Saturday, 27 July 2024

రాజ్యాంగము-ఉపోద్ఘాతము

 రాజ్యాంగ ఉపోద్ఘాతము 

(preamble of our constitution)

https://cherukurammohan.blogspot.com/2024/07/preamble-of-our-constitution.html
ఈ రాజ్యాంగ ఉపోద్ఘాతము అన్న వ్యాసమును చదువుటకు పూర్వము పాఠకులకొక 

విన్నపము. ఎప్పుడూ కథలు, హాస్యము, కవితలు (అవి కూడా ఉండ వలసినదే) 

అనికాకుండా ఇటువంటి విషయాలను కూడా చదవండి. నేను ఈ వ్యాసము పేరు 

కొరకు ప్రతిష్ట కొరకు వ్రాయుటలేదు. ఉత్సాహవంతులైన యువకులు ఇటువంటి 

విషయాలు విరివిగా చదివి ఆకళింపు చేసుకొని తమ మేధోశక్తితో పట్టుదలను 

జోడించి దేశ ప్రగతికి తమకు తోచిన సవ్యమగు రీతిలో స్పందించుతారన్నది 

నా ఆశ. నేను హాస్యోక్తులను వ్రాయుట కూడా యువతను ఆకర్షించుటకే. నా 

గొప్ప చెప్పుకొనుటకు కాదు. దేశాన్ని బాగుపరచే  నాయకులుగా నేటి యువత 


కావాలన్నది నా ఆకాంక్ష.
  ఇక చదవండి.

 

అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతేl

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి  గరీయసిll      (అవాల్మీకము}

రాములవారు లంకను గూర్చి ప్రశంసిస్తున్న లక్ష్మణునితో ఈ విధంగా అంటున్నాడు:" కనకమయమైన ఈ లంక నా మనసును ఆకట్టుకోలేదు. నాకు నా అయోధ్య చాలు. మాత మాతృభూమి ఎన్నన్నా లేక ఎన్నున్నా స్వర్గముకన్నా మిన్న."

ఇది ఆది కవియైన వాల్మీకి వ్రాయకున్నా ఇది ఒక వాస్తవము. ఎందుకంటే లంకానగరము స్వర్నమయము. అదేవిధముగా అంతటి లంకకన్నా తన మాతృభూమి అయోధ్యయే మిన్న అంటూ 'జనని, జన్మభూమికి ఎవరూ సాటి రారు అన్న శ్రీరామ చంద్రునికి ఎవరు సాటిరాగలరు. ఇంత గొప్ప మాట చెప్పుటకు ఎంత సంస్కారము కావలెనో అంత సంస్కారము సంపాదించుటకు మన సంస్కృతి ఎంత వికసించ వలసి యుండునో, సంస్కృతి అంత వికసించవలెనంటే ఎంతకాలము నుండి ప్రజల మనుగడ ఈ పుణ్యభూమిపై సాగుచున్నదో ఊహించుట విజ్ఞులకు కూడా సాధ్యము కాదేమో!

అట్టి ఈ సంస్కృతిని, సంస్కృతమును కాలదన్ని లౌకిక వాదము లేక ధర్మ నిరపేక్షత యన్న పేరుతో ఈ దేశ పౌరులను చీకటిలోనుంచి, ఎంత వెలుగు రాబోతూ వుందో చూడండి అని చెప్పుట ఆత్మ వంచనకాదా!

ఇక అసలు విషయానికి వస్తాము.

ఈ రచనకు మూలము ప్రోll చక్రవర్తి గారి, ఈ విషయము పై వ్రాసిన యాంగ్ల పుస్తకము దాని తేలుగు సేత సుబ్బు నందవరిక్ గారిది.

జాతీయ ఘోషణాపత్రము(manifesto) అంటే ఒక లక్ష్యము దిశగా స్వపరిపాలనాను గూర్చిన ఒక వ్యూహాత్మకమైన కార్యాచరణ ప్రణాళిక భాసిస్తుంది.ఇటువంటి ఒక క్రియాశీల రచనలో సామాన్యముగా ఈ క్రింద పొందు పరచిన అంశాలు ప్రధానముగా సమన్వయ పూర్వకముగా కనిపించుతాయి.ఈ అంశాలు ఆయా రాజ్యాంగ కర్తలకు వారిని నియమించేవారలకు ఉండవలెను.అట్లు లేకుంటే అది మన రాజ్యాంగమేనేమో!

ఆ అంశాలను రేపు చూద్దాము..........

