కాల గణన(భారతీయ శైలి)
భారతీయ కాలగణన
జనవరి 1 న పాశ్చాత్య కాలగణనావిధానమును గూర్చి తెలుసుకొన్నాము. ఇక భారతీయ కాలగణనను గూర్చి తెలుసుకొన ప్రత్నింప ఉద్యమింతుమా!
మన దేశమునకు వేదశాస్త్రేతిహాస పురాణములు ప్రమాణములు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలు ఎన్నో విషయములు, వివరణలు, ఎంతో మంది రాజులు, మహాపురుషుల చరిత్రలు కలిగి వుంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలం చెప్పేవాళ్ళు అక్కడక్కడున్నా వినేవాళ్ళు తగ్గిపోయినారు. మన సంస్కారమే మన సంస్కృతి. ఈ సంస్కృతే మన దేశపు ఆకృతి.
అసలు విషయానికొస్తే పురాణం పంచ లక్షణమన్నారు ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమేరియ నుండి దిగబడినవారు కారు. (అప్రాచ్యులు అంటే న + ప్రాచ్యులు ~ తూర్పు దేశస్తులు కానివారు. అంటే పడమటి దేశస్తులు లేక పాశ్చాత్యులు).
ఈశ్వర పుత్రాః ఆర్యాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితం
తన ఋగ్వేద భాష్యంలోనూ;600 సంవత్సరముల క్రితం విద్యారణ్యులవారు తమ వేద భాష్యం లోనూ వ్రాసి యున్నారు.
పురాణము యొక్క 5 లక్షణాలు ఏమిటి వంటే 1.సర్గ 2.ప్రతిసర్గ 3.మన్వంతర 4.రాజవంశ 5.అనువంశములు. మన చర్చలో మొదటి మూడు అవసరము .
1. సర్గ: సర్గయనగా సృష్టికి ఆది పునాది. పునాది అటులనే వున్నా ఆది కల్గినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే.
2. ప్రతిసర్గ: ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి మనకు తెలిసిన మత్సావతార కథ ప్రతిసర్గకు సంబంధించిందే. ఈ ఉదంతాన్ని బైబిల్ లో కుడా చూస్తాము. నోవా అనే నాయకుడు పడవలో జీవరాశిని మచ్చుకొకటి తీసుకొని క్రొత్త తీరమునకు వెళ్ళినట్లున్నది. మన పురాణ నిర్వచనము ప్రకారము ఇది ప్రతిసర్గయే. కాని వారందులో దీనిని నిర్వచించలేదు. ఇటువంటి ఉదంతములను గూడా మన నుండి పాశ్చాత్యులు గ్రహించినట్లు తేట తెల్లమగుచున్నది. ఈ విధంగా సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు ఐన పూర్వీకులు పాశ్చాత్యులు
చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా! పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర
ప్రకారము సృష్టి జరిగి 195,58,85,125 సంవత్సరములు (2023 వరకు) అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతి వర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5125 సంవత్సరములైనది. ఇంత నిర్డుష్టముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”.
పంచ + అంగము = పంచాంగము. ఐదు అంగములు కల్గినది. అవి ఏవన: 1.తిధి 2.వారము 3.నక్షత్రము 4.యోగము 5.కరణము.
1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది
సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.
మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒకచాంద్రమాసమునకు 29.53 రోజులుంటయి.
2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్
సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము.
2½ ఘడియల కాలము =1హోర(hour). మొదటి హోర అర్క అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 '
హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర చంద్ర హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7
వారాలు వస్తాయి. చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమును, బుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును, స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. హోరా నియమము పాటించువారికి రాహుకాల యమగండ కాలాడులతో పని లేదు.
మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ
వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని, అవి ఎట్లు వచ్చినవీ తెలియకుండానే, వాడుకొనుచున్నారు పాశ్చాత్యులు
౩.
నక్షత్రము: సాపేక్ష సౌర
గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజిలీలను గుర్తించి(ఈ మజిలీలను రాశులుఅంటారు)
ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు.4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. ౩వ నక్షత్రములోని మిగిలిన ౩ పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (౩+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. ఈ విధమైన పాద విభజన పాశ్చాత్యులకు లేదు. 12*9=108 అంటే 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర,
6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ,
11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త,
14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ,
19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ,
24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.ఇందులోని
18 వ నక్షత్రమైన జేష్ఠను గమనించండి. జేష్ఠ అంటేనే అన్నిటి కన్నా పెద్దది. ఇప్పుడు పైన తెలిపిన నక్షత్ర నామములు ఒంటరి నక్షత్రమును తెలుపవు. ఆ నక్షత్రము పరిధిలో నుండే నక్షత్ర కూటమిని తెలియజేస్తాయి. ఆ విధముగా ఈ 27 నక్షత్రాలలో జేష్ఠ పెద్దది. అసలు ఈ విశ్వాంతరాళములోని పెద్ద నక్షత్రములలో 23 లేక 24వదిగా చెప్పబడుతుంది. దీని వ్యాసార్థము సూర్యుని వ్యాసార్థమున కన్నా 883
రెట్లు పెద్దది. బరువు 12.4 రెట్లు ఎక్కువ. మరి అంతటి గొప్ప విషయమును
కేవలము తమ తపోయోగముతో గమనించి మన పూర్వులు చెప్పగలిగినారంటే
వారి ఘనత బహుథా ప్రశంసనీయమే కదా! కాల గణన తో సంబంధము లేకున్నా
ఇంకొక ముఖ్యమైన విషయము తెలుపుకుంటాను. పెళ్లిరోజు పంతులుగారు వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. వశిష్ఠుని భార్యగా చెప్పబడుతుంది
అరుంధతి. వశిష్ఠ నక్షత్రములో రెండు నక్షత్రముల సముదాయములు రెండు వున్నాయి. అరుంధతిలో రెండు నక్షత్రములున్నాయి. కానీ ఈ రెండూ ఒకదాని వెంట ఒకటి తిరిగేది మాత్రము వాస్తవము. భార్యా భర్తల అన్యోన్యతకు, అనుబంధమునకు, ఆవిధముగా ఆ నక్షత్ర సముదాయములు ప్రతీకలైనాయి.
ఈ 12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus),
3.మిథునం(Jiminy), 4.కర్కాటకం(Cancer),
5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagittarius), 10.మకరం(Capricorn),
11.కుంభం(Aquarius), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు ఉపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.
4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి,
3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ,
13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య,
23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ,
26.ఇంద్ర,27.నైద్రుతి.
ఈ యోగము యొక్క ప్రభావము మానవ శరీర ఆరోగ్యముపై నుంటుంది.
5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి,360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని
కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖైజి, 6.వాణిజి,7.విష్టి,
8.చతుష్పద, 9శకుని, 10.నగ,
11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారముల నధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీ ప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.
పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన
గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్ద కొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్ద కొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి
1.చైత్రము, 2.వైశాఖము,
3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము,
8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము
ప్రతి నెలలోను సూర్యుడు 12 రాశులలోని ఒక రాశి లో ప్రవేశిస్తే అది నిజ మాసమౌతుంది. లేకుంటే అధిక మాసమౌతుంది. చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.
సౌరమానము ప్రకారమూ సూర్యుడు మిథునరాశిలో వున్నప్పుడు, చాంచ్మారనములో ఆషాఢ మాసము వస్తుంది. ఆరెండు నెలలూ కలిసిన మధ్య కాలమును శూన్యమాసము అంటారు. అదేవిధముగా సూర్యుడు ధనుస్సులో వున్నప్పుడు చాన్ద్రమానము ప్రకారము పుష్య మాసము ధనుర్మాసముతో కలిసి వుంటుంది. ఈ రెండు సంగామములనూ శూన్యమాసములు అంటారు. చాంద్ర మానము పాటించే జనబాహుళ్య సౌలభ్యము కొరకు ఆషాఢ పుష్య మాసములు శూన్య మాసములుగా పరిగణింప బడు చున్నవి.
అదే ఒక నెలలో రెండు సంక్రమణములొస్తే అది క్షయ మాసమౌతుంది. ఇది 141 సంవత్సరములకొకసారి వస్తుంది. ఒక సారి వచ్చిన తరువాత తిరిగీ 19 సంవత్సరములకే వచ్చే అవకాశమున్నది. ఈ విధంగా కాల గణన ఎక్కడికక్కడ సవరించుకొంటూ దోష రహితంగాను నిరాఘాటంగానూ సాగిపోతూంటుంది.
ఇక సంవత్సరముల విషయానికొస్తే సాపేక్ష సూర్య భ్రమణమును వర్తులాకారముగా తీసుకొన్నాము కావున ఆ భ్రమణము 360 డిగ్రీలు కలిగి వుంటుంది. సూర్యుడు
రోజుకు ఒక అంశ (డిగ్రీ) ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పుకొన్నాము. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలు 60 పేర్లతో గడచిన తరువాత తిరిగి ప్రభవతో పునరావృత్తమౌతాయి. ఈ 60 పేర్లు ఈ క్రింది విధముగా వున్నాయి:
1.ప్రభవ, 2.విభవ,
3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి,
6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాతు, 11.ఈశ్వర,12.బహుధాన్య,
13.ప్రమాది, 14.విక్రమ, 15.విషు, 16.చిత్రభాను, 17.స్వభాను,
18.తారణ, 19.పార్ధివ, 20.విజయ, 21.సర్వజిత్తు, 22.సర్వధారి,
23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ,
28.జయ, 29.మన్మధ, ౩౦.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, ౩౩.వికారి, 34.శార్వరి, 35.ప్లవ,
36.శుభకృతు, 37.శోభకృతు, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ,
41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య,
44.సాధారణ, 45.విరోధికృతు, 46.పరీధావి, 47. ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నళ,
51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్ధి, 54.రౌద్ర, 55.దుర్మతి,
56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ఈ సంవత్సర సమూహమును ‘60’గా ఎందుకు ఏర్పరచినారు అన్నది తెలుసుకొనుటకు ముందు మన వాళ్ళు గ్రహములకాయా పేర్లు ఎందుకు పెట్టినారో చూస్తాము. సాపేక్షముగా భూమిపై నిలబడి గ్రహ గతిని పరిశీలించితే, దూరమునుండి చేరువరకు గ్రహ భ్రమణము ఈ విధంగా వుంటుంది.
“మంద అమరేఢ్య భూపుత్ర అర్క శుక్ర బుధ ఇందవః”
శని బృహస్పతి అంగారక సూర్య శుక్ర బుధ చంద్ర
మంద అన్నా శని అన్నా అత్యంత నెమ్మదిగా నడిచేది. అన్ని గ్రహములకన్నా ఈ గ్రహము ఒక భ్రమణమునకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. అంతే గానీ Satan అని, ముస్లీములు సాతాన్ అనే మాటలకు దీనితో సంబంధము లేదు. ఇది ఒక భ్రమణమునకు 30 సంవత్సరములు తీసుకొంటుంది. బృహత్ అంటే పెద్దది. బృహత్ + పతి =బృహస్పతి. అతి పెద్ద గ్రహములకు రాజు అంటే మన సౌర మండలములో అత్యంత పెద్ద గ్రహము. అంగారము అంటే అగ్ని. ఈ గ్రహము ఆరంగులో మనకు కనిపిస్తుంది కావున అది అంగారకమైనది.
ఇక సూర్యుని గూర్చి ఒక్క సారి మన దేవాలయాలలోని నవగ్రహ మంటపం గమనించితే సూర్యుని గ్రహ మండలంలోని నట్టనడుమన ప్రతిష్టించి వుంటారు అంటే సూర్యుని కేంద్రముగా గొని మిగతా గ్రహములన్నియు భూమితో కుడా వర్తులాకారములో చుట్టుచున్న వనియే కదా! అసలు గ్రహ నామములు వానివాని గుణములను తెలియజేస్తున్నాయి గమనించండి. వరాహమిహురుడు, ఆర్యభట్టు, భట్టోత్పలుడు, భాస్కరుడు ఆదిగాగల భారతీయ ఖగోళ వైజ్ఞానికులు కోపర్నికస్ వంటి పాశ్చాత్య వైజ్ఞానికులకన్నా ఎన్నో శతాబ్దాల పూర్వమే తమ వేద విజ్ఞానముతో భూమి గుండ్రముగా నున్నదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని, గ్రహ భ్రమణమునకు సూర్యుడు కేంద్రమని, తమ గ్రంధములలో రచించియున్నారు. కాణాదుని వంటి మహర్షులు సూర్యకిరణములు వక్రగతిన ప్రయాణము చేయుననియు సూర్య కిరణములో 7 రంగులున్నవనియు కుడా చెప్పినారు. మన పూర్వులు సూర్యుని గూర్చి
తెల్పుచూ అయన రథానికి ఒకటే చక్రమనియు (కాల చక్రము) అయన రథ సారధికి నడుము మాత్రమే వుంది తొడలు లేవని (ఆయన పేరు అణూరుడు) అంటే రథము లో కదలకుండా ఎప్పుడూ నడుపుతూనే వుంటాడనియు, రథమునకు పూన్చిన గుఱ్ఱములు 7 అనియు (7 రంగులు) రథమునకు పగ్గములు పాములనియు,
సూర్య కిరణములు వంకరటింకరగా వుంటాయి నిగూఢముగా తెల్పినారు.
ఇక శుక్ర గ్రహము: శుక్రము అంటే తెలుపు, కాంతివంతము అని అర్ధం సాయం సమయమున ఆకాశం పరిశీలించితే ఈ వాస్తవం తెలుస్తుంది.
బుధగ్రహము: బుధుని సౌమ్యుడు అని అంటారు. అంటే చూడ ముచటైన చందన వర్ణములో ఉంటాడని అర్థం.
