సుల్తాన్ టిప్పు - మన కనువిప్పు
https://cherukurammohan.blogspot.com/2021/07/blog-post.html
గత వెయ్యేండ్లుగ భారతీ భువనమున్ కల్లోలమ్ము గావించి సై
కత శ్రేణిన్ తలపోయు రీతిగను కంకాళంపుసంఘాతముల్
వితతంబై కనిపింప జేసి జనులన్ విభ్రాంతిలో ముంచి రా
కతనంబంతయు భూతమై బరిగినా, కంపించమా తల్చినన్
ఈ భారత భూమి ఒక విలక్షణమైన దేశము. ఇది అన్ని విధములా స్వయం సంవృద్ధ.
సంస్కృతి, సంపద,సౌజన్యము మాత్రమే కాక సకల సద్గుణ విలసితము ఈ పుణ్య భూమి.
ఈ తిరుగులేని ధర్మము ఈ నాటికీ ప్రపంచములోని గ్రంథ వాక్య పరిపాలనా
మతములకంటే ఉన్నతోన్నత మైనది. దుష్టులకు మనమెపుడూ దూరముగానే ఉండినా
దుష్టులు మన ప్రాభవము జూచి ఓర్వలేక దండయాత్రాలు జేసి నాటి మన పౌరుల ధన
మాన ప్రాణములను హరించి మనల బానిసల జేసి, ముస్లిములు 500 సంవత్సరములు,
పాశ్చాత్యులు, ముఖ్యముగా ఆంగ్లేయులు ఇంచుమించు 300 సంవతసరములు ఏలి
మన సంస్కృతిని సర్వనాశనము చేసినారు. ఇందుకు కారణము మనలోని ఉదాసీనత
మరియు అసంఘటిత భావము.
అట్లు కాకుంటే ఎక్కడో ఒమన్ దేశపు మూలాలు కల్గిన తురుష్కులు, మన ధర్మము మీద
విపరీత ద్వేషభావము కలిగినవారై, హిందూ దేశములో ఎక్కడో ఉన్న మైసూరు పై
కన్నేసి హిందువుల కళ్లను హిందువులచేతనే పొడిపించిన ఒక నరరూప రాక్షసుని గూర్చిన వాస్తవాలు తెలుసుకొందాము.
అతనెవరో కాదు, దక్షిణభారత ఔరంగ జేబ్ గా అభివర్ణించదగిన టిప్పు సుల్తాన్ గారే!
హిందువుల కంటి నీరు తుడవడానికి కొన్ని ఎంచుకొన్న హిందూ మఠాలకు,
దేవాలయాలకు కొంత సంపద విరాళములుగా ఇచ్చి ఇచ్చి హిందువులను సందిగ్ధతకు
గురిచేసిన చేసిన కుటిల పాలకుడు ‘టిప్పు సుల్తాన్ '.
ఇది ఆరంభమే! మిగిలినది
రేపు..........
యీతని, ఈతని తండ్రి యొక్క నిజ రూపము తెలియుటకు ' Islamization of Hindu
Malabar Tippu and his Father Hyder Ali 'అన్న పుస్తకము చదివితే మనకు
వాస్తవములు అవగతము కాగలవు.
తోషిత రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయినాయి. తోషిత
రాజకీయములు అంటే తృప్తిబరచే రాజకీయములు అని అర్థము. బహుశ 1921
ప్రాంతమన ఇవి పుట్టియుండవచ్చునని ఒక అంచనా. ఖిలాపత్ ఉద్యమ కాలంలో
పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి
అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి.
ఇవి రెండు రకాలుగా చెప్పుకొనవచ్చును.
1. నేరుగా రాజకీయపరమైనవి. ఓట్లకోసం, మైనారిటీలపేరుతో ముఖ్యముగా
ముస్లిములకు అడిగినవి, అడగనివి అన్నీ సమకూర్చి, నిరంతరము వారిని తృప్తి
పరుచుతూ తమ పబ్బము
గడుపుకొనుట.
2. చరిత్ర. భారతదేశాన్ని పాలించిన పరమత పాలకులు మతోన్మాదులు, కర్కోటకులు,
నరహంతుకులు, దారుణ మారణకాండలకు ఆద్యులు, మతమార్పిడులే ధేయ్యంగా
బతికిన వారు. అలాంటి వారి చరిత్రను మార్చి, భావితరాలను ఏమార్చటమే ధ్యేయంగా
చరిత్ర రచన జరిగింది. దీనిలో ప్రముఖపాత్ర పోషించినవారు కమ్యునిస్టులు.
అసత్యాలను పుట్టలు పుట్టలుగా చరిత్రను నింపివేసినారు.
నరరూపరాక్షసులను మానవతావాదులుగా, రక్తపిపాసులను శాంతికాముకులుగాను
చిత్రించినారు.దుర్మార్గపాలనను రామరాజ్యంగా వక్రీకరించినారు. అలా వండివార్చిన
చరిత్రను పాఠ్యాంశాలుగా పెట్టి పిల్లలకు వాస్తవాలను దూరం చేసినారు. వీటన్నింటికి
మూలం ఓటుబ్యాంకు రాజకీయాలు.
కొద్ది సంవత్సరాల క్రితం, అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టిప్పు సుల్తాన్
జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినపుడు, మైసూరు, మలబార్,
కొడగు ప్రాంతాల హిందువులు, మంగుళూరు క్రైస్తవులు తీవ్ర నిరసన తెలిపినారు.
కర్నాటక ప్రజలు గర్వించదగ్గ చక్రవర్తులు మయూరశర్మ, రెండవ పులకేశి,
అమోఘవర్షుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి వారెందరో ఉన్నారు. అయినా నాటి
సిద్ధరామయ్య ప్రభుత్వం వీరిలో ఎవరిని పట్టించుకోకుండా, కేవలం టిప్పు జయంతిని
మాత్రమే నిర్వహించాలను కోవటంలో ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ
ప్రయోజనాల సాధన కోసం రేపు మరో పాలకుడు “ఔరంగజేబు జయంతి”ని కూడా
అధికారికంగా నిర్వహించాటానికి పూనుకోడని చెప్పలేము.
