. దహింపబడజాలదు. తడప బడజాలదు. ఆరబెట్టబడజాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి,
స్థాణువు, నిశ్చలుడు, పురాతనుడు.
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోऽయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||
ఈ ఆత్మ అవ్యక్తము (ఇంద్రియ గోచరము కానిది), అచింత్యము (ఆలోచింపజాలనిది), వికారములు పొందనిది – అని
చెప్పబడుతున్నది. ఇది తెలిసినప్పుడు నీకు దు!ఖింపవలసిన అవసరమేమున్నది?
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
25
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి|| 2-26 ||
అర్జునా! ఒకవేళ ఈ ఆత్మ (శరీరముతో సహా) నిత్యము పుట్టుచు, చచ్చుచూ ఉన్నట్లు తలచిననూ అట్టి స్థితియందు కూడా
నీవిట్లు శోకించుట తగదు.
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||
పుట్టినవారికి మరణం తప్పదు. మరణించినవారికి తిరిగి పుట్టడం తప్పదు. ఇది తప్పనిసరి అయినప్పుడు ఈ విషయమై
శోకించుట నీకు తగదు.
{గాయత్రి శర్మ - మీరు చెప్పినది అర్ధం అవట్లేదు. కృష్ణుడు పరమాత్మ, చావును తప్పించుకోలేడా? మరి పరీక్షిత్ ఎలా బతికాడు? ఐతే ఒక విషయం, పరమాత్మకి చావు, బాధ, ఆనందం ఉండవు. తాను అన్నిటికీ అతీతుడు. తాను భాగవతులకు లొంగి ఉన్నాడు కాని మరణాన్ని స్వీకరించడు. అలాగే జన్మలు ఎత్తుతాడు.
ఇంకొకటి. వాలిని చెట్టు చాటు నుండి చంపావు. ఇది ధర్మమా? వాలి ఇలాగున అడిగినప్పుడు రాముని సమాధానం - నేను మనుష్యుడిని నీవు వానరుడివి. ఒక్క నీ శృంగార సమయమున తప్ప నేను బాణాన్ని నీ పై వదలవచ్చు,నీవు ధర్మాన్ని విడిచి నీ తమ్ముని భార్యని అనుభవిస్తున్నావు కాబట్టి బాణాన్ని విడిచి పెట్టవచ్చు, నేను రాజుని ఎందుకంటే నా తమ్ముడు ఈ భూమిని ఏలుతున్న భరతుడు నా పాదుకలు అయోధ్యలో పెట్టి నా అన్న పాదుకలు రాజ్యమేలుతాయి అని చెప్పాడు. నా ధర్మములొ అక్కడ తప్పులేదు నీ పై బాణాన్ని విడిచాను అని చెపితే వాలి కూడ అంగీకరించాడు రాముడు తప్పు చేసి ఉంటే ధర్మాత్మునిగా మనం మిగలనీయము ఎందుకంటే రాముడు దేవుడైనా, మనిషి రూపాన్ని పొంది కష్టాలు అనుభవించాడు కాబట్టి.. .
V V S Sarma
మీ వ్యాఖ్య వింజమూరి వారి కృష్ణనిర్వాణం - వాలి వధ కథనంపైనో దానిపై నావ్యాఖ్యపైనో అర్థం కాలేదు. కాని మీప్రశ్నలపై వ్యాఖ్యానం అవసరమనిపించింది.
1. కృష్ణనిర్యాణం - ప్రశ్న - మీరు చెప్పినది అర్ధం అవట్లేదు. కృష్ణుడు పరమాత్మ, చావును తప్పించుకోలేడా? సమాధానం - కృష్ణునిగా వ్యవహరించే పరమాత్మకు (ఆత్మకు) జనన మరణాలులేవు. భగవద్గీత చెప్పేది ఇదే. దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించిన కృష్ణుని శరీరానికి బాల్యం, యౌవనం, వార్ధక్యం, నిర్వాణం అన్నీ ఉన్నాయి. ఆ మానవ శరీరం 125 సంవత్సరాలు భూమిపై సంచరించి. అంతమైనది. ఒక కథనంప్రకారం ఆ శరీరమునకు దహ సంస్కారాలు కూడా చేయబడ్డాయి.
2, ప్రశ్న - మరి పరీక్షిత్ ఎలా బతికాడు? ఉత్తర గర్భస్థ శిశువుపై అశ్వత్థామ చేసిన బ్రహ్మ శిరోనామకాస్త్రంతో అకాలమృత్యువాత పడిన పరీక్షిత్తును కృష్ణుడు తన యోగశక్తితో బ్రతికించాడు. తన కాలము సమీపించినప్పుడు ఒక మునికుమారుని శాపంతో తక్షకుడనే నాగము కాటుతో మరణించాడు.
3. వ్యాఖ్య - * తాను భాగవతులకు లొంగి ఉన్నాడు* సమాధానం - ఇది నాకు అర్థం కాలేదు. భగవంతుడుభక్తునిదృష్టిలో తానులొంగియున్న భావాన్ని కల్పిస్తాడు.*కాని మరణాన్ని స్వీకరించడు.* అంటే ఏమిటి? పుట్టినప్రతివారు మరణించ వలసినదే. ఇక్కడ భగవంతుని పాత్ర లేదు. *అలాగే జన్మలు ఎత్తుతాడు.* మనుష్యులు మళ్ళీమళ్ళీ జన్మలు ఎత్తడానికీ భగవంతుడు అవతరించడానికీ ఎంతో తేడా ఉన్నది. ఆయనకు స్వేఛ్చ ఉన్నది మనకు లేదు.
4. వాలివధ - వాలివధలో రాముడు చేసిన పని ధర్మమేనా? చాలా క్లిష్టమైనప్రశ్న. చాలా వివరమైన సమాధానం కావాలి. నా మరియొక వివరణ చూడండి.
5. శ్రీ రామ కృష్ణావతార గాధల సంబంధాల సమన్వయం.... ఇది మరొక విషయం}
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
26
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||
సృష్టింపబడిన ప్రాణికోటులు పుట్టుకకు ముందు అవ్యక్తస్థితిలో ఉన్నవి (దేహముతో కనుపించవు), పుట్టగానే దేహముతో కనుపించును. మరణించిన పిమ్మట (ఆదేహములు) తిరిగి కనుపింపవు. ఆ దేహముల విషయమై శోకించనేల? (దేవన, పరిదేవన = శోకము)
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| 2-29 ||
ఒకడు దీనిని (ఈ ఆత్మను) ఆశ్చర్యమైన దాని వలె చెప్పుతున్నాడు.వేరొకడు ఆశ్చర్యకరమైన దానివలె వినుచున్నాడు. మరియొకడు ఆశ్చర్యముతో (ప్రశ్నార్థకమైన ముఖముతో) చూచుచున్నాడు. చెప్పుతూ, చూచుచూ, వినుచూ కూడా ఒక్కరును దానిని అర్థము చేసుకొనుటలేదు. (ఆత్మతత్త్వము అనుభవములోనికి రావటంలేదు).
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
27
దేహీ నిత్యమవధ్యోऽయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి|| 2-30 ||
అర్జునా! దేహి (దేహమును ధరించినవాడు, జీవుడు) నిత్యుడు. అవధ్యోऽయం (అవధ్యుడు, యెన్నడును చంపబడనివాడు). తస్మాత్ (అందువలన) సర్వాణి భూతాని సర్వస్యదేహే (సమస్త ప్రాణికోటి దేహములందు వసించి యున్నవాడు.) ఒక దేహములోని ఆత్మ వస్తువే సమస్త దేహములలోనూ, దేహముల వెలుపలి ప్రపంచమంతటిలోనూ కూడా వ్యాపించి ఉన్నది. న త్వం శోచితుమర్హసి (ఏప్రాణి కొరకు నీవుశోకించుట తగదు.)
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే|| 2-31 ||
ఓ అర్జునా! మరియొక విధముగా చూచినా స్వకీయమైన క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునందు వెనుకంజ వేయుట నీకు తగదు. క్షత్రియునకు ధర్మయుద్ధము కంటె శ్రేయస్కరము మరియొకటి లేదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
28
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్|| 2-32 ||
యాదృచ్ఛగా (అప్రయత్నంగా) లభించిన ఈ యుద్ధము తెరచిన స్వర్గద్వారము వంటిది. దీనిని ఏ క్షత్రియులు పొందుదురో, వారు
సుఖులేయగుదురు.
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి|| 2-33 ||
ఒకవేళ నీవు ధర్మబద్ధమైన ఈ సంగరమున పాల్గొనవేని, దానిచేత నీవు స్వధర్మమును నిరసించినవాడివై, కీర్తిని పోగొట్టుకొని
పాపమును మూటగట్టుకుందువు.
ఈ అధ్యాయములో కృష్ణ-అర్జున సంవాదము గమనింపదగినది. కృష్ణుడు రకరకాలుగా చెబుతున్నాడు. మొదట ఆత్మ తత్త్వాన్ని
బోధించాడు. ఇప్పుడు భౌతిక శరీరమునకు సంబంధించిన, వర్ణధర్మమైన క్షత్రియ ధర్మాన్ని పాటించమని చెబుతున్నాడు.
నిజానికి కీర్తి అనేది జీవునికి ఏమాత్రము ఉపయోగించనిది. జీవించినపుడు అహాన్ని తృప్తిపరుస్తుంది, పరానికి పూర్తిగా
అనవసరమైనది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
29
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేऽవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే|| 2-34 ||
ఓ అర్జునా! లోకులు నీ అపకీర్తిని ఎంతో కాలమువరకు చెప్పుకుంటారు. గౌరవముగా బ్రతికిన నీకు ఇది మరణముకంటె హీనమయినది.
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్|| 2-35 ||
ఏ మహారథులయందు నీవింతవరకు ఘనముగా భావింపబడుతుంటివో వారందరూ నిన్ను ఇప్పుడు చులకన చేసి భయమువలన రణమునుండి వెనుతిరిగిన అల్పునివలె నిన్ను చిత్రింతురు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
30
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్|| 2-36 ||
శత్రువులు నీసామర్థ్యాన్ని నిందిస్తూ అనేక దుర్భాషలు పలికెదరు. అంతకంటె దుఃఖమేమున్నది?
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||
ఓకౌంతేయా! ఈ ధర్మయుద్ధమున నీవు మరణించినచో,వీరస్వర్గము పొందెదవు. నీవే జయించినచో రాజ్యభోగములు అనుభవింతువు. (ఏమియైనను నీకు మేలే కలుగును) కావున లేచి యుద్ధమునకై కృతనిశ్చయుడవు కమ్ము.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి|| 2-38 ||
సుఖ దుఃఖములయందు, లాభనష్టములయందు, జయాపజయములయందు సమదృష్టికలిగి యుద్ధమునకు సంసిద్ధుడవుకమ్ము. ఇట్లు చేసిన నీకు పాపము అంటదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
31
ఏషా తేऽభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి|| 2-39 ||
ఓ అర్జునా! ఇంతవరకు నీకు సాంఖ్య శాస్త్రమున ఉన్న ఆత్మ తత్త్వమును గురించి చెప్పాను. (సాంఖ్యమనే పదానికీ, సంఖ్య అనే పదానికి మూలము ఒకటే. సాంఖ్యము సృష్టిని గురించి ప్రకృతి, పురుషుల సంయోగముగా చెబుతుంది ఈ మూల ప్రకృతినే ప్రధానము, మహత్ అని కూడా అంటారు. ప్రకృతిలోని చతుర్వింశతి తత్త్వాలతో నిర్మితమైనదిగా జగత్తును విశ్లేషిస్తుంది. కపిలుని బోధలో ఇది దర్శనమయింది.)తరువాత నీకు ఇప్పుడు కర్మయోగమునందలి కర్మనుగురించి చెబుతాను. ఏవిధముగా కర్మబంధమునుండి ముక్తునివి కాగలవో తెలుసుకొనేదవు. శ్రద్ధతో వినుము.
నేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్|| 2-40 ||
ఓ అర్జునా! ఒకసారి ప్రారంభింపబడిన ఈ కర్మయోగము నిష్ఫలమెన్నటికి కాదు. సంకల్పించిన కర్మ ఏకారణముచేతనైనను పూర్తి కాకున్నను దోషములేదు. ఈ కర్మానుష్ఠానమనే ధర్మమును ఒకింత ఆచరించినను సంసారభయమునుండి నిన్ను రక్షించగలదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
32
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్|| 2-41 ||
ఈ శ్లోకంలో వ్యవసాయాత్మికా, అవ్యవసాయినామ్ – అని రెండు పదాలు ఉన్నాయి.
తెలుగులో వ్యవసాయము, వ్యవసాయదారు అనేపదాలని కేవలము సేద్యము, సేద్యము చేసేవాడు, పంటలు పండించే రైతు అనే అర్థంలో వాడుతున్నాము. వ్యవసాయము అనే పదముకు ఇంకా విస్తృతమైన అర్థాలు ఉన్నవి. వ్యవసాయము = ప్రయత్నము; కృషి. determination, resolve,strenuous effort or exertion, activity,energy, industry, perseverance; action, performance; conduct, behaviour; following any business or profession; a trade, business, livelihood వ్యవసాయాత్మిక అంటే కృత నిశ్చయముతో చేసిన ప్రయత్న సంబంధమైనవి; అవ్యవసాయి అంటే ప్రయత్నము చేయనివాడు
ఇక్కడ ప్రయత్నము కర్మయోగానుష్ఠానము. దానికి కృతనిశ్చయమైన ఏకాగ్రతతోకూడిన బుద్ది ఒక్కటే. ప్రయత్నము చేయనివారి బుద్ధులు పరిపరి విధములుగా పోవును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
33
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి|| 2-43 ||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే|| 2-44 ||
ఈ మూడు శ్లోకాలు ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఈ కర్మానుష్ఠానమునందు ఇచ్ఛలేని వారిని గురించి చెబుతున్నాడు. మనుష్యులు అనేక విధములుగా ప్రవర్తిస్తారు. కొందరికి ఫలశ్రుతులు ఇష్టం. వేదమునందు ఫలము తెలుపు భాగములయందు ఇష్టముకలిగి, అవిచెప్పు స్వర్గ-ప్రాప్తి వంటి ఫలములకు మించినవి లేవని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముగలవారును, స్వర్గాభిలాషులును అయిన అల్పజ్ఞులకు ఏకాగ్రమైన బుద్ధి కలుగదు. అటులనే కర్మఫలము, పునర్జన్మ ఇచ్చునవి, భోగములు, ఐశ్వర్యము సంపాదించుటకు అవసరమైనవి ఫలశూన్యమైనవి అట్టివాక్యములను చెప్పుచున్నవారు, వినుచున్నవారు - ఇటువంటి వారికి సమాధి నిష్ఠయందు ఏకాగ్రమైన బుద్ధి కలుగనేకలుగదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
34
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్|| 2-45 ||
వేదములు ముఖ్యముగా త్రిగుణాత్మకమైన విషయములనుగురించి తెలియజేయును. నీవు ఆ త్రిగుణములను అధిగమించి, ద్వంద్వములు లేనివాడవై, నిరంతరము శుద్ధసత్త్వమును ఆశ్రయించినవాడవై, యోగక్షేమములయందు నిరాసక్తుడవై, ఆత్మజ్ఞానివి కమ్ము.
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః|| 2-46 ||
ఉద అంటే ఉదకము, ఉదపాన అంటే బావి, (ఉదపాన మండూక = కూపస్థమండూకము); స్నానపానాదులకు ఉపయోగపడు స్వల్పజలము గల బావియందెంత ప్రయోజనముకలదో అంత ప్రయోజనము జలముతోనిండిన విశాల జలాశయమునందునూ ఉన్నటులే, సమస్త వేదములయందు చెప్పబడినంత ప్రయోజనము, బ్రహ్మవిదునికి బ్రహ్మానందమున ఉన్నది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
35
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||
(ఓ అర్జునా!) కర్మచేయుటవరకు మాత్రమే నీకు అధికారము కలదు. ఆకర్మల ఫలముల నాశించుటకు నీకేనాడును అధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవుకాకుము. మరియు కర్మలు మానుటయందు నీవు ఆసక్తిచూపకుము.