Comments

Kalyani Gauri Bhamidipati

చక్కటి విషయాలను అచ్చ తెలుగు పదాలలో వివరించారు..కొన్ని ఇంగ్లీష్ పదాలకు తెలుగు పదాలు మా తరం వారు వెతుక్కునే దుస్థితి ఏర్పడింది..మీ వంటి వారి వ్యాసాలు చదవడం తో మాకు కొన్ని పదాలు పాతవే అయిన కొత్త గ తెలుసుకునే సదవకాశం కల్పిస్తున్నoదుకు.. ధన్యవాదాలు......

మరొకమారు రాజ్యాంగము – 2 తో మీ ముందుకు వస్తాను.....

రాజ్యాంగ ఉపోద్ఘాతము  (preamble of our constitution)-2

రాజ్యాంగమును తయారు చేయు పండితులు నిజమునకు ఈ క్రింది విషయములపై అవగాహన తప్పనిసరిగా కలిగియుండుట ఎంతో అవసరము.

1.ఒక సనాతన సంస్కృతి యొక్క పరిణామ క్రమమును గూర్చి దాని లక్ష్యాన్ని గూర్చిన అవగాహన 

2.దాని మత ధార్మిక, ఆర్ధిక చరిత్ర

3. ఆదేశమును పరిపాలించిన మహామహులైన రాజులుమహారాజులుచక్రవర్తులుసామ్రాట్టులుసార్వభౌములను గూర్చిన టిప్పణి రాజ్యాంగ ఉపోద్ఘాతమునకు అత్యంత అవసరము. సాధారణ పౌరుడు ఇటువంటివి చదివినపుడుఅంతటి మహత్తు కలిగిన దేశములో పుట్టినందుకు ఎంతో గర్విన్చుత్యే గాక తన తదుపరి తరములవారికి ఈ చరిత్రను చేరవేస్తాడు.

4.మిగతా ఏదేశామునకూ లేనంత పౌరాణిక సంపద మనకున్నది. అందు ఈ దేశమును మహానీయులగు ఏ ఏ మహానుభావులు ఎంతెంత మనో రంజకముగా పరిపాలించినారు అన్న విషయము మనకు ఎంతో సమగ్రముగా వున్నది.

 ఈ భారత దేశము సనాతనమని ఈ ధర్మమూ సనాతనమని మనకు తెలుసు. సామాన్యులమైన మనకే తెలిసినపుడు మాన్యులైన రాజ్యాంగ రచయితలకు తెలియదా లేక వారిని వ్రాయమని నిర్దేశించిన నాటి మహా నాయకులకు తెలియదా. ఒక క్రియాశీలమైన ఇటువంటి రచనలో 1) సంస్కృతి పరిణామమును గూర్చి కానీ 2) సాంఘీక ,3)ధార్మిక, 4)ఆర్ధిక , 5)పారమార్థిక తత్వమును గానీ వ్యక్త పరుప నవసరము లేదా!

అధిక సంఖ్యాకులను త్రోసి రాజని అల్పసంఖ్యాకుల సంక్షేమానికే అంకితమైన రాజకీయ నేతృత్వము ఏ జాతిని ఉద్ధరించ బూనినదో ఆత్మ పరిశీలన ఒక పర్యాయమయినా చేసుకొంటే అర్థమౌతుంది. సాధారణంగా రాజ్యాంగాలను పరిచయము చేసే ఉపోద్ఘాతాలు తమ మూలములకు జని తమ ఔన్నత్యమును గ్రహించి అది తమ ప్రజావాహినికి ప్రపంచమునకు ఎరుకపరచుతారు.

 ఇటీవల తన అభిప్రాయమును వ్యక్తీకరించిన ఒక అనుభవజ్ఞుడైన పాశ్చాత్య పండితుడు ఈ విషయ మూల రచయితతో ఈవిధముగా అన్నాడట:"ఈ హిందూదేశ రాజ్యాంగ ఉపోద్ఘాతము నాకు మూలరహితముగానూ, నిః+హృదయముగానూ తోచుచున్నది. ఇందులో చారిత్రికమైనదీ, ఆధ్యాత్మికమైనది, సాంప్రదాయికమైనది,పూజ్యమైనది,ఆరాధింప దగినది అయిన యేవిషయానికి తావు వున్నట్లు కనిపించుటలేదు. దానిలో ఎక్కడగాని గతించిన ఎన్నో యుగాల వైభవాలను గురించి సగర్వంగా కృతజ్ఞతా పూర్వకముగా ప్రస్తావించిన ఒక్క వాక్యమైనా నాకు కనబడ లేదు. నిజమైన రాజ్యాంగ కర్తలు, భర్తలు (మహామహా నాయకులు),ఇటువంటి ఉపోద్ఘాతములలో తమ పౌరులకు ఉత్తమమైన ,దృఢమైన,ఉత్తేజకరమైన ,దేశభక్తి ప్రపూరితమైన సందేశాలను పొందుపరచి తమ ప్ర్జజావాహినిని కార్యోన్ముఖులను చేస్తారు. అంతగా చరిత్రలేని  ఏ యితర దేశముల పీఠికలను పరిశీలించినా మన కర్తాభర్తల నిస్తేజతను గ్రహింపవచ్చును."