అలాంటి వక్రీకరించి రాయబడిన, గతంలో సీరియల్ గా తీయబడ్డ టిప్పు సుల్తాన్
అనబడు వ్యక్తి చరిత్రను జాతీయవాద నయనములతో నిష్పక్షపాతముగా చూద్దాము.
సగటు భారతీయుడికి టిప్పుసుల్తాన్ ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటిష్ వారిని
అడ్డుకుని, వారిని తరిమివేసి, దేశానికి స్వాతంత్ర్య పరిరక్షణ కోసం ప్రాణాలనర్పించిన
త్యాగధనుడు. అసమాన ధైర్యశాలి. తన ప్రజల ఉద్దరణకోసం కొత్త
తంత్రజ్ఞానము(Technology) దిగుమతితో ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు
వేసిన దార్శనికుడు. పరమత సహనం ఆయన రక్తంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.
కరుణామూర్తి. హిందూ దేవాలయాలకు ఇతోధికంగా బంగారు కానుకలు పంపి, ప్రజల
మనస్సులలో చెరిపినా చెరగని స్ధానం సుస్ధిరం చేసుకున్న మానవతామూర్తి. ఇలా
చిన్నప్పటినుండి పాఠ్యపుస్తకాల్లో చిత్రించబడిన టిప్పుసుల్తాన్ చరిత్ర నేటికీ దాదాపుగా
అలాగే చెలామణి అవుతుంది. ఒక 65, 70 సంవత్సరముల క్రితము, ముఖ్యముగా కేశ
సంస్కరణ శాలల (Hair Cutting Saloons) లో ఆ మహావీరుడు పులితో పోట్లాడే
చిత్రమును గోడకు తగిలించేవారు. కానీ నిజమైన చరిత్రలో అట్టి ఉదంతమెచ్చటనూ కాన
రాదు.
సాధారణముగా ప్రసార మాధ్యమములు బాధ్యతగా కొంతవరకైనా నాణెమునకు
రెండోవైపును చూపవలసి యున్నది. కాని దురదృష్టవశాత్తు, భారత ప్రసార
మాధ్యమాలలో అత్యధిక భాగము, వివిధ పక్షాల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే
బానిసలై కించిత్తు కూడా తన ప్రాథమిక బాధ్యతను స్వీకరించలేకపోయినవి.
నిజం నిప్పులాంటిది. ఏనాటికైనా బయటకు రాక తప్పదు. సాంఘీక మాధ్యమములు
వేదికగా ఔత్సాహికులెందరో నేడు, గతంపై దృష్టి సారించినారు. దిగ్ర్భాంతికరమైన
నిజాలు, పాఠకులను మరింత విభ్రాంతికి గురిచేస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో వండివార్చిన
టిప్పుసుల్తాన్ కథను కాకుండా అసలైన చరిత్రను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
విఖ్యాత విజయనగర సామ్రాజ్యము 1565 తళ్ళికోట యుద్ధంలో పతనమైంది. తర్వాత
ఎంతో కాలం పాటు అనిశ్చితి కొనసాగింది. చిన్నచిన్న రాజ్యాలు అనేకము
విజయనగరము యొక్క స్ధానములో వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వాటిలో
మైసూరు రాజ్యము ఒకటి. వడయారులను హిందూ రాజ వంశజులు మైసూరును
పాలించినారు. 1761 ప్రాంతంలో నాటి మైసూరు పాలకుడైన రెండవ కృష్ణరాజ
వడయార్ పసివాడగుటచే నంజరాజ్ దుల్వారు అనగా ప్రధానిగా అధికారము చేపట్టి
పాలించుచుండినాడు.
మిగిలినది రేపు .........
సుల్తాన్
టిప్పు – మన కనువిప్పు – 3
మైసూర్లోని కోలార్ జిల్లాలో 'బుడికోట' వద్ద హైదర్ఆలీ జన్మించినాడు. ఇతని తండ్రి
ఫతేమహ్మద్. హైదర్ఆలీ సైనికునిగా మైసూర్ రాజ్యంలో జీవనోపాధి కొనసా
గించేవాడు. అనేక యుద్ధాలలో ఇతని ధైర్యసాహసాలు చూసి ఆకర్షితుడైన మైసూరు
దుల్వారగు నంజరాజ్ హైదర్ని దిండిగల్ ఫౌజ్దార్గా నియమించినాడు. తదుపరి
మొగల్ చక్రవర్తి అతని ధైర్యసాహసాలకు మెచ్చి మైసూర్ దగ్గరున్న 'సీరా' రాష్ట్రానికి
సుబేదార్గా నియమించినాడు. 1761లో నంజరాజ్ను తప్పించి కృష్ణ రాజు ను
తొలగించి, సింహాసనమును ఆక్రమించి, మైసూరు పాలకుడైనాడు హైదర్అలి. ఆతను
1782 వరకూ శ్రీరంగ పట్టణమును రాజధానిగా చేసుకొని మైసూరు ప్రాంతమును
పాలించినాడు. 1782లో బ్రిటిష్ వారితో జరిగిన రెండవ మైసూరు యుద్ధ సమయంలో
అతను మరణించినాడు. నిరక్షరాస్యుడైనా అతని మేధస్సు, జ్ఞాపకశక్తిని దేశీయులు,
విదేశీయులు మెచ్చుకొనేవారు.