ఇది ప్రసిద్ధమైన శ్లోకము. కర్మలు చేయుటవరకే మనకు అధికారము. దానికి వచ్చు ప్రతిఫలము మన వశములోలేదు. మనకు దానియందు అధికారమూలేదు. కర్మఫలస్వరూపము మనకు తెలియుటలేదు. మన కర్మ సత్ఫలమిచ్చినా, నిష్ఫలమైనా, దుష్ఫలమిచ్చినా మనముచేయ గలిగినది ఏమీలేదు. కర్మచేయటమే మన విధి. కర్మ ఫలమును ఆశించక కర్మను నిర్లిప్తతతో, కౌశలముతో చేయాలి. దీనిలో నాకేమి ప్రయోజనం అనే ప్రశ్నయే ఉత్పన్నం కాకూడదు.
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే|| 2-48 ||
ఓ ధనంజయా! నీవు యోగనిష్ఠయందుండి, సంగమును పరిత్యజించి, కార్యములో సాఫల్య, వైఫల్యములయందు సమదృష్టి గలవాడవై కర్మలను చేయుము. అటువంటి సమబుద్ధియే యోగమనబడుతుంది.
1.మన సుఖ సంతోషాలు బాధలూ ఇత్యాదులు మన శరీరానికే గాని ఆత్మను తాకవంటారు గదా?.మరి ఆత్మ శాంతించడం ఏమిటి ?
Each of your questions need an elaborate answer. This is from what I understand
మీ మొదటివాక్యమే సరిగాలేదు. శరీరము ఆత్మ మధ్యన మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము అనే మైండ్ కాంప్లెక్స్ ఉన్నది. మీప్రశ్న మీశరీరానిదీ కాదు, మీఆత్మదీకాదు. శరిరభాగాలైన జ్ఞానేంద్రియము,తన్మాత్ర, నాడీమండలము, మస్తిష్కము, దాని కార్యక్రమమైన మనస్సు మనోవృత్తులు, బుద్ధి, చిత్తము, చిత్తవృత్తి, అహంకారము ఇవన్నీ శరీరము - ఆత్మ మధ్యన ఉన్నాయి. సుఖమనేది శరీరకమైనది అనుకుందాము. పూర్తిగా కాదు. స్పర్శేంద్రియమువలన వచ్చేది స్పర్శ సుఖము. పుత్ర-గాత్ర పరిష్వంగ సుఖములోనో, శృంగారక్రియలోనో, ఫానుగాలికో కూడా స్పర్శ సుఖము కలుగవచ్చు. దానిని అనుభవించేది మనస్సు. ఆకోరిక, దానికై చేసిన కర్మ, దాని అనుభవము కూడా మనోబుద్ధులు అహంకారానికి ఇచ్చిననివేదిక చేత మీకు తెలుస్తున్నాయి. నేను సుఖించాను అని భావనచేసేది మీజీవాహంకారము. అహంకారమనే దుస్తులు ధరించిన మీ ఆత్మవస్తువు. అదేజీవుడు. మీ కర్మలకు కర్త, భోక్త. సుఖము వేరు, సంతోషము వేరు, శాంతి వేరు. momentary pleasure, happiness, tranquillity or bliss)
Bhagavad Gita chapter 2 if one follows and interprets sloka after sloka the links from body organs to Atman are clarified. Part of the chain is in these two slokas.
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
మనుష్యుడు ఇంద్రియములవలన లభించిన శబ్దములను,దృశ్యములను గురించి చింతించుటవలన వానితో అనుబంధమేర్పడును. అనుబంధము వలన కోరిక, కోరికవలన కోపము పుట్టును.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధముచేత అవివేకము, అవివేకముచేత స్మృతి విభ్రమము (మతిమరపు), మరపు వలన బుద్ధినాశము కలుగును. బుద్ధినాశనము సర్వనాశనమునకు దారితీయును.
Vinjamuri Venkata Apparao
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
37
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్|| 2-51 ||
సమత్వ బుద్ధిగల వివేకవంతులు తాము కర్మలను చేయుచున్నను కర్మఫలములను త్యజించి జన్మబంధము (జననమరణ చక్రము) నుండి విముక్తులౌతున్నారు. తద్వారా దుఃఖరహితమైన మోక్షపదమును పొందుచున్నారు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ|| 2-52 ||
అర్జునా! నీ బుద్ధి అజ్ఞానము చేత వచ్చిన మోహమనే మాలిన్యమును దాటినప్పుడు, వినవలసిన దానినుండియు, వినిన దానినుండియు విరక్తి పొందెదవు.
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి|| 2-53 ||
నానావిధములైన శ్రవణాదులచేత కలతచెందిన నీబుద్ధి ఎప్పుడు చలించక పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారము (యోగసిద్ధి) పొందెదవు.
ఈ రెండు శ్లోకాలలో పరమాత్మ శ్రోతవ్యము, శ్రుతము, శ్రుతి అనే వినుటకు సంబంధించిన పదములను తీసుకువచ్చాడు. శ్రుతి అంటే ఋషులు విన్న. వేదము.. శ్రోతవ్యము అంటే వినవలసినది. అదికూడా వేదమే. శ్రుతము అంటే వినినది. అది కూడా వేదమే. వేదము వింటే బుద్ధి కలత ఎందుకు చెందుతుంది? వేదము కర్మకాండను గురించి చెబుతుంది. చివరి భాగము వేదాంతము. జ్ఞాన,మోక్షాదులను గురించి చెబుతుంది. కర్మల ఫలాలు చెబుతుంది. మోహ బుద్ధి ఉంటే వేదము చెప్పిన స్వర్గసుఖముల వంటి ఫలాలపై ఆసక్తి పెరుగుతుంది. పుణ్య సముపార్జన, ఊర్ధ్వలోకప్రాప్తి క్రమముక్తికి మార్గాలు. ప్రతివ్యక్తి తన ఆశయంతెలుసుకోవాలి. అందరి గమ్యమూ ఒకటి కాదు. మోక్షకామికి ఫలప్రదమైన కర్మకాండ భ్రమహేతువే. అందుకే సమబుద్ధి కావాలి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
38
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్|| 2-54 ||
అర్జునుడు అడుగుతున్నాడు: ఓ కేశవా! సమాదిస్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుని లక్షణములేవి? అతని భాష, భాషణము ఎలా ఉంటాయి? ఏరీతిగా ఉండును? ఏరీతిగా సంచరించును?
గీతలో ముఖ్యమైన పదములలో స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞత్వము ఉన్నాయి. ఆ పదము మొదట ఇక్కడ అర్జునుడే వాడినాడు. స్థితప్రజ్ఞుడు అందరివలె ఉంటాడా? అతని స్థితిగురించిఎలా తెలుసుకోవాలి? అతని నిత్యజీవితంలో, నడవడిలో ప్రత్యేకత, జ్ఞానము కనబడుతాయా? ఇది ప్రశ్న.
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే|| 2-55 ||
భగవానుడు చెబుతున్నాడు: ఓ పార్థా! ఎప్పుడు మనుజుడు తన మనస్సులోని కోరికలన్నిటిని వదలివేయునో, మరియు ఆత్మయందే ఆత్మతో నిర్మలచిత్తముతో నిరంతరము సంతృప్తుడైయుండునో అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
స్థితప్రజ్ఞుని ముఖ్యలక్షణం ఎప్పుడూ తృప్తినిండిన హృదయంతో ఆనందంగా ఉండుట. మనవంటి సామాన్యులు ఏదో ఒక సంఘటనతో, ఒక వార్తతో, ఒకరి పలుకులతో సంతోషపడతాం. మన సంతోషానికి కారణం ఉంటుంది. అతని ఆనందానికి కారణం ఉండదు. కోరికలను జయించడంవలన, తీరనికోరికల వచ్చే నైరాశ్యం ఉండదు. సదా శాంతితో, తృప్తితో జీవిస్తాడు. చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల వలన అతడు చలించడు. అతడి దృష్టిలో ప్రపంచమంతా ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నదీ. వ్యక్తులలోని సుఖదుఃఖాలు ఆత్మకు అంటవు. అందుకే ఒకరి దుఃఖానికి మరి యొకరు దుఃఖించరు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
39
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
దుఃఖమునందు కలత (ఉద్విగ్నత)చెందని మనస్సుకలవాడు,సుఖమునందు నిస్పృహ కలవాడు (ఆసక్తి చూపని వాడు) రాగ ద్వేషములు, భయము, క్రోధము తొలగిన వాడు,మనన శీలుడు (ముని) స్థితప్రజ్ఞుడు అనబడును.
ఒక వస్తువుపై మితిమీరిన అనురాగం వ్యామోహంగా పరిణమిస్తుంది. అది పోతుందేమో అన్న భయం వస్తుంది. లేదా తానే ముందు పోవచ్చును, అదివెంటరాదు, అన్న భయం వస్తుంది. దీనికి కారణాన్ని ఊహించుకుని దానిపై క్రోధము పెంచుకుంటాడు. ఐశ్వర్యమును అనుభవించినప్పుడు కూడా అదిపోతుందేమో ఆన్న భయం లోఉంటాడు. రాగము, భయము, క్రోధములను జయించినవాడే స్థిత ప్రజ్ఞుడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్ య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||
ఎవరు సమస్త విషయములందును అభిమానములేక యుందురో, తనకు కలుగు శుభాశుభములను సంతోషము, దుఃఖములేక స్వీకరింతురో, అట్టివారి ప్రజ్ఞ సుస్థిరముగా ఉండును.
ఇతడు తనకు మంచిది, చెడు అనేది చూడడు. సంగవిహీనుడు. ఒకచోట స్నేహబుద్ధి, మరొకచోట భేదబుద్ధి, ద్వేషము ఉండవు. తనయందే తాను స్థిరుడై ఉంటాడు. సగుణ మూర్తియైన భగవంతుని కళ్యాణగుణములయందుకూడా మోహము, ఆశ లేకుండా ఉంటాడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
40
యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58 ||
ఏవిధముగా తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునో, ఆ విధముగా యోగి తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు విషయములనుండి సర్వత్ర వెనుకకు మరల్చుకొన్నయెడల అపుడే అతని జ్ఞానము సుస్థిరమగును. తాబేలు ఆత్మరక్షణకోసము తన అవయవాలను లోనికి ముడుచుకుంటుంది. మనుష్యుల ఇంద్రియములు ప్రాపంచిక విషయములయందు వ్యాపించి ఉంటాయి. కానియోగి తాబేలు వలె తన ఇంద్రియములను అంతర్ముఖము గావించుకుంటాడు. నిగ్రహముకలిగి ఉంటాడు. అతని ఇంద్రియములు ఏపరిస్థితిలోనూ బహిర్ముఖముకావు.
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే|| 2-59 ||
(ఇంద్రియ నిగ్రహము మాత్రమే చాలదు.) శబ్దరూపమున,దృశ్యరూపమునయున్న విషయములను నిగ్రహించినా, ఆజీవునకు ఆవిషయములు తాత్కాలిముగా తొలగుచున్నవి కాని, ఆసంబంధమైన వాసనలు (tendencies) వదలుటలేదు. పరమాత్మను దర్శించినచో విషయములతోబాటుగా వాసనలునూ వదలును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
41
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః|| 2-60 ||
(vipas’cita = learned, pramaathin = agitating, prasabha = forcefully) ఓ అర్జునా! ఇంద్రియములు మహా శక్తివంతములైనవి. సాధనలోనున్న విద్వాంసుడగు మనుజునియొక్క మనస్సును కూడ (విషయముల వైపుగా) లాగుకొనిపోవ సమర్థములైనవి.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-61 ||
బలవత్తరమైన అట్టి ఇంద్రియములను వశపరచుకొని, మనస్సు స్థిరము చేసుకొనిన యోగ సాధకుడు నాయందే ఆసక్తికలిగియుండవలెను. అప్పుడే అతని జ్ఞానము సుస్థిరమై ప్రకాశించును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
42
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
మనుష్యుడు ఇంద్రియములవలన లభించిన శబ్దములను,దృశ్యములను గురించి చింతించుటవలన వానితో అనుబంధమేర్పడును. అనుబంధము వలన కోరిక, కోరికవలన కోపము పుట్టును.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధముచేత అవివేకము, అవివేకముచేత స్మృతి విభ్రమము (మతిమరపు), మరపు వలన బుద్ధినాశము కలుగును. బుద్ధినాశనము సర్వనాశనమునకు దారితీయును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
43
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||
రాగద్వేషములనుండి విముక్తిపొందినవాడు, తన వశములోనున్న ఇంద్రియములతో విషయానుభవము (దేహయాత్రకు ఉపయుక్తమైన అన్నపానాదులు) పొందువాడైనను, మనోనిర్మలత్వమును (మనశ్శాంతిని) పొందుతున్నాడు (ప్రసాద మధిగచ్ఛతి) (ప్రసాద = tranquility, serenity of disposition)
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||
మనోనిర్మలత్వము కలుగగా మనుజునకు సమస్త దుఃఖములు ఉపశమించుచున్నవి. ప్రసన్న చిత్తముగలవానికి శీఘ్రముగానే బుద్ధి సుస్థిరమగును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
44
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్|| 2-66 ||
ఇక్కడ యుక్త, అయుక్త అని రెండు పదాలున్నాయి. అయుక్త అంటే అయోగ్యుడు, ఇంద్రియనిగ్రహము, మనస్సంయమనము లేనివాడు. యుక్త అంటే absorbed in abstract meditation , concentrated , attentive
అయోగ్యునికి వివేకముతోకూడిన బుద్ధి, ఆత్మచింతన కలుగవు. ఆత్మ చింతనలేని వాడికి శాంతి లభించదు. శాంతిలేని వానికి సుఖమెక్కడిది? (అశాంతస్య కుతః సుఖం?) ఈ ఆఖరువాక్యమే త్యాగరాజకృతి "శాంతములేక సౌఖ్యములేదు" లోని భావము. సుఖము వేరు, సంతోషము వేరు, శాంతి వేరు (pleasure, happiness, tranquillity or bliss).
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి|| 2-67 ||
జలముపై నున్న నావను వ్యతిరేక పవనము దిశమళ్ళించునట్లే, విషయములపై కేంద్రీకరించిన ఇంద్రియములు మనుజుని ప్రజ్ఞను, వివేకమును హరించును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
45
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-68 ||
ఓ మహాబాహో! అర్జునా! ఎవరు తమ ఇంద్రియములను విషయములపై పోనీయక సర్వ విధముల నిగ్రహించుకొనుచున్నారో,
అట్టివారి ప్రజ్ఞ సుస్థిరమైయున్నది.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
సమస్త ప్రాణులకు రాత్రియగు సమయమున ఇంద్రియనిగ్రహముగల యోగి మెలకువతో ఉండును. ఏసమయమున లోకులు
మెలకువతో తమనిత్యకృత్యములలో నిమగ్నులైయుందురో, అది పరమార్థతత్త్వమును చింతించు యోగికి నిశాసమయము.
ఇది చాలా ప్రత్యేకతగల శ్లోకము. దీనిని అర్థముచేసుకొనుట శంకరుల అద్వైతమును అర్థము చేసుకొనుటయే. శంకరుల
గురువు గోవిందపాదులు. ఆయన గురువు గౌడపాదులు. మాండూక్యోపనిషత్తు చాలా చిన్నది. గహనమైనది. దానివ్యాఖ్యానమే
గౌడపాదుని మాండూక్యకారికలు. ఇక్కడ మనుజునికిగల నిద్రాజాగ్రదవస్థలను గురించి చెబుతున్నాడు. ప్రపంచముయొక్క
మిథ్యాత్వము ఇక్కడ అవగతమౌతుంది. నిద్రలో జగత్తు మిథ్యయే. మెలకువలో సత్యమే. వీనిలో ఏది సత్యము? ఇది చాలా
చర్చించవలసిన విషయము.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
46
ఇక్కడ ఒక చిన్న దారి మళ్ళింపు (diversion). పై శ్లోకమునకు మాండూక్యోపనిషత్తుకు ఉన్న సంబంధము పరిశీలించాలంటే ఉపనిషత్తును చూడాలికదా! ఒక 5-6 రోజులు ఆ పనిచేద్దాము. జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన ఆత్మవస్తువు ఒక్కటే. కాని జీవాత్మను అనేక కోణాలలో అర్థంచేసుకోవచ్చు. ఉపనిషత్తు ఈ విషయాన్ని 12 శ్లోకాలలో చెబుతుంది. గౌడపాదకారిక వివరణను క్లుప్తంగా చెప్పినా 217 శ్లోకాలు అవసరమైనాయి. దీనిలో నాలుగు ప్రకారణాలున్నాయి. అవి ఆగమ ప్రకరణము, వైతథ్య ప్రకరణము, అద్వైత ప్రకరణము, అలాట శాంతి ప్రకరణము. గౌడపాద కారికయే గోవిందపాదుడు, శంకరుల ద్వారా మనకు చేరినది. గీతకు "అద్వైతామృత వర్షిణీ" అనే సార్థక నామధేయం లభించినది. భగవద్గీతలోని తరువాత శ్లోకాలు - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత (10.20), అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహమాశ్రితః (15.20) లోని ఆత్మ స్వరూపాల లోని భేదములు అర్థంచేసుకొనుటకు ఈచర్చ అవసరం
మాండూక్యోపనిషత్తు
ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం
భూతం భవ్యభవిష్యదితి సర్వమోంకారమేవ |
యచ్చాన్య త్రికాలాతీతం తద్యప్యోకారమేవ || 1||
సర్వమూ ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్కాలములలోనివి అన్నీ ఓంకారములోనే ఉన్నాయి. కాలమునకు అతీతముగా ఉన్నవికూడా ఓంకారమే.
