Tuesday, 29 July 2014

ఏడుకొండల దేవుడు

ఏడుకొండల దేవుడు - వేంకటేశ్వరుడు


https://cherukurammohan.blogspot.com/2014/07/blog-post_29.html

Vinjamuri Venkata Apparao = నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది.

VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కాడు అనేది. శంకరాచార్యుని చిత్రించే విధానం శైవునిలా విబూతిధారణతో కనుపిస్తుంది. ఈ శైవ, వైష్ణవభేదాలు శంకరుల తరువాత వచ్చినవి. రామానుజ పూర్ణప్రజ్ఞ (మధ్వ) దర్శనాలనే వైష్ణవదర్శనాలంటారు.......

vvs గారి వ్రాతకు జతగా నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయ సంకల్పించినాను.

నిజానికి వెం+కట అన్న ఈ రెండు శబ్దాలు సంస్కృత శబ్దములు కాదని విన్నాను. వీనికి సంస్కృత శబ్దమైన ఈశ్వర కలిపి వెంకటేశ్వర ఐనదని పండితుల మాట. ఇక నిజానిజాలకొస్తే వైష్ణవులు ఎవరైతే విష్ణువే పరబ్రహ్మ స్వరుపుడనుకోటారో వారు ఈశ్వర శబ్దము నుచ్చరించరు. అందుకే వెంకటాచల పతియని శ్రీనివాస యనినామంతరముల నెర్పరచుకొని పిలుచుకొంటారు

మహా పండితులు కోట వెంకటా చలం గారు సహేతుకముగా సాదికారకముగా జగద్గురు ఆది శంకరుల కాలము బి. సి. 509--477 అని నిరుపించినారు. అట్టి ఆది శంకరులు వారు జీవించిన కాలములోనే ధనాకర్షణ జనాకర్షణ యంత్రములు వేసియుంటారు . అసలా యంత్రాలు వారు వేసినారా లేదా అంటే అతి ప్రాచీనమైన ధనాకర్షణ యంత్రము స్వామి కొప్పెరను 10 లేక 15 సం.ల క్రితం పునరుద్దరించు నపుడు భూమి అడుగున దొరికింది . అంటే ఆ యంత్రముల పురాతనత్వము మీకు ఎరుకపడి వుంటుంది. శంకరులు సకల దేవతా స్తోత్రములు వ్రాసినా

ప్రత్యేకించి వేంకటేశ్వరుని గూర్చి వ్రాయలేదు. కారణం ఆయన శివ కేశవ అభేది గనుక. ఆ విగ్రహమును గూర్చి యా అపర శంకరులకేరుక కనుక. ఇక భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు దాదాపు 120సం. బ్రతికినారు.ఎన్నొ ఉత్థాన పతనాలను అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ యతి(అద్వైతి),రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే కాలాంతరమున రామానుజులవారు శ్రీయామునాచార్యుల (అలవందార్) వారి శిష్యులై విశిష్టాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాంతరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాంతరీకరణములు జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .

ఏది ఏమైనా వారికి పూర్వము ఆ విగ్రహాన్ని 6 నెలలు శైవాగమ విధానము గాను 6 నెలలు వైష్ణవాగమ విధానము గానూ పూజించేవారు. వారి కాలములో చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్ర్రీనివాస విగ్రహం గా మార్చినట్లు తెలియ వచ్చుచున్నది.

ఇందుకు అనేక కారణాలున్నాయి . అవి తరువాత పోస్ట్ లో తెలియబరచుతాను. నేను విన్న చదివిన ఆధారాలపైనే ఈ మాటలు వ్రాస్తున్నాను .జిజ్ఞ్యాసువులు నన్ను తప్పుగా తలవరని తలుస్తాను.



నిన్నటి పోస్ట్ లో కటేశ్వరుని మూలమూర్తిని శివునిగా విష్ణువుగా బాలాత్రిపురసుందరిగా సుబ్రహ్మణ్యునిగా అన్వఇంచుకొనుటకు గల కారణములను అన్వేషించుదాము . అంతకు ముందు భక్తాగ్రేసరులై భగవంతుని తమకిష్టమైన రీతిలో దర్శించగలిగిన వారేమన్నారో చూస్తాము. వెంకటేశ పాదాధ్యాయుడై తొలుత అద్యైతియయ్యు పిదప వైష్ణవమును స్వీకరించిన భక్త శిఖామణి అన్నమయ్య ఒక పాదములో ఏమన్నారంటే :
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు

అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరి నమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు'

అదేవిధంగా పరమ రామ భక్తుడైన త్యాగరాజు గారు తన కృతి లో'శివుడవో మాధవుడవో' అని ప్రశ్నిస్తాడు .

ఇక విషయానికొస్తే ఈ విగ్రహాన్ని 'అమ్మ' అనుకొనుటకు గల కారణమేమంటే

ఔత్తరాహికులు ఈ మూర్తిని అనాది నుండి 'బాలాజీ' అనే సంబోధిస్తారు .'జి' అనేది మర్యాద సుచకము..ప్రాకారానికి నలువైపులా యుండే సింహ విగ్రహాలు సింహవాహినీ తత్వాన్ని మనకు సూచిస్తాయి. శుక్రవారములందు ఈ విగ్రహానికి అభిషేకాలు జరుగుతాయి. ఆరోజు విగ్రహానికి చీర కట్టడం జరుగుతుంది. అమ్మవారికి జరిగే దసరా ఉత్సవాలు ఈ మూర్తికి జరుగుతాయన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతేకాక ఉత్తుంగమైన వక్షస్సు, చూపు మరల్సుకోలేని ముఖ వర్చస్సు, విగ్రహపు వేనుకవైపునుండే ధమ్మిల్లము(కొప్పు) ఇత్యాదులు 'అమ్మ' నే సూచిస్తాయి కదా!