ఈయన కుమారుడైన టిప్పుసుల్తాన్. అసలు పేరు ఫతే అలీ సాహెబ్. స్ధానిక ముస్లిం
ఫకీర్ టిప్పు మస్తాన్ ఔలియా పేరున ఈయనకు టిప్పుసుల్తాన్ పేరు స్ధిరమైనది. రెండవ
మైసూరు యుద్ధసమయంలో తండ్రి మరణించిన వెంటనే, పాలకుడిగా
పట్టాభిషిక్తుడైనాడు. బ్రిటిష్ వారితో సంధి చేసుకుని, తాత్కాలికంగా యుద్ధం
విరమించినాడు. కాని తన రాజ్యాన్ని నిలుపుకోవాలనే తపనతో ఉన్న సుల్తాన్ ను,
భారతదేశంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉండకూడదనే తలంపు కలిగిన బ్రిటిష్
ఈస్టిండియా కంపెనికి మధ్య పొత్తు తెంచుకొని మూడో మైసూరు యుద్ధమునకు
ఢంకా బజాయించినారు. ఇది 1792లో జరిగింది. ఈ యుద్ధములో టిప్పు, తన
రాజ్యంలో సగభాగాన్ని కోల్పోయినాడు.
తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించాలనే తపనతో ఫ్రెంచివారితో
పొత్తుపెట్టుకుని, మద్ధతు కోసం టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల నేతలను
భారతదేశంపై దాడులకు ఆహ్వానించినాడు. 1799లో నాల్గవ మైసూరు యుద్ధంలో
బ్రిటిష్ వారిని నెదుర్కొని, యుద్ధంలో మరణించినాడు. అంతటితో టిప్పు సామ్రాజ్యము
అంతరించింది.
సంక్షిప్తంగా చెప్పబడిన ఈ టిప్పుచరిత్ర చదివితే, భారతీయ పాలకుడైన టిప్పుసుల్తాన్,
బ్రిటిష్ వారి అధికారానికి రాజీపడక, దేశ స్వాతంత్ర్యం పరిరక్షణకు కోసం పోరాడి,
ప్రాణాలర్పించిన యోధుడిగా కనబడతాడు. కాని లోతుకెళ్ళిచూస్తే అతగాడి అసలు చరిత్ర
కనబడుతుంది.
టిప్పు పూర్వీకులు గల్ఫ్ ప్రాంతంలోని
ఒమన్ దేశ ప్రాంతానికి చెందినవారు.
ఘనతవహించిన వామపక్ష చరిత్రకారులు టిప్పుసుల్తాన్ ను ఆకాశానికెత్తినారు. టిప్పుకు
లేని ఎన్నో భూషణాలను అలంకరించినారు. అతని అవలక్షణములను అణుమాత్రము
బయటికి రాకుండా . తన సింహాసనము కాపాడుకొనుటకు చేసిన ప్రయత్నములను,
దేశ బానిస సంకెళ్ళు తెంపటానికి పూనుకున్న పురాణపురుషునిగా అతనిని
చిత్రీకరించుట జరిగినది. ఒక నరరూప రాక్షసుడికి శ్రేష్ఠమానవత్వపు రంగు పులిమినారు.
చివరికి ‘నిజమే నెమో!, అంతేనేమో! కు అలవాటుపడిన మనలను, ముద్రణ కలిగిన
పాఠశాల పాఠ్యపుస్తకముల రూపములో, వారు వాస్తవాలుగా నమ్మించదలచిన
విషయములను మనకు వేరు మార్గము లేనివిధముగా చదివింపజేసి నమ్మించినారు.
ఈ చరిత్రకారులు టిప్పుసుల్తాన్ ను, గొప్పతనానికి మారుపేరుగా చూపిన అంశములు
ఈ దిగువన తెలియజేయుచున్నాను.
1. పరమత సహనం..... టిప్పు గొప్ప పరమత సహనం కలవాడని, ఎన్నో హిందూ
దేవాలయాలకు మాన్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా ఇచ్చినాడని
సాక్ష్యములను చూపినారు. శ్రీరంగపట్టణంలోని ప్రముఖదేవాలయాలు భద్రంగా
ఉండటానికి టిప్పు పరమత సహనమే ఋజవంటూ వాదించారు. టిప్పు ఆస్ధానంలో
పూర్ణయ్య అనే హిందువు ప్రముఖ పదవిలో ఉండటాన్ని సాక్ష్యంగా ప్రవేశపెట్టినారు.
అసలు టిప్పు సుల్తాన్ ను పరమత సహనము కలిగిన వానిగా చూపుటకు పూర్ణయ్య
హస్తముందేమో? పూర్ణయ్య స్వతహాగా బ్రాహ్మణుడు. జీవితాంతము టిప్పుసుల్తానునే
నమ్ముకొన్నవాడు. మంత్రాంగములో దిట్ట. మతసహనము అన్న తాయిలము
హిందువులకు ఇవ్వకపోతే అతని రాజ్యములోనే విప్లవము వచ్చే సూచనలు
కనిపించియుండుటచే ఈ విధముగా తన రాజుచే చేయించియుంటాడు.
ఇది నా ఊహ మాత్రమే!
కొద్దిపాటి నిజాలు, అనే ముసుగుతో అసంఖ్యాక ఘాతుకాలను కప్పిపెట్టటంలో
వామపక్షీయులు సిద్ధహస్తులు.