ఓంకారముతో మొదలైన ఈశ్లోకముతో ప్రారంభమైన మాండూక్యోపనిషత్తులో పన్నెండు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. దీనిని 217 శ్లోకాలతో వివరించినవి గౌడపాదకారికలు. (kArikA = concise statement in verse of (esp. philosophical and grammatical) doctrines).
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత - మాండూక్యోపనిషత్తు
47
సర్వం ఏతద్బ్రహ్మాయమాత్మాబ్రహ్మ సో2యమాత్మా చతుష్పాత్ ||2||
ఇది అంతయూ బ్రహ్మమే. ఈ ఆత్మయూ బ్రహ్మయే. ఆ ఆత్మ చతుష్పాది (నాలుగుపాదములుకలది).
జాగరిత స్థానో బహిఃప్రజ్ఞ సప్తాఙ్గ ఏకోనవింశతిముఖః
స్థూల భుగ్వైశ్వానరః ప్రథమః పాదః ||3||
జాగ్రదవస్థలో బాహ్యప్రజ్ఞతో సప్తాంగములు, పందొమ్మిది జిహ్వలూ కలిగి స్థూల విషయములకు భోక్తయైన వైశ్వానరుడే ఆత్మయొక్క ప్రథమపాదము. ఇతడే విశ్వుడనియూ తెలియబడును.
(సప్తాంగములు - తల స్వర్గలోకము, సూర్యుడు నేత్రములు, వాయువు ప్రాణము, ఆకాశము శరీరము, నీరు అధోభాగము, భూమి - పాదములు) (ఏకోనవింశతి జిహ్వలు - పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, చతుర్విధ అంతఃకరణలు - మనోబుద్ధిచిత్తాహంకారాలు)
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత - మాండూక్యోపనిషత్తు
48
స్వప్నస్థానో 2న్తః ప్రజ్ఞః సప్తాఙ్గ ఏకోనవింశతిముఖః
ప్రవివిక్త భుక్తైజసో ద్వితీయః పాదః ||4||
స్వప్నావస్థలో, అన్తః ప్రజ్ఞతో, సప్తాంగములు, పందొమ్మిది జిహ్వలూ కలిగి, మానసిక స్మృతులకు భోక్తయైన తైజసుడే ఆత్మయొక్క ద్వితీయ పాదము
యత్ర సుప్తో నకంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం |
సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానన్దమయో ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః ||5||
గాఢనిద్రలో (సుషుప్తిలో) ఇంద్రియార్థములైన కోరికలు, మానసికమైన స్వప్నములు కూడ ఉండవు. దేహాత్మభావన లేని శుద్ధ చిత్తము కేవలానందమునే పొందును. ఆ ఆనందమునకు భోక్తయైన ప్రాజ్ఞుడు ఆత్మయొక్క తృతీయపాదము.
భగవద్గీత
57
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోऽహమాప్నుయామ్|| 3-2 ||
సందేహాస్పదమైన (వ్యామిశ్ర = equivocal, mixed, సందేహాస్పదమైన ) వాక్యాలచేత నా బుద్ధిని కలవరపెడుతున్నావు. నేను దేనిచేత శ్రేయస్సును పొందెదనో అదొకటియే నిశ్చయముగా చెప్పుము.
అర్జునునికి సాంఖ్యయోగం లోని కృష్ణుని బోధ విన్నాక చాలా అనుమానాలు వచ్చాయి. తన ప్రశ్నకు సమాధానం సూటిగా ఈయకుండా ఏవో అన్యవిషయాలు చెబుతున్నట్లు అనిపించింది. ఆత్మనుగురించి చెప్పావు, బ్రహ్మ వస్తువు గురించి చెప్పావు. సామాన్యునిగురించి చెప్పావు, యోగిని గురించిచెప్పావు. ఒకమాటకు మరొక మాటకు సమన్వయం కుదరటంలేదు. ఏదో ఒక మార్గము సూటిగా చెప్పు. ఆజ్ఞాపించు. అదినేను చేస్తాను. కాని నన్ను చిక్కులో పడవేయకు - ఈ విధమైన మనఃస్థితిలో అర్జునుని ప్రశ్నలున్నాయి. అర్జునుని స్థితిలో గాని పరోక్ష శ్రోతలైన మనకుగాని ఈ ప్రశ్నలు సహజమే!
భగవద్గీత
58
శ్రీభగవానువాచ|
లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||
భగవానుని సమాధానం: అర్జునా! నేను చాలా పూర్వమే సాంఖ్యులకు జ్ఞాన యోగము, యోగులకు కర్మయోగము అనే రెండు మార్గములను బోధించాను. ఇక్కడ చెప్పిన రెండు మార్గములు తత్త్వతః వేరైనవి కాని రెండూ ముక్తిమార్గములుగానే చెప్పబడినవి.
ఒకటి ఇంద్రియములు,మనస్సు చేయు కర్మలకు తాను కర్త కాదని, తాను సర్వాత్మకుడైన పరమాత్మయేనని భావించడం జ్ఞానయోగము. ఇదే సంన్యాసము, సాంఖ్యయోగము.
రెండవది ఈశ్వరాజ్ఞచేత, లేదా ఈశ్వరార్థమై చేయు నిష్కామకర్మ. అంటే లౌకిక ఫలము లేనిది. ఇది కర్మ యోగము.
ఈ సమాధానం సహజంగా అర్జునునిలో క్రొత్త ప్రశ్నలకు దారి తీస్తుంది. మనుష్యులలో రెండు రకాల వారున్నారా? నీవు పూర్వం చెప్పావంటే ఎప్పుడు, ఎవరికి ఎంత చెప్పావు? నీవు ఎప్పుడు వచ్చావు?
భగవద్గీత
59
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4 ||
మనుజుడు కర్మలను ఆచరించకపోవుట వలన నిష్క్రియమైన ఆత్మస్వరూప స్థితిని పొందడు. సన్యసించుట చేత సిద్ధి కలుగదు.
ఇది చాలా ముఖ్యమైన బోధ. కేవలము కర్మలను ఆరంభింపకపోవడమువలన ఏ మనుజుడు కర్మలను చేయడంలేదని అనిపించుకోడు. కర్మలు చేస్తూ కర్మకన్న జ్ఞానము గొప్పదని తెలుసుకొని కర్మ పరిత్యాగము చేసిన వాడుకూడా కర్మచేయనివాడు కాడు. అట్టి వారిని కర్మభ్రష్టులు అంటారు కాని వారు కర్మాతీతులు అనిపించుకోరు. కేవలం కర్మలను వదలిపెట్టుటవలన జ్ఞానము కాని, మోక్షము కాని రావు.
అసలు గీత చెప్పే ఈ కర్మ ఏమిటి? ఒక అర్థములో యజ్ఞకర్మ, వైదిక కర్మకాండ అని కొందరు చెబుతారు. మరి సామాన్యుని జీవితకాలంలో చేసే చదువు, ఉద్యోగం, ఉదర పోషణ, కుటుంబం, పిల్లల పెంపకం ఇవన్నీ కర్మలే కదా! అనే సందేహం కలుగుతుంది.
తాను జ్ఞానమార్గములో ఉన్నాను అనే భ్రమలో నిత్య వైదిక విధులు, భగవదనుగ్రహము లభించే ఉత్తమ కర్మలను వదలిపెట్టి, సామాన్యమైన లౌకిక కర్మలుచేస్తూ వాని ఫలములు అనుభవించకుండా ఉండరు. కనుక వారు కర్మలకు అతీతులు కాలేరు.
{గాయత్రి శర్మ - మీరు చెప్పినది అర్ధం అవట్లేదు. కృష్ణుడు పరమాత్మ, చావును తప్పించుకోలేడా? మరి పరీక్షిత్ ఎలా బతికాడు? ఐతే ఒక విషయం, పరమాత్మకి చావు, బాధ, ఆనందం ఉండవు. తాను అన్నిటికీ అతీతుడు. తాను భాగవతులకు లొంగి ఉన్నాడు కాని మరణాన్ని స్వీకరించడు. అలాగే జన్మలు ఎత్తుతాడు.
ఇంకొకటి. వాలిని చెట్టు చాటు నుండి చంపావు. ఇది ధర్మమా? వాలి ఇలాగున అడిగినప్పుడు రాముని సమాధానం - నేను మనుష్యుడిని నీవు వానరుడివి. ఒక్క నీ శృంగార సమయమున తప్ప నేను బాణాన్ని నీ పై వదలవచ్చు,నీవు ధర్మాన్ని విడిచి నీ తమ్ముని భార్యని అనుభవిస్తున్నావు కాబట్టి బాణాన్ని విడిచి పెట్టవచ్చు, నేను రాజుని ఎందుకంటే నా తమ్ముడు ఈ భూమిని ఏలుతున్న భరతుడు నా పాదుకలు అయోధ్యలో పెట్టి నా అన్న పాదుకలు రాజ్యమేలుతాయి అని చెప్పాడు. నా ధర్మములొ అక్కడ తప్పులేదు నీ పై బాణాన్ని విడిచాను అని చెపితే వాలి కూడ అంగీకరించాడు రాముడు తప్పు చేసి ఉంటే ధర్మాత్మునిగా మనం మిగలనీయము ఎందుకంటే రాముడు దేవుడైనా, మనిషి రూపాన్ని పొంది కష్టాలు అనుభవించాడు కాబట్టి.. .
V V S Sarma
మీ వ్యాఖ్య వింజమూరి వారి కృష్ణనిర్వాణం - వాలి వధ కథనంపైనో దానిపై నావ్యాఖ్యపైనో అర్థం కాలేదు. కాని మీప్రశ్నలపై వ్యాఖ్యానం అవసరమనిపించింది.
1. కృష్ణనిర్యాణం - ప్రశ్న - మీరు చెప్పినది అర్ధం అవట్లేదు. కృష్ణుడు పరమాత్మ, చావును తప్పించుకోలేడా? సమాధానం - కృష్ణునిగా వ్యవహరించే పరమాత్మకు (ఆత్మకు) జనన మరణాలులేవు. భగవద్గీత చెప్పేది ఇదే. దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించిన కృష్ణుని శరీరానికి బాల్యం, యౌవనం, వార్ధక్యం, నిర్వాణం అన్నీ ఉన్నాయి. ఆ మానవ శరీరం 125 సంవత్సరాలు భూమిపై సంచరించి. అంతమైనది. ఒక కథనంప్రకారం ఆ శరీరమునకు దహ సంస్కారాలు కూడా చేయబడ్డాయి.
2, ప్రశ్న - మరి పరీక్షిత్ ఎలా బతికాడు? ఉత్తర గర్భస్థ శిశువుపై అశ్వత్థామ చేసిన బ్రహ్మ శిరోనామకాస్త్రంతో అకాలమృత్యువాత పడిన పరీక్షిత్తును కృష్ణుడు తన యోగశక్తితో బ్రతికించాడు. తన కాలము సమీపించినప్పుడు ఒక మునికుమారుని శాపంతో తక్షకుడనే నాగము కాటుతో మరణించాడు.
3. వ్యాఖ్య - * తాను భాగవతులకు లొంగి ఉన్నాడు* సమాధానం - ఇది నాకు అర్థం కాలేదు. భగవంతుడుభక్తునిదృష్టిలో తానులొంగియున్న భావాన్ని కల్పిస్తాడు.*కాని మరణాన్ని స్వీకరించడు.* అంటే ఏమిటి? పుట్టినప్రతివారు మరణించ వలసినదే. ఇక్కడ భగవంతుని పాత్ర లేదు. *అలాగే జన్మలు ఎత్తుతాడు.* మనుష్యులు మళ్ళీమళ్ళీ జన్మలు ఎత్తడానికీ భగవంతుడు అవతరించడానికీ ఎంతో తేడా ఉన్నది. ఆయనకు స్వేఛ్చ ఉన్నది మనకు లేదు.
4. వాలివధ - వాలివధలో రాముడు చేసిన పని ధర్మమేనా? చాలా క్లిష్టమైనప్రశ్న. చాలా వివరమైన సమాధానం కావాలి. నా మరియొక వివరణ చూడండి.
5. శ్రీ రామ కృష్ణావతార గాధల సంబంధాల సమన్వయం.... ఇది మరొక విషయం}
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
26
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||
సృష్టింపబడిన ప్రాణికోటులు పుట్టుకకు ముందు అవ్యక్తస్థితిలో ఉన్నవి (దేహముతో కనుపించవు), పుట్టగానే దేహముతో కనుపించును. మరణించిన పిమ్మట (ఆదేహములు) తిరిగి కనుపింపవు. ఆ దేహముల విషయమై శోకించనేల? (దేవన, పరిదేవన = శోకము)
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| 2-29 ||
ఒకడు దీనిని (ఈ ఆత్మను) ఆశ్చర్యమైన దాని వలె చెప్పుతున్నాడు.వేరొకడు ఆశ్చర్యకరమైన దానివలె వినుచున్నాడు. మరియొకడు ఆశ్చర్యముతో (ప్రశ్నార్థకమైన ముఖముతో) చూచుచున్నాడు. చెప్పుతూ, చూచుచూ, వినుచూ కూడా ఒక్కరును దానిని అర్థము చేసుకొనుటలేదు. (ఆత్మతత్త్వము అనుభవములోనికి రావటంలేదు).
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
27
దేహీ నిత్యమవధ్యోऽయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి|| 2-30 ||
అర్జునా! దేహి (దేహమును ధరించినవాడు, జీవుడు) నిత్యుడు. అవధ్యోऽయం (అవధ్యుడు, యెన్నడును చంపబడనివాడు). తస్మాత్ (అందువలన) సర్వాణి భూతాని సర్వస్యదేహే (సమస్త ప్రాణికోటి దేహములందు వసించి యున్నవాడు.) ఒక దేహములోని ఆత్మ వస్తువే సమస్త దేహములలోనూ, దేహముల వెలుపలి ప్రపంచమంతటిలోనూ కూడా వ్యాపించి ఉన్నది. న త్వం శోచితుమర్హసి (ఏప్రాణి కొరకు నీవుశోకించుట తగదు.)
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే|| 2-31 ||
ఓ అర్జునా! మరియొక విధముగా చూచినా స్వకీయమైన క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునందు వెనుకంజ వేయుట నీకు తగదు. క్షత్రియునకు ధర్మయుద్ధము కంటె శ్రేయస్కరము మరియొకటి లేదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
28
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్|| 2-32 ||
యాదృచ్ఛగా (అప్రయత్నంగా) లభించిన ఈ యుద్ధము తెరచిన స్వర్గద్వారము వంటిది. దీనిని ఏ క్షత్రియులు పొందుదురో, వారు
సుఖులేయగుదురు.
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి|| 2-33 ||
ఒకవేళ నీవు ధర్మబద్ధమైన ఈ సంగరమున పాల్గొనవేని, దానిచేత నీవు స్వధర్మమును నిరసించినవాడివై, కీర్తిని పోగొట్టుకొని
పాపమును మూటగట్టుకుందువు.