 ఒక పుటలో నాలుగవ వంతుకు మన రాజ్యాంగ పరిచయ భూమిక (IP1950,1976) వుంటే చైనావారిది రెండు పుటలుంటుంది.(ఇది1982 లో విడుదలైనది). వారు సన్యత్ సెన్, మావో, లెనిన్, మార్క్స్, మొదలయిన మార్గదర్శకులను తలచుకొంటే మనది'సార్వభౌమ, సోషలిస్టు, లౌకికవాద మన్న నైరూప్య సిద్ధాంతములతో మొదలవుతుంది. వారు అందులో భౌతిక, రాజకీయ, ఆధ్యాత్మిక నాగరికతల సమన్వయమును గూర్చి ప్రస్తావించినారు. మన పీఠికలో ఆధ్యాత్మికతకు తావే లేదు. అసలు శ్రీలంక పీఠిక కు 'స్వస్తి' అన్న సంస్కృత నామమును ఉపయోగించినారు. వారి పూర్వీకుల త్యాగములు,బుద్ధ ధర్మము, బుద్ధ శాసనము(article 9) మొదలగు అంశములను నొక్కి  వక్కాణించినారు . మరి మన వారసత్వము వారికన్నా ప్రాచీనమైనది కాదా. మరి ప్రపంచములోనే సంస్కృతమునకు,సంస్కృతికి మూలము మన దేశము కాదా. 

'స్వస్తి ప్రజాభ్యాం..., స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః..., స్వస్తిర్మానుషేభ్యః..... అన్న ఈ స్వస్తి వచనాన్ని అత్యంత శుభకరమైన వాక్కు) తృణీకరించినామే మరి మనకన్నా కృతఘ్నులను వేరే దేశములో  నైనా చూడగలమా! నేపాళ దేశమునకు రాజ భాష సంస్కృతము. వారి దేశీయ నినాదము ( national slogan ) ' జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.' ఇది ఎంత సహజముగా నున్నది. వారికి వారాంతపు శెలవు శనివారము. మన కాలగణన లో   వారము ఆది వారము తో మొదలై 

 శని వారము తో అంతమౌతుంది. అప్రాచ్యులవలె సోమ వారముతో మొదలై ఆదివారము తో 

 అంతము కాదు. ఆవు వారి జాతీయ జంతువు. ఇది మనకు శిగ్గు చేటు కాదా! మన దేశ నినాదమైన 'సత్యమేవ జయతే' ఎంతవరకు సహజత్వమునకు దగ్గరగా వున్నది. కారణ మేమిటంటే ముండకోపనిషత్తులోని ఈ వాక్యము, కల్గిన శ్లోకము 'బ్రహ్మ సత్యము  జగత్తు మిథ్య' అన్న శంకరులవారి వివేక చూడామణికి ఆలంబన. ఆ ఉపనిషద్ శ్లోకము  ఈ విధముగా వున్నది.

 మిగిలినది రేపు.....

రాజ్యాంగ ఉపోద్ఘాతము (preamble of our constitution) – 

1.ఒక సనాతన సంస్కృతి యొక్క పరిణామ క్రమమును గూర్చి దాని లక్ష్యాన్ని గూర్చిన అవగాహన

2.దాని మత ధార్మిక, ఆర్ధిక చరిత్ర

ఈ భారత దేశము సనాతనమని ఈ ధర్మమూ సనాతనమని మనకు తెలుసు. సామాన్యులమైన మనకే తెలిసినపుడు మాన్యులైన రాజ్యాంగ రచయితలకు తెలియదా లేక వారిని వ్రాయమని నిర్దేశించిన నాటి మహా నాయకులకు తెలియదా. ఒక క్రియాశీలమైన ఇటువంటి రచనలో 1) సంస్కృతి పరిణామమును గూర్చి కానీ 2) సాంఘీక ,3)ధార్మిక, 4)ఆర్ధిక , 5)పారమార్థిక తత్వమును గానీ వ్యక్త పరుప నవసరము లేదా!