పైన పేర్కొన్న అంశాలు పాక్షికంగా నిజాలైయుండవచ్చు. కాని అవన్నీ రాజకీయపరమైన
అవసరాలకొద్ది చేయటం జరిగింది. మూడవ మైసూరు యుద్ధం(1792)లో ఓటమిపాలైన
టిప్పుసుల్తాన్, తన రాజ్యంలో సగ భూభాగాన్ని కోల్పోయాడు. పైగా మూడు కోట్ల
రూపాయల నష్టపరిహారం ఈస్టిండియా కంపెనీకి చెల్లించాల్సివచ్చింది. ఈ మొత్తం తమ
ఖజానాలో జమ పడే వరకూ హామీగా ఉండేందుకు తన ఇద్దరు కుమారులను
మద్రాసులోని కంపెని ప్రధానకార్యాలయానికి అప్పగించాడు. వెన్ను విరిగిన స్ధితిలో,
అంతకుముందు హిందువులపై ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డప్పటికీ, ఇప్పుడు హిందువుల
మద్ధతు లేనిదే, తాను తిరిగి పూర్వ వైభవం పొందలేన్న సత్యాన్ని గుర్తించిన టిప్పు,
కర్ణాటకలో అక్కడక్కడ కొన్ని దేవాలయాలకు దానాలు చేసినాడు. అలాగే మనము పైన
చెప్పుకొన్న పూర్ణయ్య అనే అఖండ మేధావిని ముఖ్యమైన పదవిలో కొనసాగనిచ్చినాడు.
ఇక అతని పరమత సహనం ఏపాటిదో చూద్దాం. తాను పదవికీ వచ్చిన వెంటనే,
సామ్రాజ్య విస్తరణలో భాగంగా కేరళ, కర్నాటకలోని కొడగు, మంగుళూరులోని
క్రైస్తవులపై దాడులకు దిగినాడు. దేశంలోని అధిక ముస్లిం పాలకులకు వలె టిప్పు
సుల్తాన్ మతోన్మాది. ఇస్లాం రాజ్య స్ధాపన ధ్యేయంగా అతడు చేసిన క్రూరమైన పనులు
మానవత్వానికి మచ్చగా మిగిలినాయి.
ఎమా.హెచ్.గోపాల్ అనే చరిత్రకారుని ప్రకారం, మైసూరు రాజ్యంలోని ముస్లింలందరికి
ఇంటిపన్ను, వస్తువులపై (గృహావసర సంబంధమైన) పన్నులు మినహాయించబడినాయి.
కేరళలోని మలబార్ ప్రాంతంపై మొదట అతను దాడులు చేసినాడని పైన
చెప్పుకొన్నాము. స్ధానికముగా ఉన్న చిన్న చిన్న పాలకులు చేతులెత్తేయగానే, సామాన్య
ప్రజానీకంపై విరుచుకుపడినాడు. అందరినీ మతం మార్చటమే ధ్యేయంగా పెట్టుకొని
ఎన్నో విధములుగా హింసించినాడు. ఔరంగజేబు దార్-ఉల్-హర్బ్ (ఇస్లాం పై
విశ్వాసము లేనివారలకు నిలయమైన ప్రాంతం) అయిన భారతదేశాన్ని దార్-ఉల్-
ఇస్లాం (ముస్లిం విశ్వాస దేశం)గా మార్చటానికి తన జీవితమంతా ఎంతగా
ప్రయత్నించినాడో, అలాగే టిప్పు కూడా, తాను పాలిస్తున్న మైసూరు రాజ్యాన్ని ఇస్లామిక్
రాజ్యంగా చూడాలని కలలగన్నాడు. తన లక్ష్యసాధన కోసం కనికరం లేని రీతిలో, తానూ
విశ్వాసము లేనివారు అని తాను భావించిన వారందరిని, మతం మారటానికి
నిరాకరించినవారిని అనాగరిమైన తీరులో హత్యాకాండలకు పాల్పడి మార్చనన్నా
మార్చినాడు లేకుంటే కడతెర్చనన్నా కడతేర్చినాడు.
కేరళ, మంగుళూరు, కొడగు ప్రాంతాల్లో టిప్పు చేసిన దాడులు, అక్కడి ముస్లిమేతరులతో
అతడు వ్యవహరించిన తీరు, అతడిలోని రాక్షసత్వాన్ని వెల్లడిస్తాయి. అక్కడి
దేవాలయాలను అతడి సైన్యం లూటీ చేసింది. విగ్రహాలను ధ్వంసం, అపవిత్రం చేయటం
జరిగింది. పురుషులను హత్య చేయటం, స్త్రీలపై అత్యాచారం చేయటం, వారి కూతుర్లను
తమతో తీసుకెళ్ళిపోయి తమ పెల్లాలలో ఒకరిగానో, ఉంపుడుకత్తెలుగానో
ఉంచుకొన్నారు. అటువంటి అత్యంత క్లిష్టమైన కాలములో పుట్టి తమ సర్వస్వము కొల్పడి
మతమే మారి తల్లిమతమునే మరచిన తల్లులను గూర్చి తల్లడిల్లుట తప్ప ఏమి
మాట్లాడుకొనగలము.
మిగిలినది రేపు ........
సుల్తాన్
టిప్పు – మన కనువిప్పు – 4
జరిగిన ఘోరాలకు బలియై కాలిపోయిన కాయము కల్గిన కన్నె పిల్లలు, వారిని కన్న
తల్లులు, తమ తల్లుల తల్లులని మారిన మతము గల్గిన మన హిందూ సోదరీ
సోదరులకు ఎందుకు అర్థము కాదో నాకు అర్థము కాదు. ముస్లిములు కానివారలపై
భారీగా పన్నులు విధించినాడు. దేవాలయలతో పాటు జైన మందిరాలు, క్రైస్తవ చర్చిలు
విధ్వంసానికి, దోపిడికి ఆయన ముస్లిం సేనలు పాలుపడినాయి. దాదాపు 800
పైచిలుకు హిందూ దేవాలయాలు టిప్పు వల్ల విధ్వంసానికి గురైనట్లు చరిత్రకారుల
అంచనా!