ఈ అధ్యాయములో కృష్ణ-అర్జున సంవాదము గమనింపదగినది. కృష్ణుడు రకరకాలుగా చెబుతున్నాడు. మొదట ఆత్మ తత్త్వాన్ని
బోధించాడు. ఇప్పుడు భౌతిక శరీరమునకు సంబంధించిన, వర్ణధర్మమైన క్షత్రియ ధర్మాన్ని పాటించమని చెబుతున్నాడు.
నిజానికి కీర్తి అనేది జీవునికి ఏమాత్రము ఉపయోగించనిది. జీవించినపుడు అహాన్ని తృప్తిపరుస్తుంది, పరానికి పూర్తిగా
అనవసరమైనది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
29
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేऽవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే|| 2-34 ||
ఓ అర్జునా! లోకులు నీ అపకీర్తిని ఎంతో కాలమువరకు చెప్పుకుంటారు. గౌరవముగా బ్రతికిన నీకు ఇది మరణముకంటె హీనమయినది.
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్|| 2-35 ||
ఏ మహారథులయందు నీవింతవరకు ఘనముగా భావింపబడుతుంటివో వారందరూ నిన్ను ఇప్పుడు చులకన చేసి భయమువలన రణమునుండి వెనుతిరిగిన అల్పునివలె నిన్ను చిత్రింతురు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
30
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్|| 2-36 ||
శత్రువులు నీసామర్థ్యాన్ని నిందిస్తూ అనేక దుర్భాషలు పలికెదరు. అంతకంటె దుఃఖమేమున్నది?
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||
ఓకౌంతేయా! ఈ ధర్మయుద్ధమున నీవు మరణించినచో,వీరస్వర్గము పొందెదవు. నీవే జయించినచో రాజ్యభోగములు అనుభవింతువు. (ఏమియైనను నీకు మేలే కలుగును) కావున లేచి యుద్ధమునకై కృతనిశ్చయుడవు కమ్ము.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి|| 2-38 ||
సుఖ దుఃఖములయందు, లాభనష్టములయందు, జయాపజయములయందు సమదృష్టికలిగి యుద్ధమునకు సంసిద్ధుడవుకమ్ము. ఇట్లు చేసిన నీకు పాపము అంటదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
31
ఏషా తేऽభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి|| 2-39 ||
ఓ అర్జునా! ఇంతవరకు నీకు సాంఖ్య శాస్త్రమున ఉన్న ఆత్మ తత్త్వమును గురించి చెప్పాను. (సాంఖ్యమనే పదానికీ, సంఖ్య అనే పదానికి మూలము ఒకటే. సాంఖ్యము సృష్టిని గురించి ప్రకృతి, పురుషుల సంయోగముగా చెబుతుంది ఈ మూల ప్రకృతినే ప్రధానము, మహత్ అని కూడా అంటారు. ప్రకృతిలోని చతుర్వింశతి తత్త్వాలతో నిర్మితమైనదిగా జగత్తును విశ్లేషిస్తుంది. కపిలుని బోధలో ఇది దర్శనమయింది.)తరువాత నీకు ఇప్పుడు కర్మయోగమునందలి కర్మనుగురించి చెబుతాను. ఏవిధముగా కర్మబంధమునుండి ముక్తునివి కాగలవో తెలుసుకొనేదవు. శ్రద్ధతో వినుము.
నేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్|| 2-40 ||
ఓ అర్జునా! ఒకసారి ప్రారంభింపబడిన ఈ కర్మయోగము నిష్ఫలమెన్నటికి కాదు. సంకల్పించిన కర్మ ఏకారణముచేతనైనను పూర్తి కాకున్నను దోషములేదు. ఈ కర్మానుష్ఠానమనే ధర్మమును ఒకింత ఆచరించినను సంసారభయమునుండి నిన్ను రక్షించగలదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
32
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్|| 2-41 ||
ఈ శ్లోకంలో వ్యవసాయాత్మికా, అవ్యవసాయినామ్ – అని రెండు పదాలు ఉన్నాయి.
తెలుగులో వ్యవసాయము, వ్యవసాయదారు అనేపదాలని కేవలము సేద్యము, సేద్యము చేసేవాడు, పంటలు పండించే రైతు అనే అర్థంలో వాడుతున్నాము. వ్యవసాయము అనే పదముకు ఇంకా విస్తృతమైన అర్థాలు ఉన్నవి. వ్యవసాయము = ప్రయత్నము; కృషి. determination, resolve,strenuous effort or exertion, activity,energy, industry, perseverance; action, performance; conduct, behaviour; following any business or profession; a trade, business, livelihood వ్యవసాయాత్మిక అంటే కృత నిశ్చయముతో చేసిన ప్రయత్న సంబంధమైనవి; అవ్యవసాయి అంటే ప్రయత్నము చేయనివాడు
ఇక్కడ ప్రయత్నము కర్మయోగానుష్ఠానము. దానికి కృతనిశ్చయమైన ఏకాగ్రతతోకూడిన బుద్ది ఒక్కటే. ప్రయత్నము చేయనివారి బుద్ధులు పరిపరి విధములుగా పోవును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
33
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి|| 2-43 ||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే|| 2-44 ||
ఈ మూడు శ్లోకాలు ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఈ కర్మానుష్ఠానమునందు ఇచ్ఛలేని వారిని గురించి చెబుతున్నాడు. మనుష్యులు అనేక విధములుగా ప్రవర్తిస్తారు. కొందరికి ఫలశ్రుతులు ఇష్టం. వేదమునందు ఫలము తెలుపు భాగములయందు ఇష్టముకలిగి, అవిచెప్పు స్వర్గ-ప్రాప్తి వంటి ఫలములకు మించినవి లేవని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముగలవారును, స్వర్గాభిలాషులును అయిన అల్పజ్ఞులకు ఏకాగ్రమైన బుద్ధి కలుగదు. అటులనే కర్మఫలము, పునర్జన్మ ఇచ్చునవి, భోగములు, ఐశ్వర్యము సంపాదించుటకు అవసరమైనవి ఫలశూన్యమైనవి అట్టివాక్యములను చెప్పుచున్నవారు, వినుచున్నవారు - ఇటువంటి వారికి సమాధి నిష్ఠయందు ఏకాగ్రమైన బుద్ధి కలుగనేకలుగదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
34
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్|| 2-45 ||
వేదములు ముఖ్యముగా త్రిగుణాత్మకమైన విషయములనుగురించి తెలియజేయును. నీవు ఆ త్రిగుణములను అధిగమించి, ద్వంద్వములు లేనివాడవై, నిరంతరము శుద్ధసత్త్వమును ఆశ్రయించినవాడవై, యోగక్షేమములయందు నిరాసక్తుడవై, ఆత్మజ్ఞానివి కమ్ము.
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః|| 2-46 ||
ఉద అంటే ఉదకము, ఉదపాన అంటే బావి, (ఉదపాన మండూక = కూపస్థమండూకము); స్నానపానాదులకు ఉపయోగపడు స్వల్పజలము గల బావియందెంత ప్రయోజనముకలదో అంత ప్రయోజనము జలముతోనిండిన విశాల జలాశయమునందునూ ఉన్నటులే, సమస్త వేదములయందు చెప్పబడినంత ప్రయోజనము, బ్రహ్మవిదునికి బ్రహ్మానందమున ఉన్నది.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
35
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||
(ఓ అర్జునా!) కర్మచేయుటవరకు మాత్రమే నీకు అధికారము కలదు. ఆకర్మల ఫలముల నాశించుటకు నీకేనాడును అధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవుకాకుము. మరియు కర్మలు మానుటయందు నీవు ఆసక్తిచూపకుము.
ఇది ప్రసిద్ధమైన శ్లోకము. కర్మలు చేయుటవరకే మనకు అధికారము. దానికి వచ్చు ప్రతిఫలము మన వశములోలేదు. మనకు దానియందు అధికారమూలేదు. కర్మఫలస్వరూపము మనకు తెలియుటలేదు. మన కర్మ సత్ఫలమిచ్చినా, నిష్ఫలమైనా, దుష్ఫలమిచ్చినా మనముచేయ గలిగినది ఏమీలేదు. కర్మచేయటమే మన విధి. కర్మ ఫలమును ఆశించక కర్మను నిర్లిప్తతతో, కౌశలముతో చేయాలి. దీనిలో నాకేమి ప్రయోజనం అనే ప్రశ్నయే ఉత్పన్నం కాకూడదు.
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే|| 2-48 ||
ఓ ధనంజయా! నీవు యోగనిష్ఠయందుండి, సంగమును పరిత్యజించి, కార్యములో సాఫల్య, వైఫల్యములయందు సమదృష్టి గలవాడవై కర్మలను చేయుము. అటువంటి సమబుద్ధియే యోగమనబడుతుంది.
1.మన సుఖ సంతోషాలు బాధలూ ఇత్యాదులు మన శరీరానికే గాని ఆత్మను తాకవంటారు గదా?.మరి ఆత్మ శాంతించడం ఏమిటి ?
Each of your questions need an elaborate answer. This is from what I understand
మీ మొదటివాక్యమే సరిగాలేదు. శరీరము ఆత్మ మధ్యన మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము
Bhagavad Gita chapter 2 if one follows and interprets sloka after sloka the links from body organs to Atman are clarified. Part of the chain is in these two slokas.
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
మనుష్యుడు ఇంద్రియములవలన లభించిన శబ్దములను,దృశ్యములను గురించి చింతించుటవలన వానితో అనుబంధమేర్పడును. అనుబంధము వలన కోరిక, కోరికవలన కోపము పుట్టును.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధముచేత అవివేకము, అవివేకముచేత స్మృతి విభ్రమము (మతిమరపు), మరపు వలన బుద్ధినాశము కలుగును. బుద్ధినాశనము సర్వనాశనమునకు దారితీయును.
Vinjamuri Venkata Apparao
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
37
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్|| 2-51 ||
సమత్వ బుద్ధిగల వివేకవంతులు తాము కర్మలను చేయుచున్నను కర్మఫలములను త్యజించి జన్మబంధము (జననమరణ చక్రము) నుండి విముక్తులౌతున్నారు. తద్వారా దుఃఖరహితమైన మోక్షపదమును పొందుచున్నారు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ|| 2-52 ||
అర్జునా! నీ బుద్ధి అజ్ఞానము చేత వచ్చిన మోహమనే మాలిన్యమును దాటినప్పుడు, వినవలసిన దానినుండియు, వినిన దానినుండియు విరక్తి పొందెదవు.
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి|| 2-53 ||
నానావిధములైన శ్రవణాదులచేత కలతచెందిన నీబుద్ధి ఎప్పుడు చలించక పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారము (యోగసిద్ధి) పొందెదవు.
ఈ రెండు శ్లోకాలలో పరమాత్మ శ్రోతవ్యము, శ్రుతము, శ్రుతి అనే వినుటకు సంబంధించిన పదములను తీసుకువచ్చాడు. శ్రుతి అంటే ఋషులు విన్న. వేదము.. శ్రోతవ్యము అంటే వినవలసినది. అదికూడా వేదమే. శ్రుతము అంటే వినినది. అది కూడా వేదమే. వేదము వింటే బుద్ధి కలత ఎందుకు చెందుతుంది? వేదము కర్మకాండను గురించి చెబుతుంది. చివరి భాగము వేదాంతము. జ్ఞాన,మోక్షాదులను గురించి చెబుతుంది. కర్మల ఫలాలు చెబుతుంది. మోహ బుద్ధి ఉంటే వేదము చెప్పిన స్వర్గసుఖముల వంటి ఫలాలపై ఆసక్తి పెరుగుతుంది. పుణ్య సముపార్జన, ఊర్ధ్వలోకప్రాప్తి క్రమముక్తికి మార్గాలు. ప్రతివ్యక్తి తన ఆశయంతెలుసుకోవాలి. అందరి గమ్యమూ ఒకటి కాదు. మోక్షకామికి ఫలప్రదమైన కర్మకాండ భ్రమహేతువే. అందుకే సమబుద్ధి కావాలి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
38
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్|| 2-54 ||
అర్జునుడు అడుగుతున్నాడు: ఓ కేశవా! సమాదిస్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుని లక్షణములేవి? అతని భాష, భాషణము ఎలా ఉంటాయి? ఏరీతిగా ఉండును? ఏరీతిగా సంచరించును?
గీతలో ముఖ్యమైన పదములలో స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞత్వము ఉన్నాయి. ఆ పదము మొదట ఇక్కడ అర్జునుడే వాడినాడు. స్థితప్రజ్ఞుడు అందరివలె ఉంటాడా? అతని స్థితిగురించిఎలా తెలుసుకోవాలి? అతని నిత్యజీవితంలో, నడవడిలో ప్రత్యేకత, జ్ఞానము కనబడుతాయా? ఇది ప్రశ్న.
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే|| 2-55 ||
భగవానుడు చెబుతున్నాడు: ఓ పార్థా! ఎప్పుడు మనుజుడు తన మనస్సులోని కోరికలన్నిటిని వదలివేయునో, మరియు ఆత్మయందే ఆత్మతో నిర్మలచిత్తముతో నిరంతరము సంతృప్తుడైయుండునో అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
స్థితప్రజ్ఞుని ముఖ్యలక్షణం ఎప్పుడూ తృప్తినిండిన హృదయంతో ఆనందంగా ఉండుట. మనవంటి సామాన్యులు ఏదో ఒక సంఘటనతో, ఒక వార్తతో, ఒకరి పలుకులతో సంతోషపడతాం. మన సంతోషానికి కారణం ఉంటుంది. అతని ఆనందానికి కారణం ఉండదు. కోరికలను జయించడంవలన, తీరనికోరికల వచ్చే నైరాశ్యం ఉండదు. సదా శాంతితో, తృప్తితో జీవిస్తాడు. చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల వలన అతడు చలించడు. అతడి దృష్టిలో ప్రపంచమంతా ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నదీ. వ్యక్తులలోని సుఖదుఃఖాలు ఆత్మకు అంటవు. అందుకే ఒకరి దుఃఖానికి మరి యొకరు దుఃఖించరు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
39
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
దుఃఖమునందు కలత (ఉద్విగ్నత)చెందని మనస్సుకలవాడు,సుఖమునందు నిస్పృహ కలవాడు (ఆసక్తి చూపని వాడు) రాగ ద్వేషములు, భయము, క్రోధము తొలగిన వాడు,మనన శీలుడు (ముని) స్థితప్రజ్ఞుడు అనబడును.
ఒక వస్తువుపై మితిమీరిన అనురాగం వ్యామోహంగా పరిణమిస్తుంది. అది పోతుందేమో అన్న భయం వస్తుంది. లేదా తానే ముందు పోవచ్చును, అదివెంటరాదు, అన్న భయం వస్తుంది. దీనికి కారణాన్ని ఊహించుకుని దానిపై క్రోధము పెంచుకుంటాడు. ఐశ్వర్యమును అనుభవించినప్పుడు కూడా అదిపోతుందేమో ఆన్న భయం లోఉంటాడు. రాగము, భయము, క్రోధములను జయించినవాడే స్థిత ప్రజ్ఞుడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||
ఎవరు సమస్త విషయములందును అభిమానములేక యుందురో, తనకు కలుగు శుభాశుభములను సంతోషము, దుఃఖములేక స్వీకరింతురో, అట్టివారి ప్రజ్ఞ సుస్థిరముగా ఉండును.
ఇతడు తనకు మంచిది, చెడు అనేది చూడడు. సంగవిహీనుడు. ఒకచోట స్నేహబుద్ధి, మరొకచోట భేదబుద్ధి, ద్వేషము ఉండవు. తనయందే తాను స్థిరుడై ఉంటాడు. సగుణ మూర్తియైన భగవంతుని కళ్యాణగుణములయందుకూడా మోహము, ఆశ లేకుండా ఉంటాడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
40
యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58 ||
ఏవిధముగా తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునో, ఆ విధముగా యోగి తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు విషయములనుండి సర్వత్ర వెనుకకు మరల్చుకొన్నయెడల అపుడే అతని జ్ఞానము సుస్థిరమగును. తాబేలు ఆత్మరక్షణకోసము తన అవయవాలను లోనికి ముడుచుకుంటుంది. మనుష్యుల ఇంద్రియములు ప్రాపంచిక విషయములయందు వ్యాపించి ఉంటాయి. కానియోగి తాబేలు వలె తన ఇంద్రియములను అంతర్ముఖము గావించుకుంటాడు. నిగ్రహముకలిగి ఉంటాడు. అతని ఇంద్రియములు ఏపరిస్థితిలోనూ బహిర్ముఖముకావు.