చంద్ర గ్రహము: చంద్రము అంటే బంగారము. చంద్రుడు ఆ వర్ణములో వుంటూ చల్లని కిరణాలను ప్రసరింప చేస్తాడు కావున ఆయనను చంద్రుడని శీత కిరణుడని అన్నారు.
ఈ విధంగా పేర్లుంచుట యందు కూడా ఎంతో యోచించి అర్ధవంతంగా పెట్టినారు కాని, స్వోత్కర్షతో తమ పేర్లను ఎక్కడా ఉపయోగించుకోలేదు.
ఇక 60 సంవత్సరము లెందుకు అన్న అసలు విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణ కాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్నా శని గ్రహము ౩౦ సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈ గ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12
x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 =60)
రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట.
ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము
తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.
జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము
6 ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)
60 వినాడు లు = 1 నాడి (ఘడియ)
60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)
360 రోజులు (24 హోరలు) =
1 సౌర వర్షము
(దేవతలకు) 1 దివ్య వర్షము =
360 సౌర వర్షములు
కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)
త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)
ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)
కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)
మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)
ఒక మన్వంతరము = 71 మహాయుగములు
ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము
కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు
15 సంధులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.
1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ.
= 6 మహాయుగములు
2 కల్పములు: బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు
ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.
బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు
ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.
కాల గణన – ఒక పరిశీలన
మనకు ఉగాది రోజుననే ప్రకృతి పరంగా మార్పు సంభవిస్తుంది, చెట్లకు కొత్త
చిగుళ్ళు వస్తాయి మల్లెలు గుబాళిస్తాయి, మామిడి పళ్ళు కాస్తాయి. ప్రకృతి
కొత్తదనము కొని తెస్తుంది. కాబట్టి ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకలు
చేసుకోవాలి.
ఉగాదిని గూర్చి విశదముగా మన ఉగాది రోజున తెలుపుతాను.
ఇపుడు, కొంత అవసరము కాబట్టి క్లుప్తముగా
తెలియజేస్తాను. రామాయణంలో
చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన
చైత్రమాసంలో
శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే
చైత్రే
నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది.
మార్గశిర
పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు
మతం. అమరసింహుడు అమరకోశము
కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే
మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి
ఆగ్రహాయణికః అనేది పర్యాయ
పదం. ఆగ్రమందున ఆయనము కలది- అంటే సంవత్సరగమనమును
ముందుండి
నడిపించేది అంటే సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర
పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల
వరకు మారుతూ వచ్చిందనుట మనకు
తేటతెల్లమౌతూవుంది. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో
సవత్సరం ప్రారంభించే
ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి
బైసాఖి (
వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత
ఋతువనే గణన
ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని
ధ్రువ పరుస్తాయి.
ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక
సాయనాలు. ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునుబట్టి. విషువత్ మారినా మనం
ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు
వసంతము. ద్వాపర యుగాంతములో, విషువత్తు
చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్తు మృగశిరంలో
వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే
విష్ణుపురాణం
'మేషాదౌచ మృగాదౌచ
మైత్రేయ విషవః స్థితాః' అని చెప్పింది. తర్వాత మారుతూ
వచ్చిందనే కదా!! నేడు నిజానికి మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర
వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేప ఇగుళ్ళు తినడం
చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపయిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు
పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే
విషువత్తు మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించినాడు. వేదాంగ
జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైనబ్రాహ్మణకాలకాలంలో వసంత విషుత్కాలం
కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించినాడు. తనకాలంలో వసంత విషువత్కాలం
అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం
ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే
సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం
చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని
మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని
నెలగా పరిగణిస్తున్నాము. నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.
వరాహమిహిరుడు వసంత విషువత్తునుబట్టి
ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించినాడు కాని అప్పటినుంచి వసంత విషువత్ 23
డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.
మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు
మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు:
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహనిl
శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే
సతిll
చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో
బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించినాడు అని సమాధానం చెప్పినాడు. ఇది ఇలా
ఉంచితే మన దేశంలో పుష్య-మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలము. ఇదే
మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం. ఇది
మార్గశిర-పుష్య-మాఘమాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ
సరిసమానంగా ఉండే కాలము. ‘సమరాంత్రిందివే కాలే విషువత్’ అన్నాడు అమరసింహుడు. ఈ
విషువత్తులు రెండు. మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి
ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. అందుకే మనము
చైత్రమాసమున శుక్ల పాడ్యమిని ఉగాదిగా ఏర్పరచుకొన్నాము. అప్పటినుండి చెట్లు
చిగురించే కాలముగా దానిని గుర్తించినాము.పాడ్యమి నుడి 9 రోజులు వసంత నవరాత్రులుగా
పండుగ చేసుకొని నవమి నాడు శ్రీరామజయంతి జరుపుకొంటాము. చైత్ర శుద్ధ పాడ్యమి రామ
నవరాత్రుల మొదటిరోజు అగుట కూడా ఉగాదికి దోహదము చేసినదేమో!
ఏది ఏమయినా మన పూర్వులు తాము చేసిన ప్రతిపనికీ సహేతుకత,
ఒకత్ర్కమును చూపించినారు. పాశ్చాత్యులు అట్లు కాదు. వారు ఏమిచేసినా
తమ పెరుకోరకు ప్రాకులాడుటే మనకు కనిపిస్తుంది.
పాశ్చాత్య కాలమానము ప్రకారము ఇపుడు
జరుగుతున్నది క్రీస్తు శకము 2018వ సంవత్సరము.
ఇప్పుడు దీనిని క్రీస్తు శకమునకు బదులు సామాన్య శకము అని
అంటున్నారు. ఎవరికి సామాన్య శకము.
ఎవరికిది సామాన్య శకము. ఇది క్రైస్తవ దేశము కాదు , మరి సామాన్య శకము అన్న నవీన నామకరణముతో మనపై రుద్దట ఎందులకు. దానిని మనము
ఆచరించవలసిన అగత్యమేమి. అంటే 2018 కు ముందు పుట్టిన వారి మాటేమిటి.