మానవ జాతికే తగని మాయని
మచ్చగ నిల్చి తల్లులన్
మానక పిల్లలన్ చెరచి
మత్త నిరంకుశ దంతిభాతిగా
తాను ఉదీర్ణతన్ జెలగి
దారుణ మారణ ప్రేరణాత్ముడై
కానగ క్రూర రాక్షసుల
కైవడి టిప్పు జెలంగె నిద్ధరన్
కర్నాటకలోని ఎన్నో పట్టణాల హిందూ పేర్లను తొలగించి, వాటికి ఇస్లామిక్ పేర్లు పెట్టిన
ఘనుడు టిప్పుసుల్తాన్ గారు.
అతడు మార్చిన పట్టణాల పేర్లు పాతవి...కొత్తవి.
మైసూరు ..... నజారాబాద్ (Nazarbad)
మంగుళూరు .... జలాలాబాద్ (Jalalabad)
హాసన్ .....ఖైమాబాద్ (Khayimabad)
సక్లేష్ పూర్..... మన్సూరాబాద్
క్యాలికట్ ..... ఇస్లామాబాద్ (Islamabad)
మద్దికేరి ..... జఫరాబాద్ (Jaffarabad)
సిరా...... రుస్తుమాబాద్ (Rustumabad)
దేవనహళ్లి ..... యుసుఫాబాద్ ( Yusufabad)
కానీ ఈ పేర్లు శాశ్వతముగా నిలువలేదు. తిరిగీ నేడు తమ నిజనామములతోనే
పిలువబడుచున్నాయి. ఇది ఎంతో సంతోషకరమగు విషయము. మరి ఈ శ్రద్ధ
బలవంతపు మతాతరీకరణ విషయములో ఆయా మతములకు మారినవారు మనసు
పెట్టి అర్థము చేసుకోనలేక పోయినారు. తన 50 సంవత్సరాల పాలనా కాలంలో
ఔరంగజేబు చేసిన అకృత్యాలను, టిప్పు కేవలం 17 సంవత్సరాలలోనే
పూర్తిచేయగల్గినాడని మాతృదేశాభిమానులయిన చరిత్రకారులు చెబుతారు. ఇస్లాం
పరిరక్షకుడిగా , ఇస్లాం సేవలో ఆలయాల విధ్వంసమనేది భక్తితో చేయుచుండెడు కార్యముగా తలపోసినాడు మన టిప్పు. లక్షల మంది హిందు, జైన,
క్రైస్తవ మతస్తులను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేయించినాడు. అతని
క్రూరకృత్యాలకు నిదర్శనముగా కొడగు సంఘటనను చూపవచ్చు. దాదాపు 800 ల
కొడగు కుటుంబాలను, కొడగు జిల్లాలోని దేవట్టిపరంబ అనే అటవీ ప్రాంతంలో,
బహిరంగంగా హతమార్చినాడు. కొడగు ప్రజలపై టిప్పు చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ
కావు. ఏనుగుల కాళ్ళకు బతికున్న మనుషులను కట్టి, వాటిని పరుగెత్తించటంతో, నేలపై
రక్తమోడుతూ అనేకమంది ప్రాణాలు వదిలారు.
1799లో బ్రిటిష్ వారు టిప్పును హతమార్చినప్పుడు, శ్రీరంగపట్టణంలో బంధించబడిన
దాదాపు 12000 కొడుగు కుటుంబాలు తప్పించుకుని, తిరిగి కూర్గ్ కు
వెళ్ళిపోయినాయి. ఈ విధముగా ఎన్ని వేల మంది కూర్గు ప్రజల టిప్పు చేతుల్లో
మరణించినారో, లెక్కలకు ఇదమిద్ధముగా ఎక్కనివి. ఇలాంటి పైశాచికానందం పొందిన
మనిషి మానవతావాదిగా పాఠ్యపుస్తకాల్లో చిత్రించటం చరిత్రను చేరబట్టడమే కదా!
ఇప్పటికి కూడా కొడగు ప్రాంతంలోని చాలా మంది ముస్లింలు, తమ పాత హిందూ
ఇంటి పేర్లే పెట్టుకొనియున్నారు గానీ మాతృమతమునకు మారలేదు సరికదా ఆ
ఆలోచన కూడా చేసినట్లులేదు. కూర్గు ప్రాంతంలో నేటికీ చాలామంది ప్రజలు తమ
కుక్కలకు టిప్పు అని పేరు పెట్టటం జరుగుతంది. రెండువందల సంవత్సరాలు
గతించినా, టిప్పుపై అక్కడి వారికి కోపం చల్లారలేదనటానికి ఇదే నిదర్శనం.
కేరళ మలబార్ లోని కాలికట్ పట్టణము శతాబ్దాలుగా సుగంధద్రవ్యాల వ్యాపారానికి
పట్టుకొమ్మ. టిప్పు సుల్తాన్ దాడులు వలన ఆనగరం పూర్తిగా తగులబడి, చరిత్రలో
మొదటిసారిగా దాదాపు నలభై నుండి యాభై సంవత్సరాల పాటు సుగంధద్రవ్యాల
వ్యాపారము లేకుండా పూర్తిగా నిలిచిపోయింది. టిప్పుసుల్తాన్ నిజంగా స్వాతంత్ర్య
సమరయోధుడైతే, ఎటువంటి ప్రతిఘటన లేకపోయిన ప్రదేశంలోని, తన దేశ
వాణిజ్యకూడలియైన నగరాన్ని నాశనం చేస్తాడా ?
18 జనవరి, 1790 వ తేదీన సయ్యద్ అబ్దుల్ దులాయ్ అనే వ్యక్తికి రాసిన లేఖలోని,
ఆంగ్లములోనికి తర్జుమా చేయబడిన ముఖ్యాంశమును చూడండి:
“With the grace of Prophet Muhammad and Allah, almost all Hindus in
Calicut are now converted to Islam. Only a few are still not converted on the
borders of Cochin State. I am determined to convert them also very soon. I
consider this as Jehad to achieve that object.”