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే|| 2-59 ||
(ఇంద్రియ నిగ్రహము మాత్రమే చాలదు.) శబ్దరూపమున,దృశ్యరూపమునయున్న విషయములను నిగ్రహించినా, ఆజీవునకు ఆవిషయములు తాత్కాలిముగా తొలగుచున్నవి కాని, ఆసంబంధమైన వాసనలు (tendencies) వదలుటలేదు. పరమాత్మను దర్శించినచో విషయములతోబాటుగా వాసనలునూ వదలును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
41
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః|| 2-60 ||
(vipas’cita = learned, pramaathin = agitating, prasabha = forcefully) ఓ అర్జునా! ఇంద్రియములు మహా శక్తివంతములైనవి. సాధనలోనున్న విద్వాంసుడగు మనుజునియొక్క మనస్సును కూడ (విషయముల వైపుగా) లాగుకొనిపోవ సమర్థములైనవి.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-61 ||
బలవత్తరమైన అట్టి ఇంద్రియములను వశపరచుకొని, మనస్సు స్థిరము చేసుకొనిన యోగ సాధకుడు నాయందే ఆసక్తికలిగియుండవలెను. అప్పుడే అతని జ్ఞానము సుస్థిరమై ప్రకాశించును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
42
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
మనుష్యుడు ఇంద్రియములవలన లభించిన శబ్దములను,దృశ్యములను గురించి చింతించుటవలన వానితో అనుబంధమేర్పడును. అనుబంధము వలన కోరిక, కోరికవలన కోపము పుట్టును.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధముచేత అవివేకము, అవివేకముచేత స్మృతి విభ్రమము (మతిమరపు), మరపు వలన బుద్ధినాశము కలుగును. బుద్ధినాశనము సర్వనాశనమునకు దారితీయును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
43
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||
రాగద్వేషములనుండి విముక్తిపొందినవాడు, తన వశములోనున్న ఇంద్రియములతో విషయానుభవము (దేహయాత్రకు ఉపయుక్తమైన అన్నపానాదులు) పొందువాడైనను, మనోనిర్మలత్వమును (మనశ్శాంతిని) పొందుతున్నాడు (ప్రసాద మధిగచ్ఛతి) (ప్రసాద = tranquility, serenity of disposition)
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||
మనోనిర్మలత్వము కలుగగా మనుజునకు సమస్త దుఃఖములు ఉపశమించుచున్నవి. ప్రసన్న చిత్తముగలవానికి శీఘ్రముగానే బుద్ధి సుస్థిరమగును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
44
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్|| 2-66 ||
ఇక్కడ యుక్త, అయుక్త అని రెండు పదాలున్నాయి. అయుక్త అంటే అయోగ్యుడు, ఇంద్రియనిగ్రహము, మనస్సంయమనము లేనివాడు. యుక్త అంటే absorbed in abstract meditation , concentrated , attentive
అయోగ్యునికి వివేకముతోకూడిన బుద్ధి, ఆత్మచింతన కలుగవు. ఆత్మ చింతనలేని వాడికి శాంతి లభించదు. శాంతిలేని వానికి సుఖమెక్కడిది? (అశాంతస్య కుతః సుఖం?) ఈ ఆఖరువాక్యమే త్యాగరాజకృతి "శాంతములేక సౌఖ్యములేదు" లోని భావము. సుఖము వేరు, సంతోషము వేరు, శాంతి వేరు (pleasure, happiness, tranquillity or bliss).
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి|| 2-67 ||
జలముపై నున్న నావను వ్యతిరేక పవనము దిశమళ్ళించునట్లే, విషయములపై కేంద్రీకరించిన ఇంద్రియములు మనుజుని ప్రజ్ఞను, వివేకమును హరించును.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
45
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-68 ||
ఓ మహాబాహో! అర్జునా! ఎవరు తమ ఇంద్రియములను విషయములపై పోనీయక సర్వ విధముల నిగ్రహించుకొనుచున్నారో,
అట్టివారి ప్రజ్ఞ సుస్థిరమైయున్నది.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
సమస్త ప్రాణులకు రాత్రియగు సమయమున ఇంద్రియనిగ్రహముగల యోగి మెలకువతో ఉండును. ఏసమయమున లోకులు
మెలకువతో తమనిత్యకృత్యములలో నిమగ్నులైయుందురో, అది పరమార్థతత్త్వమును చింతించు యోగికి నిశాసమయము.
ఇది చాలా ప్రత్యేకతగల శ్లోకము. దీనిని అర్థముచేసుకొనుట శంకరుల అద్వైతమును అర్థము చేసుకొనుటయే. శంకరుల
గురువు గోవిందపాదులు. ఆయన గురువు గౌడపాదులు. మాండూక్యోపనిషత్తు చాలా చిన్నది. గహనమైనది. దానివ్యాఖ్యానమే
గౌడపాదుని మాండూక్యకారికలు. ఇక్కడ మనుజునికిగల నిద్రాజాగ్రదవస్థలను గురించి చెబుతున్నాడు. ప్రపంచముయొక్క
మిథ్యాత్వము ఇక్కడ అవగతమౌతుంది. నిద్రలో జగత్తు మిథ్యయే. మెలకువలో సత్యమే. వీనిలో ఏది సత్యము? ఇది చాలా
చర్చించవలసిన విషయము.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
46
ఇక్కడ ఒక చిన్న దారి మళ్ళింపు (diversion). పై శ్లోకమునకు మాండూక్యోపనిషత్తుకు ఉన్న సంబంధము పరిశీలించాలంటే ఉపనిషత్తును చూడాలికదా! ఒక 5-6 రోజులు ఆ పనిచేద్దాము. జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన ఆత్మవస్తువు ఒక్కటే. కాని జీవాత్మను అనేక కోణాలలో అర్థంచేసుకోవచ్చు. ఉపనిషత్తు ఈ విషయాన్ని 12 శ్లోకాలలో చెబుతుంది. గౌడపాదకారిక వివరణను క్లుప్తంగా చెప్పినా 217 శ్లోకాలు అవసరమైనాయి. దీనిలో నాలుగు ప్రకారణాలున్నాయి. అవి ఆగమ ప్రకరణము, వైతథ్య ప్రకరణము, అద్వైత ప్రకరణము, అలాట శాంతి ప్రకరణము. గౌడపాద కారికయే గోవిందపాదుడు, శంకరుల ద్వారా మనకు చేరినది. గీతకు "అద్వైతామృత వర్షిణీ" అనే సార్థక నామధేయం లభించినది. భగవద్గీతలోని తరువాత శ్లోకాలు - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత (10.20), అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహమాశ్రితః (15.20) లోని ఆత్మ స్వరూపాల లోని భేదములు అర్థంచేసుకొనుటకు ఈచర్చ అవసరం
మాండూక్యోపనిషత్తు
ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం
భూతం భవ్యభవిష్యదితి సర్వమోంకారమేవ |
యచ్చాన్య త్రికాలాతీతం తద్యప్యోకారమేవ || 1||
సర్వమూ ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్కాలములలోనివి అన్నీ ఓంకారములోనే ఉన్నాయి. కాలమునకు అతీతముగా ఉన్నవికూడా ఓంకారమే.
ఓంకారముతో మొదలైన ఈశ్లోకముతో ప్రారంభమైన మాండూక్యోపనిషత్తులో పన్నెండు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. దీనిని 217 శ్లోకాలతో వివరించినవి గౌడపాదకారికలు. (kArikA = concise statement in verse of (esp. philosophical and grammatical) doctrines).
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత - మాండూక్యోపనిషత్తు
47
సర్వం ఏతద్బ్రహ్మాయమాత్మాబ్రహ్మ సో2యమాత్మా చతుష్పాత్ ||2||
ఇది అంతయూ బ్రహ్మమే. ఈ ఆత్మయూ బ్రహ్మయే. ఆ ఆత్మ చతుష్పాది (నాలుగుపాదములుకలది).
జాగరిత స్థానో బహిఃప్రజ్ఞ సప్తాఙ్గ ఏకోనవింశతిముఖః
స్థూల భుగ్వైశ్వానరః ప్రథమః పాదః ||3||
జాగ్రదవస్థలో బాహ్యప్రజ్ఞతో సప్తాంగములు, పందొమ్మిది జిహ్వలూ కలిగి స్థూల విషయములకు భోక్తయైన వైశ్వానరుడే ఆత్మయొక్క ప్రథమపాదము. ఇతడే విశ్వుడనియూ తెలియబడును.
(సప్తాంగములు - తల స్వర్గలోకము, సూర్యుడు నేత్రములు, వాయువు ప్రాణము, ఆకాశము శరీరము, నీరు అధోభాగము, భూమి - పాదములు) (ఏకోనవింశతి జిహ్వలు - పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, చతుర్విధ అంతఃకరణలు - మనోబుద్ధిచిత్తాహంకారాలు)
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత - మాండూక్యోపనిషత్తు
48
స్వప్నస్థానో 2న్తః ప్రజ్ఞః సప్తాఙ్గ ఏకోనవింశతిముఖః
ప్రవివిక్త భుక్తైజసో ద్వితీయః పాదః ||4||
స్వప్నావస్థలో, అన్తః ప్రజ్ఞతో, సప్తాంగములు, పందొమ్మిది జిహ్వలూ కలిగి, మానసిక స్మృతులకు భోక్తయైన తైజసుడే ఆత్మయొక్క ద్వితీయ పాదము
యత్ర సుప్తో నకంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం |
సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానన్దమయో ఆనందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః ||5||
గాఢనిద్రలో (సుషుప్తిలో) ఇంద్రియార్థములైన కోరికలు, మానసికమైన స్వప్నములు కూడ ఉండవు. దేహాత్మభావన లేని శుద్ధ చిత్తము కేవలానందమునే పొందును. ఆ ఆనందమునకు భోక్తయైన ప్రాజ్ఞుడు ఆత్మయొక్క తృతీయపాదము.
Vvs Sarma | 6:50pm Sep 14 |
Vinjamuuri Venkata Apparao
మన సుఖ సంతోషాలు బాధలూ ఇత్యాదులు మన శరీరానికే గాని ఆత్మను తాకవంటారు గదా? .మరి ఆత్మ శాంతించడం ఏమిటి ?
VVS Sarma
ఈకథలు ఎవరుచెప్పారు మీకు? మీ ప్రశ్నకు అర్థంలేదు. మన సుఖ సంతోషాలు బాధలూ ... మన శరీరానికే గాని ఇక్కడ మన అనే బహువచన పదానికి అర్థమేమిటి? నేను అన్నంతింటే మీకు ఆకలి తీరి తృప్తాస్తు అంటారా? ఎవరూ భోజనం చేసి నా నోరు, నాలుక, అన్నవాహిక, కాలేయము, జఠరాశయము ఆనందించాయి అనరు. నేను తృప్తి చెందాను.అంటారు. నేను అంటే ఏమిటి? జీవాత్మ మాత్రమే. శరీరముకాదు. ఆఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని ధరిస్తుంది, కాని మరణానంతరం ప్రేతాత్మగా కూడా ఉంటుంది.అన్నం తిన్న సుఖానికి భోక్త జీవుడే. (విశ్వుడు,వైశ్వానరుడు+ నాగీత పోష్టులు చూడండి.) సామాన్యునిలో దేహాత్మభావన బలంగా ఉంటుంది. శరీరాని దహనంచేసినప్పుడు ఆజీవాత్మ క్షోబిస్తుంది. అందుకే శ్రాద్ధమంత్రాలలో - దహన జనిత తాపోపశమనార్థం, తృష్ణోపశమనార్థం, పిపాసా శాంత్యర్థం తిలోదక, వాసోదక స్నానం కరిష్యే అని చదువుతారు.
Vinjamuri Venkata Apparao
మనం ఏదో మంచి చేస్తే మన పెద్దల అత్మలు సంతోషించడం ఏమిటి? .ఆత్మలు క్షోభించడం ఏమిటి?
VVS Sarma
మీ అబ్బాయి అమెరికాలో ఉంటే మీరు సంతోషంపొందడం ఎందుకు? ప్రపంచము సంబంధాల మీద నడుస్తుంది. (Logic of relationships) మీరు చేసిన కర్మలు మీవెంట ఎలా వస్తాయి? పుణ్య పాప కర్మలు మీఅక్కౌంట్ లో ఎక్కడ పడతాయి? ఇవి సంస్కారాలరూపంలో,స్మృతిరూపంలో మీ ఆత్మను అచ్చాదించి ఉండడమే మీ పునర్జన్మ కు ప్రారబ్ధకర్మకు సాధనాలౌతాయి. ఈ సంబంధాన్ని అపూర్వ సంబంధం ఆంటరు. . మీకర్మలు మీఆత్మ వెంట వచ్చే డెబిట్, క్రెడిట్ కార్డులు.ముక్తి అంటే ఈబంధాల,సంబంధాలనుండి విముక్తి.
VVA - పున్నామ నరకం నుండి తప్పించు వారు పుత్రులు అంటారు.. VVS – ఈ నమ్మకం పూర్తిగా అనవసరం. ఇది వారు పితృయజ్ఞాలు చేసి పితౄణం తీర్చుకుంటే . ఇప్పుడు 100కి 90 మంది బ్రతికి ఉండగానే ఇంకెన్నో నరకాలు చూపిస్తున్నారు
VVA - అన్ని మతాల వారికీ వర్గాల వారికీ కర్మ కాండ నిర్వహించే పద్ధతి ఉంది . అంటే ఏ పధ్ధతిలో చేసినా ఒకటే అని మన పధ్ధతిలోనే చెయాలని లేదనే భావం కదా? అలాగే సంధ్యా వందనానికి బదులు ఒక సూర్య నమస్కారం చేస్తే అదే ఫలితం వస్తున్నప్పుడు .అంత Ritualistic గా నోరు తిరగని సంధ్యా వందనం చేసి శ్రమ పడడం ఎందుకు?
VVS - కర్మ కాండ అంటే వైదిక కర్మకాండ మాత్రమే. ఇతర మతాల వాళ్ళ అంత్యక్రియలకూ మన కర్మకాండకు సంబంధంలేదు. ఒక ఉదాహరణ = ఒకరికి హార్ట్ ఎటాక్ వస్తే అపోలో హాస్పిటలికి,ఒకరినీ ఒక క్లినిక్ కీ, ఒకరిని పల్లేటూళ్ళో RMP వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళారనుకోండి. వారి వారి గతులు వేరుగా ఉంటాయి. అంత్యక్రియలు అంతే. అబ్రహామిక్ మతాలవారి ఆత్మ సమాధిపట్టుకునే అశాంతితో judgment day కోసం వేచియుంటుంది. అందుకే అందరి RIPలు. హిందువులకు RIPచెప్పడం మూర్ఖత్వం.
సంధ్యావందనానికి సూర్యనమస్కారానికి ఒకే ఫలమని మీకు ఎవరుచెప్పారు? దానికి ప్రమాణము ఏమిటి? ఎవరికి వారు ఏదో ఉహించుకున్నది సనాతన ధర్మం ఎలా ఔతుంది? విశ్వేశ్వరాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో శర్మన్ ప్రచోదయాత్ అని నేను వ్రాసుకుంటే అది గాయత్రీ మంత్రం ఔతుందా? VVS Sarma's absolute stupidity అవుతుంది.
VVA = నా పిల్లలు నాకు శ్రాధ్ధం పెట్టక పోతే నేను నరకమెందుకు అనుభవించాలోనా కు అర్ధం కాదు
VVS - మీకు శ్రాద్ధంపెట్టడమేమిటండీ? పితృ పితామహ ప్రపితామహులకు పెడతారు. ఫలం మీకు కాదు పితృదేవతల అనుగ్రహం వాళ్ళకు. మీకు యముడు నరకం విధించేముందు మీరు చెప్పుకునేది ఏమైన ఉందా? అని అడుగుతాడులెండి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
50
సో2 యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో2 ధి మాత్రం
పాదా మాత్రా మాత్రాశ్చ పాదా అకారో ఉకారో మకారయితి ||8||
ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ, ఉ, మ్ అనే మూడు
వర్ణాలతో రూపొందిన ఓం
జాగరితస్థానో వైశ్వానరో 2 కారః ప్రధమామాత్రా ఆప్తేరాదిమత్వాద్ వా ఆప్నోతి హవై సర్వాన్
కామాదిశ్చ భవతి య ఏవం వేదా||9||
ఓంకార మంత్రం మొదటిభాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో
పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంచేత ఈ రెండూ సమానముగా ఉన్నవి. (అ
ప్రథమాక్షరము. విష్ణువుకు సంకేతం. అందుకే వ్యాపకత్వానికి సంకేతం.) ఈ విధంగా
ఉపాసన చేసినవానికి అన్నికోరికలూ తీరి ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతాడు.