జూలియస్ సీజరు ‘జూలియన్ కేలెండరు’ ను క్రీస్తు కు పూర్వము 46 వ సంవత్సరములో రూపొందించినాడు. దానిని అనుసరించియే నేటి గ్రెగోరియన్
కేలెండరు వ్యాప్తి లోనికి వచ్చినది. ఒక వేళ సీజరు భూమి మీదికి వచ్చి రోము లోని
పోపు తో కలిసినారనుకొందాము. తానున్న కాలములో ‘క్రీస్తు’ లేడు ‘క్రీస్తు శకము’
లేదు. మరి యేమని చెప్పుకుంటాడు. అప్పుడు తనకన్నా పదవిలో తక్కువ వాడైనన ఒక
బిషప్పును పిలిచి అతనినడిగితే, అతను సీజరును అడిగి విషయమును
తెలుసుకొని, పోపుతో ‘ఈయన క్రీస్తుకు పూర్వము 46 సంవత్సరము నందు ఉండిన వాడు అని తెలుప వలసి వస్తుంది. అదే మన దేశవాసుడైన ఏ
‘జరాసంధుడో’ పోతే అప్పుడు బిషప్పు పోపుతో ‘ ఈయన చరిత్రకు అందని కాలము నాటి వాడ’ని
చెప్పవలసి వస్తుంది. వారికి కాల గణనలో భారతీయులకు ‘యుగము’ అన్న కొలమానము ఉన్నదని
తెలియదు కదా! పై పెచ్చు భూమి పుట్టుక క్రీస్తుకు
పూర్వము 4004 అని, 4000,అని 4178
అని పరిపరి విధములుగా తెలిపి యున్నారు పాశ్చాత్య కాలజ్ఞానులు.
Many people have come up with dates for creation, such as James Ussher (4004
BC), Johannes Kepler (3992 BC), Gerhard Hasel (4178 BC), and Isaac Newton
(~4000 BC).
మరి వాస్తవమేది.
ఇక ఒక మాట ‘శకము’ ను గూర్చి చెప్పుకొందాము. శకులు మన దేశ సమీపమున
గల పర్షియా దేశస్తులు. ఆ దేశమును పాలించిన సైరస్-ii అన్న
రాజు ఉత్తర భారతమును కొంత జయించి యుండినాడు. ఆతను ప్రపంచములోని చాలా దేశములను
జయించుట చేత తానూ యుగ పురుషునిగా
భావించి ‘సైరస్’ ‘శకుడు’ కావున ‘సైరస్ శకము’ ప్రారంభించినాడు.
శకము అన్న మాటకు వంశము అన్న ఒక అర్థము కూడా వాడుకలో ఉన్నది. ఈతను మన దేశమును చాలా
తక్కువ కాలము పాలించినసాడు. ‘భట్టి విక్రమార్క’ విక్రం భేతాళ’ కథల యందలి ప్రమర
వంశజుడైన విక్రముడు ఆతని పై యుద్ధము ప్రకటించి ఆతనిని యుద్ధములో చంపినాడు. తరువాత
శకము ను అంతరింపజేసి ‘విక్రం సంవత్’ ను ఏర్పాటు చేసినాడు. ఔత్తరాహికులు నేటికీ
దీనిని పాటించుతారు. అంతటి గొప్ప వీరుని మనము చరిత్రలో చదివే అదృష్టమే
పోగొట్టుకున్నాము. నేటి తలిదండ్రులు ఉద్యమించితే గాని నేటి బాలలు మన దేశపు నిజ
చరిత్ర చదువలేరు. వాస్తవ భారతీయ చరిత్రను ముఖ్యముగా తెలుగులో చదివి, అసలైన వాస్తవాలను సాధికారముగా, తెలుసుకొనవలెనంటే
విశ్వనాధ, జటావల్లభుల వంటి నాటి ఎందరో శ్రేష్ఠతముల చేత
నిరుపమాన మాన్యతను పొందిన బ్ర.శ్రీ. కోట వెంకటాచలము గారి పలు రచనలు చదివి, పిల్లలచే పాఠ్యాంశములుగా చదివించి తీర వలసినదే!
Cyrus continues to take over more lands. In 533 B.C. he invades India. He
later dies in battle in 529 B.C. (Google)
ఇదే విధముగా ఆంధ్రుల అపురూప చక్రవర్తి ‘శాలివాహనుడు’ ఎన్నో
విజయాలను సాధించి ‘శాలివాహన శకము’ను స్థాపించినాడు. బహుశ అప్పటికి ‘ శకము’ అన్న
పదము ‘నిరంతర కాలమునకు ప్రత్యామ్నాయమై యుండినదేమో!
ఇక మన కాల గణనా విధానములో, గ్రెగోరియన్
కాలెండరును అనుసరించి 3012 ఫెబ్రవరి 18 న ౦౦ గంటలకు కలియుగము మొదలైనది . కృష్ణుని జీవిత కాలము 120సంవత్సరములుగా నిర్ణయింప బడినది. రాజసూయము ఆయన 70 ఏట
చేయబడినది. అంటే దరిదాపుగా జరాసంధుడు భీమునిచే 3052
లో హతమార్చ బడినాడు. అంటే పాశ్చాత్యుల కేలెండరు ప్రకారము వారి
దేవుని చేత వారు సృష్టింపబడనే లేదన్నమాట. ( వారి సృష్టి కాలము 40౦౦ అనుకొంటే క్రీ.పూ. 20౦౦ + క్రీ.శ. 20౦౦ =4000). ఇక వారేమి చెప్పగలరు?
వారికి మన యుగ, మహాయుగ, మన్వంతర, కల్పములనెడు కాల ప్రమాణములను గూర్చి వారికి
తెలియదు. 10౦౦ మహాయుగములు ఒక కల్పము. ఈ విషమును గూర్చి
వివరముగా నేను కాలగణన అన్న అంశమును గూర్చి గతములో వ్రాసినపుడు వివరించినాను.
కలియుగము ౩౦68 లో ‘జ్యోతిర్విదాభరణము’ అన్న గ్రంథమును
విక్రమాదిత్యుని ఆస్థాన కవి పండితుడును అశేష శేముషీ సంపన్నుడును, అప్రతిహత ప్రతిభాశాలి యైన కాళీదాసు, వ్రాసినట్లు
తెలియబరచినాడు. కాలము అన్నది చక్రము . మరి వృత్తమునకు ఆది తుది ఉండదు గదా! వారి
కాల గమనము, కాల గణన ఒక మతప్రవక్త పుట్టియుండవచ్చును అన్న
ఊహను బిందువు గా తీసుకొని ఏర్పాటు చేయబడినది. వారి పరిమితమైన అవగాహన వారితోనే
ఉండనివ్వండి. అంటే క్రీస్తు శకముగానే ఉండనివ్వండి. సామాన్య శకమును జేసి మనము
అక్కున చేర్చుకో నవసరము లేదు. వారి కొరకు వ్రాయ వలసి వస్తే మీ క్రీస్తు శకము అని
బ్రాకెట్లో వ్రాయ వచ్చు.
అసలు వారి కాల విశ్లేషణ లో యుగాలను ఈ విధముగా విభజించినారు.
1.రాత్రి యుగము (చీకటి యుగము Pre-historic age) , రాతి యుగము , కోతి యుగము 4. కొలిమి
యుగం (లోహపు యుగము) ఏమాత్రము అర్థవంతమయినవో మీరే అర్థము చేసుకొందురు గాక!