19 జనవరి, 1790లో తన అనుచరుడైన బద్రూజ్ జమాన్ ఖాన్ కి రాసిన లేఖలో తన
ఇస్లామిక్ మత మౌఢ్యాన్ని ఇలా బయటపెట్టుకున్నాడు.
“Don’t you know I have achieved a great victory recently in Malabar and over four lakh Hindus were converted to Islam and I am now determined to
march against the cursed Raman Nair.” (రామవర్మ లేక రామనాయర్ అప్పటి
ట్రావన్కూర్ రాజ్య ప్రభువు).
ఇంతకన్నా దారుణము ఉంటుందా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒకేధర్మము
ఒకే దేశముగా ఎన్నో లక్షల సంవత్సరములనుండి కొనసాగుతూవచ్చిన ఈ దేశములో
నేడు పరదేశము గ్రంధ మతముల బంధములో తగుల్కొని వారి సాంప్రదాయాలు
పూర్తిగా తెలియక మన సాంప్రదాయాలు వదలలేక హంస నడక పోగొట్టుకొని కాకి
నడకను అలవరచుకోలేక రెంటికిన్ చెడిన రేవడయై అంగలార్చుచున్నారు.
మిగిలినది రేపు ..........
సుల్తాన్ టిప్పు – మన కనువిప్పు – 5
టిప్పుసుల్తాన్ తరపున పోరాడిన ఫ్రెంచి దేశస్తుడైన Francois Fidele Ripaud de
Montaudever అనేవాడు, టిప్పుసైన్యం క్రూరత్వంపై రాసిన మాటలు...” I’m disturbed
by Tipu Sultan’s treatment of these most gentle souls, the Hindus. During the
siege of Mangalore, Tipu’s soldiers daily exposed the heads of many
innocent Brhmins within sight from the fort for the Zamorin (The word
‘Zamorin’ is an English rendering from the Dutch and Portuguese words for
the Malayalam word Samoothiri. ‘Samoothiri’ is the hereditary title of the
rulers of Kozhikode (Calicut), a historically significant trading port on the Malabar Coast of Kerala and his Hindu followers to see”).
టిప్పుసుల్తాన్ కు సహాయం పోరాడిన మరో ఫ్రెంచి సైనికాధికారి Ripaud తన డైరి లో
ఈ విధముగా రాసుకున్నాడు. “To show his ardent devotion and steadfast faith
in the Mohammadan religion, Tipu Sultan found Kozhikode to be the most
suitable place. Kozhikode was then a centre of Brahmins and had over
7,000 Brahmin families living there. Over 2.000 Brahmin families perished as
a result of Tipu Sultan’s Islamic cruelties. He did not spare even women and
children.”
Bartolomaco అనే పేరుగల పోర్చుగీసు యాత్రికుడు, టిప్పు అనాగరిక చేష్టలను ఇట్లు
వర్ణించినాడు.
First corps of 30,000 barbarians who butchered everybody on the way…
followed by the field-gun unit under the French commander, M.Lally. Tipu
was riding on an elephant behind which another army of 30,000 soldiers
followed. Most of the men and women were hanged in Calicut, first mothers
were hanged with their children tied to necks of mothers. That barbarian
Tipu Sultan tied the naked Christians and Hindus to the legs of elephants and
made the elephants to move around till the bodies of the helpless victims
were torn to pieces. Temples and churches were ordered to be burned
down, desecrated and destroyed. Christian and Hindu women were forced
to marry Mohammandans and similarly their men were forced to marry
Mohammadan women. Those Christians who refused to be honoured with
Islam were ordered to be killed by hanging immediately. These atrocities
were told to me by the victims of Tipu Sultan who escaped from the clutches
of his army and reached Varappuzha, which is the centre of Carmichalel
Christian Mission. I myself helped many victims to cross the Varappuzha River
by boats.
ఉత్తరభారతంలో మహ్మద్ ఘజ్ని, అల్లావుద్దీన్ ఖల్జి, నాదిర్షాలు అక్కడి హిందువులపై
జరిపిన అకృత్యాల కంటే, మలబార్, కొడగు హిందువులపై టిప్పుసుల్తాన్ జరిపిన
అకృత్యాలు ఎన్నో రెట్లు అనాగరికంగా ఉన్నాయని Lowis B Boury అనే ఆంగ్లేయుడు
పేర్కొనటం జరిగింది.
కర్నాటకలోని మాండ్యా జిల్లాలోగల మెల్కోటే అనే ఊరిని ఆలయాల పట్టణము(Temple Town) అని అంటారు. అక్కడ ఉండేవారందరూ అయ్యంగార్ బ్రాహ్మణులు. తమిళనాడు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా మెల్కోటే అయ్యంగార్ బ్రాహ్మణ వంశస్తురాలే.
కొంతమంది మెల్కోటే వాసులు పాత వడయార్ ప్రభువు పునరుథ్థానము కొరకు
పనిచేస్తున్నారనే వార్తను వాస్తవమని నమ్మి, ఆ ప్రాంతంపై దాడి చేసిన టిప్పు దాదాపు
800 అయ్యంగార్లను వధించినాడు. అనేకమంది అయ్యంగార్లను జైలుపాలుచేసినాడు.
ఆరోజు నరక చతుర్ధశి(దిపావళి ముందురోజు). నాటి నుండి నేటి వరకూ మెల్కోటే
అయ్యంగార్లు, నాడు టిప్పు జరిపిన దారుణ మారణ కాండకు గురుతుగా నరకచతుర్ధశి
జరుపుకొనుట
నిలిపివేసినారు.
