Tuesday, 8 March 2022

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

https://cherukurammohan.blogspot.com/2019/11/blog-post_25.html

కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేంళ్లకే ముగిసిపోయింది. కనుచూపు మేరలో మనలనేలుచున్న బ్రిటీషు వారితో  పోరాటాలూ లేవు. అటువంటి సమయములో సడి సవ్వడి లేకుండా వారు పలాయనము చిత్తగించుట జరిగినది. అంత అర్ధాంతరముగా మనకు స్వాతంత్య్రమును ఇచ్చివేసి వారు ఎందుకు పోవలసి వచ్చినది. GD Bakshi గారి 'Bose: An Indian Samurai' పుస్తకము చదివితే తెలిసివస్తుంది.

India Today Magazine has been able to exclusively access an advance copy of a Knowledge World Publication, 'Bose: An Indian Samurai'. In this book General GD Bakshi quotes from a conversation between former British Prime Minister Clement Attlee and the then Governor of West Bengal Justice PB Chakraborthy. In 1956, Clement Attlee had come to India and stayed in Kolkata as a guest of the then governor. Remember, Clement Richard Attlee was the man, who as leader of the Labor Party and British Prime Minister between 1945 and 1951, signed off on the decision to grant Independence to India.

PB Chakraborthy was at that time the Chief Justice of the Calcutta High Court and was also serving as the acting Governor of West Bengal.

అంటే - ఈనాడు మనము అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. ఆయనే అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొనవచ్చు. బాధాకరమగు విషయమేమిటంటే ఆయన కనీస మర్యాద, మన్ననలకు కూడా నోచుకోలేదేమో అనిపిస్తుంది.

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రము సిద్ధించైనా పిమ్మట అదే యోధులు స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. కానీ స్వాతంత్య్రంవచ్చిన తదుపరి కూడా అట్టి మహానీయులగు జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పని చేయుటకు నాటి మన ప్రభుత్వమునకే చేల్లినదేమో!

ప్రజాస్వామ్య విలువలను, ఉదార భావాల మహానాయకునిగా గుర్తింపబడిన మాననీయ  నెహ్రూ గారు బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలపై నిఘా ఉంచమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.

ఇక్కడో సందేహం సహజం.

నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వాఋ ధృవపరచినారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?

వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని!

1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.

శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.

విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించినాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతను సమాచారమును  రాబట్టినాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పగా, వైస్రాయ్ తల ఊచినాడు.

ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు గద్దెనెక్కింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రూ ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే!

కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతలకు తెలుసు. ప్రజాబలము కలిగిన అతడి ముందు వినాయకులగు ఈ నాయకులు  ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకు క్షేమమని తలచినారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టినారు. వారికొచ్చే ఉత్తరములను చించి, చదివి తమకు ఇబ్బంది కలిగించే లేఖలను రహస్యముగా దాచియుంచినారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారి కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల క్రితమే బయటపెట్టినాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనము. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.

ఎట్టకేలకు తుట్టతుదకు కట్టకడపటికి చిట్టచివరకు పాత ప్రభుత్వము ఎన్నికలలో కానీ ఎన్నికలలో ఓడిన తరువాత క్రొత్త ప్రభుత్వము ఒక్కొక్కటిగా బయట పెడుతూ వుంది. నేడు ఆ మహావీరుడు సహజ మరణము పొంది ఉండవచ్చును. భారత దేశము భూమిపై ఉన్నంతవరకు ఆయనను ఈ దేశము మరువదు,

స్వస్తి.