అధిక సంఖ్యాకులను త్రోసి రాజని అల్పసంఖ్యాకుల సంక్షేమానికే అంకితమైన రాజకీయ నేతృత్వము ఏ జాతిని ఉద్ధరించ బూనినదో ఆత్మ పరిశీలన ఒక పర్యాయమయినా చేసుకొంటే అర్థమౌతుంది. సాధారణంగా రాజ్యాంగాలను పరిచయము చేసే ఉపోద్ఘాతాలు తమ మూలములకు జని తమ ఔన్నత్యమును గ్రహించి అది తమ ప్రజావాహినికి ప్రపంచమునకు ఎరుకపరచుతారు.

ఇటీవల తన అభిప్రాయమును వ్యక్తీకరించిన ఒక అనుభవజ్ఞుడైన పాశ్చాత్య పండితుడు ఈ విషయ మూల రచయితతో ఈవిధముగా అన్నాడట:"ఈ హిందూదేశ రాజ్యాంగ ఉపోద్ఘాతము నాకు మూలరహితముగానూ, నిః+హృదయముగానూ తోచుచున్నది. ఇందులో చారిత్రికమైనదీ, ఆధ్యాత్మికమైనది, సాంప్రదాయికమైనది,పూజ్యమైనది,ఆరాధింప దగినది అయిన యేవిషయానికి తావు వున్నట్లు కనిపించుటలేదు. దానిలో ఎక్కడగాని గతించిన ఎన్నో యుగాల వైభవాలను గురించి సగర్వంగా కృతజ్ఞతా పూర్వకముగా ప్రస్తావించిన ఒక్క వాక్యమైనా నాకు కనబడ లేదు. నిజమైన రాజ్యాంగ కర్తలు, భర్తలు (మహామహా నాయకులు),ఇటువంటి ఉపోద్ఘాతములలో తమ పౌరులకు ఉత్తమమైన ,దృఢమైన,ఉత్తేజకరమైన ,దేశభక్తి ప్రపూరితమైన సందేశాలను పొందుపరచి తమ ప్ర్జజావాహినిని కార్యోన్ముఖులను చేస్తారు. అంతగా చరిత్రలేని  ఏ యితర దేశముల పీఠికలను పరిశీలించినా మన కర్తాభర్తల నిస్తేజతను గ్రహింపవచ్చును."

ఒక పుటలో నాలుగవ వంతుకు మన రాజ్యాంగ పరిచయ భూమిక (IP1950,1976) వుంటే చైనావారిది రెండు పుటలుంటుంది.(ఇది1982 లో విడుదలైనది). వారు సంయత్ సెన్, మావో, లెనిన్, మార్క్స్, మొదలయిన మార్గదర్శకులను తలచుకొంటే మనది 'సార్వభౌమ, సోషలిస్టు, లౌకికవాద మన్న నైరూప్య సిద్ధాంతములతో మొదలవుతుంది. వారు అందులో భౌతిక, రాజకీయ, ఆధ్యాత్మిక నాగరికతల సమన్వయమును గూర్చి ప్రస్తావించినారు. మన పీఠికలో ఆధ్యాత్మికతకు తావే లేదు. అసలు శ్రీలంక పీఠిక కు 'స్వస్తి' అన్న సంస్కృత నామమును ఉపయోగించినారు. వారి పూర్వీకుల త్యాగములు,బుద్ధ ధర్మము, బుద్ధ శాసనము(article 9) మొదలగు అంశములను నొక్కి  వక్కాణించినారు . మరి మన వారసత్వము వారికన్నా ప్రాచీనమైనది కాదా. మరి ప్రపంచములోనే సంస్కృతమునకు,సంస్కృతికి మూలము మన దేశము కాదా. 'స్వస్తి ప్రజాభ్యాం..., స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః..., స్వస్తిర్మానుషేభ్యః..... ‘అన్న ఈ స్వస్తి వచనాన్ని (అత్యంత శుభకరమైన వాక్కు) తృణీకరించినామే మరి మనకన్నా కృతఘ్నులను వేరే దేశములో నైనా చూడగలమా! నేపాళ దేశమునకు రాజ భాష సంస్కృతము .

వారి దేశీయ నినాదము ( national slogan ) ' జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.' ఇది ఎంత సహజముగా నున్నది. వారికి వారాంతపు శెలవు శనివారము. మన కాలగణన లో   వారము ఆది వారము తో మొదలై శని వారము తో అంతమౌతుంది. అప్రాచ్యులవలె సోమ వారముతో మొదలై ఆదివారము తో అంతము కాదు. ఆవు వారి జాతీయ జంతువు. ఇది మనకు శిగ్గు చేటు కాదా! మన దేశ నినాదమైన 'సత్యమేవ జయతే' ఎంతవరకు సహజత్వమునకు దగ్గరగా వున్నది. కారణ మేమిటంటే ముండకోపనిషత్తులోని ఈ వాక్యము, కల్గిన శ్లోకము 'బ్రహ్మ సత్యము  జగత్తు మిథ్య' అన్న శంకరులవారి వివేక చూడామణికి ఆలంబన. ఆ ఉపనిషద్ శ్లోకము  ఈ విధముగా వున్నది.