స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయామాత్రా ఉత్కర్షాదుభయత్వాత్ వా ఉత్కర్షతిహ
వైజ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్ కులే భవతి య ఏవంవేదా ||10||
ఓంకారమంత్రము రెండవమాత్రయైన ఉకారము స్వప్నావస్థను ఆధారముచేసుకొన్న
తైజసుడు. శ్రేష్ఠత్వం చేత, బ్రహ్మ సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నవి. ఈ విధంగా
తెలుసుకున్నవాడు జ్ఞానాన్ని నిశ్చయంగా పెంపొందించుకుంటాడు. సుఖదుఃఖాలవంటి
ద్వంద్వాలలో సమతౌల్యంగా ఉంటాడు. అతడి వంశంలో జ్ఞాని కాని వాడు జన్మించడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
51
సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకార స్తృతీయ మాత్రా మితేరాసి తేర్వామినోతి హవాఇదం.
సర్వమపీతిశ్చ మపీతిశ్చభవతి య ఏవంవేదా ||11||
ఓంకార మంత్ర మూడోభాగమైన మకారం సుషుప్తిని (గాఢనిద్రాస్థితిని) ఆధారంచేసుకున్న ప్రాజ్ఞుడు. ప్రజ్ఞ అంటే విశ్లేషణ శక్తి, గ్రహణశక్తి (wisdom , intelligence , knowledge , discrimination , judgement ) మకారము రుద్రుని, కాలస్వరూపుడైన యముని సూచిస్తుంది. ప్రాజ్ఞుని ప్రజ్ఞ, మకారము సమానముగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు ప్రజ్ఞావంతుడు అగుచున్నాడు.
అమాత్ర శ్చతుర్థోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో2ద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనా 22 త్మానం . య ఏవం వేద య ఏవం వేద ||12||
ఓంకారమంత్రంలో నాలుగవభాగము, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది. ప్రాపంచిక చైతన్యానికి అతీతమైంది, మంగళకరమైంది. అద్వైతము. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందు ఆత్మజ్ఞాని.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
52
ఇప్పుడు తిరిగి గీత శ్లోకము (2.69) కు వద్దాము.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
సమస్త ప్రాణులకు రాత్రియగు సమయమున ఇంద్రియనిగ్రహముగల యోగి మెలకువతో ఉండును. ఏసమయమున లోకులు మెలకువతో తమనిత్యకృత్యములలో నిమగ్నులైయుందురో, అది పరమార్థతత్త్వమును చింతించు యోగికి నిశాసమయము.
ఇక్కడ భగవంతుడు పగలు రాత్రి సమయాలలో జీవుని లక్షణాలను తెలుపుతున్నాడు. సామాన్యులు సూర్యోదయమునుండి రాత్రివరకు పగలుగా భావిస్తారు. మెలకువతో ఉంటూ తమ లౌకిక వ్యవహారాలలో నిమగ్నులైఉంటారు. కాని దీనిని మునులు చీకటి రాత్రిగా పరిగణిస్తారు. జనులు చైతన్య రహితులై నిద్రలో ములిగిన రాత్రి మునులకు పగలుగా కనుపిస్తుంది.
జాగ్రదవస్థ - పగలు మనుష్యుడు లౌకిక వ్యవహారాలలో నిమగ్నుడై ఉన్నప్పుడు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను అనుభవిస్తాడు. కోరికలు - కోరుకొన దగినవి, కోరుకొన కూడనివి అని రెండు రకాల కోరికలతో సతమత మౌతాడు. ఈ పరిస్థితిలో జీవుని విశ్వుడు అంటారు. అంటే విశ్వములో ప్రవర్తిస్తున్నవాడు. దేహాత్మభావన బలంగా ఉంటుంది. ఇదే మాయతో కూడిన విశ్వము. మాయకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి సత్యమును కనిపించకుండా చేయడం. రెండవది అసత్యమును సత్యముగా చూపడం (ఉదాహరణ - తాడు పాముగా కనబడడం) నిశా సమయములో స్వప్నావస్థ, సుషుప్తి (గాఢనిద్ర) అని రెండు స్థితులు ఉంటాయి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
53
స్వపావస్థ - నిద్రలో కలలు వచ్చేసమయం. నిత్యజీవితములో పరిచయమున్న పనులలోనే సామాన్యంగా ప్రవర్తిస్తాడు. ఒకొక సమయంలో గాలిలో ఎగరడం వంటి ఊహలు కూడా స్వప్నాలలో నిజమౌతాయి. ఆత్మ భావన అలాగే ఉంటుంది. శరీరభావన కూడా ఉంటుంది. ఆ సమయములో అన్నీ సత్యాలుగానే అనుభవంలోనికి వస్తాయి. ఇక్కడ జీవుని తైజసుడు అంటారు. స్మృతులు, కోరికలు, భయాలు స్వప్నానుభవములో జరిగినట్లు ఉండవచ్చు. తిరిగి మెలకువలోనికి రాగానే ఇదంతా అసత్యమని తెలుస్తుంది.
సుషుప్త్యవస్థ - నిద్రలో దేహాత్మ భావన ఉండదు. కేవలం జీవాత్మ భావనయే. నేను అనే అహంకారం నిద్రలో ఉండదు. నిద్రలో మాయయొక్క ఒక లక్షణమే ఉంటుంది. అజ్ఞానం ఉంటుంది, ఏదీ తెలియదు కాబట్టి. కాని సత్యాన్ని అసత్యంగా చూపే లక్షణం ఉండదు. ఈ రెండులక్షణాలనే అద్వైత సిద్ధాంతములో ఆవరణ, విక్షేపము అంటారు. ఇక్కడ జీవుని ప్రాజ్ఞుడు అంటారు. సాధారణంగా ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ కలవాడు, పండితుడు అనే అర్థములో వాడుతాము. తనలో తాను ప్రవేశించి ప్రశాంతముగా నిద్రించడమే అతని ప్రజ్ఞ. ప్రపంచ భావనను విస్మరించడం వలన ఒక అజ్ఞానమునుండి దూరమైనాడు. కాని జ్ఞాని కాలేదు. తెలుసుకోవలసినది, తెలుసుకో తగినది దేనిని తెలుసుకుంటే నిత్యమైన శాంతి లభిస్తుందో అట్టి జ్ఞానము అతనికి లేదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
54
అపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ|| 2-70 ||
ఏవిధముగా నదీజలాదులు అనేకము ప్రవేశించినను,సముద్రము నిశ్చలముగా ఉన్నదో, ఆవిధముగనే భోగ్యవిషయములన్నియు బ్రహ్మనిష్ఠునియందు అణగిపోవుచున్నవి. అతడే శాంతిని పొందును కాని విషయాసక్తుడైన వాడు (కామకామీ) శాంతిని పొందడు.
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి|| 2-71 ||
ఎవరు సమస్త కోరికలను వదలి, ప్రాపంచిక విషయములను పరిత్యజించి అహంకార మమకారములు లేకుండ ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుతున్నాడు. నేను, నాది అన్నవి లేకపోతే కోరికలు, రాగద్వేషాలు సహజంగా నశిస్తాయి.
తురీయావస్థ - ఈ మూడు స్థితులకు అతీతమైన తురీయావస్థలో ఇట్టి జ్ఞానము సంప్రాప్తమౌతున్నది. ఇదే ఆశించవలసినది. ఇది జ్ఞాని స్థితి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
55
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||
అర్జునా ఇది అంతయు బ్రాహ్మీ స్థితి (బ్రహ్మ సంబంధమైన స్థితి) ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందిన వాడు మరలనెప్పటికీ విమోహమును చెందడు. అంత్యకాలమందుకూడా ఇట్టిస్థితియందున్నవాడు బ్రహ్మానందరూపమోక్షమును (బ్రహ్మ నిర్వాణమును) పొందుచున్నాడు.
ఈస్థితి యందున్నవానికి ఏవిధమైన మోహమూలేదు. అంత్యకాలమున కూడా ఈస్థితిలో ఉన్నయెడల నిర్వికారము, శాశ్వతమూ ఐన బ్రహ్మమునందు లయము చెందుచున్నాడు. అంత్యకాలమందు దేవతలను స్మరిస్తూ ఉంటే ఆయా దేవతల స్థానములను పొందుతాడు. ఇది సగుణారాధన, యజ్ఞాదుల ఫలము. తుఋఈయావస్థలో ఈ క్రమముక్తి మార్గము వర్తించదు.
నాలుగవ స్థానములో జీవుడు అద్వైత సిద్ధిని పొందుతున్నాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః|| 2 ||
మన సుఖ సంతోషాలు బాధలూ ఇత్యాదులు మన శరీరానికే గాని ఆత్మను తాకవంటారు గదా? .మరి ఆత్మ శాంతించడం ఏమిటి ?
VVS Sarma
ఈకథలు ఎవరుచెప్పారు మీకు? మీ ప్రశ్నకు అర్థంలేదు. మన సుఖ సంతోషాలు బాధలూ ... మన శరీరానికే గాని ఇక్కడ మన అనే బహువచన పదానికి అర్థమేమిటి? నేను అన్నంతింటే మీకు ఆకలి తీరి తృప్తాస్తు అంటారా? ఎవరూ భోజనం చేసి నా నోరు, నాలుక, అన్నవాహిక, కాలేయము, జఠరాశయము ఆనందించాయి అనరు. నేను తృప్తి చెందాను.అంటారు. నేను అంటే ఏమిటి? జీవాత్మ మాత్రమే. శరీరముకాదు. ఆఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని ధరిస్తుంది, కాని మరణానంతరం ప్రేతాత్మగా కూడా ఉంటుంది.అన్నం తిన్న సుఖానికి భోక్త జీవుడే. (విశ్వుడు,వైశ్వానరుడు+ నాగీత పోష్టులు చూడండి.) సామాన్యునిలో దేహాత్మభావన బలంగా ఉంటుంది. శరీరాని దహనంచేసినప్పుడు ఆజీవాత్మ క్షోబిస్తుంది. అందుకే శ్రాద్ధమంత్రాలలో - దహన జనిత తాపోపశమనార్థం, తృష్ణోపశమనార్థం, పిపాసా శాంత్యర్థం తిలోదక, వాసోదక స్నానం కరిష్యే అని చదువుతారు.
Vinjamuri Venkata Apparao
మనం ఏదో మంచి చేస్తే మన పెద్దల అత్మలు సంతోషించడం ఏమిటి? .ఆత్మలు క్షోభించడం ఏమిటి?
VVS Sarma
మీ అబ్బాయి అమెరికాలో ఉంటే మీరు సంతోషంపొందడం ఎందుకు? ప్రపంచము సంబంధాల మీద నడుస్తుంది. (Logic of relationships) మీరు చేసిన కర్మలు మీవెంట ఎలా వస్తాయి? పుణ్య పాప కర్మలు మీఅక్కౌంట్ లో ఎక్కడ పడతాయి? ఇవి సంస్కారాలరూపంలో,స్మృతిరూపంలో మీ ఆత్మను అచ్చాదించి ఉండడమే మీ పునర్జన్మ కు ప్రారబ్ధకర్మకు సాధనాలౌతాయి. ఈ సంబంధాన్ని అపూర్వ సంబంధం ఆంటరు. . మీకర్మలు మీఆత్మ వెంట వచ్చే డెబిట్, క్రెడిట్ కార్డులు.ముక్తి అంటే ఈబంధాల,సంబంధాలనుండి విముక్తి.
VVA - పున్నామ నరకం నుండి తప్పించు వారు పుత్రులు అంటారు.. VVS – ఈ నమ్మకం పూర్తిగా అనవసరం. ఇది వారు పితృయజ్ఞాలు చేసి పితౄణం తీర్చుకుంటే . ఇప్పుడు 100కి 90 మంది బ్రతికి ఉండగానే ఇంకెన్నో నరకాలు చూపిస్తున్నారు
VVA - అన్ని మతాల వారికీ వర్గాల వారికీ కర్మ కాండ నిర్వహించే పద్ధతి ఉంది . అంటే ఏ పధ్ధతిలో చేసినా ఒకటే అని మన పధ్ధతిలోనే చెయాలని లేదనే భావం కదా? అలాగే సంధ్యా వందనానికి బదులు ఒక సూర్య నమస్కారం చేస్తే అదే ఫలితం వస్తున్నప్పుడు .అంత Ritualistic గా నోరు తిరగని సంధ్యా వందనం చేసి శ్రమ పడడం ఎందుకు?
VVS - కర్మ కాండ అంటే వైదిక కర్మకాండ మాత్రమే. ఇతర మతాల వాళ్ళ అంత్యక్రియలకూ మన కర్మకాండకు సంబంధంలేదు. ఒక ఉదాహరణ = ఒకరికి హార్ట్ ఎటాక్ వస్తే అపోలో హాస్పిటలికి,ఒకరినీ ఒక క్లినిక్ కీ, ఒకరిని పల్లేటూళ్ళో RMP వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళారనుకోండి. వారి వారి గతులు వేరుగా ఉంటాయి. అంత్యక్రియలు అంతే. అబ్రహామిక్ మతాలవారి ఆత్మ సమాధిపట్టుకునే అశాంతితో judgment day కోసం వేచియుంటుంది. అందుకే అందరి RIPలు. హిందువులకు RIPచెప్పడం మూర్ఖత్వం.
సంధ్యావందనానికి సూర్యనమస్కారానికి ఒకే ఫలమని మీకు ఎవరుచెప్పారు? దానికి ప్రమాణము ఏమిటి? ఎవరికి వారు ఏదో ఉహించుకున్నది సనాతన ధర్మం ఎలా ఔతుంది? విశ్వేశ్వరాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో శర్మన్ ప్రచోదయాత్ అని నేను వ్రాసుకుంటే అది గాయత్రీ మంత్రం ఔతుందా? VVS Sarma's absolute stupidity అవుతుంది.
VVA = నా పిల్లలు నాకు శ్రాధ్ధం పెట్టక పోతే నేను నరకమెందుకు అనుభవించాలోనా కు అర్ధం కాదు
VVS - మీకు శ్రాద్ధంపెట్టడమేమిటండీ? పితృ పితామహ ప్రపితామహులకు పెడతారు. ఫలం మీకు కాదు పితృదేవతల అనుగ్రహం వాళ్ళకు. మీకు యముడు నరకం విధించేముందు మీరు చెప్పుకునేది ఏమైన ఉందా? అని అడుగుతాడులెండి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
50
సో2 యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో2 ధి మాత్రం
పాదా మాత్రా మాత్రాశ్చ పాదా అకారో ఉకారో మకారయితి ||8||
ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ, ఉ, మ్ అనే మూడు
వర్ణాలతో రూపొందిన ఓం
జాగరితస్థానో వైశ్వానరో 2 కారః ప్రధమామాత్రా ఆప్తేరాదిమత్వాద్ వా ఆప్నోతి హవై సర్వాన్
కామాదిశ్చ భవతి య ఏవం వేదా||9||
ఓంకార మంత్రం మొదటిభాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో
పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంచేత ఈ రెండూ సమానముగా ఉన్నవి. (అ
ప్రథమాక్షరము. విష్ణువుకు సంకేతం. అందుకే వ్యాపకత్వానికి సంకేతం.) ఈ విధంగా
ఉపాసన చేసినవానికి అన్నికోరికలూ తీరి ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతాడు.