ఒక్క విషయము చెప్పి ముగిస్తాను. ఈ అనంత విశ్వములో ఏ విధముగానైతే
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ మండలములో మనమున్నామో అదే విధముగా ఈ విశ్వములో మన సౌర
మండలము చుట్టూ వుండే, మన సౌర మండలముతో సహా, తమ తమ కక్ష్యలు కలిగిన, ఇటువంటి అసంఖ్యాక
గ్రహమండలములన్నీ ఇంకొక మూల వస్తువు చుట్టూ తిరుగుతూ వున్నాయి. అదే పరమాత్మ.
స్వస్తి
భారతీయ కాలగణన
జనవరి 1 న పాశ్చాత్య కాలగణనావిధానమును గూర్చి తెలుసుకొన్నాము. ఇక భారతీయ కాలగణనను గూర్చి తెలుసుకొన ప్రత్నింప ఉద్యమింతుమా!
మన దేశమునకు వేదశాస్త్రేతిహాస పురాణములు ప్రమాణములు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలు ఎన్నో విషయములు, వివరణలు, ఎంతో మంది రాజులు, మహాపురుషుల చరిత్రలు కలిగి వుంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలం చెప్పేవాళ్ళు అక్కడక్కడున్నా వినేవాళ్ళు తగ్గిపోయినారు. మన సంస్కారమే మన సంస్కృతి. ఈ సంస్కృతే మన దేశపు ఆకృతి.
అసలు విషయానికొస్తే పురాణం పంచ లక్షణమన్నారు ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమేరియ నుండి దిగబడినవారు కారు. (అప్రాచ్యులు అంటే న + ప్రాచ్యులు ~ తూర్పు దేశస్తులు కానివారు. అంటే పడమటి దేశస్తులు లేక పాశ్చాత్యులు).
ఈశ్వర పుత్రాః ఆర్యాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితం
తన ఋగ్వేద భాష్యంలోనూ;600 సంవత్సరముల క్రితం విద్యారణ్యులవారు తమ వేద భాష్యం లోనూ వ్రాసి యున్నారు.
పురాణము యొక్క 5 లక్షణాలు ఏమిటి వంటే 1.సర్గ 2.ప్రతిసర్గ 3.మన్వంతర 4.రాజవంశ 5.అనువంశములు. మన చర్చలో మొదటి మూడు అవసరము .
1. సర్గ: సర్గయనగా సృష్టికి ఆది పునాది. పునాది అటులనే వున్నా ఆది కల్గినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే.
2. ప్రతిసర్గ: ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి మనకు తెలిసిన మత్సావతార కథ ప్రతిసర్గకు సంబంధించిందే. ఈ ఉదంతాన్ని బైబిల్ లో కుడా చూస్తాము. నోవా అనే నాయకుడు పడవలో జీవరాశిని మచ్చుకొకటి తీసుకొని క్రొత్త తీరమునకు వెళ్ళినట్లున్నది. మన పురాణ నిర్వచనము ప్రకారము ఇది ప్రతిసర్గయే. కాని వారందులో దీనిని నిర్వచించలేదు. ఇటువంటి ఉదంతములను గూడా మన నుండి పాశ్చాత్యులు గ్రహించినట్లు తేట తెల్లమగుచున్నది. ఈ విధంగా సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు ఐన పూర్వీకులు పాశ్చాత్యులు
చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా! పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర
ప్రకారము సృష్టి జరిగి 195,58,85,125 సంవత్సరములు (2023 వరకు) అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతి వర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5125 సంవత్సరములైనది. ఇంత నిర్డుష్టముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”.
పంచ + అంగము = పంచాంగము. ఐదు అంగములు కల్గినది. అవి ఏవన: 1.తిధి 2.వారము 3.నక్షత్రము 4.యోగము 5.కరణము.
1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది
సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.
మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒకచాంద్రమాసమునకు 29.53 రోజులుంటయి.
2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్
సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము.
2½ ఘడియల కాలము =1హోర(hour). మొదటి హోర అర్క అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 '
హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర చంద్ర హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7
వారాలు వస్తాయి. చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమును, బుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును, స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. హోరా నియమము పాటించువారికి రాహుకాల యమగండ కాలాడులతో పని లేదు.
మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ
వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని, అవి ఎట్లు వచ్చినవీ తెలియకుండానే, వాడుకొనుచున్నారు పాశ్చాత్యులు
౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజిలీలను గుర్తించి(ఈ మజిలీలను రాశులుఅంటారు)
ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు.4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. ౩వ నక్షత్రములోని మిగిలిన ౩ పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (౩+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. ఈ విధమైన పాద విభజన పాశ్చాత్యులకు లేదు. 12*9=108 అంటే 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.ఇందులోని
18 వ నక్షత్రమైన జేష్ఠను గమనించండి. జేష్ఠ అంటేనే అన్నిటి కన్నా పెద్దది. ఇప్పుడు పైన తెలిపిన నక్షత్ర నామములు ఒంటరి నక్షత్రమును తెలుపవు. ఆ నక్షత్రము పరిధిలో నుండే నక్షత్ర కూటమిని తెలియజేస్తాయి. ఆ విధముగా ఈ 27 నక్షత్రాలలో జేష్ఠ పెద్దది. అసలు ఈ విశ్వాంతరాళములోని పెద్ద నక్షత్రములలో 23 లేక 24వదిగా చెప్పబడుతుంది. దీని వ్యాసార్థము సూర్యుని వ్యాసార్థమున కన్నా 883
రెట్లు పెద్దది. బరువు 12.4 రెట్లు ఎక్కువ. మరి అంతటి గొప్ప విషయమును
కేవలము తమ తపోయోగముతో గమనించి మన పూర్వులు చెప్పగలిగినారంటే
వారి ఘనత బహుథా ప్రశంసనీయమే కదా! కాల గణన తో సంబంధము లేకున్నా
ఇంకొక ముఖ్యమైన విషయము తెలుపుకుంటాను. పెళ్లిరోజు పంతులుగారు వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. వశిష్ఠుని భార్యగా చెప్పబడుతుంది
అరుంధతి. వశిష్ఠ నక్షత్రములో రెండు నక్షత్రముల సముదాయములు రెండు వున్నాయి. అరుంధతిలో రెండు నక్షత్రములున్నాయి. కానీ ఈ రెండూ ఒకదాని వెంట ఒకటి తిరిగేది మాత్రము వాస్తవము. భార్యా భర్తల అన్యోన్యతకు, అనుబంధమునకు, ఆవిధముగా ఆ నక్షత్ర సముదాయములు ప్రతీకలైనాయి.
ఈ 12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jiminy), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagittarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Aquarius), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు ఉపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.
4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర,27.నైద్రుతి.
ఈ యోగము యొక్క ప్రభావము మానవ శరీర ఆరోగ్యముపై నుంటుంది.
5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి,360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని
కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖైజి, 6.వాణిజి,7.విష్టి,
8.చతుష్పద, 9శకుని, 10.నగ,
11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారముల నధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీ ప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.
పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన
గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్ద కొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్ద కొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి
1.చైత్రము, 2.వైశాఖము,
3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము,
8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము
ప్రతి నెలలోను సూర్యుడు 12 రాశులలోని ఒక రాశి లో ప్రవేశిస్తే అది నిజ మాసమౌతుంది. లేకుంటే అధిక మాసమౌతుంది. చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.
సౌరమానము ప్రకారమూ సూర్యుడు మిథునరాశిలో వున్నప్పుడు, చాంచ్మారనములో ఆషాఢ మాసము వస్తుంది. ఆరెండు నెలలూ కలిసిన మధ్య కాలమును శూన్యమాసము అంటారు. అదేవిధముగా సూర్యుడు ధనుస్సులో వున్నప్పుడు చాన్ద్రమానము ప్రకారము పుష్య మాసము ధనుర్మాసముతో కలిసి వుంటుంది. ఈ రెండు సంగామములనూ శూన్యమాసములు అంటారు. చాంద్ర మానము పాటించే జనబాహుళ్య సౌలభ్యము కొరకు ఆషాఢ పుష్య మాసములు శూన్య మాసములుగా పరిగణింప బడు చున్నవి.
అదే ఒక నెలలో రెండు సంక్రమణములొస్తే అది క్షయ మాసమౌతుంది. ఇది 141 సంవత్సరములకొకసారి వస్తుంది. ఒక సారి వచ్చిన తరువాత తిరిగీ 19 సంవత్సరములకే వచ్చే అవకాశమున్నది. ఈ విధంగా కాల గణన ఎక్కడికక్కడ సవరించుకొంటూ దోష రహితంగాను నిరాఘాటంగానూ సాగిపోతూంటుంది.
ఇక సంవత్సరముల విషయానికొస్తే సాపేక్ష సూర్య భ్రమణమును వర్తులాకారముగా తీసుకొన్నాము కావున ఆ భ్రమణము 360 డిగ్రీలు కలిగి వుంటుంది. సూర్యుడు
రోజుకు ఒక అంశ (డిగ్రీ) ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పుకొన్నాము. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలు 60 పేర్లతో గడచిన తరువాత తిరిగి ప్రభవతో పునరావృత్తమౌతాయి. ఈ 60 పేర్లు ఈ క్రింది విధముగా వున్నాయి:
1.ప్రభవ, 2.విభవ,
3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి,
6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాతు, 11.ఈశ్వర,12.బహుధాన్య,
13.ప్రమాది, 14.విక్రమ, 15.విషు, 16.చిత్రభాను, 17.స్వభాను,
18.తారణ, 19.పార్ధివ, 20.విజయ, 21.సర్వజిత్తు, 22.సర్వధారి,
23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ,
28.జయ, 29.మన్మధ, ౩౦.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, ౩౩.వికారి, 34.శార్వరి, 35.ప్లవ,
36.శుభకృతు, 37.శోభకృతు, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ,
41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య,
44.సాధారణ, 45.విరోధికృతు, 46.పరీధావి, 47. ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నళ,
51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్ధి, 54.రౌద్ర, 55.దుర్మతి,
56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ఈ సంవత్సర సమూహమును ‘60’గా ఎందుకు ఏర్పరచినారు అన్నది తెలుసుకొనుటకు ముందు మన వాళ్ళు గ్రహములకాయా పేర్లు ఎందుకు పెట్టినారో చూస్తాము. సాపేక్షముగా భూమిపై నిలబడి గ్రహ గతిని పరిశీలించితే, దూరమునుండి చేరువరకు గ్రహ భ్రమణము ఈ విధంగా వుంటుంది.
“మంద అమరేఢ్య భూపుత్ర అర్క శుక్ర బుధ ఇందవః”
శని బృహస్పతి అంగారక సూర్య శుక్ర బుధ చంద్ర
మంద అన్నా శని అన్నా అత్యంత నెమ్మదిగా నడిచేది. అన్ని గ్రహములకన్నా ఈ గ్రహము ఒక భ్రమణమునకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. అంతే గానీ Satan అని, ముస్లీములు సాతాన్ అనే మాటలకు దీనితో సంబంధము లేదు. ఇది ఒక భ్రమణమునకు 30 సంవత్సరములు తీసుకొంటుంది. బృహత్ అంటే పెద్దది. బృహత్ + పతి =బృహస్పతి. అతి పెద్ద గ్రహములకు రాజు అంటే మన సౌర మండలములో అత్యంత పెద్ద గ్రహము. అంగారము అంటే అగ్ని. ఈ గ్రహము ఆరంగులో మనకు కనిపిస్తుంది కావున అది అంగారకమైనది.
ఇక సూర్యుని గూర్చి ఒక్క సారి మన దేవాలయాలలోని నవగ్రహ మంటపం గమనించితే సూర్యుని గ్రహ మండలంలోని నట్టనడుమన ప్రతిష్టించి వుంటారు అంటే సూర్యుని కేంద్రముగా గొని మిగతా గ్రహములన్నియు భూమితో కుడా వర్తులాకారములో చుట్టుచున్న వనియే కదా! అసలు గ్రహ నామములు వానివాని గుణములను తెలియజేస్తున్నాయి గమనించండి. వరాహమిహురుడు, ఆర్యభట్టు, భట్టోత్పలుడు, భాస్కరుడు ఆదిగాగల భారతీయ ఖగోళ వైజ్ఞానికులు కోపర్నికస్ వంటి పాశ్చాత్య వైజ్ఞానికులకన్నా ఎన్నో శతాబ్దాల పూర్వమే తమ వేద విజ్ఞానముతో భూమి గుండ్రముగా నున్నదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని, గ్రహ భ్రమణమునకు సూర్యుడు కేంద్రమని, తమ గ్రంధములలో రచించియున్నారు. కాణాదుని వంటి మహర్షులు సూర్యకిరణములు వక్రగతిన ప్రయాణము చేయుననియు సూర్య కిరణములో 7 రంగులున్నవనియు కుడా చెప్పినారు. మన పూర్వులు సూర్యుని గూర్చి
తెల్పుచూ అయన రథానికి ఒకటే చక్రమనియు (కాల చక్రము) అయన రథ సారధికి నడుము మాత్రమే వుంది తొడలు లేవని (ఆయన పేరు అణూరుడు) అంటే రథము లో కదలకుండా ఎప్పుడూ నడుపుతూనే వుంటాడనియు, రథమునకు పూన్చిన గుఱ్ఱములు 7 అనియు (7 రంగులు) రథమునకు పగ్గములు పాములనియు,
సూర్య కిరణములు వంకరటింకరగా వుంటాయి నిగూఢముగా తెల్పినారు.
ఇక శుక్ర గ్రహము: శుక్రము అంటే తెలుపు, కాంతివంతము అని అర్ధం సాయం సమయమున ఆకాశం పరిశీలించితే ఈ వాస్తవం తెలుస్తుంది.
బుధగ్రహము: బుధుని సౌమ్యుడు అని అంటారు. అంటే చూడ ముచటైన చందన వర్ణములో ఉంటాడని అర్థం.