కారణ మేమిటంటే ముండకోపనిషత్తులోని ఈ వాక్యము, కల్గిన శ్లోకము 'బ్రహ్మ సత్యము  జగత్తు మిథ్య' అన్న శంకరులవారి వివేక చూడామణికి ఆలంబన. ఆ ఉపనిషద్ శ్లోకము  ఈ విధముగా వున్నది.

सत्यमेव जयते नानृतं

सत्येन पन्था विततो देवयानः 

येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा

यत्र तत् सत्यस्य परमं निधानम् 

సత్యమేవ జయతే నానృతం

సత్యేన పంథా వితతో దేవయానః

ఏనాక్రమన్త్ర్యు షయో హ్యప్తకామా

యత్ర తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయించుతుంది, అనృతము కాదు. సత్యము ద్వారా దైవసన్నిధి సాధ్యము. ఇది సత్యనిధిని చేరుటకు ఋషులు అనుసరించిన మార్గము. సత్యనిధి ఆ పరమాత్ముడే కదా! అంటే మనవారు ఎంతో లౌకికతను ప్రదర్శించి ఈ 'సత్యము' అన్న మాటను వాడి తాము అత్యంత లౌకిక వాదులమని చెప్పుకొన్నారు.

మిగిలినది మరొకమారు  చూద్దాము.........

రాజ్యాంగ ఉపోద్ఘాతము (preamble of our constitution)-4

ఈ విషయమున శ్రీఅరవిందులవారి  సాధికార పరిశీలన మనకు మన దేశ ఔన్నత్యమును గూర్చి తెలుపుటలో ఎంతయో సహకరించుతుంది. అందులో ఈ భావము నాకు స్పురించినది.' భారత దేశము సాంఘీక నిర్మాణ శీలమగు దేశము. గ్రామ సమాజములు గ్రామీణ ప్రజాతంత్రము అన్నవి సహజ సాధారణములు. గ్రామములు పంచాయతీల పాలనలో ఉండేవి. విద్య ఆర్ధిక విషయములను తానే సమర్థవంతముగా నిర్వహించుకొనగలిగేది.

ఇంత నాగరికత ముసుగులోని అనాగరికత దావానలమై విస్తరిల్లికూడా  ఆధ్యాత్మికతను అణగద్రొక్కలేకపోయినది. పై వాస్తవమును దృష్టిలో ఉంచుకొని పరిశీలించినచో మనము ఈ క్రింది విధముగా నాటి పరిస్థితులను పరిగణించ వచ్చును.

 భారత భూమి తన సిద్ధాంతములకనుగుణంగా ఉన్నత ప్రమాణములను అనుసరించుచూ, తన ఆదర్శాలకు అనుగుణంగా సాగినంత కాలము అద్భుతమైన ఫలితాలను సాధించింది. పారమార్థికమే కాకుండా ప్రాపంచిక జీవన విధానమున  కూడా మిగతా దేశాలకన్న మిన్న గానే ఈ దేశము ఉంటూ వచ్చినది. ఇంత చక్కటి నేపథ్యాన్ని కాలదన్ని కసాయి వాడిని గొర్రె నమ్మినట్లు తెల్లదొరలకు బానిసలమై మన సంస్కృతికి నల్ల ముసుగు కప్పినాము. మన పతనమునకు అదే నాంది. పరహితము పరార్థము అన్నవి మన పాలిటి పలుకలేని పేర్లయి పోయినవి.' అందుకే చిన్న దేశమైన సింగపూరు యొక్క 'స్థూల తలసరి జాతీయాదాయము'(percapita income) $54700 వుండగా మన దేశము చైనా ఇండొనీషియా కన్న అట్టడుగున $3560 తో సరిపుచ్చుకోవలసి వస్తూంది. మరి ఈ దేశము ప్రగతి పథములో ఒడుదుడుకులు లేకుండా పయనించుటకు ఈ క్రింది వచనములు ఎంతవరకు ఉపయోగ పడునన్నది గమనించండి:

ఆ విషయములను రేపు తెలుసుకొని ఈ వ్యాసమునకు ముగింపు పలుకుదాం.

