భూగోళము
మన
ఊహకు అందని కాలము నుండి కూడా మనము భూమిని భూగోళము అనియే వాడుచున్నాముకదా! మరి ఈ
బల్లపరుపు భూమి ఎక్కడనుండి వచ్చినది. ఈ ప్రతిపాదన మనది కాదు. ఈ ప్రతిపాదన, క్రొత్తగా పుట్టిన వారి వారి మతముల దేవుళ్ళు చేసినవి. ముందు వెనుక ఆలోచించకుండా
వారిని అనుసరించే గొర్రెదాటు మనస్తత్వము కలిగిన మనది, కాబట్టి అవునేమో అనుకొన్నాము. . అంతేకానీ మన పూర్వులు భూమి
గుండ్రముగా ఉన్నదనే చెప్పినారు.
16, 17 వ శతాబ్దాలకు
చెందిన పర దేశీయులైన కెప్లర్ కోపర్నికస్, మరియు గెలీలియోలు,
భూమిగుండ్రంగా గోళాకారంలో వున్నదని కనిపెట్టినట్లు ప్రస్తుతం
ప్రపంచం మొత్తంగా నమ్ముతున్నాము
అదేవిధముగా.పుస్తకాలలో కూడా చదువుచున్నాము. కానీ ఈ విషయము వేదకాలంలోనే మన
భారతీయులకు తెలుసు. దానినిరూపణకు ఎన్నో ఉదాహరణలున్నాయి. 1.ఋగ్వేదంలో 1.33. 8 వ
మంత్రంలో ఇలా వుంది:
'చక్రాణానః పరీణయం వృథివ్యా...' అనగాభూమియొక్క
వృత్తపు అంచున వున్న వారు అనిభావం. అనగా భూమి గుండ్రంగా వున్నదనిఅర్థం.
2.
సూర్య సిద్ధాంతం అనే ప్రాచీనగ్రంధంలో 12 వ అద్యాయం, 32 వ శ్లోకంలో ఇలావుంది.: 'భూగోళో వ్యోమ్నితిష్ఠతి'
అనగా బ్రంహాండం మద్యలో భూగోలంఆకాశంలో నిలిచి వున్నది అని అర్థము.
ఇంతస్పష్ఠంగా చెప్పబడింది. 3. క్రీ.శ. 476 ప్రాంతంవాడైన ఆర్య భట్టు తన గ్రంథం ఆర్య
భట్టీయంలో గోళ పాదమనే అధ్యాయం...... 6 వ శ్లోకంలో :: 'భూగోళః
సర్వతో వృత్తః' అన్నాడు. అనగా భూమి సర్వతో వృత్తః అంటే భూమి
అన్ని వైపులా వృత్తాకారముగా వున్నదని అంటే
భూమి గోళాకృతి కలిగియున్నది అనియె కదా అర్థము. అసలు సంబోదనే 'భూగోళః' అని వుంది.
మరి ఈ విషయములు మన పూర్వులకు అనంతకాలమునుండి సుపరిచితములని తెలియుట లేదా! ఈ విషయముగా ఒక, బహుశ, జరిగిన కథ తెలుసుకొందాము.
భాస్కరాచార్య
- 2 యొక్క కుమార్తె లీలావతి. వీరు 12వ
శతాబ్దమునకు చెందినవారు. వీరికి సంబంధించిన ఒక విషయము, భూమిని గూర్చి,
వినండి.
ఒక నాడు "భూమి నాలుగు వైపులా బల్లపరుపుగా
ఉంది కానీ మీరు భూమిని గోళము అంటూవున్నారు. కారణమేమి" అని అడిగింది లీలావతి
తన తండ్రి భాస్కరా చార్యుల వారిని .
అప్పుడు
ఆయన, పుత్రీ! మనకు కనిపించేదంతా నిజమనుకోవడం తప్పు. అది ఒక భ్రమ. కొండను దూరము నుండి
చూస్తే ఎంతో నునుపుగా కనబడుతుందికదా! మరి
దగ్గరికి పోయి చూస్తె అది భ్రమయని మనకు తెలుస్తుంది. నీవు ఇసుకలో ఒక పెద్ద
వృత్తమును గీచి దాని పరిథిలో ఏ 16వ
భాగాన్ని గుర్తించి చూడు. అది నీకు సరళ రేఖవలెనే కనిపిస్తుంది కాని నిజానికది
వృత్తములోని భాగమే కదా! అదేవిధముగా విశాలమగు ఈ భూమి గోళాకారమును కలిగియున్నా, మనమందులో అత్యంత తక్కువభాగమును మాత్రమే
చూడగలుగుచున్నాము. కాబట్టి మనకది బల్లపరుపుగా కనిపిస్తుంది. వాస్తవానికి భూమి
గుండ్రంగా ఉంది అన్నది నీకు అర్థమౌతూవున్నది కదా!. అని ఆమె సందేహమును తీర్చినాడు.
ఆమాటకు
శ్లోకరూపము ఈ దిగువన ఇవ్వబడినది.
నమో
యతః స్యాత్పరిధేః శతాంశః
పృథ్వీ
చ పృథ్వీ నితరాం తనీయాన్.
నరశ్చ
తత్పృష్ఠగతస్య కృత్స్నా
సమేవ
తస్య ప్రతిభాత్యతః సా. (భువనకోశం – 13)
భూమి
గుండ్రంగా ఉంది అని బైబిల్ కు విరుద్ధముగా చెప్పిన కోపర్నికస్ ను రాళ్ళతో కొట్టి
చంపిన మతానుయాయులను, మన అభిమతాలను చంపుకొని, మన పూర్వుల ఆవిష్కరణలను
తుంగల ద్రొక్కి, 'మీరే తప్ప నితఃపరంబెరుగము' అంటూ ఆలోచన లేక అనుసరించుచున్నాము. ఈ
భారతీయ సంస్కృతిలో శాస్త్రమునకు మనము అనుసరించే ధర్మమునకు అవినాభావ సంబంధము వున్నది. ఆవిషయమును ఆసాంతము
మరచి, తెలివి అంటే వారిది అని మానాభిమానములు వదలి వారి వెనుక
మన గోచి ఊడిపోతూవున్నా పరిగెడుతూ ఉన్నాము. సత్యాన్వేషణ, సత్యనిరూపణ
అన్నవి మన జాతికి మూలములు. ఈ రెండు విషయాలను నిర్లక్షంచేసి జాతిని తిరోగతిలో
పయనింపజేసి అథోగతికి చేర్చుచున్నాము.
ఇకనన్నా యువత వాస్తవాలను గమనించి, గ్రహించి పురోగమించితే
దేశ ప్రతిష్ఠకు పునర్వైభవము సమకూర్చినవారవుతారు.
స్వస్తి.