ఇక శివుడనుకోడానికి గల కారణమేమంటే ఆ మూర్తికి అభిషేకము జరుగుతుంది బిల్వదళ పూజాజరుగుతుంది. 'అలంకార ప్రియో విష్ణుః అభిషెక ప్రియో శివః' అన్నది ఆర్యొక్తి.ఆ మూర్తి కి చేతులకు నాగాభరణాలున్నాయి. శంఖచక్రములు లేవు. అర్చకులు వానిని అనుదినము అలంకరించుతారు. ఈ విగ్రహములో త్రిశూలాది చిహ్నములు కుడా వున్నాయని పెద్దలు వాక్రుచ్చుతారు. ఉరమునండు లక్ష్మీదేవిని కూడా అమర్చుతారు. స్వామీ అభయహస్తమొకటి చాలు అది విష్ణు విగ్రహమనడానికి. కేవలము శివుడే ఐతే లింగరుపము లో ఉండవలెనుగదా! విగ్రహ వేషభూషలు,పై విషయముల తప్ప విష్ణువునే సూచిస్తాయి.

వీటన్నిటికంటే ఇంకొక ముఖ్య విషయమేమిటంటే ఈ విగ్రహము సుబ్రహ్మణునిది అన్న ఆలోచన కలిగించేది. గుడి ప్రక్కనే వున్న కొలనును 'స్వామి పుష్కరణి' అంటారు . శాస్త్రము సుబ్రహ్మణ్యుని పేర్లను ఈ విధంగా చెబుతుంది.

'దేవసేనాపతిః శూరః స్వామీ గజముఖానుజః ... 'అంటే ఇక్కడ 'స్వామి' అన్న పేరు ఆయనకున్నది అని తెలుస్తున్నది. కొండ మీద 'కుమార ధార' అన్న తీర్థము కుడా వున్నది. ఇక కటి హస్తము కుమారుని విగ్రహములకే ఉంటుందంటారు.

ఇంక ఉపసంహారానికి వస్తాము. అద్వైతము 'న ద్వితీయే ఇతి అద్వైతం' అంటుంది . అదే పరబ్రహ్మ అంటుంది . కానీ ఈ పరబ్రహ్మ వాచామగోచరము. మరి ఈ విగ్రహమో వాచా గోచరము. హరి అన్న ఒక్క శబ్దానికి అనంతమైన అర్థాలునాయి. అసలు హరి యన్నా హరుడన్నా హరించే వాడే. ఏమిటి హరిస్తున్నది అంటే మన అన్వయాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మనము ఈ విగ్రహాన్ని ఆ పరబ్రహ్మ కే అనుసంధించుకొంటే 'ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' అన్న శాస్త్ర వచనము నిజమును నిరుపించిన వాళ్ళమైతాము. మహాకవి కాళీదాసు 'ఎకైవమూర్తి ర్బిభిదే త్రిధాసా ' అన్న మాటతో వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ

నిలుస్తాను.

 

Top of Form

 

Bottom of Form

శ్రీ వేంకటేశ్వర స్వామిని గూర్చిన విషయాలు (నిజానిజాలు నాకు తెలియదు )

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు విగ్రహం ఎప్పుడూ 110


డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది.

 

తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది.

తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో

శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి

మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు.

గురువారం అభిషేకానికి ముందు వెంకన్న

ఆభరణాలను తీసేస్తారు

. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల

విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు


కారణమని వారు చెబుతున్నారు.

 

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా

గదులు ఇందులో ప్రత్యేక మైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి

ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు,

జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు

కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు. అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త

మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి

గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు.

స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి

ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.ఇక

స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21

అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును

కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు

తిరుమల గురించి కొన్ని నిజాలు*******

1. గుడి మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై

అనంతాళ్వారు కొట్టిన గునపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న

స్వామివారిని ఆగడ్డపార కొట్టడం తో స్వామివారి గడ్డంపై గాయమై

రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే

సాంప్రదాయం మొదలైంది.

 

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్)

ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.


3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం

ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ

గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత

పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే

తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి,

పూలు, వెన్న తదితర అన్నీ.


4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ

నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి

గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.


5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైనచీరతో అలంకరిస్తారు.

దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటిఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న

దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్

అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయతీసుకు

రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి

వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది.

అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం

నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది

తీసివేసినప్పుడులక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

 9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే

స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా

పూజారివారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా

స్వామి వెనక చూడరు అనిఅంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి

ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాళహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర

పైకి వస్తాయి.


10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల

సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

 11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది.

ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర దేవునికి అపచారము

చేసినారని నమ్హమి వారిని హతమార్చి

గోడకు వేలాడదీసినాడట. ఆ సమయములోనే విమాన వెంకటేశ్వర స్వామి

వారి విగ్రురహము వెలసినాడని చేబుతారు.

స్వస్తి.