మంగుళూరు ప్రాంతం నుండి క్రైస్తవులను బంధించి, తన రాజదానియైని
శ్రీరంగపట్టణానికి తరలించి, వారిని బానిసలుగా మార్చి వారి యావదాస్ధిని స్వాధీనము
చేసుకొని. ఇస్లాంలోకి మారిన వారికి పన్ను మినహాయింపులు వర్తింపచేస్తూ
మిగతావారిని నిర్దాక్షిణ్యముగాఊచకోత కోసినాడు. దివాన్ పూర్ణయ్య మినహా యావత్తు
హిందువులను, తన ఆస్ధానంలోని ఉద్యోగాల నుండి తొలగించి, వారి స్ధానంలో పూర్తిగా
ముస్లింలను నియమించినాడు.
మరియొక పచ్చి అబద్ధమగు విషయము ఏమిటంటే సనాతన ధర్మమునకు తమ
ప్రాణములొడ్డే మరాఠాలు తమ సైన్యముతో పూణే చేరుకొంటూ మార్గమధ్యములో
శృంగేరిపై దాడిచేసి మఠము యొక్క సంపద దోచుకొన్నారని, అప్పుడు టిప్పు వారిపై
దాడిజరిపి తరిమికొట్టినాడని ఒక అభూత కల్పనను సృష్టించినారు కుహనా
చరిత్రకారులు. వాస్తవము మీ కొరకై దిగువన ఆంగ్లమున యథా తతముగా
పొందుపరచినాను. మరాఠాలు ముస్లిం పాలకులను దీటుగా ఎదుర్కొనుటకు
పిండారీలు అను, యుద్ధవృత్తితో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారివైపు యుద్ధము చేస్తూ
యజమానులకు తెలియకుండా దోపిడీలు లూటీలు చేసే వర్గమును తప్పనిసరి
పరిస్థితులలో చేరదీసినారు. వీరు అధికముగా ముస్లిములే! ఇపుడు విస్తారముగా
చదవండి.
మిగిలినది రేపు .........
సుల్తాన్ టిప్పు – మన కనువిప్పు – 6
(చివరి భాగము)
Pindaris
The majority of their leaders were Muslims, but they recruited
from all classes.
The Pindaris followed the Maratha bands who raided Mughal territory from the late
17th century. With the collapse of the Mughal Empire in the 18th century, these
camp followers organized themselves into groups, each usually attached to one of
the leading Maratha chiefs.
After the regular forces of the Marathas had been broken up by the British in the
campaigns of 1803–04 (see Maratha Wars), the Pindaris made their headquarters in
Malwa, under the tacit protection of the rulers of Gwalior and Indore. They usually
assembled in November to set forth over British-held territory in search of plunder. In
one such raid on the Masulipatam coast, they plundered 339 villages, killing and
wounding 682 persons, torturing 3,600 others, and carrying off much valuable
property.
https://www.britannica.com/topic/Pindari
Not connected to the above link.
The same Pindari-assisted strategy helped the Marathas block and reverse the
Mughal era gains in south India as far as Gingee and Trichurapalli during the 27
years Maratha War of Independence.
In a letter of 24 April, 1792 written on behalf of Lord Cornwallis, the Governor-
General, the following is stated:
The Pindari horse of the Mahratta armies were employed without any check or
control that from the nature of those horse the march of armies thro’ a country was
always attended with circumstances of this description…
The information given under is taken from the link
https://swarajyamag.com/culture/what-exactly-happened-at-sringeri-math-in-april-
1791
The Sringeri episode was neither a policy nor a battle plan for the Marathas. It was
carried out by those predatory troops and lamaans (a caste dealing with grain) who
do not take part in an actual battle. VV Khare, the historian who collected a huge
collection of letters writes that the Sringeri math seemed a safe repository for all the
rich in the region as the Marathas being Hindus and led by Brahmin commanders
would not harm it.
ప్రఖ్యాతమైన టిప్పు ఖడ్గం పిడిపై రాయబడిన రాతలే, అతని ఇస్లామిక్ మత
మూర్ఖత్వానికి నిదర్శనాలు. ఆతని కత్తి పిడి మీద వ్రాసిన గూగుల్ నుండి గ్రహించిన
అరబ్బీ వ్రాతల ఇంగ్లీషు తర్జుమా ఈ దిగువన ఇవ్వబడినది.
On the handle of the Tipu Sultan's steel sword was the following inscription
(translated into English). "My victorious sabre is lightning for the destruction of
the unbelievers. Haider, the Lord of the Faith, is victorious to my advantage.
And moreover, he destroyed the wicked race who were unbelievers. Praise
be to him, who is the Lord of the Worlds! Thou art our Lord, support us against
the people who are unbelievers. He to whom the Lord giveth victory prevails
over all (mankind). Oh Lord, make him victorious, who promoted the faith of
Muhammad. Confound him, who refused the faith of Muhammad; and
withhold us from those who are so inclined. The Lord is predominant over his
own works. Victory and conquest are from the Almighty. Bring happy tidings,
Oh Muhammad, to the faithful; for God is the kind protector and is the most
merciful of the merciful. If God assists thee, thou wilt prosper. May the Lord
God assist thee, Oh Muhammad, with a mighty
victory."
క్రీ.శ.1799లో అతను మరణించేనాటికి, అతని విశాలమైన రాజ్యంలో కేవలం రెండే,
రెండు దేవాలయాల్లో మాత్రమే నిత్య పూజలు జరుగుతుండేవి. ఆ రెంటిని కూడా
అతగాడు వదిలివేయటానికి కారణం, జోతిష్యంలో అతనికున్న నమ్మకం మాత్రమే. అతని
జ్యోతిష్కులు
సలహాపై మాత్రమే వాటి జోలికి టిప్పు పోలేదు.
టిప్పుసుల్తాన్ దేవాలయల విధ్వంస చరిత్ర తెలిసి అప్పట్లో, కేరళలోని ప్రఖ్యాతమైన
గురువాయుర్ శ్రీకృష్ణదేవాలయంలోని మూలవిరాట్టు(విగ్రహం)ను ముందుజాగ్రత్తగా
తిరువాన్కూరుకు 200కి.మి. దక్షిణంగా ఉన్న అంబళప్పుళ(Ambalapuzha)కు
తరలించబడినదట.