మరి ఈ దేశము ప్రగతి పథములో ఒడుదుడుకులు లేకుండా పయనించుటకు ఈ క్రింది వచనములు ఎంతవరకు ఉపయోగ పడునన్నది గమనించండి:

1. విద్య అంటే 'పర విద్య' యే. వృత్తివిద్యాదులన్నీ'అవిద్య'లే .ఈ రెండూ సత్వగుణ సంపన్నులైన బ్రాహ్మల చేతిలో ఉండేవి. సాత్వికత, సమ్యమనము, సమాజ శ్రేయస్సును (అందుకే వారిని పురోహితులన్నారు)  దృష్టిలో వుంచుకొని నిస్వార్థముగా ఈ సమాజమును తీర్చి దిద్దినారు. అందుకే వేల సంవత్సరాలు మన సమాజ సంస్కృతి ఆర్ధిక వ్యవస్థ కాలానికి ఎదురొడ్డి ప్రపంచములో సర్వశ్రేష్ఠ స్థితిలో నిలువ గలిగినది. వారు రాజులను చేసినారు కానీ రాజులు కావాలనుకోలేదు.

2. పూర్వము విద్య ముగిసిన వెంటనే అది ఉపాధి హేతువుగా మారిపోయేది. ఉద్యోగాల కొరకై వెతుకులాడే అవసరము వారికుండేధి కాదు. సంతృప్తికి సమాజశ్రేయస్సుకు అవినాభావ సంబంధము కలదని వారు గ్రహించినారు. నేడు వృత్తులను విడనాడి ఉద్యోగాల పేరుతో వీదులబడి ఉరకలేత్తుతున్నాము. శూద్ర శబ్దము నిమ్నతను సూచించదు. వారే ప్రగతికి మూలాధారము. మృచ్ఛకటికమును వ్రాసిన మహారాజు పేరు శూద్రకుడు. వేదములో 'పద్భ్యాగం శూద్రో అజాయత' అన్నారు. వారిని పాదములతో పోల్చినది వేదము. ఎవరైనా పెద్దలకు మ్రొక్కవలెనంటే పాదములకే కదా మ్రొక్కేది. దేశము అన్న పురుషుడు నడవ వలెనంటే పాదములే కదా పనికి వచ్చేది. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ. శివ,వైష్ణవ సాయుజ్యము పొందిన భక్తులలో బ్రాహ్మణేతరులే ఎక్కువ, బ్రహ్మత్వము పొందిన మహనీయులను వదిలేస్తే. అరమరికలు లేవు, విభేదాలు లేవు, ఎవరిపని వారిది. ఐక్యతయే వారందరి వారధి మరియు వారిధి కూడా. నదులెక్కడ పుట్టినా ఎటుల పుట్టినా కడలి కడుపునకే కదా కడకు చేరునది.

3. భారత దేశము మత ధార్మిక దేశము. ఎవరెంత పెకలింప జూచినా, కొమ్మలను నరుకగలిగినారే గానీ వేర్లను అంటే మూలములను  పెకలించలేక పోయినారు.ఈ దేశమనే చెట్టుకు ఆధ్యాత్మికమే కూకటి వేర్లు. ఈ చేట్టుకు పాదు సలిపి,  అందరినీ పురికొలిపి,  వారి మనసులను కలిపితే ఈ దేశ ఉన్నతికి ఆకాశమే హద్దు.

4. బ్రహ్మచర్యము మన సంస్కృతికి మూలము. నీతి నియమాలకు నిర్దుష్ట నిర్వచనము కలిగిన భూమి ఇది. అది అప్రాచ్యులకు లేదు. ఇక్కడ బ్రహ్మచర్యము అనుమాతకు అర్థము పెళ్లి పేరంటాలు లేకుండా ఉండిపోవమని కాదు, కాపురుషులయిపోకుండా కామాతురుతకు కళ్ళెము వేసి నీతి, నియమము ధర్మతత్పరత కలిగియున్దవలయునన్నది ఉద్దేశ్యము.

5. మనకు కేంద్రము భగవత్ సాయుజ్యము. కావున భూగోళములో మనము చేసే ప్రతి సత్కార్యము, దేవునికి చేరువ చేస్తుంది. పాశ్చాత్యులు కేంద్రము నుండి దూరమై క్రొత్త క్రొత్త పరిధులను ఎంచుకొంటారు. మరి కేంద్రమునకు దూరమైతే దైహిక పరిణతి తప్పించి దైవిక పరిథి పెరుగదు గాక పెరుగదు.

మరయు చివరి భాగాన్ని మరొకమారు చద్దాం....... 