చంద్ర గ్రహము: చంద్రము అంటే బంగారము. చంద్రుడు ఆ వర్ణములో వుంటూ చల్లని కిరణాలను ప్రసరింప చేస్తాడు కావున ఆయనను చంద్రుడని శీత కిరణుడని అన్నారు.
ఈ విధంగా పేర్లుంచుట యందు కూడా ఎంతో యోచించి అర్ధవంతంగా పెట్టినారు కాని, స్వోత్కర్షతో తమ పేర్లను ఎక్కడా ఉపయోగించుకోలేదు.
ఇక 60 సంవత్సరము లెందుకు అన్న అసలు విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణ కాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్నా శని గ్రహము ౩౦ సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈ గ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 =60)
రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట.
ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము
తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.
జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము
6 ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)
60 వినాడు లు = 1 నాడి (ఘడియ)
60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)
360 రోజులు (24 హోరలు) =
1 సౌర వర్షము
(దేవతలకు) 1 దివ్య వర్షము =
360 సౌర వర్షములు
కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)
త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)
ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)
కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)
మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)
ఒక మన్వంతరము = 71 మహాయుగములు
ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము
కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు
15 సంధులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.
1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ.
= 6 మహాయుగములు
2 కల్పములు: బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు
ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.
బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు
ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.
కాల గణన – ఒక పరిశీలన
మనకు ఉగాది రోజుననే ప్రకృతి పరంగా మార్పు సంభవిస్తుంది, చెట్లకు కొత్త
చిగుళ్ళు వస్తాయి మల్లెలు గుబాళిస్తాయి, మామిడి పళ్ళు కాస్తాయి. ప్రకృతి
కొత్తదనము కొని తెస్తుంది. కాబట్టి ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకలు
చేసుకోవాలి. ఉగాదిని గూర్చి విశదముగా మన ఉగాది రోజున తెలుపుతాను.
ఇపుడు, కొంత అవసరము కాబట్టి క్లుప్తముగా తెలియజేస్తాను. రామాయణంలో
చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో
శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే
నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది.
మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు
మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే
మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి ఆగ్రహాయణికః అనేది పర్యాయ
పదం. ఆగ్రమందున ఆయనము కలది- అంటే సంవత్సరగమనమును ముందుండి
నడిపించేది అంటే సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర
పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు మారుతూ వచ్చిందనుట మనకు
తేటతెల్లమౌతూవుంది. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే
ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి (
వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత
ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి.
ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక
సాయనాలు. ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునుబట్టి. విషువత్ మారినా మనం
ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు
వసంతము. ద్వాపర యుగాంతములో, విషువత్తు
చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్తు మృగశిరంలో
వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే
విష్ణుపురాణం
'మేషాదౌచ మృగాదౌచ
మైత్రేయ విషవః స్థితాః' అని చెప్పింది. తర్వాత మారుతూ
వచ్చిందనే కదా!! నేడు నిజానికి మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర
వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేప ఇగుళ్ళు తినడం
చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపయిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు
పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే
విషువత్తు మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించినాడు. వేదాంగ
జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైనబ్రాహ్మణకాలకాలంలో వసంత విషుత్కాలం
కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించినాడు. తనకాలంలో వసంత విషువత్కాలం
అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం
ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే
సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం
చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని
మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని
నెలగా పరిగణిస్తున్నాము. నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.
వరాహమిహిరుడు వసంత విషువత్తునుబట్టి
ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించినాడు కాని అప్పటినుంచి వసంత విషువత్ 23
డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.
మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు
మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు:
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహనిl
శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే
సతిll
చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో
బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించినాడు అని సమాధానం చెప్పినాడు. ఇది ఇలా
ఉంచితే మన దేశంలో పుష్య-మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలము. ఇదే
మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం. ఇది
మార్గశిర-పుష్య-మాఘమాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ
సరిసమానంగా ఉండే కాలము. ‘సమరాంత్రిందివే కాలే విషువత్’ అన్నాడు అమరసింహుడు. ఈ
విషువత్తులు రెండు. మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి
ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. అందుకే మనము
చైత్రమాసమున శుక్ల పాడ్యమిని ఉగాదిగా ఏర్పరచుకొన్నాము. అప్పటినుండి చెట్లు
చిగురించే కాలముగా దానిని గుర్తించినాము.పాడ్యమి నుడి 9 రోజులు వసంత నవరాత్రులుగా
పండుగ చేసుకొని నవమి నాడు శ్రీరామజయంతి జరుపుకొంటాము. చైత్ర శుద్ధ పాడ్యమి రామ
నవరాత్రుల మొదటిరోజు అగుట కూడా ఉగాదికి దోహదము చేసినదేమో!
ఏది ఏమయినా మన పూర్వులు తాము చేసిన ప్రతిపనికీ సహేతుకత,
ఒకత్ర్కమును చూపించినారు. పాశ్చాత్యులు అట్లు కాదు. వారు ఏమిచేసినా
తమ పెరుకోరకు ప్రాకులాడుటే మనకు కనిపిస్తుంది.
పాశ్చాత్య కాలమానము ప్రకారము ఇపుడు జరుగుతున్నది క్రీస్తు శకము 2018వ సంవత్సరము.
ఇప్పుడు దీనిని క్రీస్తు శకమునకు బదులు సామాన్య శకము అని
అంటున్నారు. ఎవరికి సామాన్య శకము.
ఎవరికిది సామాన్య శకము. ఇది క్రైస్తవ దేశము కాదు , మరి సామాన్య శకము అన్న నవీన నామకరణముతో మనపై రుద్దట ఎందులకు. దానిని మనము
ఆచరించవలసిన అగత్యమేమి. అంటే 2018 కు ముందు పుట్టిన వారి మాటేమిటి.
జూలియస్ సీజరు ‘జూలియన్ కేలెండరు’ ను క్రీస్తు కు పూర్వము 46 వ సంవత్సరములో రూపొందించినాడు. దానిని అనుసరించియే నేటి గ్రెగోరియన్
కేలెండరు వ్యాప్తి లోనికి వచ్చినది. ఒక వేళ సీజరు భూమి మీదికి వచ్చి రోము లోని
పోపు తో కలిసినారనుకొందాము. తానున్న కాలములో ‘క్రీస్తు’ లేడు ‘క్రీస్తు శకము’
లేదు. మరి యేమని చెప్పుకుంటాడు. అప్పుడు తనకన్నా పదవిలో తక్కువ వాడైనన ఒక
బిషప్పును పిలిచి అతనినడిగితే, అతను సీజరును అడిగి విషయమును
తెలుసుకొని, పోపుతో ‘ఈయన క్రీస్తుకు పూర్వము 46 సంవత్సరము నందు ఉండిన వాడు అని తెలుప వలసి వస్తుంది. అదే మన దేశవాసుడైన ఏ
‘జరాసంధుడో’ పోతే అప్పుడు బిషప్పు పోపుతో ‘ ఈయన చరిత్రకు అందని కాలము నాటి వాడ’ని
చెప్పవలసి వస్తుంది. వారికి కాల గణనలో భారతీయులకు ‘యుగము’ అన్న కొలమానము ఉన్నదని
తెలియదు కదా! పై పెచ్చు భూమి పుట్టుక క్రీస్తుకు
పూర్వము 4004 అని, 4000,అని 4178
అని పరిపరి విధములుగా తెలిపి యున్నారు పాశ్చాత్య కాలజ్ఞానులు.