స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయామాత్రా ఉత్కర్షాదుభయత్వాత్ వా ఉత్కర్షతిహ
వైజ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్ కులే భవతి య ఏవంవేదా ||10||
ఓంకారమంత్రము రెండవమాత్రయైన ఉకారము స్వప్నావస్థను ఆధారముచేసుకొన్న
తైజసుడు. శ్రేష్ఠత్వం చేత, బ్రహ్మ సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నవి. ఈ విధంగా
తెలుసుకున్నవాడు జ్ఞానాన్ని నిశ్చయంగా పెంపొందించుకుంటాడు. సుఖదుఃఖాలవంటి
ద్వంద్వాలలో సమతౌల్యంగా ఉంటాడు. అతడి వంశంలో జ్ఞాని కాని వాడు జన్మించడు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
51
సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకార స్తృతీయ మాత్రా మితేరాసి తేర్వామినోతి హవాఇదం.
సర్వమపీతిశ్చ మపీతిశ్చభవతి య ఏవంవేదా ||11||
ఓంకార మంత్ర మూడోభాగమైన మకారం సుషుప్తిని (గాఢనిద్రాస్థితిని) ఆధారంచేసుకున్న ప్రాజ్ఞుడు. ప్రజ్ఞ అంటే విశ్లేషణ శక్తి, గ్రహణశక్తి (wisdom , intelligence , knowledge , discrimination , judgement ) మకారము రుద్రుని, కాలస్వరూపుడైన యముని సూచిస్తుంది. ప్రాజ్ఞుని ప్రజ్ఞ, మకారము సమానముగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు ప్రజ్ఞావంతుడు అగుచున్నాడు.
అమాత్ర శ్చతుర్థోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో2ద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనా 22 త్మానం . య ఏవం వేద య ఏవం వేద ||12||
ఓంకారమంత్రంలో నాలుగవభాగము, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది. ప్రాపంచిక చైతన్యానికి అతీతమైంది, మంగళకరమైంది. అద్వైతము. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందు ఆత్మజ్ఞాని.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
52
ఇప్పుడు తిరిగి గీత శ్లోకము (2.69) కు వద్దాము.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
సమస్త ప్రాణులకు రాత్రియగు సమయమున ఇంద్రియనిగ్రహముగల యోగి మెలకువతో ఉండును. ఏసమయమున లోకులు మెలకువతో తమనిత్యకృత్యములలో నిమగ్నులైయుందురో, అది పరమార్థతత్త్వమును చింతించు యోగికి నిశాసమయము.
ఇక్కడ భగవంతుడు పగలు రాత్రి సమయాలలో జీవుని లక్షణాలను తెలుపుతున్నాడు. సామాన్యులు సూర్యోదయమునుండి రాత్రివరకు పగలుగా భావిస్తారు. మెలకువతో ఉంటూ తమ లౌకిక వ్యవహారాలలో నిమగ్నులైఉంటారు. కాని దీనిని మునులు చీకటి రాత్రిగా పరిగణిస్తారు. జనులు చైతన్య రహితులై నిద్రలో ములిగిన రాత్రి మునులకు పగలుగా కనుపిస్తుంది.
జాగ్రదవస్థ - పగలు మనుష్యుడు లౌకిక వ్యవహారాలలో నిమగ్నుడై ఉన్నప్పుడు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను అనుభవిస్తాడు. కోరికలు - కోరుకొన దగినవి, కోరుకొన కూడనివి అని రెండు రకాల కోరికలతో సతమత మౌతాడు. ఈ పరిస్థితిలో జీవుని విశ్వుడు అంటారు. అంటే విశ్వములో ప్రవర్తిస్తున్నవాడు. దేహాత్మభావన బలంగా ఉంటుంది. ఇదే మాయతో కూడిన విశ్వము. మాయకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి సత్యమును కనిపించకుండా చేయడం. రెండవది అసత్యమును సత్యముగా చూపడం (ఉదాహరణ - తాడు పాముగా కనబడడం) నిశా సమయములో స్వప్నావస్థ, సుషుప్తి (గాఢనిద్ర) అని రెండు స్థితులు ఉంటాయి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత – మాండూక్యోపనిషత్తు
53
స్వపావస్థ - నిద్రలో కలలు వచ్చేసమయం. నిత్యజీవితములో పరిచయమున్న పనులలోనే సామాన్యంగా ప్రవర్తిస్తాడు. ఒకొక సమయంలో గాలిలో ఎగరడం వంటి ఊహలు కూడా స్వప్నాలలో నిజమౌతాయి. ఆత్మ భావన అలాగే ఉంటుంది. శరీరభావన కూడా ఉంటుంది. ఆ సమయములో అన్నీ సత్యాలుగానే అనుభవంలోనికి వస్తాయి. ఇక్కడ జీవుని తైజసుడు అంటారు. స్మృతులు, కోరికలు, భయాలు స్వప్నానుభవములో జరిగినట్లు ఉండవచ్చు. తిరిగి మెలకువలోనికి రాగానే ఇదంతా అసత్యమని తెలుస్తుంది.
సుషుప్త్యవస్థ - నిద్రలో దేహాత్మ భావన ఉండదు. కేవలం జీవాత్మ భావనయే. నేను అనే అహంకారం నిద్రలో ఉండదు. నిద్రలో మాయయొక్క ఒక లక్షణమే ఉంటుంది. అజ్ఞానం ఉంటుంది, ఏదీ తెలియదు కాబట్టి. కాని సత్యాన్ని అసత్యంగా చూపే లక్షణం ఉండదు. ఈ రెండులక్షణాలనే అద్వైత సిద్ధాంతములో ఆవరణ, విక్షేపము అంటారు. ఇక్కడ జీవుని ప్రాజ్ఞుడు అంటారు. సాధారణంగా ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ కలవాడు, పండితుడు అనే అర్థములో వాడుతాము. తనలో తాను ప్రవేశించి ప్రశాంతముగా నిద్రించడమే అతని ప్రజ్ఞ. ప్రపంచ భావనను విస్మరించడం వలన ఒక అజ్ఞానమునుండి దూరమైనాడు. కాని జ్ఞాని కాలేదు. తెలుసుకోవలసినది, తెలుసుకో తగినది దేనిని తెలుసుకుంటే నిత్యమైన శాంతి లభిస్తుందో అట్టి జ్ఞానము అతనికి లేదు.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
54
అపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ|| 2-70 ||
ఏవిధముగా నదీజలాదులు అనేకము ప్రవేశించినను,సముద్రము నిశ్చలముగా ఉన్నదో, ఆవిధముగనే భోగ్యవిషయములన్నియు బ్రహ్మనిష్ఠునియందు అణగిపోవుచున్నవి. అతడే శాంతిని పొందును కాని విషయాసక్తుడైన వాడు (కామకామీ) శాంతిని పొందడు.
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి|| 2-71 ||
ఎవరు సమస్త కోరికలను వదలి, ప్రాపంచిక విషయములను పరిత్యజించి అహంకార మమకారములు లేకుండ ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుతున్నాడు. నేను, నాది అన్నవి లేకపోతే కోరికలు, రాగద్వేషాలు సహజంగా నశిస్తాయి.
తురీయావస్థ - ఈ మూడు స్థితులకు అతీతమైన తురీయావస్థలో ఇట్టి జ్ఞానము సంప్రాప్తమౌతున్నది. ఇదే ఆశించవలసినది. ఇది జ్ఞాని స్థితి.
శ్రీకృష్ణ బోధామృతం – భగవద్గీత
55
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||
అర్జునా ఇది అంతయు బ్రాహ్మీ స్థితి (బ్రహ్మ సంబంధమైన స్థితి) ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందిన వాడు మరలనెప్పటికీ విమోహమును చెందడు. అంత్యకాలమందుకూడా ఇట్టిస్థితియందున్నవాడు బ్రహ్మానందరూపమోక్షమును (బ్రహ్మ నిర్వాణమును) పొందుచున్నాడు.
ఈస్థితి యందున్నవానికి ఏవిధమైన మోహమూలేదు. అంత్యకాలమున కూడా ఈస్థితిలో ఉన్నయెడల నిర్వికారము, శాశ్వతమూ ఐన బ్రహ్మమునందు లయము చెందుచున్నాడు. అంత్యకాలమందు దేవతలను స్మరిస్తూ ఉంటే ఆయా దేవతల స్థానములను పొందుతాడు. ఇది సగుణారాధన, యజ్ఞాదుల ఫలము. తుఋఈయావస్థలో ఈ క్రమముక్తి మార్గము వర్తించదు.
నాలుగవ స్థానములో జీవుడు అద్వైత సిద్ధిని పొందుతున్నాడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః|| 2 ||
భగవద్గీత
57
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోऽహమాప్నుయామ్|| 3-2 ||
సందేహాస్పదమైన (వ్యామిశ్ర = equivocal, mixed, సందేహాస్పదమైన ) వాక్యాలచేత నా బుద్ధిని కలవరపెడుతున్నావు. నేను దేనిచేత శ్రేయస్సును పొందెదనో అదొకటియే నిశ్చయముగా చెప్పుము.
అర్జునునికి సాంఖ్యయోగం లోని కృష్ణుని బోధ విన్నాక చాలా అనుమానాలు వచ్చాయి. తన ప్రశ్నకు సమాధానం సూటిగా ఈయకుండా ఏవో అన్యవిషయాలు చెబుతున్నట్లు అనిపించింది. ఆత్మనుగురించి చెప్పావు, బ్రహ్మ వస్తువు గురించి చెప్పావు. సామాన్యునిగురించి చెప్పావు, యోగిని గురించిచెప్పావు. ఒకమాటకు మరొక మాటకు సమన్వయం కుదరటంలేదు. ఏదో ఒక మార్గము సూటిగా చెప్పు. ఆజ్ఞాపించు. అదినేను చేస్తాను. కాని నన్ను చిక్కులో పడవేయకు - ఈ విధమైన మనఃస్థితిలో అర్జునుని ప్రశ్నలున్నాయి. అర్జునుని స్థితిలో గాని పరోక్ష శ్రోతలైన మనకుగాని ఈ ప్రశ్నలు సహజమే!
భగవద్గీత
58
శ్రీభగవానువాచ|
లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||
భగవానుని సమాధానం: అర్జునా! నేను చాలా పూర్వమే సాంఖ్యులకు జ్ఞాన యోగము, యోగులకు కర్మయోగము అనే రెండు మార్గములను బోధించాను. ఇక్కడ చెప్పిన రెండు మార్గములు తత్త్వతః వేరైనవి కాని రెండూ ముక్తిమార్గములుగానే చెప్పబడినవి.
ఒకటి ఇంద్రియములు,మనస్సు చేయు కర్మలకు తాను కర్త కాదని, తాను సర్వాత్మకుడైన పరమాత్మయేనని భావించడం జ్ఞానయోగము. ఇదే సంన్యాసము, సాంఖ్యయోగము.
రెండవది ఈశ్వరాజ్ఞచేత, లేదా ఈశ్వరార్థమై చేయు నిష్కామకర్మ. అంటే లౌకిక ఫలము లేనిది. ఇది కర్మ యోగము.
ఈ సమాధానం సహజంగా అర్జునునిలో క్రొత్త ప్రశ్నలకు దారి తీస్తుంది. మనుష్యులలో రెండు రకాల వారున్నారా? నీవు పూర్వం చెప్పావంటే ఎప్పుడు, ఎవరికి ఎంత చెప్పావు? నీవు ఎప్పుడు వచ్చావు?
భగవద్గీత
59
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4 ||
మనుజుడు కర్మలను ఆచరించకపోవుట వలన నిష్క్రియమైన ఆత్మస్వరూప స్థితిని పొందడు. సన్యసించుట చేత సిద్ధి కలుగదు.
ఇది చాలా ముఖ్యమైన బోధ. కేవలము కర్మలను ఆరంభింపకపోవడమువలన ఏ మనుజుడు కర్మలను చేయడంలేదని అనిపించుకోడు. కర్మలు చేస్తూ కర్మకన్న జ్ఞానము గొప్పదని తెలుసుకొని కర్మ పరిత్యాగము చేసిన వాడుకూడా కర్మచేయనివాడు కాడు. అట్టి వారిని కర్మభ్రష్టులు అంటారు కాని వారు కర్మాతీతులు అనిపించుకోరు. కేవలం కర్మలను వదలిపెట్టుటవలన జ్ఞానము కాని, మోక్షము కాని రావు.
అసలు గీత చెప్పే ఈ కర్మ ఏమిటి? ఒక అర్థములో యజ్ఞకర్మ, వైదిక కర్మకాండ అని కొందరు చెబుతారు. మరి సామాన్యుని జీవితకాలంలో చేసే చదువు, ఉద్యోగం, ఉదర పోషణ, కుటుంబం, పిల్లల పెంపకం ఇవన్నీ కర్మలే కదా! అనే సందేహం కలుగుతుంది.
తాను జ్ఞానమార్గములో ఉన్నాను అనే భ్రమలో నిత్య వైదిక విధులు, భగవదనుగ్రహము లభించే ఉత్తమ కర్మలను వదలిపెట్టి, సామాన్యమైన లౌకిక కర్మలుచేస్తూ వాని ఫలములు అనుభవించకుండా ఉండరు. కనుక వారు కర్మలకు అతీతులు కాలేరు.
భగవద్గీత
65
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12 ||
మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టమైన (వారు కోరిన) భోగములను ఇస్తారు. ఇట్లు వారిచే ఈయబడిన భోగ్యవస్తువులను వారికి తిరిగి సమర్పించక ఎవరు అనుభవించుదురో వారు దొంగలే అగుదురు. (ఇది ఒక జాగ్రతగా తెలుసుకోవలసిన విషయాన్ని గురించి చెబుతుంది.)
65
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12 ||
మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టమైన (వారు కోరిన) భోగములను ఇస్తారు. ఇట్లు వారిచే ఈయబడిన భోగ్యవస్తువులను వారికి తిరిగి సమర్పించక ఎవరు అనుభవించుదురో వారు దొంగలే అగుదురు. (ఇది ఒక జాగ్రతగా తెలుసుకోవలసిన విషయాన్ని గురించి చెబుతుంది.)
యజ్ఞ కర్మ వలన లభించిన ఫలం (భోగ భాగ్యములు) తిరిగి దేవతలకు సమర్పించడమేమిటి? ఇది అర్థ రహితంగా కనుపిస్తుంది.
కోరికలతో యజ్ఞము చేస్తే కోరికలు తీరుతాయి. ధనం వస్తుంది. పదవులు వస్తాయి. అధికారం వస్తుంది. అవి లభించడం వలన చేసే ఐహిక కర్మలన్నీ పుణ్య పాపాలను ఇస్తాయి. పుణ్య కర్మలు ఉత్తమ జన్మలను, పాపకర్మలు హీన జన్మలను ఇస్తాయి. ఏదైనా ఇవన్నీ పునర్జన్మలతో ఇహలోకానికి బంధించేవే. సంసార బంధాలనుండి విముక్తినీయవు. యజ్ఞము చేయవలసినదే. కాని ఎందుకు చేయాలి? కోరికలతో కాదు. జన్మ సార్థకతకోసం చేయాలి. జ్ఞాన మోక్షాలకోసం చేయాలి. యజ్ఞ కర్మలే ముక్తిని ఈయగలవు. యజ్ఞమంటే హోమాలు మాత్రమే కావు. ఆ వివరణ తరువాత వస్తుంది.
యజ్ఞ ఫల త్యాగము వలననే అమృతత్వం వస్తుంది. దానం పుణ్యమునే ఇస్తుంది.
మహాభారతంలో యజోపయజుల కథ , చిన్నప్పుడు విన్న తోటకూర కథ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. క్రింద ఇచ్చిన వెబ్సైట్ చూడండి. నహుషుని కథ తెలిసినదే. బుద్ధుడు కర్మకాండను నిరసించడంలో ఈ గీతా రహస్యం ఉన్నది.
http://manonetram.blogspot.in/2011/07/blog-post_20.html
యజ్ఞ ఫల త్యాగము వలననే అమృతత్వం వస్తుంది. దానం పుణ్యమునే ఇస్తుంది.
