Friday, 16 April 2021

నన్నెచోడుడు - మానవల్లి రామకృష్ణ కవి

 నన్నెచోడుడు - మానవల్లి రామకృష్ణ కవి

https://cherukurammohan.blogspot.com/2021/04/blog-post.html

 నన్నెచోడుడు కడప జిల్లాలో తూరుపు ప్రాంతాలతో చేర్చి  నేటి నెల్లూరు ప్రకాశం 

జిల్లాలలోని కొన్ని ప్రాంతములకు అధిపతియై పాలించినాడు. ప్రసిద్దుడగు కరికాల 

చోళుడు తమ పూర్వీకుడని చెప్పుకొన్నాడు ఈయన. ఈయన తండ్రి చోడబలి యనితల్లి 

శ్రీసతి యని తెలియవస్తూ వున్నది. ఈయన కడప జిల్లా నందలురులోని ప్రసిద్ధిగన్న 

సౌమ్యనాథస్వామి ఆరాధకులు. ఈయనకు శివ కేశవ భేదము లేదు. ఇక అసలు 

విషయమునకు వత్తము.

మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) సాహిత్య పరిశోధకుడుకవి మరియు 

సంస్కృతాంధ్ర పండితుడు. బహుభాషా కోవిదుడు. సంస్కృతముఆంధ్రముఅరవము

కన్నడముమలయాళము మరియు ఇంగ్లీషు భాషలలో పాండిత్యము కలవాడు. 

అన్నమయ్యను వెలుగులోనికి తెచ్చిన మొట్టమొదటి మహనీయుడు ఈయన. 

రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ 

విద్యాశాఖాధికారిగా పనిచేసినాడు.

 'కుమార సంభవకావ్యాన్ని కనుగొనిపరిష్కరించి అజ్ఞాత వాసము నుండి బయటకు 

తెచ్చిప్రచురించిన పట్టుదల ఈ మహనీయునిది. అసలు అప్పటివరకు వరకూ తెలుగు 

సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర 

కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీఅతని కుమార సంభవ కావ్యమును గురించి 

గానీపూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాసిన పాపాన 

పోయినది లేదు. తంజావూరు లోని సరస్వతీ మహల్ గ్రంథాలయములో ఒక మూలపడి 

ఉన్న తాళపత్ర గ్రంథమును కనుగొనిదానిని పరిష్కరించి 1909లో  ప్రకటిస్తూ నన్నె 

చోడుడు నన్నయ కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత 

లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే చెప్పుట మాటలకు శక్యము కాదు. ఈ 

ప్రతిపాదనమీద చర్చలూఉపచర్చలూవాదోపవాదాలు బాగానే జరిగిఅరిగించుకోలేక

అసలు ఈ కావ్యమును  నన్నెచోడుడు వ్రాయలేదు-రామకృష్ణ కవి రాసి నన్నెచోడుని 

పేరు పెట్టినాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినా చాలామంది పరిశోధకులు 

ఆమోదించలేదు. ఒక్కొక్కసారి మితిమీరిన ప్రాంతీయాభిమానములుకూడా వాస్తవాలను 

గతములో తప్పుదారి పట్టించిన దాఖలాలు మనకు ఎన్నో కానవస్తాయి.

స్వస్తి.