Many people have come up with dates for creation, such as James Ussher (4004
BC), Johannes Kepler (3992 BC), Gerhard Hasel (4178 BC), and Isaac Newton
(~4000 BC).
మరి వాస్తవమేది.
ఇక ఒక మాట ‘శకము’ ను గూర్చి చెప్పుకొందాము. శకులు మన దేశ సమీపమున
గల పర్షియా దేశస్తులు. ఆ దేశమును పాలించిన సైరస్-ii అన్న
రాజు ఉత్తర భారతమును కొంత జయించి యుండినాడు. ఆతను ప్రపంచములోని చాలా దేశములను
జయించుట చేత తానూ యుగ పురుషునిగా
భావించి ‘సైరస్’ ‘శకుడు’ కావున ‘సైరస్ శకము’ ప్రారంభించినాడు.
శకము అన్న మాటకు వంశము అన్న ఒక అర్థము కూడా వాడుకలో ఉన్నది. ఈతను మన దేశమును చాలా
తక్కువ కాలము పాలించినసాడు. ‘భట్టి విక్రమార్క’ విక్రం భేతాళ’ కథల యందలి ప్రమర
వంశజుడైన విక్రముడు ఆతని పై యుద్ధము ప్రకటించి ఆతనిని యుద్ధములో చంపినాడు. తరువాత
శకము ను అంతరింపజేసి ‘విక్రం సంవత్’ ను ఏర్పాటు చేసినాడు. ఔత్తరాహికులు నేటికీ
దీనిని పాటించుతారు. అంతటి గొప్ప వీరుని మనము చరిత్రలో చదివే అదృష్టమే
పోగొట్టుకున్నాము. నేటి తలిదండ్రులు ఉద్యమించితే గాని నేటి బాలలు మన దేశపు నిజ
చరిత్ర చదువలేరు. వాస్తవ భారతీయ చరిత్రను ముఖ్యముగా తెలుగులో చదివి, అసలైన వాస్తవాలను సాధికారముగా, తెలుసుకొనవలెనంటే
విశ్వనాధ, జటావల్లభుల వంటి నాటి ఎందరో శ్రేష్ఠతముల చేత
నిరుపమాన మాన్యతను పొందిన బ్ర.శ్రీ. కోట వెంకటాచలము గారి పలు రచనలు చదివి, పిల్లలచే పాఠ్యాంశములుగా చదివించి తీర వలసినదే!
Cyrus continues to take over more lands. In 533 B.C. he invades India. He
later dies in battle in 529 B.C. (Google)
ఇదే విధముగా ఆంధ్రుల అపురూప చక్రవర్తి ‘శాలివాహనుడు’ ఎన్నో
విజయాలను సాధించి ‘శాలివాహన శకము’ను స్థాపించినాడు. బహుశ అప్పటికి ‘ శకము’ అన్న
పదము ‘నిరంతర కాలమునకు ప్రత్యామ్నాయమై యుండినదేమో!
ఇక మన కాల గణనా విధానములో, గ్రెగోరియన్
కాలెండరును అనుసరించి 3012 ఫెబ్రవరి 18 న ౦౦ గంటలకు కలియుగము మొదలైనది . కృష్ణుని జీవిత కాలము 120సంవత్సరములుగా నిర్ణయింప బడినది. రాజసూయము ఆయన 70 ఏట
చేయబడినది. అంటే దరిదాపుగా జరాసంధుడు భీమునిచే 3052
లో హతమార్చ బడినాడు. అంటే పాశ్చాత్యుల కేలెండరు ప్రకారము వారి
దేవుని చేత వారు సృష్టింపబడనే లేదన్నమాట. ( వారి సృష్టి కాలము 40౦౦ అనుకొంటే క్రీ.పూ. 20౦౦ + క్రీ.శ. 20౦౦ =4000). ఇక వారేమి చెప్పగలరు?
వారికి మన యుగ, మహాయుగ, మన్వంతర, కల్పములనెడు కాల ప్రమాణములను గూర్చి వారికి
తెలియదు. 10౦౦ మహాయుగములు ఒక కల్పము. ఈ విషమును గూర్చి
వివరముగా నేను కాలగణన అన్న అంశమును గూర్చి గతములో వ్రాసినపుడు వివరించినాను.
కలియుగము ౩౦68 లో ‘జ్యోతిర్విదాభరణము’ అన్న గ్రంథమును
విక్రమాదిత్యుని ఆస్థాన కవి పండితుడును అశేష శేముషీ సంపన్నుడును, అప్రతిహత ప్రతిభాశాలి యైన కాళీదాసు, వ్రాసినట్లు
తెలియబరచినాడు. కాలము అన్నది చక్రము . మరి వృత్తమునకు ఆది తుది ఉండదు గదా! వారి
కాల గమనము, కాల గణన ఒక మతప్రవక్త పుట్టియుండవచ్చును అన్న
ఊహను బిందువు గా తీసుకొని ఏర్పాటు చేయబడినది. వారి పరిమితమైన అవగాహన వారితోనే
ఉండనివ్వండి. అంటే క్రీస్తు శకముగానే ఉండనివ్వండి. సామాన్య శకమును జేసి మనము
అక్కున చేర్చుకో నవసరము లేదు. వారి కొరకు వ్రాయ వలసి వస్తే మీ క్రీస్తు శకము అని
బ్రాకెట్లో వ్రాయ వచ్చు.
అసలు వారి కాల విశ్లేషణ లో యుగాలను ఈ విధముగా విభజించినారు.
1.రాత్రి యుగము (చీకటి యుగము Pre-historic age) , రాతి యుగము , కోతి యుగము 4. కొలిమి
యుగం (లోహపు యుగము) ఏమాత్రము అర్థవంతమయినవో మీరే అర్థము చేసుకొందురు గాక!
ఒక్క విషయము చెప్పి ముగిస్తాను. ఈ అనంత విశ్వములో ఏ విధముగానైతే
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ మండలములో మనమున్నామో అదే విధముగా ఈ విశ్వములో మన సౌర
మండలము చుట్టూ వుండే, మన సౌర మండలముతో సహా, తమ తమ కక్ష్యలు కలిగిన, ఇటువంటి అసంఖ్యాక
గ్రహమండలములన్నీ ఇంకొక మూల వస్తువు చుట్టూ తిరుగుతూ వున్నాయి. అదే పరమాత్మ.
స్వస్తి
No comments:
Post a Comment