దాదాపు నాలుగు లక్షలమంది హిందువులను ఇస్లాంలోకి మార్చానని సగర్వంగా
చెప్పుకున్న టిప్పుసుల్తాన్ స్వాతంత్ర్యసమరయోధుడా లేక ముస్లిం మతోన్మాదా? మైసూరు
రాజ్యంలోని ఎన్నో పట్టణాలకు, వాటి పాత పేర్లు తొలగించి, ముస్లిం పేర్లు పెట్టిన
ఘనుడు టిప్పు.
టిప్పును స్వాతంత్ర్యసమరయోధుడిగా వామపక్ష మరియు స్వార్ధపరులైన చరిత్రకారులు
చిత్రికీరించుట జరిగినది. టిప్పు సుల్తాన్ తన రాజసింహాసనమును కాపాడుకునేందుకు
మాత్రమే బ్రిటిష్ వారితో పోరాడినాడు తప్ప, సాటి భారతీయ పాలకులందరిని
చైతన్యపరచి, బ్రిటిషు వారిపై యుద్ధానికి దిగలేదు. వాస్తవానికి రాజ్యాన్ని
కాపాడుకోవటము మరియు ఇస్లాం మతాంతరీకరణ అనేవి మాత్రమె టిప్పు యొక్క
లక్శ్యములు. టిప్పుకు మైసూరు టైగర్ అనే బిరుదును కూడా తగిలించారు. 1990ల్లో
దూరదర్శన్ లో ప్రసారమైన The Sword of Tippu Sultan సీరియల్ లో టిప్పు పులితో
పోరాడి విజయం సాధించినట్లు కల్పనలు జోడించినారు. భగవాన్ గిద్వాని అనే
రచయిత రాసిన నవల ఆధారంగా ఆ శృంఖల (Serial) ను నిర్మించినారు. వాస్తవ చరిత్ర
అనే కన్నా కాల్పనిక రచన అనటం సబబు. అలాంటి నవల ఆధారంగా నిర్మించి ఆ
సీరియల్ ను కూడా చరిత్రగా భావించటం సరికాదు. ఆయన ఏ పులితో పోరాడలేదు.
కేవలం టిప్పు ఖ్యాతిని ఆకాశానికెత్తటం కోసమే ఈ రకమైన భూషణాలంకరణ జరిగింది.
అసలు ఆ దూరదర్శన శృంఖల వచ్చినంతకాలమూ దాని ప్రారంభమున ఇది చరిత్రకాదు
అని తెరవెనుక చెప్పేవారు.
టిప్పుసుల్తాన్ ను క్షిపణీ తంత్రవిజ్ఞాన(Rocket Technology)పితామహుడిగా కొత్త రంగు
పులిమినారు. వాస్తవానికి ఫ్రెంచివారితో జరిగిన ఒప్పందంలో భాగంగా, వారు పలు
ఆయుధాలు సరఫరా చేయుట జరిగినది. వాటిలో కొన్ని క్షిపణీ విముక్త యంత్రములు
(Rocket Launchers) కూడా ఉండినవి. వాటిని చూపి, ప్రపంచాని రాకెట్ టెక్నాలజిని
అందించిన తొలి శాస్త్రవేత్తగా
చిత్రికరించటమనేది,
అసహజ అభూత కల్పనా మాత్రమే!
పాకిస్తాన్ తాను తయారు చేసిన అనేక క్షిపణులలో ఒకదానికి టిప్పు అనే పేరు పెట్టటం
మనము గమనించదగ్గ విషయము. అందుకు కారణం ఊహించలేనిదేమీ కాదు. ఘజ్ని,
ఘోరి,అబ్దాలి, బాబర్, వంటి పేర్లు వారు క్షిపణులకు పెట్టారు. అలాంటి పాలకుల సరసన
టిప్పు పేరు చేర్చారంటేనే,టిప్పు ఒక ఇస్లామిక్ మత వ్యాపకుడు అని వారు మనకు
తెలియబరచుచున్నారు.
మరొక విషయము ఏమిటంటే, వక్రీకరణ చరిత్రకారులు, టిప్పుకు కన్నడ భాషా
ఉద్దారకుడనే ఆభరణాన్ని అలంకరించినారు. నిజానికి కన్నడ భాషా ప్రాంతమైన
మైసూరు రాజ్యంలో కన్నడం స్ధానంలో పార్సి భాషను అధికార భాషగా నిర్ణయించినాడు
ఆ మహానుభావుడు. నాడు ప్రభుత్వమునకు ప్రధాన ఆదాయపరికరమగు భూమిశిస్తు
రికార్డులన్ని ఫార్సీ భాషలోనికి తర్జుమా చేయించినాడు. ప్రభుత్వ వ్యవహారమంతా ఆ
భాషలోనే నిర్వహించురీతిగా ఆదేశించినాడు. అందుకే నేటికీ మైసూరు ప్రాంతంలో
రెవిన్యూ రికార్డుల్లో పార్సి పదాలెన్నో కనబడతాయి. ఉదాహరణకు Khatha, Phani,
Khaneshmari,Thakthe, Thari, Kushki, Amaldar, Shirastedar, Majumdar
మొదలగునవి ఫార్శీ
భాష యొక్క పదములే!
భావితరాలు మోసపోకుండా ఉండాలంటే, తమ పూర్వికులు టిప్పు వంటి అనాగరికుడి
చేతిలో అనుభవించిన అమానుషమగు నరకమును భావితరములవారికి
అందజేయవలయునంటే మొదట స్వార్థరహిత చరిత్రకారులు వ్రాసిన చరిత్ర మనము
తప్పక తెలుసుకొని తీరాలి.
అందుకే ఈ ప్రయత్నమంతా...
స్వస్తి.