మహాభారతంలో యజోపయజుల కథ , చిన్నప్పుడు విన్న తోటకూర కథ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. క్రింద ఇచ్చిన వెబ్సైట్ చూడండి. నహుషుని కథ తెలిసినదే. బుద్ధుడు కర్మకాండను నిరసించడంలో ఈ గీతా రహస్యం ఉన్నది.
http://manonetram.blogspot.in/2011/07/blog-post_20.html
భగవద్గీత
66
యజ్ఞశిష్టాశనః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్|| 3-13 ||
66
యజ్ఞశిష్టాశనః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్|| 3-13 ||
యజ్ఞమునందు మిగిలిన (భగవదర్పణము చేసిన) పదార్థమును తిను సజ్జనులు సమస్తపాపములనుండి ముక్తులౌతున్నారు. అట్లుకాక ఎవరు జిహ్వచాపల్యంతో తమ అనుభవానికై భుజించుచున్నారో, అట్టివారు పాపములను తినువారే అగుదురు.
అంటే యజ్ఞమును యజ్ఞఫలమును భగవంతునకు అర్పించి, యజ్ఞ శేషమును ప్రసాదముగా స్వీకరించాలి. నిత్యకృత్యములో ఇది తమ ఇంటిలో వండిన అన్నాదులను పరమేశ్వరార్పణముగా, భగవంతునికి నైవేద్యము పెట్టడముచేత ఇది యజ్ఞ శేషమే అగుచున్నది. ఇది సంప్రదాయము. ఈ అన్నము భగవంతుని అనుగ్రహం వలననే నాకు లభించింది అనే భావనతో స్వీకరించాలి. ఇలా చేస్తే పాపములు తొలగుతాయి. ఇటువంటి అన్నము వలన వంశాభివృద్ధి కలుగుతుంది. నిత్యజీవితములో మనముచేస్తున్న ప్రతిపనీ యజ్ఞ కర్మగా అనుకోవాలి. మంత్రములతో చేసిన హోమము ఒక్కటే యజ్ఞము కాదు.
అంటే యజ్ఞమును యజ్ఞఫలమును భగవంతునకు అర్పించి, యజ్ఞ శేషమును ప్రసాదముగా స్వీకరించాలి. నిత్యకృత్యములో ఇది తమ ఇంటిలో వండిన అన్నాదులను పరమేశ్వరార్పణముగా, భగవంతునికి నైవేద్యము పెట్టడముచేత ఇది యజ్ఞ శేషమే అగుచున్నది. ఇది సంప్రదాయము. ఈ అన్నము భగవంతుని అనుగ్రహం వలననే నాకు లభించింది అనే భావనతో స్వీకరించాలి. ఇలా చేస్తే పాపములు తొలగుతాయి. ఇటువంటి అన్నము వలన వంశాభివృద్ధి కలుగుతుంది. నిత్యజీవితములో మనముచేస్తున్న ప్రతిపనీ యజ్ఞ కర్మగా అనుకోవాలి. మంత్రములతో చేసిన హోమము ఒక్కటే యజ్ఞము కాదు.
భగవద్గీత
67
67
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 ||
ప్రాణము (జీవకోటి) అన్నము వలన కలుగుతున్నది. అన్నము (వర్షమునిచ్చు) మేఘము వలన కలుగుతున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుతున్నది. యజ్ఞము సత్కర్మవలన కలుగుతున్నది.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్|| 3-15 ||
సత్కర్మ వేదములవలన కలుగుతున్నది. వేదము అక్షరమైన పరబ్రహ్మము వలన కలుగుచున్నది. కనుక సర్వవ్యాపకమగు ఆ బ్రహ్మమే, నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్టింపబడినదానినెరుంగుము.
సకల ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి. అన్నము వర్షము వలన, వర్షము యజ్ఞమువలన కలుగుచున్నవి. ఈ ప్రపంచములో ఏ ఒక జీవుడైనా భగవంతుని ప్రసాదముచేత వర్షము పడుతున్నట్లు భావన చేస్తే, ఆ భావనే యజ్ఞము. ఆ సత్యము సృష్టిలో ఉన్నంత వరకు యజ్ఞము జరుగుతున్నట్లే లెక్క. ఎవరైతే సమస్త కారణములు యజ్ఞము వల్లనే అనిగుర్తిస్తాడో అతడు పరమేశ్వరుని గుర్తించినట్లే. నిత్యజీవితములో పరమేశ్వరునిగుర్తించి ఛేసిన ప్రతికర్మా యజ్ఞమే కనుక దాని ఫలంగా వర్షము, అన్నము, సంతానము, దానివలన కలుగు సుఖదుఃఖములు అన్నీ ఉన్నాయి.
కర్మ బ్రహ్మోద్భవం అని చెప్పినప్పుడు ఈ బ్రహ్మ ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. జీవునకు కరచరణాది అవయవములు, సంకల్పవికల్పములు ఇచ్చినది సృష్టికర్త యైన చతుర్ముఖ బ్రహ్మ. ఈ సగుణబ్రహ్మ పరబ్రహ్మనుంది వచ్చినది. అది నశించనిది. యజ్ఞమందు ప్రతిష్ఠితమై ఉంటుంది.. కర్మ చేయుట, ఫలాన్ని అనుభవించుట అంతా యజ్ఞములో భాగములే. సమస్తసృష్టి కోరికలతో కూడియుండి, యజ్ఞమయమై ఉన్నది.
###
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 ||
ప్రాణము (జీవకోటి) అన్నము వలన కలుగుతున్నది. అన్నము (వర్షమునిచ్చు) మేఘము వలన కలుగుతున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుతున్నది. యజ్ఞము సత్కర్మవలన కలుగుతున్నది.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్|| 3-15 ||
సత్కర్మ వేదములవలన కలుగుతున్నది. వేదము అక్షరమైన పరబ్రహ్మము వలన కలుగుచున్నది. కనుక సర్వవ్యాపకమగు ఆ బ్రహ్మమే, నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్టింపబడినదానినెరుంగుము.
సకల ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి. అన్నము వర్షము వలన, వర్షము యజ్ఞమువలన కలుగుచున్నవి. ఈ ప్రపంచములో ఏ ఒక జీవుడైనా భగవంతుని ప్రసాదముచేత వర్షము పడుతున్నట్లు భావన చేస్తే, ఆ భావనే యజ్ఞము. ఆ సత్యము సృష్టిలో ఉన్నంత వరకు యజ్ఞము జరుగుతున్నట్లే లెక్క. ఎవరైతే సమస్త కారణములు యజ్ఞము వల్లనే అనిగుర్తిస్తాడో అతడు పరమేశ్వరుని గుర్తించినట్లే. నిత్యజీవితములో పరమేశ్వరునిగుర్తించి ఛేసిన ప్రతికర్మా యజ్ఞమే కనుక దాని ఫలంగా వర్షము, అన్నము, సంతానము, దానివలన కలుగు సుఖదుఃఖములు అన్నీ ఉన్నాయి.
కర్మ బ్రహ్మోద్భవం అని చెప్పినప్పుడు ఈ బ్రహ్మ ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. జీవునకు కరచరణాది అవయవములు, సంకల్పవికల్పములు ఇచ్చినది సృష్టికర్త యైన చతుర్ముఖ బ్రహ్మ. ఈ సగుణబ్రహ్మ పరబ్రహ్మనుంది వచ్చినది. అది నశించనిది. యజ్ఞమందు ప్రతిష్ఠితమై ఉంటుంది.. కర్మ చేయుట, ఫలాన్ని అనుభవించుట అంతా యజ్ఞములో భాగములే. సమస్తసృష్టి కోరికలతో కూడియుండి, యజ్ఞమయమై ఉన్నది.
###
భగవద్గీత
68
68
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
భగవంతునిచేత వర్తింపచేయబడిన ఈ ధర్మ చక్రమును ప్రపంచమున ఎవరు అనుసరించి ప్రవర్తింపరో, అట్టివారు పాప జీవనమును గడుపుతో, ఇంద్రియ సుఖములలో ములిగి వ్యర్థముగా బ్రతుకుచున్నారు.
మనుష్యుడు తెలుసుకోవలసినది "ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. ఇది బంధన హేతువు. సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. సుఖములో ఉన్నప్పుడు రాబోయే దుఃఖమును గురించి,దుఃఖములో అనుభవించిన సుఖములగురించి యోచనచేయ కుండా నిర్లిప్తతతో ఉండాలి. ఇది ప్రకృతి సహజమని ఎరిగి, ప్రతిక్రియలగురించి అలోచించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. Always act normally but do not react to every situation.
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
భగవంతునిచేత వర్తింపచేయబడిన ఈ ధర్మ చక్రమును ప్రపంచమున ఎవరు అనుసరించి ప్రవర్తింపరో, అట్టివారు పాప జీవనమును గడుపుతో, ఇంద్రియ సుఖములలో ములిగి వ్యర్థముగా బ్రతుకుచున్నారు.
మనుష్యుడు తెలుసుకోవలసినది "ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. ఇది బంధన హేతువు. సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. సుఖములో ఉన్నప్పుడు రాబోయే దుఃఖమును గురించి,దుఃఖములో అనుభవించిన సుఖములగురించి యోచనచేయ కుండా నిర్లిప్తతతో ఉండాలి. ఇది ప్రకృతి సహజమని ఎరిగి, ప్రతిక్రియలగురించి అలోచించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. Always act normally but do not react to every situation.
భగవద్గీత
69
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే|| 3-17 ||
69
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే|| 3-17 ||
ఎవరు కేవలము ఆత్మ యందే క్రీడించుచూ (ఆత్మ రతిరేవ), ఆత్మయందే తృప్తిని పొందుతూ ( ఆత్మ తృప్తశ్చ) ఆత్మచేత సంతోషపడుతో (ఆత్మన్యేవ సంతుష్ట) ఉందురో, అట్టి మానవులకు (ఆత్మజ్ఞానులకు) చేయదగినపని (కర్తవ్యం) ఉండదు. (తస్య కార్యం న విద్యతే).
ఇంతకు ముందు కర్మ అనివార్యమని భగవంతుడు చెప్పినదానికి, ఈ శ్లోకములో చెప్పినదానికి భావ వైరుధ్ధ్యం ఉన్నట్లు కనబడుతుంది. జీవులకు కర్మ తప్పదని చెప్పి, ఇప్పుడు "అకర్మకృత్" గురించి చెబుతున్నాడు.
"నేనెవరిని?" అన్న ప్రశ్నతో సాధనామార్గం చూపించిన వారు భగవాన్ రమణులు. నేను కాని వస్తువుతో సంబంధం లేకుండా ఎవరైతే ఉంటారో, నేనే సర్వాంతర్యామినై ఉన్నాననే పరిజ్ఞానం ఎవరికిఉంటుందో, అలాంటివారికి నిర్దేశింపబడిన కర్మ ఏదీ ఉండదు.
చేసే కర్మయందు కర్తృత్వభావన ఉంటేనే ధర్మము, కర్మ ఉంటాయి. ప్రతివానికి బయట జరిగే సంఘటనల వలన సుఖ దుఃఖాలు వస్తాయి. అప్పుడు ఆస్థితిని ఎదుర్కోవడానికి కర్మ చేస్తాడు. ఎండ ఎక్కువ అనిపిస్తే నీడలొ నిలబడతాడు.బయట ఎండవలన తనకు దుఃఖం. నీడలోకి నడచి సంతృప్తి పొందుతాడు. కాని ఆత్మలోనే సుఖదుఃఖాలను అనుభవించేవారికి, నీడలోనికి నడవడమనే కర్మ చేయాలని స్ఫురించదు. దేహ ధర్మాలనుకూడా వదలిపెట్టే స్థితి వస్తుంది. ఇతరులిచ్చే గౌరవానికి పొంగడు. శరీరబాధలు అతనిని బాధింపవు. క్రియలు, ప్రతి క్రియలు లేవు. దేహాత్మ భావనచేత చుట్టూ ఉన్న ప్రకృతిని గుర్తించినప్పుడు కర్మచేయబడుతుంది. ఆత్మజ్ఞాని లౌకికముగా ఇతరులకు ఆదర్శముగా ఉండాలని కర్మచేయవచ్చు, అది తనను బాధించదు.
ఇంతకు ముందు కర్మ అనివార్యమని భగవంతుడు చెప్పినదానికి, ఈ శ్లోకములో చెప్పినదానికి భావ వైరుధ్ధ్యం ఉన్నట్లు కనబడుతుంది. జీవులకు కర్మ తప్పదని చెప్పి, ఇప్పుడు "అకర్మకృత్" గురించి చెబుతున్నాడు.
"నేనెవరిని?" అన్న ప్రశ్నతో సాధనామార్గం చూపించిన వారు భగవాన్ రమణులు. నేను కాని వస్తువుతో సంబంధం లేకుండా ఎవరైతే ఉంటారో, నేనే సర్వాంతర్యామినై ఉన్నాననే పరిజ్ఞానం ఎవరికిఉంటుందో, అలాంటివారికి నిర్దేశింపబడిన కర్మ ఏదీ ఉండదు.
చేసే కర్మయందు కర్తృత్వభావన ఉంటేనే ధర్మము, కర్మ ఉంటాయి. ప్రతివానికి బయట జరిగే సంఘటనల వలన సుఖ దుఃఖాలు వస్తాయి. అప్పుడు ఆస్థితిని ఎదుర్కోవడానికి కర్మ చేస్తాడు. ఎండ ఎక్కువ అనిపిస్తే నీడలొ నిలబడతాడు.బయట ఎండవలన తనకు దుఃఖం. నీడలోకి నడచి సంతృప్తి పొందుతాడు. కాని ఆత్మలోనే సుఖదుఃఖాలను అనుభవించేవారికి, నీడలోనికి నడవడమనే కర్మ చేయాలని స్ఫురించదు. దేహ ధర్మాలనుకూడా వదలిపెట్టే స్థితి వస్తుంది. ఇతరులిచ్చే గౌరవానికి పొంగడు. శరీరబాధలు అతనిని బాధింపవు. క్రియలు, ప్రతి క్రియలు లేవు. దేహాత్మ భావనచేత చుట్టూ ఉన్న ప్రకృతిని గుర్తించినప్పుడు కర్మచేయబడుతుంది. ఆత్మజ్ఞాని లౌకికముగా ఇతరులకు ఆదర్శముగా ఉండాలని కర్మచేయవచ్చు, అది తనను బాధించదు.
భగవద్గీత
70
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18 ||
అట్టి ఆత్మజ్ఞానికి కర్మ చేయుటవలన కలిగే ప్రయోజనములేదు, చేయకపోతే దోషంలేదు. అతనికి ఏ ప్రయోజనముకైనను సమస్తభూతములను ఆశ్రయింపవలసిన అవసరము లేదు. శరీరము నేను కాదని అనుకుంటాడుకనుక శరీరమును రక్షించుకునే ప్రయత్నము చేయడు. పనిచేయటం వలన పాటులేదు,చేయకపోతే లోటు లేదు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||
తస్మాత్=అందుచేత, అసక్తః = అనాసక్తుడివై (సంగరహితముగా, ఫలా పేక్షలేకుండా ), కార్యం=చేయవలసిన, కర్మ (కర్మను) సమాచర (చక్కగా చేయుము.) ఈ విధముగా అసక్తుడై కర్మను ఆచరించు పురుషుడు పరమును (మోక్షమును)పొందుతున్నాడు.
70
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18 ||
అట్టి ఆత్మజ్ఞానికి కర్మ చేయుటవలన కలిగే ప్రయోజనములేదు, చేయకపోతే దోషంలేదు. అతనికి ఏ ప్రయోజనముకైనను సమస్తభూతములను ఆశ్రయింపవలసిన అవసరము లేదు. శరీరము నేను కాదని అనుకుంటాడుకనుక శరీరమును రక్షించుకునే ప్రయత్నము చేయడు. పనిచేయటం వలన పాటులేదు,చేయకపోతే లోటు లేదు.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||
తస్మాత్=అందుచేత, అసక్తః = అనాసక్తుడివై (సంగరహితముగా, ఫలా పేక్షలేకుండా ), కార్యం=చేయవలసిన, కర్మ (కర్మను) సమాచర (చక్కగా చేయుము.) ఈ విధముగా అసక్తుడై కర్మను ఆచరించు పురుషుడు పరమును (మోక్షమును)పొందుతున్నాడు.
దేహమున్నంతసేపూ కర్మలు చేస్తూ ఉంటావు. చేయవలసినదే. కాని ఆకర్మ నిన్ను బంధించకుండా మాత్రము నీవు చూచుకోవాలి. కర్తవ్యములు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. పుణ్యకర్మల ఫలమును త్యాగం ఛేయాలి. లేకపోయిన అవీ బంధములే.
No comments:
Post a Comment