Friday, 19 July 2024

కార్యశూరుడు

 కార్య శూరత (Management Science)

https://cherukurammohan.blogspot.com/2024/07/blog-post_19.html



నేడు పుట్టగొడుగులుగా మన మధ్యకొస్తున్న అనేకానేకములగు మానవ వనరుల మరియు మానవ సంబంధముల సంస్థలను(Human Development, Man Management Organisations) మనమెన్నో చూస్తున్నాము. ఎన్నో విషయాలలో వారు తమ మేదోవర్గపు సలహాలతో ఆచరణలో ఉంచిన నియమావళి సత్ఫలితములనివ్వక, అమెరికానే ఆర్ధిక సంక్షోభములో అతలాకుతలమై పోయింది. మన వేద శాస్త్రములను ఆకళింపు చేసుకొన్న శ్రీల ప్రభుపాదులవారు మన ఇంధనశక్తి (positive Energy = శక్తి సంకలనము) ని ఏవిధముగా పెంపొందించగలుగవచ్చునో ఎంత పరిశీలనాత్మకముగా చెబుతున్నారో చూడండి.


ఈ శ్లోకమును అభయ చరణారవింద భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామీ వారిది అని పైనే తెలియబరచినాను.


उत्साहन् निश्चयत धैर्यात

तत् तत् कर्म प्रवर्तनात

संगत्यागत सतोवृत्तिः

षड्भिर् भक्तिः प्रसिद्यते


ఉత్సాహాన్ నిశ్చయత్ ధైర్యాత్

తత్తత్ కర్మ ప్రవర్తనాత్

సంగత్యాగాత్ సతోవృత్తిః

షడ్భిర్ భక్తిః ప్రసిద్యతే


1. ఉత్సాహము 2. పట్టుదల 3. ధైర్యము 4. కర్మానుసార సమయస్ఫూర్తి 5. అయోగ్యుని విడుచుట 6. యోగ్యుని అనుసరించుట అన్న ఈ ఆరు గుణములను పుణికి పుచ్చుకొంటే ఎపనినయినా సాధించ వచ్చును. పని మంచిదయితే ఫలితము భగవంతుడు కూరుస్తాడు అన్న నమ్మకముతో మనము పని చేయవలసి వుంటుంది.


ఇప్పుడు ఈ ఆరు విషయాలను గూర్చి కొద్దిగా విశ్లేషించుకొందాము.

1. ఉత్సాహము : ఏదయినా ఒక పనినిని తలపెట్టితే ప్రోత్సాహమిచ్చేదే ఉత్సాహము.దానినే ఆంగ్లములో Motivation అంటారు.అందుకే మన పెద్దలు 'మనసుంటే మార్గముంటుంది' అంటారు.

2. పట్టుదల: పట్టుదల వున్నవాడు తాననుకొన్నది సాధించుటకు ఎంతయినా కృషి చేస్తాడు. అందుకే 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్నారు. 'సాధనతోనే ధరన పనులు సమకూరుతాయి.

3. ధైర్యము: ఒక రాజు ఎదో తప్పిదము చేయుటతో అష్ట లక్ష్ములు ఆతనిని విడిచి పెట్టి పోతూవుంటే ఆతను పట్టించుకోడు. ఒక ధైర్య లక్ష్మి పోతూవుంటే మాత్రము ఆ తల్లి చేయి పట్టుకొని మాత నీవు ఒక్కదానివి నాతో వుంటే చాలు. నీవులేకపోతే ఇక నేను లేను అంటాడు. అంతే కదా! ధైర్యము లేకపోవుట అంటే భయమునకు మనిషి ఆలవాలమైనట్లే! బీరువు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే కదా భర్తృహరి కూడా 'ఆరంభింపరు నీచమానవులు..' అని అంటూ ' ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్దార్థము ఉజ్జగించరు' అన్నాడు. కావున ఎవరికయినా తలపెట్టిన పనిని పూర్తి చేయాలంటే అత్యంత అవసరము ధైర్యము. ధైర్యమును గూర్చి వ్రాసిన ఈ క్రింది పది వాక్యములలో మొదటిది తప్ప మిగతావి నేను వ్రాసినవి. ఒక్కసారి గమనించండి.

1. ధైర్యే సాహసే లక్ష్మి

2. ఆపదలోసాహాసం అత్యుత్తమ సహవాసం

3. ఎదలో ధైర్యము వుంటే అదురెక్కడ బెదురెక్కడ

4. ధైర్యము లేకుంటే దయనీయమే!

5. మానవత్వమున ధైర్యము మణి పొదిగిన ఆభరణము

6. ధైర్యమొక్కటున్న నీవు ధరణినేలగలవన్నా

7. ధైర్యమున్న చాలునులే దుఃఖమంత దూరములే

8. పట్టు విడకు నీ సాధన ఫలియించును శుభ కామన

9. ధైర్యమున్న బాహుబలి లేకుంటే విధికి బలి

10. ధైర్యము ధనువైతే నిశితబుద్ధి నీ శరము

కావున కార్యార్థికి ధైర్యము యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నదో దీనిని బట్టి అర్థము చేసుకొన వచ్చు.


4. కర్మానుసార సమయస్ఫూర్తి : సమయస్ఫూర్తి లేకుంటే మనము లేము మనుగడ లేదు.ఒక మరచీలను కోయా నుండి విడదీయాలంటే Screwdriver కావాలన్నది అందరికీ తెలిసిన విషయమే! అవసరమేర్పనపుడు Screwdriver లేదని ఊరకుండిపోము కదా! ఎదో ఒక రేకును తీసుకొని దానిని వూడదీయ ప్రయత్నమూ చేస్తాము. రాయల ఆస్థానమునకు పోతూ ద్వారపాలకుడు తిమ్మయ్య కప్పుకొన్న శాలువను తీసుకోనవలెనని అష్ట దిగ్గజములలో నలువురు అనుకొంటారు. మొదటి ముగ్గురు ఎవరయినా నాలుగవ వాడు తెనాలి రామలింగడు. మొదటి ముగ్గురూ తిమ్మప్పను గూర్చి చెప్పిన మూడు పాదములు ఆతనికి తమ ఉద్దేశ్యము తెలియజేయలేక పోయినాయి. రామలింగడు మాత్రము 'నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!' అని తన సమయస్పూర్తిని ప్రకటించి శాలువా పొందినాడు. ఇక్కడ రామలింగని సమయస్పూర్తి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి ఆ నలుగురిలో తానూ చివరిగా నిలువడం. ఎందుకంటే పద్యమునకు నాలుగు పాదములు కదా! నీశాలువ నాకీ అని మొదటి ముగ్గురూ అనలేరు అంటే తరువాతి వారు పద్యాన్ని పూర్తి చేయరు. ఇక నాకెందుకులే అనుకొంటారు. అదీ విషయము. కావున మన మాట సూటిగానూ సున్నితము గానూ ఉంటూ సమయస్ఫూర్తి కలిగి ఉండవలెను.


5.అయోగ్యుని వదలుట : కుక్క తోక పట్టుకొని గోదావరినీదుట సాధ్యమా! కావున నీ కార్యాచరణలో అయోగ్యుని వుంచుకొనుటచే పని పూర్తికాక పోవుటయేగాక చేతగానివాడన్న పేరు ఆ కార్యాచరణ దళపతి కూడా మూటకట్టుకోనవలసి వస్తుంది. కావున ఇక్కడ పని పూర్తియగుట మాత్రమే ముఖ్యము. ఇది ధనుర్విద్యా ప్రదర్శనలో అర్జనుని గురివంటిది, కావున nee దృష్టి నుండి అతనిని తొలగించుకొనుట తప్ప వేరొక మార్గము వేడుక వీలు లేదు. తస్మాత్ జాగ్రత.


6. యోగ్యుని అనుసరించు: చిత్తశుద్ధితో యోగ్యుని అనుసరించినా అనుకరించినా నీ కార్యము నెరవేరినట్లే! యుద్ధము చేయను అని ఖండితముగా కృష్ణుడు చెప్పినా, తమసైనికబలగము 7:11 నిష్పత్తిలో వున్నా కృష్ణుని కోరుకొని అర్జనుడు మహాభారత యుద్ధమే గెలిచినాడు. ఈ ఉదాహరణ చాలదా కార్యశూరునికి!

మన ధర్మములో లేని మర్మము లేదు. ఆ కాలమునకు పాశ్యాత్య జాతులలో నాగరికత లేదు కావున వారు ఇంతటి జీవన శైలిని , నీతి నియమములను పాటించలేక పోయినారు. ఈ నాడు వారిదే మేధస్సని, వారిదే నాగరికత యని గంగను వదలి మురికి గుంటలో ఈదులాడు చున్నాము. మీలో ఎవరయినా నన్ను ఈ మాట అడుగవచ్చు. వారిది (1896 - 1977) 20వ శతాబ్దమే కదా అప్పటికి పాశ్చాత్యులు ఎంతో నాగరికులైయున్నారు కావున వీరు వారి నుండియే నేర్చుకొని యుండవచ్చుకదా యని. కానీ వారు 1950 లోనే సన్యాస దీక్ష తీసుకొని జీవితమును వేదాధ్యయనము భక్తితత్వ ప్రచారములోనే జీవితమును గడిపినారు. వారి ధీజలధి లో ప్రభవించిన ఒక స్వర్ణ కమలమే ఈ శ్లోకము.


మన దేశ, శాస్త్ర, ఋషిగణ, మహిమాన్వితులను గుర్తించి అట్టి మహనీయుల బాటలో నడవండి.

స్వస్తి.